
సూపర్ స్టార్ కృష్ణ వారసత్వాన్ని, మహేష్ బాబు ఇమేజ్ను ముందుకు తీసుకెళ్లేందుకు ఘట్టమనేని కుటుంబం నుండి మరో సరికొత్త తరం హీరో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. జయకృష్ణ ఘట్టమనేని (Jaya Krishna Ghattamaneni) హీరోగా పరిచయమవుతున్న మోస్ట్ అవేటెడ్ డెబ్యూ ఫిల్మ్ 'శ్రీనివాస మంగాపురం' (Srinivasa Mangapuram). ప్రమోషనల్ కంటెంట్లో జయకృష్ణ చూపించిన నటన, యాక్షన్ ఎబిలిటీస్, అదిరిపోయే డ్యాన్సింగ్ స్కిల్స్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.
'ఆర్ఎక్స్ 100', 'మంగళవారం' వంటి విలక్షణమైన చిత్రాలతో టాలీవుడ్లో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న డైరెక్టర్ అజయ్ భూపతి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. సూపర్ స్టార్ కృష్ణ, మహేష్ బాబుల నట వారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇస్తున్న జయకృష్ణకు ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఒక పవర్ఫుల్ లిట్మస్ టెస్ట్గా మారనుంది. ప్రారంభంలో వచ్చిన రెస్పాన్స్ ఎంతో పాజిటివ్గా ఉండటంతో, ఈ యంగ్ హీరోని వెండితెరపై చూడటానికి సినిమా లవర్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు.

ఈ క్రేజీ ప్రాజెక్ట్ రిలీజ్ డేట్ను మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ చిత్రాన్ని జూలై 30న థియేటర్లలో భారీ ఎత్తున విడుదల చేయబోతున్నట్లు స్పష్టం చేశారు. నిజానికి చిత్ర బృందం మొదట జూలై 9వ తేదీని రిలీజ్ డేట్గా పరిశీలించినప్పటికీ, బాక్సాఫీస్ వద్ద 'లెనిన్' వంటి ఇతర చిత్రాలతో ఎలాంటి అనవసరమైన క్లాష్స్ రాకూడదనే ఉద్దేశంతో ఒక అడుగు వెనక్కి వేసి, సోలోగా వచ్చి బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించేందుకు జూలై 30వ తేదీని లాక్ చేశారు.
ఈ సినిమా ద్వారా బాలీవుడ్ సీనియర్ నటి రవీనా టాండన్ కుమార్తె రాషా థడాని టాలీవుడ్లోకి హీరోయిన్గా గ్రాండ్ ఎంట్రీ ఇస్తోంది. జయకృష్ణ, రాషా థడాని మధ్య కెమిస్ట్రీ టాలీవుడ్లో హాట్ టాపిక్గా మారింది. మొదటి సినిమానే అయినప్పటికీ రాషా కనబరిచిన ఎక్స్ప్రెషన్స్, డ్యాన్సింగ్ టాలెంట్, నటన సినిమాపై అంచనాలను నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లాయి. కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ఈ సినిమాలో ఒక పవర్ఫుల్ పాత్రలో నటిస్తుండటం విశేషం. ఘట్టమనేని మూడో తరం వారసుడి ఎంట్రీ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.
Srinivasa Mangapuram, Jaya Krishna Ghattamaneni, Krishna, Mahesh Babu, Ajay Bhupathi




