LATEST NEWS
ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికార పగ్గాలు చేపట్టి రెండేళ్లయ్యింది. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా మూడేళ్ల సమయం ఉంది. స్థనిక ఎన్నికలు వినా ఇప్పట్లో రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం లేదు. అయితే రెండేళ్ల   తెలుగుదేశం కూటమి పాలన పట్ల ప్రజా స్పందన ఎలా ఉంది? ప్రతిపక్ష హోదా లేకున్నా రాష్ట్రంలో ఏకైక విపక్షం గా ఉన్న వైసీపీ పట్ల ప్రజాదరణ ఎలా ఉంది అన్న అంశాలపై  ప్రముఖ పొలిటికల్ రీసెర్చ్ సంస్థ పయనీర్  స్ట్రాటజీస్ తాజాగా ఓ  సర్వే నిర్వహించింది.  ఆ సర్వే ఫలితం ఇటు అధికార కూటమిలోనూ, అటు వైసీపీలోనూ కలకలం రేపుతోంది.  రాష్ట్రంలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే..  రెండేళ్ల పాలనలో తెలుగుదేం కూటమి సర్కార్ పట్ల ప్రజలలో వ్యతిరేకత కనిపిస్తున్నప్పటికీ సునాయాసంగా గతం కంటే ఎక్కువ మెజారిటీతో అధికారంలోకి రావడం ఖాయమని సర్వే ఫలితం కుండబద్దలు కొట్టింది. అయితే తెలుగుదేశం కూమిటికి ఆందోళన కలిగించే విషయం ఏమిటంటే.. చంద్రబాబు నాయకత్వంలో కూటమి సర్కార్ సంక్షేమ, అభివృద్ధిని సమాంతరంగా పరుగులు పెట్టిస్తున్నప్పటికీ ఆ స్థాయిలో ప్రజాదరణ పెరగడం అటుంచి.. క్షేత్రస్థాయిలో కూటమి పాలన పట్ల ఒకింత అసంతృప్తి పె రిగిందని సర్వే స్పష్టం చేయడమే.  ఇక వైసీపీ విషయానికి వస్తే.. 40 శాతం ఓటు షేర్, ప్రభుత్వ వ్యతిరేకతే తమను 2029 ఎన్నికలలో అధికారంలో కూర్చోబెడతాయని ధీమా వ్యక్తం చేస్తున్న ఆ పార్టీకి ఈ సర్వే ఫలితం ఊహించని షాక్ ఇచ్చింది. తిరిగి అధికారంలోకి రావడం అటుంచి.. ఆ పార్టీ గ్రాఫ్ ఈ రెండేళ్లలో అధ:పాతాళానికి పడిపోయిందని సర్వే తేల్చింది.   గత ఎన్నికల ఘోర పరాజయం నుండి కోలుకుని తిరిగి పుంజుకుంటామని ఆశిస్తున్న వైపీపీకి  పయనీర్ స్ట్రాటజీన్ సర్వే గట్టి షాక్ ఇచ్చింది.  సర్వే ప్రకారం.. ఈ రెండేళ్లలో క్షేత్రస్థాయిలో వైసీపీ ఓటు బ్యాంకు పుంజుకోవడం అటుంచి ఉన్న ఓటు బ్యాంకు కూడా చాలా వరకూ దూరమైంది.   పయోనీర్ స్ట్రాటజీ విడుదల చేసిన   గణాంకాల ప్రకారం, రాష్ట్రవ్యాప్తంగా   అన్ని నియోజకవర్గాల్లో నిర్వహించిన ఈ సర్వేలో కూటమి ప్రభుత్వ పాలన పట్ల ప్రజలలో ఒకింత వ్యతిరేకత కనిపిస్తున్నా.. తెలుగుదేశం కూటమి ప్రభుత్వం పట్ల సానుకూలతే వ్యక్త మౌతోంది.  కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన   అభివృద్ధి, సంక్షేమ పథకాలు, పరిశ్రమల రాక, పెట్టుబడుల ప్రవాహం, అమరావతి, పోలవరం పనులలో వేగం వంటివి ప్రభుత్వం పట్ల వ్యతిరేకతను తోసి రాజని సానుకూలతను తీసుకువచ్చాయి.  ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే తెలుగుదేశం కూటమి గెలుచుకునే సీట్ల సంఖ్య గతం కంటే ఎక్కువగా ఉంటుంది.  గ్రామీణ, పట్టణ, నగరాలు అన్న తేడా లేకుండా..  యువత, మహిళలు  రైతులు   తెలుగుదేశం నేతృత్వంలోని కూటమి ప్రభుత్వానికే జై కొడుతున్నారు.    ఇక వైసీపీ విషయానికి వస్తే..  గతంలో అధికారాన్ని అనుభవించి, 2024 ఎన్నికలలో కేవలం 11 స్థానాలకే పరిమితమయ్యేంతగా ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకున్న వైసీపీ పట్ల ఈ రెండేళ్లలో ప్రజలలో ఇసుమంతైనా సానుకూలత కానరావడం లేదని పయనీర్ స్ట్రాటజీస్ సర్వే తేల్చింది. అధికారం కోల్పోయిన తరువాత ఈ రెండేళ్లలో పార్టీ ఇసుమంతైనా పుంజుకోలేదని సర్వే ఫలితం పేర్కొంది. పుంజుకోకపోవడం అటుంచితే.. ఇప్పటికిప్పుడు రాష్ట్రంలో ఎన్నికలు జరిగితే వైసీపీ గత ఎన్నికలలో సాధించిన 11 స్థానాలను నిలుపుకోవడం కూడా కష్టమేనని సర్వే పేర్కొంటున్నది.  అధికారంలో ఉన్న సమయంలో చేసిన పొరపాట్లు, ప్రజావ్యతిరేక నిర్ణయాలు,   నిధుల మళ్లింపు వంటి అంశాలు ఇప్పటికీ ప్రజల జ్ఞాపకాల్లో బలంగా ఉన్నాయని సర్వే పేర్కొంది.   వైసీపీ ఓటు షేర్ మరింత దిగజారిపోవడానికి ఆ పార్టీ వైఖరి, అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించడం, ప్రజా సమస్యలపై  స్పందించకపోవడంతో పాటు.. ఆ పార్టీ అధినేత బెంగళూరు మకాం కూడా కారణం అని సర్వే పేర్కొంది.   ఉత్తరాంధ్ర, కోస్తా ఆంధ్ర, మరియు రాయలసీమ  ఇలా మూడు ప్రాంతాలలోనూ పయనీర్ స్ట్రాటజీన్ సర్వే చేసింది. ఈ సర్వేలో బయటపడిన మరో విశేషం ఏమిటంటే.. వైసీపీకి పెట్టని కోట వంటి రాయలసీమ ప్రాంతంలో కూడా ఆ పార్టీ ప్రతిష్ట మసకబారింది. సీమ ప్రాంతంలో కూడా తెలుగుదేశం కూటమి వైపు మొగ్గు స్పష్టంగా గోచరిస్తోంది. యువత, నిరుద్యోగులలో ఐటీ ఉద్యోగాల కల్పన, పారిశ్రామిక వేత్తల పెట్టుబడుల పట్ల ఆశావహ దృక్పథం వ్యక్తమవుతుండగా, మహిళలు ఉచిత బస్సు ప్రయాణం, దీపం పథకం,  ఇతర సంక్షేమ హామీల అమలు తీరుపై సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఒకప్పుడు వైసీపీకి కొండంత అండగా నిలిచిన గ్రామీణ ఓటర్లు కూడా ఇప్పుడు కూటమి ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి నమూనా వైపే మొగ్గు చూపుతున్నారని సర్వే ఫలితం పేర్కొంది.    ఇక ఈ సర్వే ఓటు శాతం విషయంలో కూడా తెలుగుదేశం కూటమి, వైసీపీల మధ్య స్పష్టమైన తేడా కనిపిస్తోందని వెల్లడించింది. గత ఎన్నికలలో 40 శాతం ఓటు షేరు మాకుందని చెప్పుకున్న వైసీపీకి ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే.. 28 శాతం ఓటు షేర్ కు పరిమితమౌతుందని సర్వే తేల్చింది. అదే సమయంలో తెలుగుదేశం కూటమికి 49 శాతం ఓటు షేర్ వస్తుందని పేర్కొంది. కూటమి పాలనపై ఒకింత అసంతృప్తి వ్యక్తమౌతున్నప్పటికీ, వైసీపీపై పెరుగుతున్నవ్యతిరేకత కారణంగా అది లెక్కలోకి రావడం లేదని సర్వే తేల్చింది.  YCP graph fallen, AP Political Survey, Pioneer Strategy Survey, TDP Alliance Lead, YSRCP Vote Share Drop, AP Politics, TeluguOne
దేశవ్యాప్తంగా పరీక్షల లీకేజీలు, రద్దుల చుట్టూ చెలరేగిన విద్యార్థుల ఆగ్రహజ్వాలలు చివరకు దేశ రాజధానిని, కేంద్ర ప్రభుత్వాన్ని ఇరకాటంలోకి నెట్టేశాయి.  ఏ ఉద్యమమైనా సరే, విద్యార్థులు రోడ్డు మీదకు వస్తే ప్రభుత్వాల పునాదులు కదులుతాయని చరిత్ర చెబుతోంది. ఇప్పుడు ఢిల్లీ వీధుల్లో కూదా దాదాపు అదే జరిగింది.  ప్రశ్నించే గొంతుకలపై లాఠీఛార్జ్, పెల్లెట్ గన్లు, చివరికి కరెంట్ షాక్ ఇచ్చే బ్యాటన్లు వాడినా... యంగ్ ఇండియా ఇసుమంతైనా తగ్గలేదు.   వ్రస్థాయి నిరసనలు, విద్యార్థుల అకుంఠిత పోరాటం ఫలితంగా కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది! అయితే దీని వెనుక అసలు రాజకీయ వ్యూహం ఏంటి?  విద్యాశాఖ మంత్రి రాజీనామా  నైతిక బాధ్యతతో చేశారా?   విద్యార్థి ఉద్యమ తీవ్రతను తగ్గించడానికి వేసిన ఎత్తడగా? అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి.  ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా లేఖను  పరిశీలిస్తే..  పరీక్షల నిర్వహణలో జరిగిన ఘోర వైఫల్యానికి పూర్తి బాధ్యత వహిస్తూ రాజీనామా చేస్తున్నాననడం కాకుండా..  దేశద్రోహ శక్తులు  ఈ ఉద్యమాన్ని దుర్వినియోగం చేయకుండా ఉండేందుకే తాను పక్కకు తప్పుకుంటున్నానని పేర్కొన్నారు. అసలు పరీక్షల లీకేజీ వల్ల లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తు నాశనమైతే, న్యాయం కావాలని అడిగిన విద్యార్థులను, వారి తల్లిదండ్రులను  దేశద్రోహుల బీ-టీమ్ అని ప్రచారం చేయడమేంటి?  అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు చేస్తున్న వ్యాఖ్యలు ఈ  అగ్నికి ఆజ్యం పోస్తున్నాయనే చెప్పాలి.  ఎంపీ కంగనా రనౌత్ విద్యార్థి నాయకుల వయస్సు, ఉద్యోగంపై చేసిన వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో పెద్ద దుమారాన్ని రేపాయి. అలాగే కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కూడా పరీక్షల రద్దు వల్ల వచ్చిన సమయాన్ని విద్యార్థులు మరింత ప్రిపేర్ అవ్వడానికి వాడుకున్నారనేలా వ్యాఖ్యానించడంపై విద్యార్థి లోకం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.  ప్రధాన్ స్థానంలో నూతన విద్యాశాఖ మంత్రిగా ప్రహ్లాద్ జోషిని నియమించడం ఇప్పుడు సరికొత్త వివాదానికి తెరలేపింది. గతంలో బిల్కిస్ బానో కేసులోని ముద్దాయిల విడుదలపై ఆయన చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ ప్రతిపక్షాలు పార్లమెంట్‌లో  అధికిర కూగయొపై విరుచుకుపడ్డాయి. విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేయాల్సిన కీలక సమయంలో, వివాదాస్పద నేపథ్యం ఉన్న నేతకు విద్యాశాఖను అప్పగించడంపై విద్యార్థి సంఘాలు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం మాత్రం విద్యార్థుల ఆగ్రహాన్ని చల్లార్చేందుకు పేపర్ లీకేజీలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకునేలా, ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేసేలా ఒక కొత్త బిల్లును సిద్ధం చేస్తోంది. కానీ, ఈ తాత్కాలిక చట్టాలు, నాయకుల మార్పులు విద్యార్థుల నిరసనల తీవ్రతను తగ్గించగలవా? అంటే మాత్రం తగ్గించలేవనే సమాధానమే వస్తోంది. తమపై నమోదు చేసిన కేసులను తక్షణమే ఎత్తివేయాలని, పరీక్షల నిర్వహణలో పూర్తి పారదర్శకత తేగల వ్యవస్థాత్మక మార్పులు కావాలని విద్యార్థిలోకం ఎలుగెత్తుతోంది. తాజాగా రైతుల ఆందోళనలకూ యువత సంఘీభావం ప్రకటించింది.  మొత్తంగా విద్యార్థులు, యువతఉద్యమం.. ఒక స్పష్టమైన సందేశాన్ని అయితేనిస్సందేహంగా ఇచ్చింది.   అన్యాయాన్ని ప్రశ్నించడంలో, హక్కుల కోసం పోరాడటంలో , న్యాయం కోసం నినదించడంలో  వెనకడుగు  వేసే ప్రశ్నేలేదని చాటింది.   ఆందోళనలను, ఉద్యమాలనూ అణచివేయడానికి అధికార పార్టీ, ప్రభుత్వం ఎన్ని వ్యూహాలురచించినా యువగళంముందు అవేవీ పారవని తాజా ఆందోళనలు నిర్ద్వంద్వంగారుజువుచేశాయి. ఇక ఈ ఉద్యమం సాధించిన మరో గొప్ప విజయం ఏమిటంటే.. ఏ రాజకీయ పార్టీకీ పొలిటికల్ మైలేజీ దక్కనీయకపోవడం.  Dharmendra Pradhan Resignation, Student Unrest, Pralhad Joshi Education Minister, Paper Leak Controversy, BJP Strategy, politicalmilage,  TeluguOne
   రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కర్నూలు జిల్లా ఆదోని పట్టణ, మండల టీడీపీ నేతలు పని చేయాలని తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు నారా లోకేష్ కోరారు. ఆదోని మండల, పట్టణ టీడీపీ ముఖ్యనేతలతో నారా లోకేష్ ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ... చిన్నచిన్న విభేదాలను పక్కనబెట్టి కూటమి నేతలు, కార్యకర్తలను కలుపుకెళ్లాలని అన్నారు. రెండేళ్ల కూటమి ప్రభుత్వ విజయాలపై డోర్ టు డోర్  కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించండి. మండల, క్లస్టర్, యూనిట్ ఇంచార్జిలు చురుగ్గా పనిచేయాలి. పనిచేసే వాళ్ళని గౌరవిస్తా. పార్టీ లైన్ దాటి ఎవరైనా మాట్లాడితే సహించేది లేదు.  ఏవైనా సమస్యలు ఉంటే ఇంచార్జితో మాట్లాడండి. నాలుగు గోడల నడుమ కలసి కూర్చొని సమస్య పరిష్కరించుకోండి. మీడియాకి ఎక్కితే పార్టీ నష్టపోతుంది. రెవెన్యూ, పోలీసు సమస్యలు, జీ రామ్ జీ బిల్లుల సమస్యలపై అధికారులకు ఆదేశాలు ఇస్తాం. 2014-19 నడుమ హౌసింగ్ బిల్లుల సమస్యపై ముఖ్యమంత్రితో మాట్లాడి, విడతలవారీగా చెల్లించేలా కృషిచేస్తా. కూటమి ధర్మాన్ని పాటిస్తూ కలసికట్టుగా పని చేయాలని లోకేష్ దిశానిర్దేశం చేశారు. ఈ సమావేశంలో జోనల్ ఇంచార్జి పెళ్లకూరు శ్రీనివాసరెడ్డి, పార్లమెంటు పార్టీ అధ్యక్షురాలు కిస్టమ్మ, నియోజకవర్గ టీడీపీ పరిశీలకుడు కేశవరెడ్డి, ఆదోని పట్టణ పార్టీ అధ్యక్షుడు బి.తిమ్మప్ప, మండల పార్టీ అధ్యక్షుడు కురువ శివప్ప, జిల్లా పార్టీ ట్రెజరర్ వాల్మీకి రవి, ఆదోని టీడీపీ నాయకులు బి. కృష్ణయ్య, లక్ష్మీనారాయణ, బి. విరూపాక్షి, సజ్జాద్ హుసేన్, కొల్లా వీరేష్, రామాంజని, ఎస్.సయ్యదుల్లా,  బిపి బస్వరాజ్, కురువ మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. Nara Lokesh, Adoni, TDP intimate meeting, CM Chandrababu, Election of local bodies, MLA Palla Srinivasa Rao
 ఇప్పటివరకు సోషల్ మీడియాలో, స్టూడెంట్ ప్రొటెస్ట్‌లలో మాత్రమే వినిపించిన పేరు... కాక్రోచ్  జనతా పార్టీ (సీజేపీ)! ఇప్పుడు ఈ బొద్దింకలు  రైతు సంఘాలతో చేతులు కలిపాయి.  నీట్ పేపర్ లీక్ ఆందోళనలతో దిల్లీ వీధులను ఊపేసిన బొద్దింకలు ఇప్పుడు దేశ రాజధాని జంతర్ మంతర్ వద్ద రైతు నాయకుడు రాకేష్ తికాయత్‌ను కలిసి సంఘీభావం ప్రకటించాయి. రైతులు, కాక్రోచ్ ల కలయిక నిస్పందేహంగా కేంద్ర ప్రభుత్వానికి కొత్త తలనొప్పులు తీసుకువస్తుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.    కేంద్రంలోని మోడీ సర్కార్ కు ఇన్నేళ్లలో ఎదురైన నిజమైన, బలమైన సవాళ్లు ఏవైనా ఉన్నాయంటే.. అవి.. గతంలో జరిగిన చారిత్రాత్మక రైతు ఉద్యమం, తాజాగా నీట్ లీకేజీకి నిరసనగా ఉవ్వెత్తున ఎగసిన కాక్రోచ్ ల ఆందోళన. రెండు సందర్భాలలోనూ కూడా మోడీ సర్కార్ దిగి వచ్చి వారి డిమాండ్లను అంగీకరించాల్సి వచ్చింది.  ఇప్పుడు ఈ రెండు శక్తులూ ఏకతాటిపైకి వచ్చాయి. దీంతో భవిష్యత్ లో వీరి కలయిక మోడీ సర్కార్ ను ఏ స్థాయిలో ఇరుకున పెడుతుందీ అన్న చర్చ ఇప్పుడు దేశ వ్యాప్తంగా జోరుగా సాగుతోంది.  జంతర్ మంతర్ వేదికగా సిజెపి నాయకులు, రాకేష్ తికాయత్ సహా 500 మంది రైతులతో  భేటీ అయ్యారు. గురువరాం(జులై 29) జరిగిన ఈ భేటీ..కాక్రోచ్ లు ఉద్యమ బాట వీడలేదనీ. కేవలం విద్యా సమస్యలే కాదు, కర్షకుల సమస్యలపైనా తాము ఉద్యమిస్తామనీ, అన్నదాతలకు అండగా నిలుస్తామని ఈ భేటీ ద్వారా సందేహాలకు అతీతంగా పరోక్షంగా ప్రకటించారు.  విద్యార్థులు, యువత,  రైతులు ఏకతాటిపైకి  వచ్చి ఉద్యమిస్తే.. ప్రజా సమస్యల పరిష్కారం విషయంలో కేందరంలోని మోడీ సర్కార్ పై ఒత్తిడి కొన్ని రెట్లు ఎక్కువ అవుతుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.    ఇప్పటికే నీట్ లీకేజీకి వ్యతిరేకంగా కాక్రోచ్ ల ఆందోళనల్లో పాల్గొన్న విద్యార్థులపై   నమోదైన కేసులను తక్షణమే ఉపసంహరించుకోవాలనీ, లేదంటే..  తన ఉద్యమాన్నినెక్స్ట్ లెవెల్ కు తీసుకువెడతామనీ సీజేపీ కేంద్రానికి అల్టిమేటమ్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ అల్టిమేటమ్ ఇచ్చిన రోజువ్యవధిలోనే... కాక్రోచ్ జనతా పార్టీ నేతలు రైతు సంఘాల నేతలతో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.    Cockroach Janta Party, Rakesh Tikait, NEET Protest Delhi, CJP Farmers Protest, Jantar Mantar Protest, Dharmendra Pradhan, Gen Z Protest India, CJP Foreign Funding Court
తెలుగువన్ ప్రత్యేకం వైసీపీ  అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజకీయ వైఖరి, రాజధాని అమరావతిపై ఆయన తీసుకున్న నిర్ణయాలపై మైలవరం తెలుగుదేశం   ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తెలుగు వన్ న్యస్ చానల్ కు ఇచ్చిన  ప్రత్యేక ఇంటర్వ్యూలో  ఆయన  కుట్రలతో అమరావతిని చెడగొట్టాలని చూసేవారు చరిత్రహీనులుగా మిగిలిపోతారని హెచ్చరించారు. గతంలో  వైపీపీలో  తాను ఎదుర్కొన్న ఇబ్బందులను ఈ సందర్భంగా వసంత కృష్ణప్రసాద్ వివరంగా వెల్లడించారు. ఆ పార్టీలో ఉండలేని పరిస్థితులు తలెత్తడం వల్లే తాను బయటకు వచ్చి, తన మద్దతుదారులు, శ్రేయోభిలాషుల సూచనల మేరకు తెలుగుదేశం పార్టీలో  చేరానన్నారు.  పారిశ్రామిక రంగానికి రావాల్సిన రాయితీలు, నిధుల విడుదల విషయంలో నాలుగేళ్లపాటు జగన్ ప్రభుత్వం  నిర్లక్ష్యం వహించిందని ఆరోపించారు. మాజీ మంత్రి జోగి రమేష్  తనపై చేస్తున్న ఆరోపణలనుఖండించిన వసంత వెంకట కృష్ణ ప్రసాద్.. జోగి రమేష్ కు ఎటువంటి క్రెడిబులిటీ లేదనీ, అతను ఏదోదో మాట్లాడతారనీ, అవన్నీ పట్టించుకోవలసిన అవసరం లేదని చెప్పారు. వైఎస్సార్సీపీ హయాంలో తమకు కావలసిన కొందరికే నిధులు, రాయితీలు విడుదల చేశారన్నారు. ప్రాతినిధ్యం వహించే ప్రజాప్రతినిధుల విజ్ఞప్తులను సైతం జగన్ ప్రభుత్వం పట్టించుకోలేదని, మూడు నెలల కాలపరిమితి పేరుతో ఏళ్ల తరబడి కాలయాపన చేస్తూ మోసం చేశారని స్పష్టం చేశారు. రాజధాని అమరావతి అంశంపై జగన్మోహన్ రెడ్డి తీరుపై ఎమ్మెల్యే వసంత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిని దెబ్బతీసేందుకు జగన్ తెరపైకి తెచ్చిన ప్రతిపాదనలు, ఆలోచనలు జుగుప్సాకరంగా ఉన్నాయని విమర్శించారు. ప్రాంతాల మధ్య వైషమ్యాలు సృష్టించే కుట్రలతో రాష్ట్ర భవిష్యత్తును నాశనం చేయడానికి ప్రయత్నించారని ధ్వజమెత్తారు.  అమరావతి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి శాశ్వత రాజధాని. జగన్   కాదు..  ఎవరు దిగివచ్చినా అమరావతిని మార్చడం సాధ్యపడే విషయం కాదని స్పష్టం చేశారు.   ఒక నగరం అభివృద్ధి చెందే క్రమంలో చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు ఆర్థికంగా, సామాజికంగా ఎదుగుతారని, దానిని సహించలేక కుల రాజకీయాలు, ప్రాంతీయ విభేదాలు రగల్చడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. బోగస్ హామీలు, రాజకీయ నాటకాలడే వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మద్దతు ఇచ్చేవారు రాష్ట్ర ప్రయోజనాలకు విఘాతం కలిగించినట్లేనని వసంత కృష్ణ ప్రసాద్ అన్నారు.  రాబోయే రోజుల్లో ఓటు అనేది కేవలం ఎన్నికల ప్రక్రియ మాత్రమే కాదని, ఆంధ్రప్రదేశ్ బిడ్డల భవిష్యత్తును నిర్మించే కీలక నిర్ణయమని పిలుపునిచ్చారు. తాను ప్రాతినిధ్యం వహించే ప్రతి వేదికపైనా ఈ విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తున్నట్లు వెల్లడించారు. రాష్ట్ర సమగ్ర అభివృద్ధి, అమరావతి నిర్మాణం కేవలం కూటమి ప్రభుత్వంతోనే సాధ్యమవుతుందని వసంత కృష్ణప్రసాద్ ధీమా వ్యక్తం చేశారు. గత పాలకుల విధానాలను ప్రజలు ఇప్పటికే గ్రహించారని, ఇకపై అభివృద్ధి నిరోధక రాజకీయాలకు ఏపీలో తావులేదని పునరుద్ఘాటించారు. Vasantha Krishna Prasad Interview, Mylavaram MLA Vasantha, YS Jagan Amaravati Comments, Jogi Ramesh Vasantha Krishna Prasad
ALSO ON TELUGUONE N E W S
తెలుగు సినిమాకి, నటప్రపూర్ణ మోహన్ బాబు కి మధ్య ఉన్న అనుబంధానికి మధ్య ఎంతో ఘనమైన చరిత్ర ఉంది. హీరోగా ఎన్నో శతదినోత్సవాలు, సిల్వర్ జూబ్లీ లు అందించి   కలెక్షన్స్ కింగ్ అనిపించాడు. తెలుగు ప్రేక్షకులు ఎంత అదృష్టం చేసుకున్నారో అనే విధంగా, తనకి మాత్రమే సాద్యమయ్యే డైలాగ్ మాడ్యులేషన్ తో పస లేని సీన్ ని సైతం మెప్పించడం మోహన్ బాబు స్టైల్. సెకండ్ ఇన్నింగ్స్ లో పెద్దగా స్పీడ్ చూపించడం లేదు. అందుకు కారణాలు ఏమిటనేది పక్కన పెడితే ఈ రోజు కృష్ణ గారి మనవడు జై కృష్ణ తో కలిసి 'శ్రీనివాస మంగాపురం'తో సెల్యులాయిడ్ పై తిష్ట వేసాడు.     అభిమానులతో పాటు మూవీ చూసిన వాళ్ళు మీడియాతో పాటు సోషల్ మీడియా వేదికగా స్పందిస్తు 'మూవీలో మోహన్ బాబు పోషించిన 'వెంకటాద్రి నాయుడు' రోల్ ఆయన నటనా జీవితంలో ఒక మైలురాయిగా నిలుస్తుంది. ఆ క్యారక్టర్ ద్వారా గంభీరం, బాధ్యత, కుటుంబం పట్ల ప్రేమాభిమానాలు, పరిస్థితులకు తగ్గట్టుగా స్పందించే గుణం ఇవన్నీ కలగలిపి చేసి మెప్పించడం సాధారణ విషయమేమీ కాదు. ఒక రకంగా  మోహన్ బాబు వెంకటాద్రి నాయుడు క్యారక్టర్ కి ప్రాణప్రతిష్ట చేశారు.  డైలాగ్ డెలివరీ లో ఇంకా తగ్గని వేడి, హావభావాలు కట్టిపడేసాయి. ముఖ్యంగా కుటుంబ వ్యవస్థలోని విలువలను, బంధాల ప్రాధాన్యతని  ఆవేశం, బాధ్యతారాహిత్యాన్ని ప్రశ్నించే తీరు, న్యాయం వైపు నిలబడే గుణం ఒక రకమైన భావోద్వేగాన్ని నింపుతాయి. ముఖ్యంగా స్క్రీన్ ప్రెజెన్స్ మరో స్థాయికి తీసుకెళ్లింది. చిత్రం మొదటి భాగం నుంచి ముగింపు వరకు మోహన్ బాబు తనదైన స్టైల్‌లో సినిమాని ముందుకు నడిపించారు. ఆయన చూపించిన విలక్షణమైన అభినయం వల్ల  శ్రీనివాస మంగాపురంకి అంతటి పేరు, గుర్తింపు వస్తుంది. కాబట్టి దర్శకులు, రైటర్స్ మోహన్ బాబుకి వేంకటాద్రి నాయుడు లాంటి రోల్స్ రాయాలి. మోహన్ బాబు గారు ఇలాంటి క్యారెక్టర్స్ మరిన్ని చేస్తూ  ఉంటే తెలుగు సినిమా తన వైభవాన్ని తలుచుకుంటూ మురిసిపోతూ ఉంటుందనేది వాళ్ల అభిప్రాయం. Also read: Srinivasa Mangapuram: తండ్రి పేరు నిలబెట్టినట్లేనా.. మాస్ అమ్మ మొగుడు అంటే అంతే మరి! Mohan Babu, Srinivasa Mangapuram, Jai krishna, Rasha Thadani
సినీ ప్రపంచంలో సెంటిమెంట్లు, లక్కీ నెంబర్స్, లెటర్స్ ఎప్పుడూ ఆసక్తికర చర్చకు దారితీస్తుంటాయి. ఇప్పుడు కన్నడ రాకింగ్ స్టార్ యశ్ కెరీర్‌ను పరిశీలిస్తే ఒక ఆసక్తికరమైన కామన్ పాయింట్ స్పష్టంగా కనిపిస్తుంది. అదే ఇంగ్లీష్ అక్షరం 'R'. యశ్ ను గ్లోబల్ స్టార్‌గా నిలబెట్టిన 'కేజీఎఫ్' సిరీస్ నుంచి మొదలుకొని, ఆయన రాబోయే అత్యంత భారీ బడ్జెట్ పాన్-వరల్డ్ చిత్రాల వరకు ప్రతి మైలురాయి పాత్ర వెనుక ఈ 'R' అక్షరమే ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది. 'కేజీఎఫ్: చాప్టర్ 1', 'కేజీఎఫ్: చాప్టర్ 2' సినిమాల్లో యశ్ పోషించిన 'రాకీ భాయ్' (Rocky Bhai) పాత్ర భారతీయ చిత్రసీమ చరిత్రలోనే ఒక సంచలనాన్ని సృష్టించింది. రాకీ భాయ్ అటిట్యూడ్, మాస్ మేనరిజమ్స్, గూస్‌బంప్స్ తెప్పించే ఎలివేషన్లు ప్రతి ఒక్క సినీ అభిమాని మనస్సులో చెరిగిపోని ముద్ర వేశాయి. అక్కడ 'R' తో ప్రారంభమైన ఆయన విజయ పరంపర ఇప్పుడు తదుపరి మైలురాళ్లకు బాటలు వేసింది. కేజీఎఫ్ తెచ్చిన సంచలన విజయం తర్వాత యశ్ తన తదుపరి ప్రాజెక్టుల ఎంపికలో ఎంతో వ్యూహాత్మకంగా అడుగులు వేశారు. ప్రస్తుతం ఆయన గీతు మోహన్‌దాస్ దర్శకత్వంలో నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ యాక్షన్ గ్యాంగ్‌స్టర్ డ్రామా 'టాక్సిక్'. ఈ అంతర్జాతీయ స్థాయి చిత్రంలో యష్ పోషిస్తున్న ప్రధాన పాత్ర పేరు 'రాయా' (Raya). మరోసారి 'R' అక్షరంతో ప్రారంభమయ్యే ఈ పాత్ర ద్వారా యష్ సరికొత్త మాస్ విశ్వరూపాన్ని ప్రదర్శించబోతున్నారు. మరోవైపు భారతీయ చలనచిత్ర చరిత్రలోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా, భారీ బడ్జెట్‌తో బాలీవుడ్ దర్శకుడు నితేష్ తివారీ తెరకెక్కిస్తున్న పౌరాణిక దృశ్యకావ్యం 'రామాయణ' (Ramayana). ఈ రెండు భాగాల విజువల్ ఎపిక్‌లో యశ్ లంకేశ్వరుడైన 'రావణాసురుడి' (Ravana) పాత్రలో కనిపించబోతున్నారు. తాజాగా విడుదలైన ట్రైలర్ లో రావణుడిగా యశ్  లుక్, స్క్రీన్ ప్రెజెన్స్ విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకుంది. ఇక్కడ కూడా ఆయన పాత్ర పేరు 'R' అక్షరంతోనే ప్రారంభం కావడం గమనార్హం. ఈ మూడింటినీ ఒకసారి నిశితంగా పరిశీలిస్తే.. రాకీ భాయ్, రాయా, రావణ.. ఈ మూడు ప్రతిష్టాత్మకమైన పాత్రల పేర్లు 'R' అక్షరంతోనే మొదలవుతున్నాయి. సోషల్ మీడియాలో ఇది యశ్ కి లక్కీ లెటర్ గా ప్రచారం పొందుతోంది. ఒకవేళ 'టాక్సిక్', 'రామాయణ' సినిమాలు కూడా ఘన విజయం సాధిస్తే.. ఈ R సెంటిమెంట్ మరింత బలపడే అవకాశముంది.     Rocking Star Yash, Ramayana, Ravana, Toxic  
    ఘట్టమనేని కృష్ణ(Krishna).. తెలుగు సినిమాకి దొరికిన అరుదైన, విలువైన వజ్రం.. సినిమా సినిమాకి తను ఎదగడమే కాకుండా తెలుగు సినిమాని కూడా ఎదిగేలా చేసాడు. మాస్ అమ్మ మొగుడనే ట్యాగ్ లైన్ తో పాటు కృష్ణ కోసం ఎంత వరకైనా వెళ్లే వీరాభిమానులకి లెక్కే లేదు. ప్రపంచంలోనే అత్యధిక అభిమాన సంఘాలు ఉన్న హీరో కూడా.  దీన్ని బట్టి తెలుగు సినిమాపై కృష్ణ ప్రభావం ఎలా ఉందో తెలుసుకోవచ్చు. మరి ఆ లెజండ్రీ పెద్ద కొడుకు మాజీ హీరో రమేష్ బాబు కుమారుడు జై కృష్ణ ఈ రోజు 'శ్రీనివాస మంగాపురం'తో సెల్యులాయిడ్ పై అడుగుపెడితే అభిమానుల్లో, ప్రేక్షకుల్లో ఉండే ఆసక్తి ఏ పాటిదో అర్ధం చేసుకోవచ్చు. మూవీ చూసిన వాళ్లంతా సోషల్ మీడియా వేదికగా స్పందిస్తు 'శ్రీను, వాసుబాబు అనే రెండు క్యారక్టర్ లలో జై కృష్ణ ఎలాంటి బెరుకు లేకుండా నటించాడు. డెబ్యూ మూవీనే రొమాన్స్, యాక్షన్ డ్రామాలో చేసి ఈ రోజుల్లో మెప్పించాలంటే చాలా కష్టం. అలాంటిది తాత, తండ్రి, బాబాయ్ మహేష్ బాబు పేరు నిలబెడుతు  సదరు సన్నివేశాల్లో అత్యంత సహజమైన నటన ప్రదర్శించాడు.తొలి సినిమానే అయినప్పటికీ ఎక్కడా కొత్త నటుడనే భావన కలగకుండా డాన్సులు, యాక్షన్ ఘట్టాలు, భావోద్వేగ సన్నివేశాలలో 100 శాతం  తన ప్రతిభని చాటుకున్నాడు. ముఖ్యంగా మాస్ సన్నివేశాలలో జై కృష్ణ కనబరిచిన స్క్రీన్ ప్రెజెన్స్, డైలాగ్ డెలివరీ ఆయనలోని పరిణతిని స్పష్టంగా చూపిస్తున్నాయి. తన తండ్రి రమేష్ బాబు కలలుగన్న నటుడిగా జై కృష్ణ రూపాంతరం చెందాడని ఘట్టమనేని అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. బాలీవుడ్ ప్రముఖ నటి రవీనా టాండన్ కుమార్తె రాశా తడాని కథానాయికగా తెలుగు తెరకు పరిచయమవ్వగా, జై కృష్ణ మరియు రాశాల మధ్య వచ్చిన రొమాంటిక్ కెమిస్ట్రీ సినిమాకి ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ప్రముఖ నటుడు మోహన్ బాబు, శ్యామ్, నరేష్  లాంటి సీనియర్ నటులు ఉన్నప్పటికీ జై కృష్ణ తనదైన శైలిలో నటనను పండించి సినిమా మొత్తాన్ని తన భుజాలపై నడిపించారు. జాతీయ అవార్డు గ్రహీత జి.వి. ప్రకాష్ కుమార్ అందించిన సంగీతం, ప్రత్యేకంగా “అల్లెలే” సాంగ్ మరియు బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ జై కృష్ణ మాస్ మేనియాని వేరే స్థాయికి తీసుకెళ్లాయి.     Also read:  శ్రీనివాస మంగాపురం హైలెట్స్   తండ్రి రమేష్ బాబు భౌతికంగా మన మధ్య లేకపోయినా, ఆయన ఆశయాలు, అభిమానుల ప్రేమ జై కృష్ణని  ముందుండి నడిపించాయని ఈ చిత్రం నిరూపించింది. బాబాయ్ మహేష్ బాబు సోషల్ మీడియా ద్వారా అందించిన ప్రత్యేక ప్రోత్సాహం జై కృష్ణపై ఉన్న అంచనాలను పెంచినప్పటికీ, ఆ అంచనాలను ఏమాత్రం తగ్గకుండా నిలబెట్టుకుని విజయాన్ని సాధించాడు. ఇప్పటికే ఈ చిత్ర డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో దక్కించుకోవడం ఈ సినిమాకున్న క్రేజ్‌ను సూచిస్తోంది. ఘట్టమనేని వంశంలో మూడో తరం వారసుడిగా అడుగుపెట్టిన జై కృష్ణ, తన తండ్రి రమేష్ బాబు పేరును నిలబెట్టి టాలీవుడ్‌లో భవిష్యత్తులో సుదీర్ఘ ప్రయాణానికి బలమైన పునాది వేసుకున్నారు.  
ఘట్టమనేని వారసుడు జయకృష్ణ 'శ్రీనివాస మంగాపురం' సినిమాతో థియేటర్లలో అడుగుపెట్టాడు. సూపర్ స్టార్ కృష్ణ మనవడు హీరోగా ఎంట్రీ ఇవ్వడంతో.. మొదటి షో నుంచే థియేటర్ల వద్ద సందడి మొదలైంది. టాక్ కూడా బాగానే ఉంది. రెగ్యులర్ కమర్షియల్ ఫార్మాట్ ఫిల్మ్ అయినప్పటికీ.. జయకృష్ణ తన స్క్రీన్ ప్రజెన్స్, యాక్టింగ్ తో మెప్పించాడని ప్రశంసల వర్షం కురుస్తోంది. దీంతో బాక్సాఫీస్ వద్ద 'శ్రీనివాస మంగాపురం' సౌండ్ బాగానే వినిపిస్తోంది. ప్రేక్షకుల నుండి లభిస్తున్న ఈ విశేష ఆదరణ ఇప్పుడు బుకింగ్ ప్లాట్‌ఫామ్‌లలో కూడా స్పష్టంగా కనిపిస్తోంది. ప్రముఖ ఆన్‌లైన్ టికెట్ బుకింగ్ యాప్ బుక్‌మైషోలో ఈ సినిమా ట్రెండ్ అవుతోంది. కేవలం గడిచిన ఒక్క గంట వ్యవధిలో ఏకంగా 1.33K కంటే ఎక్కువ టికెట్లు అమ్ముడవ్వడం సినిమా సాధిస్తున్న రికార్డు స్థాయి క్రేజ్‌కు నిదర్శనంగా నిలిచింది.  ఆఫ్ లైన్ లోనూ ఫుట్ ఫాల్స్ బాగానే ఉన్నాయి. ముఖ్యంగా రూరల్ ఏరియాల్లో అదిరిపోయే రెస్పాన్స్ కనిపిస్తోంది. దాంతో యేటర్ల వద్ద హౌస్‌ఫుల్ బోర్డులు దర్శనమిస్తున్నాయి.  మొత్తానికి 'శ్రీనివాస మంగాపురం' రూపంలో జయకృష్ణకు మంచి ఎంట్రీనే లభించింది. థియేటర్లలో రెస్పాన్స్ చూస్తుంటే ఈ సినిమా లాంగ్ రన్ నమోదు చేయడం ఖాయంగా కనిపిస్తోంది.     Jaya Krishna Ghattamaneni, Srinivasa Mangapuram, Bookings, Book My Show  
  ఈ రోజు ఘట్టమనేని నయా వారసుడు ఘట్టమనేని జై కృష్ణ(Jai Krishna)శ్రీనివాస మంగాపురంతో వరల్డ్ సెల్యులాయిడ్ పై ల్యాండ్ అయ్యాడు. ప్రచార చిత్రాలతో మంచి బజ్ సంపాదించుకోవడంతో పాటు జై కృష్ణ తొలి సినిమా ఎలా ఉంటుందనే ఆసక్తి అభిమానులతో పాటు ప్రేక్షకుల్లో కలిగింది. మూవీ చూసిన వాళ్లంతా పలు హైలెట్స్ ని వ్యక్తం చేస్తున్నారు. మరి ఆ హైలెట్స్ ఏంటో చూద్దాం. 1 . లవ్, యాక్షన్, సెంటిమెన్స్ సీన్స్ లో జై కృష్ణ పెర్ఫార్మెన్స్  2 . జై కృష్ణ, హీరోయిన్ రష తడాని మధ్య జరిగిన లవ్ ట్రాక్  3 .మంగ, మంగ సాంగ్   4 . ఫస్ట్ హాఫ్ లో వచ్చిన యాక్షన్ సీక్వెన్స్  5 . మోహన్ బాబు , జై కృష్ణ మధ్య ట్రాక్  6 .  ఫ్ల్యాష్ బ్యాక్ ఎపిసోడ్  7 . ప్రతి ప్రేమ్ అత్యద్భుతంగా తీర్చిదిద్దిన ఫోటోగ్రఫీ  8 . తిరుపతిలో చిత్రీకరించడం వల్ల సరికొత్త ఫ్రెష్ నెస్   9 . ప్రీ క్లైమాక్స్ లో వచ్చిన సన్నివేశాలు  10 . మాటలని ఎంత వరకు వాడాలో అంతే వాడటం Also read: Srinivasa Mangapuram movie review in telugu: శ్రీనివాస మంగాపురం మూవీ రివ్యూ    టాక్ పరంగా చూసుకున్నా మెజారిటీ ప్రేక్షకులు బాగానే ఉందని చెప్తున్నారు. మెజారిటీ రివ్యూస్ కూడా అదే విధంగా వస్తున్నాయి. అశ్వని దత్, కిరణ్ నిర్మించగా ఆర్ ఎక్స్ 100 ఫే మ్ అజయ్ భూపతి దర్శకుడు. జీ వి ప్రకాష్ కుమార్ మ్యూజిక్ ని అందించాడు.   Jai Krishna, Rasha thadani, Mohan Babu, Tollywood  
Cast: Jaya Krishna Ghattamaneni, Rasha Thadani, Mohan Babu, Shyam, Naresh Vijay Krishna, Brahmaji Crew: Written and Directed by Ajay Bhupathi Cinematography by Jayakrishna Gummadi Music by G.V. Prakash Kumar Produced by P Kiran The Ghattamaneni family introduces its third-generation actor, Jaya Krishna, with Srinivasa Mangapuram. Directed by Ajay Bhupathi, the film also marks the debut of Rasha Thadani. With strong support from veteran actors like Mohan Babu, this romantic action drama has created decent buzz. Let's discuss the movie released today. Plot: Set in the temple town of Tirupati, the story follows a carefree young man, Srinu (Jaya Krishna), who falls in love with Manga (Rasha Thadani). However, Manga's father, Peddireddy (Shyam), is a ruthless and dangerous man who controls the area. Despite Manga rejecting his initial proposal, Srinu stays involved in her life. Things take a turn when his real identity as Vasu Babu is revealed. He must now fight dangerous enemies to protect his love and survive unexpected challenges. Will he be able to find a way? Watch the movie to know more. Analysis: Jaya Krishna makes a confident debut as a lead actor. He looks natural on screen and performs well in emotional scenes. Rasha Thadani is good and shares a decent chemistry with him. Mohan Babu and Shyam both deliver strong performances in negative roles, bringing weight to the central conflict. Director Ajay Bhupathi tries to blend a classic love story with a revenge drama using full commercial elements. The first half is interesting, building good suspense around the heroine's family and the hero's identity. But the problem lies in the second half. It looks like the makers chose a very easy and predictable path to finish the story. The major drawback is that the storyline feels heavily repeated and lacks fresh ideas. Once the second half begins, the audience can easily guess what will happen next. G.V. Prakash Kumar's background music is solid and elevates many scenes, but the songs are placed poorly and act as speed breakers. Still, Srinivasa Mangapuram is a decent launchpad for the new actors. On the whole, it is a routine romantic action drama that is passable but not as fresh as one would hope. Positives: Jaya Krishna's confident acting Strong background music Engaging first half Mohan Babu and Shayam's presence Negatives: Routine and predictable story Second half lacks freshness Songs acting as speed breakers Weak screenplay in the later half Bottomline: A routine romantic drama that relies mostly on its debutants. Rating: 2.75/5   Disclaimer: The views/opinions expressed in this review are personal views/opinions shared by the writer and organisation does not hold a liability to them. Viewers' discretion is advised before reacting to them.
  -సినిమా పేరు: శ్రీనివాస మంగాపురం -న‌టీన‌టులు: జై కృష్ణ, రషా తడాని, మోహన్ బాబు, శ్యామ్, నరేష్, బ్రహ్మాజీ, అజయ్    తదితరులు  -సినిమాటోగ్ర‌ఫీ: జయకృష్ణ గుమ్మడి  -ఎడిటింగ్: మాధవ్ కుమార్  -మ్యూజిక్: జి వి ప్రకాష్ కుమార్  -నిర్మాత‌: అశ్వనీదత్, కిరణ్  -బ్యానర్స్: వైజయంతి మూవీస్, చందమామ కథలు పిక్చర్స్   -రచన,దర్శకత్వం: అజయ్ భూపతి  -రిలీజ్ డేట్ : జులై 30 ,2026  ఘట్టమనేని మూడో తరం వారసుడు 'జై కృష్ణ'(Jai Krishna)ఈ రోజు నట ప్రపూర్ణ 'మోహన్ బాబు(Mohan Babu),మాజీ హీరోయిన్ రవీనా టాండన్ కుమార్తె రషా తడాని తో కలిసి 'శ్రీనివాస మంగాపురం'(Srinivasa Mangapuram)తో థియేటర్స్ లో అడుగుపెట్టాడు. మరి మూవీ ఎలా ఉందో చూద్దాం. కథ శ్రీను(జై కృష్ణ) యంగ్ అండ్ డైనమిక్ యువకుడు. ఎంతటి ప్రతికూల సంఘటనలనైనా ఫేస్ చేసే దైర్యం శ్రీను సొంతం. ఆంధ్రప్రదేశ్ బోర్డర్ కర్ణాటక రాష్ట్రంలోని బళ్లారి నుంచి తిరుపతి వస్తాడు. మంగ(రషా తడాని) తిరుపతిలో బాగా పేరు పలుకుబడి ఉన్న పెద్దిరెడ్డి( శ్యామ్) ఒక్కగానొక్క కూతురు. చాలా మంచి మనసు గల యువతితో పాటు తన వల్ల ఎవరు ఇబ్బందులు పడకూడదనే వ్యక్తిత్వం తన సొంతం. మంగని ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తున్నానని శ్రీను వెంటపడుతుంటాడు. కానీ మంగ మాత్రం శ్రీనుని స్నేహితుడిలా చూస్తుండటంతో పాటు వేరే వ్యక్తితో పెళ్ళికి రెడీ అవుతుంది. వెంకటప్పనాయుడు(మోహన్ బాబు) బళ్లారిలో పేరు మోసిన మహాశక్తీ. తనకి అడ్డొచ్చాడని సొంత తమ్ముడినే చంపిన రికార్డు వెంకటప్ప నాయుడు సొంతం. వెంకటప్పనాయుడుని అంతం చెయ్యాలని తమ్ముడి కొడుకు( అజయ్) చూస్తుంటాడు. పెద్దిరెడ్డికి వంశ పారంపర్యంగా వస్తున్న 'గన్' ని శ్రీనుకి మంగ ఇస్తుంది.స్నేహితుడిలా చూస్తున్న శ్రీనుకి మంగ గన్ ఎందుకు ఇచ్చింది? తిరుపతి వచ్చిన వెంటనే  మంగని ప్రేమిస్తున్నాని శ్రీను ఎందుకు వెంటపడుతున్నాడు? శ్రీనుది నిజమైన ప్రేమేనా? లేక ఏమైనా కారణం ఉందా? అసలు బళ్లారి నుంచి ఎందుకు వచ్చాడు? ఎవరి తాలూకా? అనేదే కథ ఎనాలసిస్  ఇలాంటి కథతో కూడిన చిత్రాలు గతంలో కొన్నివచ్చాయి. కానీ కథనం బోర్ కొట్టకుండా సాగడంతో శ్రీనివాస మంగాపురం పర్వాలేదనే స్థాయిలోనే మెప్పిస్తుంది. ముఖ్యంగా జై కృష్ణ తన పెర్ ఫార్మెన్స్ తో మెప్పించకపోయి ఉంటె సినిమా ఫలితం వేరేలా ఉండేది. డెబ్యూ హీరోకి ఇలాంటి సబ్జెక్ట్ లో పెర్ఫార్మ్ చేయ్యడమంటే కత్తి మీద సాము అని చెప్పవచ్చు. అలాంటిది జై కృష్ణ తన స్క్రీన్ ప్రెజెన్స్ తో శ్రీనివాస మంగాపురం కి రక్షణ కవచంలా నిలిచాడు. ఫస్ట్ హాఫ్  చూసుకుంటే స్టార్టింగ్ లోనే వచ్చిన శ్రీను(జై కృష్ణ) ఇంట్రడక్షన్ సీన్ బాగుంది. ఆ తర్వాత ఏ మాత్రం లేటు చేయకుండా కథలోకి వెళ్లడంతో పాటు మంగ, శ్రీను మధ్య వచ్చిన సీన్స్ చాలా ఫన్నీగా బాగున్నాయి. స్వతంత్ర బాబు(నరేష్ ) బాలు( బ్రహ్మాజీ) మధ్య నడిచిన కామెడీ ట్రాక్ బాగానే  పేలింది. ఈ ఇద్దరి రోల్స్ ని శ్రీను లవ్ కి హెల్ప్ గా  వాడుకొని ఎంటర్ టైన్ మెంట్ ని సృషించాల్సింది. సాంగ్స్ కూడా బాగున్నాయి. పెద్ది రెడ్డి సీన్స్ కూడా బాగానే ఉన్నా శ్రీనుకి ఏదో ఫ్లాష్ బ్యాక్ ఉందనే క్యూరియాసిటీని కలిగించడంలో మేకర్స్ విఫలమయ్యారు. ఇంటర్వెల్ ఎపిసోడ్ పెద్దగా వర్క్ అవుట్ కాలేదు. సెకండ్ హాఫ్ లో ఊహించని కథ రన్ అవుతుంది. మంగ ఎపిసోడ్ హైలెట్. ఆ సందర్భంగా వచ్చిన సీన్స్ బాగున్నాయి . వెంకటప్ప నాయుడు(మోహన్ బాబు) క్యారక్టర్ డిజైన్ బాగుంది. కానీ ఆ క్యారక్టర్ చేసే పోరాటాన్ని ఇంకా బాగా ఎస్టాబ్లిష్ చేసి ఉండాల్సింది. ఫస్ట్ హాఫ్ లో మెప్పించిన విధంగా సాంగ్స్ ఉండాల్సింది. ప్రీ క్లైమాక్స్ బాగున్నా క్లైమాక్స్ లో హడా విడి సృష్టించి ఎండ్ చేయాల్సింది. అలా కాకుండా సింపుల్ గా తేల్చి పడేసారు. నటీనటులు సాంకేతిక నిపుణుల పని తీరు  జై కృష్ణ మొదటి సినిమా అయినా తన పెర్ఫార్మ్ తో నూటికి నూరు మార్కులు సంపాదించుకున్నాడు. లవ్, యాక్షన్, ఫైట్స్ సన్నివేశాల్లో ఎంతో అనుభవమున్న నటనని ప్రదర్శించాడు. తెలుగు పరిశ్రమకి ఇంకో మంచి నటుడు దొరికినట్లే. ముఖ్యంగా సిగరెట్ కాల్చే స్టైల్, రివాల్వర్ వాడే విధానంలో ఘట్టమనేని తర్వాతే ఎవరైనా అనే టాగ్ లైన్ ని మరోసారి గుర్తు చేసాడు.రష తడాని కూడా ఎంతో బరువున్న మంగ క్యారక్టర్ లో అవలీలగా నటించి మెప్పించింది. వెంకటప్ప నాయుడుగా  మోహన్ బాబు ఎప్పటిలాగా తన నట విశ్వరూపాన్ని ప్రదర్శించాడు. మోహన్ బాబు వి ఇంకొన్ని సీన్స్ ఉంటే బాగుండేది అనిపించేలా సాగింది. నరేష్ గారి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. నరేష్ గారి సీన్స్ కూడా ఇంకొన్ని ఉంటే బాగుండని అనిపిస్తుంది. పెద్దిరెడ్డి గా శ్యామ్ నటనలో మెరుపులు లేకపోయినా పర్ఫెక్ట్ గా సూటయ్యాడు. బ్రహ్మాజీ, అజయ్ తో పాటు మిగతా వాళ్ళు కూడా పరిణితి చెందిన నటనతో మెప్పించారు. అజయ్ భూపతి దర్శకత్వంలో మెరుపులు లేకపోయినా రచన పరంగా మెప్పించడంతో పాటు డైలాగ్స్ ఆణిముత్యాల్లా ఉన్నాయి. మూవీని కాపాడింది కూడా డైలాగ్స్ అని చెప్పుకోవడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. జీవి ప్రకాష్ కుమార్ నుంచి వచ్చిన సాంగ్స్ లో రెండు మాత్రమే బాగున్నాయి. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ పర్లేదు. ఫొటోగ్రఫీ హైలెట్. ఇలాంటి సినిమాలకి నిర్మాణ విలువలు కనపడవు.  బలాలు 1 జై కృష్ణ, రష తడాని పెర్ ఫార్మెన్స్  2 . కథనం 3 . ఫొటోగ్రఫీ  4 . సెకండ్ హాఫ్  5 .మోహన్ బాబు పెర్ ఫార్మెన్స్   6 . తిరుపతి అందాలు బలహీనతలు  1 . ఎంచుకున్న కథలో కొన్ని సినిమాల పోలికలు గుర్తుకు రావడం  2 . డైరెక్షన్ లో మెరుపులు లేకపోవడం  ఫైనల్ గా చెప్పాలంటే కథలో కొన్ని సినిమాల పోలికలు ఉన్నా జై కృష్ణ, రష తడాని, మోహన్ బాబు తన అద్భుతమైన పెర్ఫార్మ్ తో 'శ్రీనివాస మంగాపురం' నచ్చేలా చేసారు.    రేటింగ్ 2 .75 /5                                                                                                                                                                                                                                                       అరుణాచలం   
కోలీవుడ్ స్టార్ ధనుష్, టాలెంటెడ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి కాంబినేషన్ లో గతంలో వచ్చిన 'సార్' చిత్రం ఎంతటి విజయాన్ని సాధించిందో తెలిసిందే. బాక్సాఫీస్ వద్ద విజయం సాధించడమే కాకుండా, విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఇప్పుడు ఈ బ్లాక్‌బస్టర్ కాంబో మళ్లీ ఒక కొత్త ప్రాజెక్ట్ కోసం జతకట్టబోతోందనే వార్త ఆసక్తిని రేకెత్తిస్తోంది.  ఫిల్మ్ సర్కిల్స్ లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం, వెంకీ అట్లూరి దర్శకత్వంలో రాబోయే ఈ చిత్రంలో ధనుష్ తొలిసారిగా ఒక పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నారట. తన వైవిధ్యమైన నటనతో ఎన్నో రకాల పాత్రలకు ప్రాణం పోసిన ధనుష్, ఇప్పటివరకు ఒక్క సినిమాలో కూడా పూర్తిస్థాయి పోలీస్ ఆఫీసర్‌గా నటించకపోవడం విశేషం. అందుకే ఈసారి ఆయన ఖాకీ యూనిఫాం ధరిస్తున్నారనే ప్రచారం అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపుతోంది. దర్శకుడు వెంకీ అట్లూరి ధనుష్ కోసం ఒక పవర్ ఫుల్, ఎమోషనల్ కాన్సెప్ట్ తో కూడిన కథను సిద్ధం చేశారని టాక్. ఎమోషనల్ డ్రైవ్‌తో పాటు పక్కా కమర్షియల్ హంగులను మేళవించి ధనుష్‌ను సరికొత్త అవతార్‌లో ప్రెజెంట్ చేయడానికి స్క్రిప్ట్ డిజైన్ చేశారని తెలుస్తోంది.  'సార్' సినిమా తర్వాత మళ్లీ ఒక బలమైన లైన్‌తో వెంకీ అట్లూరి సంప్రదించగానే ధనుష్ కూడా వెంటనే ఇంప్రెస్ అయి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సమాచారం. సోషల్ మీడియాలో కూడా ఈ కాంబో అప్‌డేట్‌పై నెటిజన్లు విశేషంగా చర్చించుకుంటున్నారు. ఒక వైవిధ్యమైన నటుడు పోలీస్ ఆఫీసర్ పాత్రను తనదైన శైలిలో ఎలా పోషిస్తారో చూడాలని అందరూ చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం దర్శకుడు వెంకీ అట్లూరి.. సూర్య, మమితా బైజు కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న భారీ చిత్రం 'విశ్వనాథ్ అండ్ సన్స్' పోస్ట్ ప్రొడక్షన్ పనులతో ఎంతో బిజీగా ఉన్నారు. ఈ సినిమా ఆగస్టు 14న ప్రేక్షకుల ముందుకు రానుంది.     Dhanush, Venky Atluri, Vishwanath and Sons  
అఖిల్ అక్కినేని హీరోగా నటించిన తాజా యాక్షన్ డ్రామా చిత్రం 'లెనిన్' బాక్సాఫీస్ దగ్గర సంచలనం సృష్టిస్తోంది. ఈ సినిమా విడుదలైన మొదటి రోజు నుంచే ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటూ థియేటర్లలో రికార్డు స్థాయి వసూళ్లతో దూసుకుపోతోంది. ముఖ్యంగా అఖిల్ మాస్ మేకోవర్, ట్విస్ట్ లు, ఎమోషన్స్ కి అక్కినేని అభిమానులతో పాటు సామాన్య ప్రేక్షకులు కూడా ఫిదా అయిపోతున్నారు. మునుపెన్నడూ లేని విధంగా అఖిల్ ను ఒక పవర్ ఫుల్, ఎమోషనల్ అండ్ యాక్షన్ ఓరియెంటెడ్ పాత్రలో దర్శకుడు మురళి కిషోర్ అబ్బూరు చూపించిన తీరు బాక్సాఫీస్ వద్ద విజయాన్ని అందించింది. ఇప్పుడు ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా ఏకంగా రూ. 100 కోట్ల గ్రాస్ మార్కును అధిగమించి అఖిల్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ గా నిలిచింది. ఈ సందర్భంగా చిత్ర బృందం "మనోడు బ్లాక్‌బస్టర్ కొట్టేసాడు" అంటూ ఒక పవర్ ఫుల్ పోస్టర్ ను విడుదల చేస్తూ తమ సంతోషాన్ని పంచుకుంది. బాక్సాఫీస్ వద్ద రికార్డు స్థాయిలో కలెక్షన్లు రాబట్టడం అక్కినేని అభిమానులకు పండగ వాతావరణాన్ని తీసుకొచ్చింది. ప్రపంచవ్యాప్తంగా రూ. 100 కోట్ల గ్రాస్ మైలురాయిని దాటిన 'లెనిన్' చిత్రం బాక్సాఫీస్ వద్ద తన విజయ పరంపరను ఇప్పటికీ కొనసాగిస్తోంది. మాస్ యాక్షన్ మూవీ లవర్స్ కు పర్ఫెక్ట్ ట్రీట్ లా మారిన ఈ చిత్రం రాబోయే రోజుల్లో కూడా మరింత మెరుగైన కలెక్షన్లను సాధిస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.  https://x.com/SitharaEnts/status/2082722862193160686     Akhil Akkineni, Lenin Movie, 100 Crore Gross  
భారతీయ చలనచిత్ర పరిశ్రమలో రామాయణం ఆధారంగా తెరకెక్కే ప్రతి దృశ్యకావ్యంపై ప్రేక్షకుల్లో అపారమైన ఆసక్తి ఉంటుంది. నితీష్ తివారీ దర్శకత్వంలో భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న 'రామాయణ' చిత్రానికి సంబంధించిన ట్రైలర్ తాజాగా విడుదలై సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది.  ఈ ట్రైలర్‌లో రాముడిగా రణ్‌బీర్ కపూర్ ప్రశాంతత, సీతగా సాయి పల్లవి అమాయకత్వం, రావణాసురుడిగా యశ్ గంభీరత సోషల్ మీడియాలో విపరీతమైన హైప్‌ను క్రియేట్ చేశాయి. అయితే ఈ రామాయణ ట్రైలర్ ఎంత గొప్పగా ఆకట్టుకుందో, అదే స్థాయిలో ప్రభాస్ నటించిన 'ఆదిపురుష్' సినిమాను మరోసారి నెటిజన్లు గుర్తుచేసుకుంటున్నారు. ఓం రౌత్ దర్శకత్వంలో భారీ వ్యయంతో రూపొందిన ఆదిపురుష్ చిత్రం 2023లో విడుదలైనప్పుడు తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే.  ఇప్పుడు నితీష్ తివారీ రామాయణ ట్రైలర్‌లో విజువల్ ఎఫెక్ట్స్, పాత్రల రూపురేఖలు, ప్రాచీన సంస్కృతికి ఇచ్చిన గౌరవాన్ని చూసిన సినీ ప్రియులు, ఆదిపురుష్‌ను పోలుస్తూ సోషల్ మీడియా వేదికగా ట్రోల్స్ మొదలుపెట్టారు. ముఖ్యంగా లంకేశ్వరుడి పాత్ర డిజైన్‌లో రెండు సినిమాల మధ్య ఉన్న వ్యత్యాసాన్ని ఎత్తిచూపుతూ మీమ్స్ వర్షం కురిపిస్తున్నారు. ఆదిపురుష్ సినిమాలో సైఫ్‌ ఆలీ ఖాన్ పోషించిన రావణాసురుడి లుక్ ఒక ఆధునిక విలన్‌లా ఉందనే విమర్శలు వచ్చాయి. పైగా అందులో రావణుడి వాహనం, రావణ లంక రంగులు రామాయణ ఇతిహాసానికి తగినట్లుగా లేవని అప్పట్లో నెటిజన్లు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.  కానీ ప్రస్తుత రామాయణం ట్రైలర్‌లో యష్ రావణాసురుడిగా కనిపించిన తీరు, బంగారు లంకా నగరం ప్రాచీన వైభవాన్ని ప్రతిబింబించేలా ఉందని అభిమానులు కొనియాడుతున్నారు. అలాగే రామాయణ ట్రైలర్ లో వీఎఫ్ఎక్స్ చూశాక ఆదిపురుష్ క్వాలిటీ ఎంత పేలవంగా ఉందో అర్థమవుతోందని ట్విట్టర్ లో పోస్టులు పెడుతున్నారు. ఒకే ఇతిహాసాన్ని ఇద్దరు దర్శకులు ఏ విధంగా ఊహించుకున్నారో తేడా చూపిస్తూ నెటిజన్లు  వీడియోలను ట్రెండ్ చేస్తున్నారు. ఏది ఏమైనా రామాయణం ట్రైలర్ ఒకవైపు యూట్యూబ్ రికార్డులను తిరగరాస్తుంటే, మరొకవైపు ఆదిపురుష్ చేదు జ్ఞాపకాలను గుర్తుచేస్తూ సోషల్ మీడియాలో ట్రోల్స్ ట్రెండ్ అవ్వడం విశేషం.     Ranbir Kapoor, Ramayana Trailer, Prabhas, Adipurush  
పెద్దల మాట కొట్టి పడేయకండి..  కుటుంబం అందరూ కలిసి భోజనం చేస్తే జరిగేది ఇదే..! ఈ సమాజంలో ప్రతి వ్యక్తికి కుటుంబంతో ఉండే అనుబంధం చాలా గొప్పది. ఎన్నో విషయాలు కుటుంబం నుండే నేర్చుకుంటారు.  ఒకప్పుడు కుటుంబం మొత్తం కలిసి భోజనం చేసేవారు.  కానీ నేటి వేగవంతమైన జీవితాల కారణంగా ఇంటిల్లిపాది కలిసి భోజనం చేయడం చాలా అరుదుగా మారిపోయింది. పిల్లలు స్కూల్లో,  తల్లిదండ్రులు ఆఫీసులలో.. ఇలా అందరూ కలిసి భోజనం చేసే పరిస్థితులు ఉండటం లేదు.. కనీసం రాత్రి సమయంలో అయినా కలిసి భోజనం చేస్తారా అనుకుంటే.. ఒకరు బయట తినేయడం,  ఇంకొకరు పార్టీలో తినేయడం,  ఇంకొకరు ఆలస్యంగా ఇంటికి రావడం.. ఇలాంటి కారణాల వల్ల కుటుంబంలో అందరూ కలిసి తినే సందర్బం ఉండటం లేదు. అయితే.. పెద్దలు మాత్రం కుటుంబంలో అందరూ కలిసి కనీసం రోజులో  ఒకసారి అయినా భోజనం చేయాలని చెబుతారు. అందరూ కలిసి భోజనం చేయడం ఎందుకు ముఖ్యమూ.. తెలుసుకుంటే.. విద్య ఫలితాలు.. అంతా కలిసి భోజనం చేసే కుటుంబాలలో పిల్లలు చదువులో చాలా చురుగ్గా ఉంటారట. కుటుంబంతో కలిసి భోజనం చేయడం వారిని మానసికంగా మెరుగ్గా ఉంచి,  చదువులో మంచి వికాసం కలిగేలా చేస్తుందట. పిల్లలు చక్కగా చదువుకుంటారట. లాంగ్వేజ్,  కమ్యూనికేషన్ స్కిల్స్.. పిల్లలు, పెద్దలు కలిసి భోజనం చేసినప్పుడు  పిల్లలలో లాంగ్వేజ్ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్ డవలప్ అవుతాయి. పిల్లలు పెద్దలతో మాట్లాడటం,  కావలసినది అడగడం, వద్దని చెప్పడం,  వంట బాగుందని చెప్పడం.. ఇలా భోజనం సమయంలో చాలా సంఘటనల నుండి పిల్లలు చక్కగా మాట్లాడటం,  చక్కగా కమ్యూనికేట్ చేయడం నేర్చుకుంటారు. ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు.. పెద్దల సమక్షంలో పిల్లలు భోజనం చేయడం వల్ల పిల్లలు తినే విధానం,  ఎలా తినాలి? కావలసిన ఆహారం తినడం, ఆహారం వృధా చేయకపోవడం, శుభ్రంగా తినడం వంటి మంచి ఆహారపు అలవాట్లు అలవడతాయి.  అంతేకాదు.. ఆహారాన్ని కలుపుకునే విధానం కూడా పెద్దల నుండే నేర్చుకుంటారు. పిల్లలు పెద్దలతో కలిసి తినేటప్పుడు సంపూర్ణ ఆహారం తినే అవకాశం ఉంటుంది.  పండ్లు, కూరగాయలు,  పోషకాలు, ప్రోటీన్.. ఇలా అన్ని రకాలు పిల్లలకు అందుతాయి. తృప్తిగా తింటారు.. పిల్లలు పెద్దలతో కలిసి తినేటప్పుడు హ్యాపీగా తినడం అలవాటు అవుతుంది. ఇది పిల్లలు తృప్తిగా తినడానికి కారణం అవుతుంది. సెల్ఫ్ రెస్సెక్ట్, సెల్ఫ్ కాన్పిడెన్స్.. పెద్దల దగ్గర కూర్చుని పిల్లలు తామే ఆహారం కలుపుకోవడం, తినడం వంటివి చేయడం వల్ల వారిలో ఆత్మవిశ్వాసం,  ఆత్మగౌరవం పెరుగుతాయి. బందాలు.. పిల్లలు, పెద్దలు కలిసి భోజనం చేయడం వల్ల కుటుంబ సభ్యుల మధ్య బంధం బలంగా మారుతుంది.  అందరూ కలిసి తినే ఆ కొద్ది సమయం అందరినీ కలిపి ఉంచుతుంది. ఒత్తిడి, ఆందోళన, డిప్రెషన్.. ఒంటరిగా తినేటప్పుడు కోపం,  డిప్రెషన్, ఒత్తిడి వంటి ఎమోషన్స్ తో తినే అవకాశం ఉంటుంది.  పైగా ఒంటరిగా తినేటప్పుడు ఒంటరితనం కూడా చాలా వరకు ప్రభావం చూపిస్తుంది. కానీ అందరూ కలిసి తింటే.. ఒత్తిడి,  ఆందోళన,  డిప్రెషన్ వంటివి ఉండవు. చెడు అలవాట్లు.. ఒక వయసులోకి వచ్చిన పిల్లలు చాలా వరకు మధ్యం సేవించడం,  స్మోక్ చేయడం,  డ్రగ్స్ వాడటం వంటివి చేసే అలవాటు ఉంటుంది. కానీ అందరూ కలిసి కూర్చుని భోజనం చేస్తే పిల్లలలో చాలా వరకు మానసిక మార్పు కలుగుతుంది.  చెడు అలవాట్లకు దూరంగా ఉండగలుగుతారు. ఆరోగ్య సమస్యలు.. అందరూ కలిసి భోజనం  చేసేటప్పుడు ఒకరి గురించి ఒకరు ఆలోచిస్తారు. ఎక్కువ ఆహారం తినవద్దని,  ఎక్కువ ఉప్పు, కారం వంటివి తినవద్దని ఒకరికి ఒకరు సలహా ఇచ్చుకోవడం లేదా జాగ్రత్తలు చెప్పడం లాంటివి జరుగుతాయి.  దీని వల్ల ఒబెసిటీ,  దీనికి సంబంధించిన వ్యాధుల ప్రమాదం తగ్గుతుంది.                      *రూపశ్రీ.  
జపనీస్ పెంపకం.. ఇలా పెంచితే పిల్లలు చదువులో, ప్రవర్తనలో టాప్ లో ఉంటారట..! ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలు చదువులో రాణించడమే కాకుండా, తెలివైనవారుగా, క్రమశిక్షణ గలవారుగా , స్వయం సమృద్ధి గలవారుగా ఉండాలని కోరుకుంటారు. నేటి వేగవంతమైన ప్రపంచంలో, పిల్లలను సరైన మార్గంలో నడిపించడం ఒక పెద్ద ఛాలెంజ్ అనుకోవచ్చు. అయితే పిల్లలు చురుగ్గా ఉంటూ, చదువులో కూడా రాణిస్తూ,  మంచి ప్రవర్తనతో ఉండటానికి జపనీస్ పెంపకం చాలా బాగా సహాయపడుతుందట. ఇంతకీ ఆ జపనీస్ పెంపకం చిట్కాలు ఏంటో తెలుసుకుంటే.. జపనీస్ పెంపకం.. జపనీస్ పెంపక విధానం బాధ్యతాయుతమైన, సున్నితమైన , స్వయం సమృద్ధిగల పిల్లలను తయారుచేయడంలో సహాయపడుతుందట.  పిల్లల భవిష్యత్తును బలోపేతం చేయడానికి సహాయపడుతుందట. జపనీస్ పెంపకం చిట్కాలు..  బాధ్యతను నేర్పించడం.. జపాన్‌లో పిల్లలు చాలా చిన్న వయస్సు నుండే చిన్న పనులను స్వయంగా చేసుకోవడం నేర్చుకుంటారు. స్కూల్ బ్యాగులు సర్దుకోవడం, గదిని శుభ్రం చేసుకోవడం లేదా చిన్న చిన్న ఇంటి పనులలో సహాయం చేయడం వంటివన్నీ వారి దినచర్యలో భాగం. ఇది వారిలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించి, బాధ్యతా ఉండటాన్ని అభివృద్ధి చేస్తుంది. క్రమశిక్షణ..   జపనీస్ పెంపకంలో క్రమశిక్షణను కఠినంగా కాకుండా ఒక అలవాటుగా నేర్పిస్తారు. పిల్లలకు సమయానికి విలువ ఇవ్వడం, నియమాలను పాటించడం , ఇతరులను గౌరవించడం నేర్పిస్తారు. పాఠశాలల్లో, పిల్లలు తమ తరగతి గదులను కూడా స్వయంగా శుభ్రం చేసుకుంటారు. ఇది వారిలో సామూహిక బాధ్యతా భావాన్ని పెంపొందిస్తుంది. ఎమోషనల్ బాండింగ్..   జపనీస్ తల్లులు తమ పిల్లల బాల్యంలో వారితో గాఢమైన భావోద్వేగ బంధాన్ని ఏర్పరచుకుంటారు. దీనిని 'అమాయే' అని పిలుస్తారు. దీనిలో పిల్లలు సురక్షితంగా , ప్రేమతో చుట్టుముట్టబడినట్లు భావిస్తారు. ఇది వారి మానసిక వికాసాన్ని మెరుగుపరుస్తుంది , వారు మరింత ఆత్మవిశ్వాసంగా మారడానికి సహాయపడుుతంది. టీమ్ వర్క్..   జపనీస్ సంస్కృతిలో పిల్లలకు టీమ్ వర్క్, ఒకరికొకరు సహాయం చేసుకోవడం ,అందరూ కలిసి ఆలోచన చేయడం, నిర్ణయాలు తీసుకోవడం వంటివి నేర్పిస్తారు. ఇది వారు సమాజంలో మరింత మెరుగ్గా కలిసిపోవడానికి సహాయపడుతుంది. స్క్రీన్ సమయం..   జపనీస్ తల్లిదండ్రులు తమ పిల్లలను మొబైల్ ఫోన్లు , టెలివిజన్‌కు దూరంగా ఉంచి, సృజనాత్మక కార్యకలాపాలలో పాల్గొనేలా ప్రోత్సహిస్తారు. చదవడం, ఆరుబయట ఆడుకోవడం , కళలలో నిమగ్నమవడం వారి దినచర్యలో భాగం. ఇది వారి సంపూర్ణ అభివృద్ధికి దోహదపడుతుంది. తప్పుల నుండి నేర్చుకోవడం..   ప్రతి చిన్న తప్పుకు పిల్లలను తిట్టే బదులు, వారికి సలహా ఇచ్చి, వారి తప్పుల నుండి నేర్చుకునే అవకాశం కల్పిస్తారు. ఇది వారిలో ఆత్మవిశ్వాసాన్ని, సమస్య పరిష్కార సామర్థ్యాలను పెంపొందిస్తుంది. వ్యక్తిత్వ నిర్మాణానికే ప్రాధాన్యత.. అక్కడ కేవలం మార్కుల మీదనే కాకుండా, నిజాయితీ, వినయం, సానుభూతి వంటి గుణాలపై దృష్టి పెడతారు. అందుకే అక్కడ చదువు కన్నా, వ్యక్తిత్వ నిర్మాణానికే ఎక్కువ ప్రాధాన్యత ఉంది.                                     *రూపశ్రీ.  
టాక్సిక్ పాజిటివిటీ.. ఎప్పుడూ సంతోషంగా ఉండటం మంచిదేనా? జీవితం అన్నాక సంతోషాలు,  ఇబ్బందులు, కష్టాలు అన్నీ ఉంటాయి. కష్టం వచ్చినప్పుడు బాధపడటం అందరూ చేసే పనే.. కానీ.. కొందరుంటారు.. చుట్టూ ఉన్నవారు బాధపడితే.. ఏడిస్తే.. వారిని ఓదార్చాలనే ఆలోచనలతో "ఏడిస్తే ఏం ప్రయోజనం?", "అంతా సర్దుకుంటుంది," "ఎప్పుడూ పాజిటివ్ గా  ఆలోచించు!".. ఇలా చాలా మంది  ఇలాంటి సలహాలు ఇస్తుంటారు. ఈ మాటలు వినడానికి బానే ఉంటాయి.  కానీ మనస్తత్వవేత్తలు మాత్రం ఇది సరికాదు అంటున్నారు.  దీన్ని టాక్సిక్ పాజిటివిటీ అని పిలుస్తారట.  ఇది చాలా ప్రమాదకరమైనదని చెబుతున్నారు. కష్టంలో  ఉన్నప్పుడు పాజిటివిటీ మాటలను  ఒక మెడిసిన్ లాగా ఉపయోగిస్తారు. కానీ ఇది కాలక్రమేణా మనిషిని ఒంటరిని చేస్తుందని మానసిక విశ్లేషణ నిపుణులు అంటున్నారు.  దీని గురించి పూర్తీగా తెలుసుకుంటే.. టాక్సిక్ పాజిటివిటీ అంటే.. సులభంగా చెప్పాలంటే టాక్సిక్ పాజిటివీటి  అంటే మనిషిలో ఉండే నిజమైన ఫీలింగ్స్ ను అంగీకరించకుండా వాటిని దాచడానికి ప్రయత్నించడం. ఈ రోజుల్లో, సోషల్ మీడియా కారణంగా ఎలాంటి పరిస్థితుల్లోనైనా "బలంగా ఉండాలి" అనే మనస్తత్వం వల్ల ప్రజలు తమ దుఃఖాన్ని, భయాన్ని లేదా వైఫల్యాన్ని వ్యక్తపరచడానికి సంకోచిస్తున్నారు. అలా వ్యక్తం  చేయడం ఒక పెద్ద బలహీనత అని అనుకుంటారు. ఎప్పుడూ సంతోషంగా, బలంగా కనిపించాలనే  తీవ్రమైన ఒత్తిడి  వ్యక్తిలో అపరాధ భావాన్ని మాత్రమే పెంచుతుంది. ఎమోషన్స్ అణిచివేత ప్రమాదం.. మనిషిలో ఉండే నిజమైన , ప్రతికూల భావోద్వేగాలను దాచుకోవడం చాలా హానికరం అని మానసిక పరిశోధనలు కూడా స్పష్టంగా నిర్ధారిస్తున్నాయి. తమ ఎమోషన్స్  ను అణచిపెట్టుకోవడానికి ప్రయత్నించే వ్యక్తులు అకస్మాత్తుగా భయాందోళనలకు గురయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుందట. మనిషి తన నెగిటివ్ ఎమోషన్స్ ను నిరంతరం అణచివేస్తే, వారి ఒత్తిడి వేగంగా పెరుగుతుందట. ఇది సంబంధాలపైనా, మానసిక ఆరోగ్యంపైనా ప్రత్యక్షంగా, చాలా ప్రతికూల ప్రభావాన్ని చూపుతుందట. నిజమైన మానసిక బలం.. మనిషిలో ఉన్న ఎమోషన్స్ ను ఓపెన్ గా యాక్సెప్ట్ చేయడమే నిజమైన మానసిక బలం అని మానసిక విశ్లేషకులు చెబుతున్నారు. విచార భావనలు ఎప్పుడూ తప్పు కాదు. వాటిని అణచివేయకుండా అర్థం చేసుకుని స్వీకరించడమే మనిషిని మానసికంగా దృఢంగా చేస్తుంది. నిజమైన మానసిక బలం అంటే ఎప్పుడూ నవ్వుతూ ఉండటం కాదు, మనుషులుగా మనం కొన్నిసార్లు కుంగిపోవడం సహజమని అంగీకరించడమే. టాక్సిక్ పాజిటీవిటీ నుండి బయట పడటానికి సూచనలు.. విచారాన్ని బలహీనతగా భావించకూడదు.. ఎమోషన్స్ ను,  అభిప్రాయాలను  ఓపెన్ గా  వ్యక్తపరచాలి,  విచారాన్ని ఓటమిగా పరిగణించకూడదు. నమ్మకమైన వ్యక్తులతో మాట్లాడటం.. కష్ట సమయాల్లో ఆన్‌లైన్‌లో ఇతరులతో మిమ్మల్ని మీరు పోల్చుకోవడానికి బదులుగా, మీరు బాగా నమ్మే వ్యక్తులతో   సమస్యలను నిష్కపటంగా పంచుకోవాలి. దీని వల్ల ఊరట లభిస్తుంది, భారం తగ్గినట్టు అవుతుంది. సలహా ఇవ్వడానికి బదులుగా వినాలి..   మీ చుట్టూ ఎవరైనా విచారంగా ఉంటే, వారికి ఊరట ఇవ్వడానికి భరోసా మాటలు చెప్పడానికి బదులుగా వారి సమస్య ఏంటో మొదట ఓపికగా వినాలి.  తమ భాదను వెంటే చాలామంది మానసికంగా కుదటపడతారు, తిరిగి ధైర్యం కూడా తెచ్చుకుంటారు. "సానుకూల ఆలోచన"తో అస్సలు మార్చలేని కొన్ని సంఘటనలు ఉంటాయి. అందువల్ల,  విచారాన్ని పూర్తిగా కొట్టిపారేయడం పాజిటివ్ మార్గం కాదు, అది ఆత్మవంచన. కాబట్టి ఎప్పుడూ అన్నిటికీ పాజిటివ్ గా ఉండాలని, పాజిటివ్ జరగలేదని బాధపడకూడదు.                            *రూపశ్రీ.  
40 సంవత్సరాల తర్వాత మహిళల శరీరంలో సహజంగానే అనేక మార్పులు చోటుచేసుకుంటాయి. హార్మోన్లలో మార్పులు, మెటాబాలిజం తగ్గడం, బరువు పెరగడం, చర్మంపై ముడతలు, అలసట వంటి సమస్యలు కనిపించడం సాధారణం. అయితే సరైన ఆహారపు అలవాట్లు పాటిస్తే ఆరోగ్యంగా ఉండటమే కాకుండా, యవ్వనంగా కూడా కనిపించవచ్చు. ఈ వీడియోలో ప్రముఖ సీనియర్ న్యూట్రిషన్ కన్సల్టెంట్ డా. పి. జానకి శ్రీనాథ్ 40 ఏళ్లు దాటిన మహిళలు తప్పనిసరిగా తీసుకోవాల్సిన యాంటీ ఏజింగ్ ఆహారాల గురించి సులభంగా వివరిస్తున్నారు. శరీరానికి అవసరమైన ప్రోటీన్లు, కాల్షియం, ఐరన్, ఫైబర్, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు, యాంటీ ఆక్సిడెంట్లు వంటి పోషకాలు ఏ ఆహారాల్లో లభిస్తాయి, అవి ఆరోగ్యానికి ఎలా ఉపయోగపడతాయో ఈ వీడియోలో తెలుసుకోవచ్చు. అలాగే బరువు నియంత్రణ, ఎముకల బలం, గుండె ఆరోగ్యం, చర్మ కాంతి, జుట్టు ఆరోగ్యం, హార్మోన్ల సమతుల్యత కోసం తీసుకోవాల్సిన ఆహారాలు, దూరంగా ఉండాల్సిన ఆహారాల గురించి కూడా విలువైన సూచనలు అందించారు. 40 ఏళ్ల తర్వాత కూడా ఫిట్‌గా, స్లిమ్‌గా, ఉత్సాహంగా ఉండాలనుకునే ప్రతి మహిళ ఈ వీడియోను తప్పక చూడాలి. ఈ వీడియోలో తెలుసుకునే అంశాలు: 40 ఏళ్ల తర్వాత మహిళలకు అవసరమైన పోషకాహారం యాంటీ ఏజింగ్ ఫుడ్స్ ప్రయోజనాలు బరువు పెరగకుండా ఉండే ఆహారాలు మెటాబాలిజం పెంచే ఆహారాలు చర్మం, జుట్టు ఆరోగ్యానికి ఉపయోగపడే ఫుడ్స్ ఎముకలు బలంగా ఉండేందుకు తీసుకోవాల్సిన ఆహారం ఆరోగ్యకరమైన జీవనశైలి కోసం డైట్ సూచనలు ఆరోగ్యానికి సంబంధించిన మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం TeluguOne Health ను ఫాలో అవ్వండి.    
రాత్రి పూట బాగా నిద్రలో ఉండగా మూత్ర విసర్జనకు వెళ్లడం తరచుగా జరుగుతూనే ఉంటుంది.  అయితే ఎప్పుడో ఒకసారి ఇలా నిద్ర మధ్యలో లేచి మూత్ర విసర్జనకు వెళ్లడం అనేది పెద్దగా సీరియస్ గా తీసుకోవాల్సిన విషయం కాదు. కానీ.. ప్రతిరోజూ రాత్రి నిద్ర మధ్యలో లేచి మూత్ర విసర్జనకు వెళ్లాల్సి వస్తే మాత్రం దాన్ని లైట్ గా తీసుకోకూడదు అంటున్నారు వైద్యులు. రాత్రి పూట ఇలా మూత్ర విసర్జనకు లేవడం అనేది  కేవలం నిద్రకు అంతరాయం కలిగించే సమస్య మాత్రమే కాదని, అది ఆరోగ్య సమస్యలకు సంకేతం కావచ్చని అంటున్నారు వైద్యులు. మీరు కూడా ప్రతి రోజూ నిద్ర మధ్యలో మూత్ర విసర్జన కోసం లేస్తుంటే కింది విషయాలు తప్పక తెలుసుకోవాలి. మధుమేహం.. శరీరంలో రక్తంలో చక్కెర స్థాయిలు సాధారణ స్థాయిని మించినప్పుడు, మూత్రపిండాలు అదనపు చక్కెరను మూత్రం ద్వారా బయటకు పంపడానికి ప్రయత్నిస్తాయి. ఈ ప్రక్రియ వల్ల శరీరం నుండి అధికంగా నీరు కూడా నష్టపోతుంది. దీనివల్ల తరచుగా మూత్రవిసర్జన చేయవలసి రావచ్చు. దీనితో పాటు అధిక దాహం, తరచుగా ఆకలి వేయడం, అలసట, లేదా అకస్మాత్తుగా బరువు తగ్గడం వంటి లక్షణాలు కూడా కనిపిస్తే బ్లడ్ షుగర్ టెస్ట్ చేయించుకోవడం మంచిది. ఓవర్ యాక్టీవ్ బ్లాడర్..  మూత్రాశయం సాధారణం కంటే ఎక్కువగా  సంకోచించే  పరిస్థితిని ఓవర్ యాక్టీవ్ బ్లాడర్ అని అంటారు. దీనివల్ల  వ్యక్తికి తరచుగా , ఆకస్మికంగా మూత్రవిసర్జన చేయాలనే కోరిక కలుగుతుంది, కొన్నిసార్లు రాత్రిపూట చాలాసార్లు నిద్రలోంచి మెలకువ కూడా వస్తుంది. ఈ సమస్య వృద్ధాప్యం, నరాల వ్యాధి, ఊబకాయం లేదా  మూత్రాశయ కండరాలు బలహీన వడటం వల్ల ఎదురవుతుంది. సరైన చికిత్స , జీవనశైలి మార్పులతో దీనిని చాలా వరకు నియంత్రించవచ్చు. యూటీఐ.. యూటీఐ అనేది మూత్ర మార్గంలోని ఏ భాగానికైనా సోకగల ఒక బాక్టీరియల్ ఇన్ఫెక్షన్. ఈ ఇన్ఫెక్షన్ వల్ల తరచుగా మూత్రవిసర్జన, మంట, నొప్పి, దుర్వాసన,   మూత్రం మబ్బు రంగులో ఉండటం,  కొన్నిసార్లు జ్వరం కూడా రావచ్చు. ఈ సమస్య పురుషుల కంటే మహిళల్లో ఎక్కువగా కనిపిస్తుంది. దీనికి వెంటనే చికిత్స చేయకపోతే, ఇన్ఫెక్షన్ మూత్రపిండాలకు వ్యాపించే  అవకాశం ఉంటుంది. కాబట్టి లక్షణాలు కనిపించిన వెంటనే వైద్యుడిని సంప్రదించడం ముఖ్యం. మూత్రపిండాల సమస్యలు.. మూత్రపిండాలు శరీరం నుండి వ్యర్థాలను , అదనపు నీటిని తొలగిస్తాయి. మూత్రపిండాలు సరిగ్గా పనిచేయకపోతే, మూత్రవిసర్జన పరిమాణంలో , సమయంలో మార్పులు సంభవించవచ్చు. రాత్రిపూట తరచుగా మూత్రవిసర్జన, పాదాలు లేదా చీలమండలలో వాపు, అలసట, ఆకలి లేకపోవడం , అధిక రక్తపోటు వంటి సమస్యలు మూత్రపిండాల వ్యాధికి సంకేతాలు కావచ్చు. ఇటువంటి సందర్భాలలో,  మూత్రపిండాలను పరీక్షించుకోవడం , వైద్యుడిని సంప్రదించడం చాలా అవసరం. అదిక రక్తపోటు, మందుల ప్రభావాలు.. అధిక రక్తపోటు చికిత్సకు ఉపయోగించే కొన్ని మందులు, ముఖ్యంగా డైయూరెటిక్స్ వంటి మూత్రవిసర్జనను పెంచే మందులు, శరీరం నుండి అదనపు ఉప్పు , నీటిని మూత్రం ద్వారా బయటకు పంపడానికి సహాయపడతాయి. ఈ మందులను సాయంత్రం లేదా రాత్రిపూట తీసుకుంటే, రాత్రి సమయంలో చాలాసార్లు బాత్రూమ్‌కు వెళ్లవలసిన అవసరం ఏర్పడవచ్చు. అంతేకాకుండా, దీర్ఘకాలికంగా నియంత్రణలో లేని అధిక రక్తపోటు మూత్రపిండాలపై కూడా ప్రభావం చూపి, మూత్రవిసర్జన అలవాట్లలో మార్పులకు దారితీస్తుంది. ఈ లక్షణాలు ఉంటే వైద్యుడిని కలవాలి.. ప్రతి రాత్రి 2-3 సార్లు లేదా అంతకంటే ఎక్కువ సార్లు మూత్రవిసర్జన కోసం నిద్రలేస్తుంటే వైద్యుడిని కలవాలి.  మూత్ర విసర్జన సమయంలో నొప్పి లేదా మంట,  మూత్రంలో రక్తం పడటం,  ఎన్ని నీళ్లు తాగినా చాలా దాహంగా ఉండటం,   కాళ్ళలో వాపులు కనిపించడం,  జ్వరంతో పాటు తరచుగా మూత్రవిసర్జనకు వెళ్లాల్సి రావడం వంటి లక్షణాలు ఉంటే తప్పనిసరిగా వైద్యుడిని కలవాలి.                                        *రూపశ్రీ.  
రాత్రి ఎంత ప్రయత్నించినా నిద్ర పట్టడం లేదా? అర్థరాత్రి వరకు మేల్కొని ఉండాల్సి వస్తుందా? ప్రస్తుతం చాలా మంది ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల్లో ఇన్సోమ్నియా (Insomnia) ఒకటి. ఉద్యోగ ఒత్తిడి, మానసిక ఆందోళన, మొబైల్ ఫోన్‌ను ఎక్కువసేపు ఉపయోగించడం, జీవనశైలిలో వచ్చిన మార్పులు వంటి అనేక కారణాల వల్ల నిద్ర సమస్యలు పెరుగుతున్నాయి. ఈ వీడియోలో ప్రముఖ సైకాలజిస్ట్ డా. సి. మంజులా రావు నిద్ర ఎందుకు పట్టదో, ఇన్సోమ్నియా రావడానికి గల ముఖ్యమైన కారణాలు ఏమిటో, నిద్రలేమి వల్ల ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం పడుతుందో సులభంగా వివరించారు. అలాగే ఎలాంటి మందులు లేకుండానే మంచి నిద్ర కోసం పాటించాల్సిన రోజువారీ అలవాట్లు, పడుకునే ముందు చేయాల్సిన చిన్న చిన్న మార్పులు, మానసిక ప్రశాంతతను పెంచే సూచనలు మరియు గాఢమైన నిద్ర కోసం ఉపయోగపడే సులభమైన చిట్కాలను కూడా ఈ వీడియోలో వివరించారు. మీకు లేదా మీ కుటుంబ సభ్యుల్లో ఎవరికైనా నిద్ర సమస్య ఉంటే ఈ వీడియో తప్పకుండా చూడండి. ఆరోగ్యకరమైన జీవితం కోసం మంచి నిద్ర ఎంత ముఖ్యమో తెలుసుకోండి. మీ ఆరోగ్య సమస్య ఏదైనా... మా హెల్త్ యూట్యూబ్ ఛానల్‌లో సీనియర్ డాక్టర్స్ చెప్పిన సలహాలు... సూచనలు ఉన్నాయి. మా యూట్యూబ్ ఛానల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 👉 TeluguOne Health (సబ్‌స్క్రైబ్ చేయడం మర్చిపోకండి!)