తెలుగుదేశం, వైసీపీలపై మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాలలో సంచలనం సృష్టిస్తున్నాయి. తన కొత్త పార్టీ ప్రకటన కోసం విజయవాడలో సోమవారం (సెప్టెంబర్ 7) ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన తెలుగుదేశం, వైసీపీలకు ప్రజాసమస్యల పరిష్కారం పట్ల ఇసుమంతైనా శ్రద్ధ, చిత్తశుద్ధి లేదన్నారు. తాను కొత్త పార్టీ ప్రారంభించడం ఖాయమని ఈ సందర్భంగా విస్పష్టంగా చెప్పిన విజయసాయి.. తన పార్టీ జెండా, అజెండా ప్రకటించడానికి ముందు వాస్తవాలను ప్రజల ముందు ఉంచాలన్న ఉద్దేశంతోనే మీడియా సమావేశం ఏర్పాటు చేసినట్లు చెప్పారు.  ప్రస్తుతం రాష్ట్రంలో రాష్ట్రంలోని ప్రధాన రాజకీయ పార్టీలైన తెలుగుదేశం, వైసీపీ, జనసేనలు ఒకే తానులోని గుడ్డలేనన్నారు.  ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి, ప్రజల సంక్షేమం వాటికి పట్టవని విమర్శించారు.   ప్రస్తుతం ఏపీ రాజకీయం మొత్తం తెలుగుదేశం, వైసీపీల చుట్టూనే తిరుగుతోందని విమర్శించిన విజయసాయి, ఆరెండు పార్టీలూ కూడా కుటుంబ, ఫ్యాక్షన్ పార్టీలేననీ,వాటివి స్వార్థపూరిత అజెండాలనీ అన్నారు.  ప్రజాధనాన్ని ఏ స్థాయిలో దోచుకోగలం, ఎలా దోచుకోగలం అన్న విషయంలో  ఈ రెండు పార్టీలూ పోటీపడుతున్నాయన్న విజయసాయి,  రాష్ట్రంలోపోలీసు వ్యవస్థ సహా అన్ని వ్యవస్థలూ ఆ పార్టీల ధోరణికి మద్దతు ఇస్తున్నాయని సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజలకు గోరంత, మాకు కొండంత అన్నది ఆ పార్టీల విధానమని విమర్శించారు.  ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రజలకు నిజమైన న్యాయం జరగాలంటే, ఈ సంప్రదాయ రాజకీయ పార్టీలకు వ్యతిరేకంగా మరో ప్రత్యామ్నాయ వేదిక రావలసిన సమయం ఆసన్నమైందని, తన పార్టీ ఆ పాత్ర తీసుకుంటుందని చెప్పారు.   [Vijayasai Reddy Say  YSRCP And YCP Same, TDP YCp faction parties, third alternative, AP politics, Telugu One]
వైసీపీ ఇండియా కూటమిలో చేరబోతోందా? 2029 ఎన్నికలలో రాష్ట్రంలో అధికారంలోకి రావాలంటే.. కాంగ్రెస్ అండ వినా గత్యంతరం లేదని భావిస్తోందా? అంటే పరిశీలకులు ఔననే అంటున్నారు. 2029 ఎన్నికలలో రాష్ట్రంలో అధికారం చేపట్టడమే లక్ష్యంగా జగన్ ఇప్పటి నుంచే వ్యూహరచన చేస్తున్నారని వైసీపీ వర్గాలూ చెబుతుతున్నాయి.  అందులో భాగంగానే వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్..   జాతీయ స్థాయిలో కీలకంగా మారిన  ఇండియా కూటమితో   జతకట్టాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు.  గత ఎన్నికల్లో ఎదురైన అనుభవాలను బేరీజు వేసుకుంటూ, రాబోయే కాలంలో అనుసరించాల్సిన విధానాలపై అయన విస్తృతంగా చర్చిస్తున్నట్లు చెబుతున్నారు.  మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా జగన్ ఇండియా కూటమివైపు అడుగులు వేస్తున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం కూటమి ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పోరాటాలను పదును పెడుతున్న జగన్.. ఇటు రాష్ట్రంలోనూ, అటు కేంద్రంలోనూ కూడా తెలుగుదేశం పార్టీ ఎన్డీయేలో కీలకమైన భాగస్వామ్య పక్షంగా ఉన్న నేపథ్యంలో తన పోరాటాలకు ఇండియా కూటమి అండ అవసరమని భావిస్తున్నారని చెబుతున్నారు.  ఇండియా కూటమితో భాగం కావడం వల్ల కాంగ్రెస్ పార్టీతో పాటు జాతీయ స్థాయిలో ఎన్డీయేయేతర పార్టీలతో సయోధ్య ఏర్పడుతుందనీ, తద్వారా రాష్ట్రంలోనే కాకుండా జాతీయ స్థాయిలో కూడా తన గళం వినిపించే అవకాశం లభిస్తుందని జగన్ యోచిస్తున్నట్లు సమాచారం.    గత ప్రభుత్వ హయాంలో కేంద్రంతో  సయోధ్యతో వ్యవహరించిన జగన్.. 2024 ఎన్నికలలో పరాజయం తరువాత.. బీజేపీతో ఎంతగా కలిసి సాగాలన్నా ఆ పార్టీకి తెలుగుదేశం పార్టీతో ఉన్న చెలిమి కారణంగా వీలు కావడం లేదని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన చూపు ఇండియా కూటమి వైపు మళ్లిందని పరిశీలకులు చెబుతున్నారు. జగన్ ఇండియా కూటమిలో చేరినట్లైతే రాష్ట్రంలో పార్టీ బలోపేతానికి కాంగ్రెస్ సహయ సహకారాలు అందుతాయనీ, అదే సమయంలో రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి సర్కార్ విధానాలకు వ్యతిరేకంగా వైసీపీ ఆందోళనలకు జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చే అవకాశాలు మెరుగ్గా ఉంటాయని జగన్ భావిస్తున్నట్లు చెబుతున్నారు.   రాష్ట్రంలో  ప్రధాన ప్రతిపక్ష హోదా లేకపోయినా, ఏకైక విపక్షంగా క్షేత్రస్థాయిలో చేపట్టే ఆందోళనలకు మద్దతు లభించాలంటే.. ఇండియా కూటమి అండ అవసరమన్న భావనలో జగన్ ఉన్నారని అంటున్నారు.    [Jagan Join INDIA Alliance, 2029 AP Elections, YCP political strategy, AP politicalnews, AP Politics, Telugu One]
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరో కొత్త పార్టీ ఆవిర్భవించింది.  రాష్ట్ర రాజకీయాల్లో సుదీర్ఘకాలం పాటు  కీలక నేతగా వ్యవహరించిన మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి నూతన రాజకీయ పార్టీ ప్రకటన అధికారికంగా చేశారు.  రాష్ట్రంలో ప్రస్తుతం కొనసాగుతున్న రాజకీయ సరళికి పూర్తి భిన్నంగా, పూర్తిగా ప్రజా పక్షం వహించే సరికొత్త ప్రత్యామ్నాయ వేదికను తీసుకురావడమే లక్ష్యంగా తన కొత్త పార్టీ ఉంటుందన్నారాయన. సోమవారం (సెప్టెంబర్ 7) విజయవాడలో మీడియా సమావేశంలో మాట్లాడిన విజయసాయి  ప్రస్తుత రాజకీయ పార్టీలవి కేవలం ఎన్నికల రాజకీయాలే తప్ప, వాటిలో సామాన్యుల నిజమైన సమస్యలను పట్టించుకునే తత్వం కరువైందని  విమర్శించారు. అధికార, ప్రతిపక్షాల మధ్య సాగుతున్న ధోరణులు ప్రజల ఆకాంక్షలను ప్రతిబింబించడంలో పూర్తిగా విఫలమయ్యాయని ఆయన అభిప్రాయపడ్డారు. తెలుగుదేశం కానీ, వైసీపీ కానీ, రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలకు చేసింది శూన్యమన్నారు. సమాజంలోని నిరుపేదలు, సామాన్యులు, కర్షకులు,  యువత ఎదుర్కొంటున్న సమస్యలకు అసెంబ్లీ,  పార్లమెంటు వేదికగా గొంతుక వినిపించేందుకు ఒక బలమైన శక్తి అవసరమని, అందుకే తాను తన  నూతన రాజకీయ ప్రయాణానికి శ్రీకారం చుట్టాల్సి వచ్చిందని విజయసాయి వివరించారు.   ఈ కొత్త రాజకీయ వేదిక విశేషాలు, పార్టీకి సంబంధించిన పూర్తి విధివిధానాల  ప్రకటన త్వరలోనే దశలవారీగా వెల్లడిస్తామన్న విజయసాయి..  కేవలం ఎన్నికల్లో పోటీ చేయడం కోసమే కాకుండా, ప్రజల భాగస్వామ్యంతో కూడిన పరిపాలనా విధానాన్ని అందించేందుకు తన రాజకీయ పార్టీ పనిచేస్తుందని   స్పష్టం చేశారు. రాబోయే రోజుల్లో రాష్ట్రంలోని అన్ని జిల్లాలలో పర్యటించి, క్షేత్రస్థాయిలో ప్రజల అభిప్రాయాలను సేకరించి, ప్రజా సమస్యలపై సమగ్రమైన కార్యాచరణను రూపొందించనున్నట్లు విజయసాయి చెప్పారు. తన కొత్త పార్టీ సీఎం అభ్యర్థిని తాను కాదని ఈ సందర్భంగా చెప్పిన విజయసాయి..  సంకేతాలు ఇచ్చారు. గతంలో తాను తీసుకున్న రాజకీయ విరామ నిర్ణయాన్ని పక్కన పెట్టి, ప్రజల నుంచి వచ్చిన డిమాండ్ మేరకు మళ్లీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి పునరాగమనం చేస్తున్నట్లు చెప్పారు.    [Vijayasai Reddy Announce new party, AP politics, YCP, TDP, Andhra Pradesh politics,  Vijayasai Reddy announcement, Teluguone]
ALSO ON TELUGUONE N E W S
మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి 75వ పుట్టినరోజు సందర్భంగా ఆయన అభిమానులకు బ్యాక్ టు బ్యాక్ సర్‌ప్రైజ్‌లు అందుతున్నాయి. కోలీవుడ్ విలక్షణ నటుడు ధనుష్ ప్రధాన పాత్రలో నటిస్తున్న మోస్ట్ ప్రెస్టీజియస్ మల్టీస్టారర్ ప్రాజెక్ట్ ‘ఓమ్’ (Om - Chapter 1: Udhiram - The Blood Wood) నుంచి మేకర్స్ ఒక సాలిడ్ గ్లింప్స్ వీడియోను విడుదల చేసి ఫ్యాన్స్‌కు అద్భుతమైన బర్త్‌డే ట్రీట్ ఇచ్చారు. ఈ స్పెషల్ గ్లింప్స్‌లో మమ్ముట్టి ‘బుర్మా కార్తికేయన్’ (సియా) అనే పవర్ ఫుల్ మరియు గ్రే-షేడ్స్ ఉన్న ఇంటర్నేషనల్ స్మగ్లర్ పాత్రలో దర్శనమిచ్చారు. పోలీస్ స్టేషన్ మోస్ట్ వాంటెడ్ ఖైదీల లిస్ట్‌లో ఆయన ఫొటో ఉండటం, ఒకవైపు ఖాకీలు ఆయన కోసం గాలిస్తుంటే.. మరోవైపు పోలీసులు వెతుకుతున్న కార్తికేయన్ ఏమాత్రం భయం లేకుండా పోలీస్ స్టేషన్ లోపలే ప్రశాంతంగా కూర్చుని మ్యాచ్ ఎంజాయ్ చేసే సీన్ మమ్ముట్టి స్వాగ్‌ను వేరే లెవెల్‌కి తీసుకెళ్లింది. జైలు లోపల శత్రువుల పై విరుచుకుపడటం, బెయిల్ మీద బయటకు వచ్చి తన సొంత సామ్రాజ్యాన్ని నడిపించే సన్నివేశాల్లో ఆయన చూపించిన స్క్రీన్ ప్రెజెన్స్, నడవడిక మాస్ ఆడియెన్స్‌ను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ఈ గ్లింప్స్‌కు సాయి అభ్యంకర్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ విపరీతమైన హైప్‌ను క్రియేట్ చేసింది. ‘అమరన్’ వంటి సక్సెస్‌ఫుల్ చిత్రాన్ని అందించిన డైరెక్టర్ రాజ్ కుమార్ పెరియసామి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రంలో నేచురల్ బ్యూటీ సాయి పల్లవి, యంగ్ లీల శ్రీలీల కథానాయికలుగా నటిస్తుండగా, దిగ్గజ నటుడు నసీరుద్దీన్ షా కీలక పాత్ర పోషిస్తున్నారు. ధనుష్‌కు చెందిన 'వుండర్‌బార్ ఫిల్మ్స్' మరియు 'ఆర్‌టేక్ స్టూడియోస్' సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మైండ్ బ్లోయింగ్ యాక్షన్ డ్రామా అక్టోబర్ 16న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది. దాదాపు ఏడేళ్ల విరామం తర్వాత మమ్ముట్టి మళ్లీ తమిళ చిత్రసీమలోకి రీ-ఎంట్రీ ఇస్తుండటంతో ఈ సినిమా కోసం సౌత్ ఇండియా వైడ్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.       [Mammootty Birthday Om Movie Glimpse, Mammootty Burma Karthikeyan Avatar, Dhanush Mammootty Om Tamil Movie, Rajkumar Periasamy Om Movie Updates, Om Chapter 1 Udhiram Release Date]
నాచురల్ స్టార్ నాని, మాస్ డైరెక్టర్ శ్రీకాంత్ ఒడెల కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ అవైటెడ్ యాక్షన్ డ్రామా చిత్రం 'ది ప్యారడైజ్'. గతంలో వీరి కలయికలో వచ్చిన 'దాసరా' చిత్రం బాక్సాఫీస్ వద్ద రికార్డు కలెక్షన్లు కొల్లగొట్టడమే కాకుండా నాని కెరీర్‌లోనే మైలురాయిగా నిలిచింది. దీంతో ఈ సెకండ్ కాంబోపై పాన్ ఇండియా స్థాయిలో భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే గత రెండు రోజులుగా 'ది ప్యారడైజ్' చిత్రం నిర్మాణానంతర కార్యక్రమాలు (పోస్ట్ ప్రొడక్షన్ వర్క్) ఆలస్యం కావడం వల్ల సెప్టెంబర్ 24న విడుదల కావడం లేదని, అక్టోబర్‌కు వాయిదా పడే అవకాశం ఉందంటూ సోషల్ మీడియాలో రకరకాల ఊహాగానాలు చక్కర్లు కొట్టాయి. దీంతో నాని అభిమానులు తీవ్ర అయోమయంలో పడ్డారు. ఈ క్రమంలోనే వాయిదా రూమర్లకు చెక్ పెడుతూ ప్రొడక్షన్ హౌస్ ఎస్.ఎల్.వి సినిమాస్ (SLV Cinemas) స్పందించింది. సినిమా ముందస్తుగా ప్రకటించిన ప్రకారమే ప్రపంచవ్యాప్తంగా సెప్టెంబర్ 24నే గ్రాండ్‌గా థియేటర్లలోకి రాబోతోందని మేకర్స్ మరోసారి అధికారికంగా స్పష్టం చేశారు. విడుదల తేదీతో కూడిన కొత్త పోస్టర్‌ను పంచుకుంటూ అభిమానుల్లో ఉన్న సందేహాలకు తెరదించారు. ఈ చిత్రంలో నాని సరసన కయాదు లోహర్ కథానాయికగా నటిస్తుండగా, వర్సటైల్ యాక్టర్ మోహన్ బాబు, రాఘవ్ జుయల్ నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రల్లో కనిపించనున్నారు. అలాగే సంపూర్ణేష్ బాబు ఒక కీలక పాత్రలో అలరించబోతున్నారు. యంగ్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండటంతో ఆడియో మరియు బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌పై భారీ హైప్ నెలకొంది. డైరెక్టర్ శ్రీకాంత్ ఒడెల ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని చాలా రా అండ్ రస్టిక్ కాన్వాస్‌లో తెరకెక్కిస్తున్నారు. అనుకున్న సమయానికే సినిమాను థియేటర్లలోకి తీసుకురావాలనే పట్టుదలతో హీరో నాని కూడా చిత్రయూనిట్‌తో కలిసి కష్టపడుతున్నారు. సెప్టెంబర్ 24న నాని బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ప్రభంజనం సృష్టిస్తారో చూడాలి.       [Nani The Paradise Release Date Confirmed, Srikanth Odela Nani Movie The Paradise, Nani The Paradise September 24 Release, The Paradise Movie Postponement Rumours, SLV Cinemas Nani Latest Movie Updates]
Nani’s The Paradise is staying on course for its announced theatrical release on September 24. The makers have released a fresh set of release date posters, reaffirming that the film will arrive in cinemas as scheduled. The update comes at a time when reports had suggested that the film’s release could be moved to October. The speculation was attributed to the makers needing additional time to complete one song along with some patchwork and VFX-related work. However, the team did not directly address the reports or offer any specific clarification on the rumours. Instead, the latest posters once again carry September 24 as the release date, effectively putting the focus back on the planned schedule. While the makers have not issued a detailed statement regarding the production work that remains, the repeated confirmation indicates that the film is currently being positioned for the announced date. Directed by Srikanth Odela, The Paradise features Nani in the lead role and is backed by Sudhakar Cherukuri under SLV Cinemas. The film has been mounted on a large scale and has already generated attention through its promotional material. Mohan Babu, Raghav Juyal, Kayadu Lohar are cast in the film with Keerthy Suresh in a special song. Anirudh Ravichander is scoring music and his songs - Aaya Sher and Yasha Nagula, have become huge blockbusters, already.  Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them. 
'నందూస్ వరల్డ్' యూట్యూబ్ ఛానల్‌ ద్వారా సోషల్ మీడియాలో ట్రావెల్, లైఫ్‌స్టైల్ వీడియోలు చేస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి, ప్రముఖ యూట్యూబర్ రమా నందన తీవ్ర చిక్కుల్లో పడ్డారు. లండన్, యూకేల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ భారీ స్థాయిలో నిరుద్యోగుల నుంచి డబ్బులు వసూలు చేసి మోసానికి పాల్పడ్డారనే ఆరోపణల నేపథ్యంలో శంషాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (RGIA) వద్ద పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు అందించిన ప్రాథమిక వివరాల ప్రకారం.. నందన తన భర్త జగర్లమూడి మధుకర్‌తో కలిసి డెస్టినీ కన్సల్టెన్సీ పేరుతో వ్యవహారాలు సాగించినట్లు ఆరోపణలు ఉన్నాయి. లండన్ సహా విదేశాల్లో మంచి ఉద్యోగాలు ఇప్పిస్తామని, వీసా స్పాన్సర్‌షిప్ (CoS) మరియు వీసా రెన్యూవల్ తదితర సేవలు అందిస్తామని నమ్మించి ఒక్కొక్కరి వద్ద నుంచి రూ.15 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు వసూలు చేసినట్లు బాధితులు ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. బాధితుడు మామిళ్లపల్లి శివక్రాంతి కుమార్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. వీసా స్పాన్సర్‌షిప్ పేరుతో విడతల వారీగా రూ.15 లక్షలు తీసుకుని, నకిలీ సర్టిఫికెట్లు ఇచ్చి మోసం చేశారని ఆయన పోలీసులను ఆశ్రయించారు. సుమారు 100 మందికి పైగా నిరుద్యోగులను నమ్మించి వీరు భారీ మొత్తంలో డబ్బులు గుంజినట్లు సోషల్ మీడియాలోనూ బాధితులు వీడియోలు పోస్ట్ చేశారు. దీంతో ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం పోలీసులు మధుకర్‌ను ఏ1గా, రమా నందనను ఏ2గా చేర్చుతూ కేసు నమోదు చేశారు. ఈ కేసు విచారణలో భాగంగా దంపతులు దేశం దాటి పారిపోకుండా అధికారులు ఇప్పటికే లుకౌట్ సర్క్యులర్ (LOC) జారీ చేశారు. విదేశాల నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకున్న నందనను ఇమ్మిగ్రేషన్ అధికారులు గుర్తించి వెంటనే అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఆర్‌జీఐఏ పోలీసులు ఆమెను తదుపరి చట్టపరమైన విచారణ నిమిత్తం ఇబ్రహీంపట్నం పోలీసులకు అప్పగించారు. అయితే, ఈ ఆరోపణలను నందన గతంలోనే ఖండించారు. తమపై వ్యక్తిగత కక్షలతోనే తప్పుడు ప్రచారం చేస్తున్నారని, అసలు డెస్టినీ కన్సల్టెన్సీతో తమకు నేరుగా సంబంధం లేదని స్పష్టం చేస్తూ కేసు కొట్టివేయాలని హైకోర్టును కూడా ఆశ్రయించారు. ఇటీవల చిరంజీవి నిర్మించిన 'మన శంకర వరప్రసాద్' సినిమాలోనూ చిన్న పాత్రలో నటించిన నందన.. ఇప్పుడు కేసులో అదుపులోకి రావడం సోషల్ మీడియా వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతోంది.     [YouTuber Nandana Arrested News, Nandus World Rama Nandana Fraud Case, Shamshabad Airport YouTuber Arrest, UK Visa Fraud Case Telugu YouTuber, Telangana Police Arrest Youtuber Nandana]
ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ జీ5 (ZEE5) ఎప్పటికప్పుడు సరికొత్త కంటెంట్‌తో డిజిటల్ ప్రియులను అలరిస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా మరో ఇంటెన్స్ ఇన్వెస్టిగేటివ్ క్రైమ్ థ్రిల్లర్ 'పంచనామా'ను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సిద్ధమైంది. విలక్షణ నటుడు భరత్ శ్రీనివాసన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ ఒరిజినల్ వెబ్ సిరీస్ అధికారిక ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేయగా, ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో విపరీతంగా ఆకట్టుకుంటోంది. ట్రైలర్ పరిశీలిస్తే.. వరుసగా జరిగే మూడు అనుమానాస్పద మరణాల చుట్టూ కథ తిరుగుతుంది. పోలీసు రికార్డుల్లో సాధారణ రోడ్డు ప్రమాదాలుగా నమోదై క్లోజ్ అయిన కేసుల వెనుక.. ఒక పక్కా క్రిమినల్ స్కెచ్ ఉందనే సందేహంతో డ్యూటీ నుంచి రిలీవ్ అవ్వడానికి రెండే రోజులున్న పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ జై రామ్ (భరత్ శ్రీనివాసన్) ఈ ఇన్వెస్టిగేషన్‌ను రీఓపెన్ చేస్తాడు. తన తమ్ముడి మరణం కూడా ప్రమాదం కాదని నమ్మే జై రామ్, ఈ కేసు మూలాల్లోకి వెళ్లేకొద్దీ షాకింగ్ విషయాలు వెలుగులోకి వస్తాయి. హత్యలను సైతం ప్రమాదాలుగా చిత్రీకరించే ఒక భారీ నేర ముఠా కుట్రను, దాని వెనుక ఉన్న రాజకీయ అవినీతిని ఆయన ఎలా ఛేదించాడనేది ట్రైలర్‌లో ఎంతో ఉత్కంఠభరితంగా చూపించారు. 6 ఎపిసోడ్ల సిరీస్‌గా రానున్న ఈ ప్రాజెక్ట్‌ను దర్శకుడు మోహన్ శ్రీవత్స చాలా గ్రిప్పింగ్‌గా మలిచారు. నటుడు భరత్ గతంలో ‘ప్రేమిస్తే’, ‘చంద్రముఖి’, ‘బాయ్స్’ వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు బాగా సుపరిచితుడే. సుదీర్ఘ విరామం తర్వాత ఆయన పవర్‌ఫుల్ ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ పాత్రలో కనిపించి తనదైన నటనతో మెప్పించారు. ఈ సిరీస్‌లో శివాజీ రాజా, మేధా రెడ్డి, చరణ్ బాబు, రూప లక్ష్మి, రాధిక ప్రీతి తదితరులు కీలక పాత్రలు పోషించగా, నరేష్ కుమారన్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ట్రైలర్‌కు ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఉదయ భాను ప్రొడక్షన్స్ బ్యానర్‌పై మిడ్డే విజయేంద్ర మౌళి, ఉదయ భాను సంయుక్తంగా నిర్మించిన ఈ ఇంటెన్స్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ 'పంచనామా' సెప్టెంబర్ 11 నుంచి జీ5 లో స్ట్రీమింగ్ కానుంది. థ్రిల్లర్ జోనర్ ప్రియులను ఈ సిరీస్ ఖచ్చితంగా ఆకట్టుకుంటుందని టీమ్ ధీమా వ్యక్తం చేస్తోంది.     [Panchanama Telugu Trailer Release, ZEE5 Panchanama Web Series, Bharath Srinivasan Panchanama Trailer, Panchanama OTT Release Date, Telugu Crime Thriller Series ZEE5]
A video featuring actor Ravi Mohan and Keneeshaa Francis has gone viral on social media, triggering another round of criticism against the actor. The footage shows the two smoking together, and several social media posts are alleging that they were consuming drugs. However, there is no verified evidence at this point to establish that what they were smoking was an illegal substance. The video has gained attention largely because it comes amid the actor’s highly publicised personal dispute with his estranged wife Aarti. Ravi Mohan and Aarti have been involved in an increasingly bitter public fallout, with statements and allegations from both sides becoming a recurring topic on social media. Ravi Mohan’s relationship with Keneeshaa has also remained under scrutiny ever since his separation from Aarti became public. Their association has attracted considerable discussion, with the singer herself facing criticism and online trolling over the relationship. The latest video has now added another layer to the ongoing controversy. While some users are strongly condemning Ravi Mohan over the footage, others are questioning whether the claims accompanying the video are being exaggerated without proper verification. Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them. 
Vijay Deverakonda and Rashmika Mandanna are coming together for the first time post their marriage with Ranabaali. The movie directed by Rahul Sankritiyan is about a rebellion happened between 1876 - 1878 with Britishers. Vijay is playing the leading cheftain who runs his forces against the Britishers.  This is the first ever folk lore for the actor and Rashmika's photo with him close to the times did go viral. The movie shoot has been almost completed and makers have locked 16th October release date. Now, they announced that the first teaser will be unveiled on 9th September.    The film also stars international actor Mummy fame, Arnold Vosloo as Sir Theodore Hector, a British officer. Ajay-Atul are composing music for the film and their back ground score is impressive for the announcement. Mythri Movie Makers are producing the film with T-Series presenting it.  Vijay Deverakonda needs a big success at the box office to regain some of the lost market with his continuous underperformers. With Rashmika back as leading lady, the makers are expecting Geetha Govindham magic will work as it is not a complete out-of-box film like Dear Comrade.  Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them. 
తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమలలో తనదైన మార్క్ దర్శకత్వంతో పాటు అద్భుతమైన విలనిజంతో ప్రేక్షకులను అలరిస్తున్న నటుడు ఎస్‌జే సూర్య చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. తాను తెరకెక్కించిన ఆల్ టైమ్ క్లాసిక్ అండ్ బ్లాక్‌బస్టర్ సినిమా 'ఖుషీ'కి, నేటి రాజకీయ పరిణామాలకు ఉన్న ఒక అపూర్వమైన కనెక్షన్‌ను ఆయన గుర్తుచేసుకోవడం సినీ, రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. కార్తీ కథానాయకుడిగా రూపొందుతున్న భారీ యాక్షన్ సీక్వెల్ 'సర్దార్ 2' ప్రమోషన్స్‌లో భాగంగా హీరో మంచు మనోజ్ నిర్వహించిన ఒక టాక్ షోలో ఎస్‌జే సూర్య, కార్తీ పాల్గొన్నారు. ఈ సరదా సంభాషణలో ఎస్‌జే సూర్య మాట్లాడుతూ.. "నేను ఒకే కథతో తమిళంలో 'ఖుషీ' (2000), తెలుగులో 'ఖుషీ' (2001) చేశాను. అప్పట్లో నా దర్శకత్వంలో నటించిన ఆ ఇద్దరు హీరోల్లో ఒకరు నేడు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కాగా, మరొకరు తమిళనాడులో సీఎం అయ్యారు" అంటూ చమత్కరించారు. ఈ వ్యాఖ్యలు వినగానే పక్కనే ఉన్న కార్తీ "వాట్ ఏ కనెక్షన్ సర్!" అంటూ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు. నిజానికి తమిళంలో దళపతి విజయ్, తెలుగులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కథానాయకులుగా నటించిన 'ఖుషీ' చిత్రాలు రెండు పరిశ్రమల్లోనూ ఇండస్ట్రీ హిట్లుగా నిలిచాయి. ఒకే దర్శకుడి చేతుల మీదుగా ఒరిజినల్, రీమేక్ చిత్రాలు చేసిన ఇద్దరు స్టార్ హీరోలు ఇప్పుడు తమ సొంత రాష్ట్రాల రాజకీయాల్లో అత్యున్నత స్థానాల్లోకి వెళ్లడం నిజంగా ఒక అరుదైన మైలురాయి అని నెటిజన్లు కొనియాడుతున్నారు. ఎస్‌జే సూర్య కేవలం దర్శకుడిగానే కాకుండా, నటుడిగా కూడా వరుస భారీ ప్రాజెక్టులతో దూసుకుపోతున్నారు. 'సర్దార్ 2' చిత్రంలో ఆయన 'బ్లాక్ డాగర్' అనే ఇంటర్నేషనల్ క్రిమినల్ పాత్రలో కనిపించబోతున్నారు. గతంలో సూపర్ స్టార్ మహేష్ బాబు 'స్పైడర్' చిత్రంలో 'భైరవుడు'గా మెప్పించిన ఎస్‌జే సూర్య, ఈ కొత్త పాత్రలో అంతకుమించిన తీవ్రమైన విలనిజం చూపిస్తారని మూవీ టీమ్ ధీమా వ్యక్తం చేస్తోంది. తన డబ్బింగ్ తానే చెప్పుకుంటూ ప్రతి పాత్రకు ప్రాణం పోసే ఎస్‌జే సూర్య, ఒకవైపు తెరపై విలన్‌గా మెప్పిస్తూనే.. మరోవైపు తన కెరీర్‌లోని గోల్డెన్ మెమొరీస్‌ను నేటి పొలిటికల్ రియాలిటీతో ముడిపెట్టి చేసిన కామెంట్స్ ఇప్పుడు ఇంటర్నెట్‌లో తెగ హల్‌చల్ చేస్తున్నాయి.     [SJ Suryah Comments On Pawan Kalyan, SJ Suryah Thalapathy Vijay Kushi Movie Coincidence, Pawan Kalyan Deputy CM Vijay Political Connection, Karthi Sardar 2 Interview SJ Suryah, Telugu Film Industry Latest Viral Cinema News]
భారతీయ సినీ పరిశ్రమలో పాత్ర ఏదైనా సరే.. అందులో పరకాయ ప్రవేశం చేసి ప్రేక్షకులను కట్టిపడేసే నటులలో మనోజ్ బాజ్‌పాయ్ ఒకరు. గ్యాంగ్స్ ఆఫ్ వస్సేపూర్, సత్య నుంచి రీసెంట్‌గా డిజిటల్ స్పేస్‌లో సంచలనాలు సృష్టిస్తున్న ది ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ వరకు ఆయన పోషించిన ప్రతి పాత్రలోనూ అద్భుతమైన నటనను ప్రదర్శించారు. తెరపై నటుడు కనిపించకుండా కేవలం ఆ క్యారెక్టర్ మాత్రమే కనిపించేలా చేయడం ఆయన ప్రత్యేకత. ఇప్పుడు ఈ వర్సటైల్ యాక్టర్ తన సినీ ప్రయాణంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన, అలాగే ఎంతో కఠినమైన ఛాలెంజ్‌కు సిద్ధమవుతున్నట్లు బి టౌన్ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. జాతిపిత మహాత్మా గాంధీ జీవిత నేపథ్యం లేదా ఆయన చారిత్రక ఘట్టాల ఆధారంగా తెరకెక్కే ప్రాజెక్ట్‌లో మనోజ్ బాజ్‌పాయ్.. గాంధీజీ పాత్రను పోషించబోతున్నారనే వార్త ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. మహాత్మా గాంధీ లాంటి చారిత్రక ఐకానిక్ వ్యక్తిత్వాన్ని వెండితెరపై ఆవిష్కరించడం అంటే సాదాసీదా విషయం కాదు. ఇది కేవలం బాడీ లాంగ్వేజ్ లేదా మేకప్‌తో ముడిపడి ఉన్న అంశం మాత్రమే కాదు. నడక, సంభాషణల శైలి, ముఖ కవళికలతో పాటు ఆ యుగం నాటి గాంభీర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని తెరపై ప్రతిబింబించాలి. భారతీయ ప్రేక్షకుల మనసుల్లో గాంధీజీ ఇమేజ్ చాలా స్పష్టంగా ముద్రపడి ఉన్నందున, ఈ పాత్రను రీ-క్రియేట్ చేయడం మనోజ్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ ట్రాన్స్‌ఫర్మేషన్‌గా నిలవనుంది. గతంలో కూడా అనేకమంది దిగ్గజ నటులు గాంధీజీ పాత్రల్లో కనిపించి విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. అయితే మనోజ్ బాజ్‌పాయ్ తనదైన నాచురల్ యాక్టింగ్ స్టైల్‌తో ఈ పాత్రకు ఎలాంటి కొత్త కోణాన్ని జోడిస్తారోనని ఇండస్ట్రీ వర్గాలు ఎంతో క్యూరియాసిటీతో ఎదురుచూస్తున్నాయి. ఇప్పటికే ఎన్నో జాతీయ అవార్డులు, అంతర్జాతీయ పురస్కారాలు అందుకున్న ఈ సీనియర్ నటుడికి ఇది మరొక మైలురాయిగా మారడం ఖాయంగా కనిపిస్తోంది. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా రూపొందుతున్న ఈ ప్రాజెక్ట్‌పై త్వరలోనే మరిన్ని వివరాలు అధికారికంగా వెలువడే అవకాశముంది. మనోజ్ బాజ్‌పాయ్ గాంధీజీగా కనిపిస్తే మాత్రం థియేటర్లలో విజువల్ డ్రామా విశ్వరూపం చూడటం ఖాయమని ఫ్యాన్స్ భావిస్తున్నారు.       [Manoj Bajpayee Mahatma Gandhi Role, Manoj Bajpayee Transformation Movie, Manoj Bajpayee Upcoming Bollywood Movie, Manoj Bajpayee Career Best Role, Indian Cinema Historical Biopics]
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సెన్సిబుల్ డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి కాంబినేషన్‌లో వచ్చిన ‘వేదం’ సినిమా టాలీవుడ్‌లో ఎంతటి ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కేబుల్ రాజుగా బన్నీ చూపించిన అద్భుతమైన నటన, క్రిష్ ఎమోషనల్ మేకింగ్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ చిత్రం వచ్చి దాదాపు 16 ఏళ్లు పూర్తయిన సందర్భంలో, ఇప్పుడు మళ్లీ బన్నీ కాంపౌండ్‌లో క్రిష్ పేరు గట్టిగా వినిపిస్తుండటం టాలీవుడ్ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. తెలుగు సినీ ఇండస్ట్రీలో అందుతున్న సమాచారం ప్రకారం, ప్రముఖ నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ బ్యానర్‌లో డైరెక్టర్ క్రిష్ ఒక భారీ ప్రాజెక్ట్‌ను లైన్‌లో పెట్టినట్లు తెలుస్తోంది. ఈ బిగ్ ఆఫర్ వెనుక ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సానుకూల ప్రోత్సాహం ఉందనే ప్రచారం జోరుగా సాగుతోంది. 'వేదం' సమయం నుంచే బన్నీ, క్రిష్ మధ్య మంచి మైత్రి ఉందనే సంగతి తెలిసిందే. ఈ సారి క్రిష్ ఒక సరికొత్త తరహా కాన్సెప్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు సమాచారం. దేవి నవరాత్రుల నేపథ్యం మరియు పౌరాణిక కథాంశంతో ఒక భారీ యానిమేషన్ చిత్రాన్ని రూపొందించేందుకు ప్లాన్ చేస్తున్నారట. ఈ ప్రాజెక్ట్‌కు 'మహిషాసురమర్దిని' అనే శక్తివంతమైన టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లు ఫిలిం నగర్ వర్గాల్లో కథనాలు వినిపిస్తున్నాయి. గతంలో 'గమ్యం', 'వేదం', 'కంచె', 'గౌతమిపుత్ర శాతకర్ణి' లాంటి వైవిధ్యమైన చిత్రాలతో క్రిష్ తన ప్రతిభను చాటుకున్నారు. అయితే, ఇటీవలి కాలంలో ఆయన దర్శకత్వం వహించిన కొన్ని ప్రాజెక్టులు ఆశించిన ఫలితాలను ఇవ్వలేకపోయాయి. అయినప్పటికీ, క్రిష్ మేకింగ్ మరియు విజువల్ డ్రామా పై ఇండస్ట్రీలో ఉన్న గౌరవం తగ్గలేదు. ఈ నేపథ్యంలో గీతా ఆర్ట్స్ వంటి ప్రతిష్టాత్మక సంస్థలో అవకాశం రావడం ఆయన కెరీర్‌కు మంచి బూస్టింగ్ అని చెప్పవచ్చు. ఇటీవల కాలంలో డివోషనల్,  పౌరాణిక యానిమేషన్ చిత్రాలకు పాన్ ఇండియా స్థాయిలో విశేష ఆదరణ లభిస్తోంది. స్టార్ క్యాస్టింగ్‌తో సంబంధం లేకుండా బలమైన కాన్సెప్ట్, పురాణ కథలతో వస్తున్న సినిమాలు బాక్సాఫీస్ వద్ద విజయం సాధిస్తున్నాయి. ఈ ట్రెండ్‌ను దృష్టిలో ఉంచుకునే గీతా ఆర్ట్స్, క్రిష్ కాంబోలో ఈ ప్రాజెక్ట్ రూపుదిద్దుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ క్రేజీ విజువల్ వండర్ పై అధికారిక ప్రకటన ఎప్పుడు వస్తుందో అని అల్లు అర్జున్ అభిమానులతో పాటు సాధారణ సినీ ప్రియులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు  కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత  కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.  జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు.  2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది. "ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు. సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు. గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.                                      *నిశ్శబ్ద.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఒకప్పుడు ఎర్ర జెండాను దిగ్విజయంగా ఎదిరించి, మార్క్సిస్టులను మట్టి కరిపించిన మమతా దీదీ ప్రస్తుతం, కాషాయ కూటమి నుంచి గట్టి సవాలును ఎదుర్కుంటున్నారు. వరసగా పదేళ్ళు పాలించడం వలన సహజంగా వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత  కంటే, హిందూ ఓటు పోలరైజేషన్ ఆమెను మరింతగా భయపెడుతోంది. నిజానికి ఐదేళ్ళ క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఐదు శాతం కంటే తక్కువ ఓట్లు, మూడంటే మూడు అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ..  2019 లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా 40 శాతం ఓట్లతో 18 స్థానాలు గెలుచుకుంది. ఈ  మార్పు ఇంకా కొన్ని కారణాలు ఉంటే ఉండవచ్చును కానీ.. హిందువుల ఓటు పోలరైజ్  కావడమే ప్రధాన కారణం.  ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ చివరకు కమ్యూనిస్టులు కూడా బీజేపీలో  చేరారు. ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత కూడా సిట్టింగ్ ఎమ్మెల్ల్యేలు సహా  తృణమూల్ టికెట్ వచ్చిన నాయకులు కూడా బీజేపీలో చేరుతున్నారు. అనేక మంది ఇతర రంగాల ప్రముఖులు, ముఖ్యంగా ఇంతకాలం, బీజేపీని హిదుత్వ అనుకూల ‘అచ్చుత్’ (అంటారని) పార్టీగా చూసిన ‘సెక్యులర్’ ప్రముఖులు కాషాయం కప్పుకోవడంతో మమతా బెనర్జీకి కొంచెం అలస్యంగానే అయినా, తత్త్వం బోధపడింది. అందుకే ఆమె ఇప్పుడు గుళ్ళూ,గోపురాలకు తిరుగుతున్నారు. కార్యకర్తల సమావేశాల్లో తానూ హిందువునేనని, చెప్పుకుంటున్నారు.  నిజానికి ఇలా నేనూ హిందువునే  అని సెక్యులర్ నేతలు బహిరంగంగా ప్రకటించుకోవడం మమతా బెనర్జీతోనే మొదలు కాలేదు. రాహుల్ గాంధీ తాను హిందువునని, జన్యుధారీ కశ్మీరీ బ్రాహ్మణుని అనీ.. తమ గోత్రం, ‘దత్తాత్రేయ’ గోత్రమని బహిరంగంగా ప్రకటించుకున్నారు. అలాగే  కొద్ది రోజుల క్రితం ప్రియాంకా గాంధీ తానూ హిందువునని చెప్పుకునేందుకు ‘మౌని అమావాస్య’ సందర్భంగా అలహాబాద్ లో గంగా స్నానం చేశారు. గతంలోనూ ఆమె ఎన్నికలకు ముందు గంగా యాత్ర చేశారు. అంతవరకు ఎందుకు కొద్దిరోజుల క్రితం సిపిఐ నారాయణ విశాఖ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. చంద్రబాబు, జగన్ రెడ్డి, కేసీఆర్ ఇలా తెలుగు నేతలు అనేక మంది లౌకిక వాదానికి కాలం చెల్లిందన్న సత్యాన్ని గ్రహించి కావచ్చు ‘నేనూ హిందువును’ అంటూ ప్రకటించుకునేందుకు పోటీ పడుతున్నారు. రాముడిని తలచుకున్నా, జై శ్రీరామ్ అన్నా తమ  లౌకిక వాదం మయలపడి పోతుందని భయపడిన నాయకులు ఇప్పుడు .. జై శ్రీరామ్ అనేందుకు కూడా వెనకాడడం లేదు.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది. గత కొంత కాలంగా సబర్మలతో సహా అనేక అంశాలపై స్పందిస్తూ.. కేరళను టార్గెట్ చేస్తున్న బీజేపీ నాయకులు అక్కడ తమ జెండా ఎగరేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా పార్టీ పాలసీని కూడా పక్కన పెట్టి మెట్రో మ్యాన్ శ్రీధరన్ ను పార్టీలో చేర్చుకుని ఆయనే తమ సీఎం అభ్యర్థి అని ప్రకటించిన 24 గంటలలో యూ టర్న్ తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం సీఎంగా ఉన్న కమ్యూనిస్ట్ నేత పినరై విజయన్ పై గోల్డ్ స్మగ్లింగ్ ఆరోపణలు రావడంతో.. ఈ ఎన్నికలలో ఎల్డిఎఫ్ భవిష్యత్తుపై ప్రజలు ఏ తీర్పు ఇవ్వబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది ఈ నేపథ్యంలో అక్షరాస్యతలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న ఆ రాష్ట్ర ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారు అనే అంశంపై ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ నౌ, సీ ఓటరుతో కలిసి ఒక సర్వేను నిర్వహించారు. ఈ సర్వే ప్రకారం చూస్తే పాపం కమలనాథులు అక్కడ పవర్ చేతికి రావటం అటుంచి కనీసం రెండు మూడు అసెంబ్లీ స్థానాల్లో గెలవటం కూడా కష్టమేనని ఆ సర్వే తేల్చి చెబుతోంది. కేరళలో ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తన హవా చాటుతుందన్న ఆ పార్టీ నేతల మాటలలో ఎలాంటి నిజం లేదని.. ప్రస్తుతానికి అది ఏమాత్రం సాధ్యం కాదని ఈ తాజా సర్వే తేల్చి చెప్పింది. అంతేకాకుండా మొత్తం 140 స్థానాలు ఉన్న కేరళలో.. ప్రస్తుత సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్డ్ డెమొక్రటిక్ ఫ్రంట్ కు 82 సీట్లు పక్కా అని.. ఆయనే తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటాడని సర్వే చెపుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూనైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ కు 56 నుంచి 60 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వేలో తేలింది. అంతేకాకుండా 2016 ఎన్నికలతో పోలిస్తే ఎల్ డీఎఫ్ ఓటింగ్ శాతం కూడా కొంత పెరగటం ఇక్కడ గమనార్హం. ప్రస్తుతం సీఎంగా ఉన్న విజయన్ మరోసారి సీఎం కావాలని 43.34 శాతం మంది మొగ్గు చూపినట్లుగా సర్వేలో తేలింది. కరోనా సమయంలో విజయన్ సీఎంగా బాగా పని చేసారని ఈ సర్వే పేర్కొంది. మరోపక్క దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ ఉండాలని కేరళ ప్రజల్లో 55.84 శాతం మంది కోరుకుంటున్నట్లుగా ఈ సర్వే;లో తేలింది. అయితే కేరళలో ఎలాగైనా పాగా వేయాలని పట్టుదలతో కృషి చేస్తున్న బీజేపీకి ఈసారి కూడా నిరాశ తప్పదని ఈ సర్వేలో స్పష్టం అయింది. ఈ ఎన్నికలలో బీజేపీకి రెండు సీట్లు కూడా రావటం కూడా కష్టమేనని ఈ సర్వే తేల్చింది. అయితే ఎన్నికలకు ముందు ఇలాంటి సర్వేలు బయటకు రావడం.. తరువాత అందులో కొన్ని చతికిల పడడం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ సర్వే ఫలితాలు నిజామా అవుతాయో లేదో తేలాలంటే కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే.        
రాజకీయాలు అంటేనే అదో జూదం. పూలమ్మిన చోటనే కట్టెలు అమ్మవలసి రావచ్చును. అలాంటి పరిస్థితే వచ్చినా, తలవంచుకుని పోగలిగితేనే, ఎవరైనా రాజకీయాలలో రాణించగలరు. అలాకాదని, అలిమి కానిచోట, కూడా తామే అధికులమని భావిస్తే, ఎందుకూ కాకుండా పోతారు. అలాంటి వారు ఇద్దరూ కూడా ఇప్పుడు మన కళ్ళముందే ఉన్నారు.  జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు. అలాగే జయ మరణం తర్వాత ఆమె పరిస్థితి ఏమిటో కూడా వేరే చెప్పవలసిన, అవసరం లేదు. జైలు పాలయ్యారు. సర్వం తానై నడిపించిన పార్టీ నుంచి  బహిష్కరణకు గురయ్యారు. జయ ఉన్నంత వరకు తన వారుగా ఉన్న వారందరూ కానివారయ్యారు. ఒంటరిగా మిగిలారు.  నిజానికి నాలుగేళ్ళు జైలు జీవితం గడిపిన తర్వాత కూడా ఆమె తలచుకుంటే.. రాష్ట్ర రాజకీయాలలో, ముఖ్యంగా అధికారంలో ఉన్న డిఎంకే కూటమిలో అలజడి సృష్టించగలరు. ఎన్నికలలో ఆమె గెలవక పోవచ్చును కానీ.. తనను కాదన్న అన్నాడిఎంకేను ఓడించగలరు. అయిన  ఆమె అందుకు విరుద్ధంగా  రాజకీయాలకు వీడ్కోలు పలికి మౌనంగా పక్కకు తప్పుకున్నారు. రాజకీయ సన్యాసం ప్రకటించారు. ఉమ్మడి శతృవు డిఎంకే ను ఓడించేందుకు అన్నా డిఎంకే కూటమి  పోటీ చేయాలని, కూటమి ఐక్యతను దెబ్బతీయరాదనే ఉద్దేశంతోనే ఆమె రాజకీయ సన్యాసం ప్రకటించారు.    శశికళ మౌనంగా వెళ్లి పోవడం వెనక ఇంకా అనేక కారణాలున్నా ,అసలు కారణం ఆమె, రాజకీయ విజ్ఞత, వివేకం. ఆమె జైలుకు వెళ్ళిన సమయంలో జయలలిత సమాధి వద్ద ఎంత కసిగా, కోపంగా ‘మౌన’ ప్రతిజ్ఞ చేశారో చూశా. అలాంటి ఆమె ఇప్పుడు ఇలా ‘మౌనం’గా వెనకడుగు వేశారంటే, అది ఆలోచించ వలసిన విషయమే.ఆమె వ్యుహతంకంగానే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అనేక మంది అనేక కోణాల్లో శశికళ సంచలన నిర్ణయాన్ని విశ్లేషించారు.జైలు జీవితం తర్వాత కూడా అన్నా డిఎంకే నాయకులు తనను అగ్రనేతగా అంగీకరించక పోవడం, అమిత్ షా చెప్పినా.. అన్నా డిఎంకే నాయకులు ఆమెను, మేనల్లుడు దినకరన్’ను కులం పేరున, కుటుంబం పేరున దూరం చేయడం, తిరిగి పార్టీలోకి తీసుకోకపోవడంతో ఆమె మనసు కష్టపెట్టుకుని, సన్యాస నిర్ణయం తీసుకున్నారని కొందరంటున్నారు. పార్టీ మీద పట్టు లేదని, చరిష్మా అసలే లేదని, అందుకే ఆమె అలా నిశ్శబ్ధంగా రాజకీయ సన్యాసం స్వీకరించారని ఇంకొందరు విశ్లేషించారు. ఈ విశ్లేషణలో కొంత నిజం ఉంటే ఉండవచ్చును.. కానీ ఆమె గతాన్ని, నైజాన్ని గుర్తు చేసుకుంటే ఆమె స్ట్రైక్ బ్యాక్ వ్యూహంతోనే ఒకడుగు వెనక్కివేశారని ఆమెతో సన్నిహితంగా మెలిగినవారు, ఆమె రాజకీయ చాణక్యం తెలిసిన వారు అంటారు.   నిజానికి జైలులో ఉన్న కాలంలో కానీ, జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత కానీ, ఆమె రాజకీయ సన్యాసం వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపించలేదు. బెంగుళూరు జైలు నుంచి విడుదలై చెన్నైలో ప్రవేశించిన నప్పుడు ఆమె పెద్ద కాన్వాయ్ తో  తమ కారుకు అన్నాడిఎంకే జెండాతోనే ఎంటరయ్యారు. అలా ఎంట్రీలోనే రాజకీయ ఆకాంక్షను వెంట తెచ్చుకున్నారు. చివరకు ‘సన్యాస’ ప్రకట చేసే వరకు కూడా ఆమె రాజకీయ కార్యకలాపాలు సాగిస్తూనే ఉన్నారు. అటు ఢిల్లీని ఇటు చెన్నైనికూడా కదిల్చారు. అంతేకాదు, రాజకీయాలపై విరక్తితో కాదు, రాజకీయ కసితో, ఉమ్మడి శత్రువు (డిఎంకే) ను ఓడించేందుకే తాను రాజకీయాలనుంచి తపుకుంటున్నట్లు చెప్పారు.  సో .. సన్యాసం తీసుకోవాలనే ఆలోచన, రాజకీయవ్యూహం లోంచి పుట్టిందే కానీ,వైరాగ్యంతో పుట్టింది కాదు ,అన్నవిశ్లేషణ వాస్తవానికి ఇంకొంత దగ్గరగా ఉందని అనుకోవచ్చును. ఇది ‘కామా’నే కాని ‘ఫుల్స్టాప్’ కాదని అంటున్నారు.  ముఖ్యమంత్రి ఎడప్పాడి కే. పళని స్వామి (ఈపీఎస్) ఆమెను పార్టీలోకి అనుమతిస్తే తన కుర్చికీ ఎసరు పెడతారనే భయంతోనే,, ఆమె ఎంట్రీని అడ్డుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, శశికళ ఒకే సామజిక వర్గానికి చెందిన వారు కావడం కూడా, ముఖ్యమంత్రి ఈపీఎస్’ భయానికి కారణంగా పేర్కొంటారు. అందుకే  ఆయన, ‘మన్నార్గుడి’ ఫ్యామిలీని బూచిగా చూపించి, ఆమెను దూరంగా ఉంచారని పార్టీలో ఒక వర్గం గట్టిగా విశ్వసిస్తుంది. అయితే ఆమె శక్తియుక్తులను కూడతీసుకుని  పులిలా పంజా విసిరేందుకే ఆమె వ్యూహాత్మకంగా ఒక అడుగు వెనక్కి వేశారు కావచ్చును అని కూడా, తమిళ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది.  గతంలో ఆమె జయలలితతో విబేధాలు వచ్చిన సమయంలో కూడా ఇలాగే కొద్ది కాలం మౌనంగా తెర చాటుకు వెళ్లి పోయారు.  కొద్ది కాలంలోనే మళ్ళీ ‘పోయస్ గార్డెన్’లో ప్రత్యక్షమయ్యారు. జయలలిత స్వయంగా ఆమెను వెనక్కి పిలుపించుకోవలసిన పరిస్థితులను సృష్టించారు. అలా  మళ్ళీ  చక్రం తిప్పారు. జయలలిత మరణం వరకు ఆమె అందరికీ చిన్నమ్మగా అమ్మకు పెద్దమ్మగా సర్వం తానై నిలిచారు. చివరకు జయ అంత్యక్రియల్లో కూడా ఆమెదే పై చేయిగా కనిపించింది.   జయలలిత చనిపోయిన సందర్భంలోనే అన్నా డిఎంకే ఎమ్మెల్ల్యేలో సుమారు 30 మంది వరకు ఆమెకు మద్దతుగా ఉన్నారన్న వార్తలొచ్చాయి. నిజానికి,ఇప్పటికి కూడా ఒక్క అన్నా డిఎంకే లోనేకాదు,డిఎంకే ఇతర పార్టీలలో కూడా  ఆమె అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ‘మన్నార్గుడి’ ఫ్యామిలీ మద్దతు లేకుండా గెలిచే అవకాశం లేదు.  ఇవ్వన్నీ నిజమే అయినా.. అన్నీ ఉండి, ఎవరు లేని శశికళలో, ఇంకా  ఎవరి కోసం తాపత్రయ పడాలి? అనే ప్రశ్న జనించి ఉంటే, ఆమె రాజకీయ సన్యాసం నిజం కావచ్చును. ఎందుకంటే ఆమె నెచ్చలి, జయలిత లేరు, భర్త అంతకంటే ముందే చనిపోయారు, పిల్లలు లేరు... పైగా నాలుగేళ్ళ జైలు జీవితం ఆమెలో మార్పు తెచ్చి ఉండవచ్చును. ఈ వయస్సులో తనవారంటూ ఎవరు లేని తనకు రాజకీయాలు ఎందుకు ? శేష జీవితాన్ని ఇలా సాగిద్దామనే ఆలోచన నిజంగా వచ్చి ఉంటే, ఆమె సన్యాసం సత్యం అయినా కావచ్చును, కాకపోనూ వచ్చును. కానీ  శశికళ... ఆమెను అర్థం చేసుకోవడం, అంచనా వేయడం , అంత తేలిగ్గా అయ్యే పని కాదు..
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు. కాంగ్రెస్ అధినాయకత్వం పై నేరుగా అస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ పేరు చెప్పకుండానే, ఆయన నాయకత్వానికి పనికిరాడని తేల్చి చెప్పారు. ఎవరైనా పార్టీ అధ్యక్షుడు అయితే కావచ్చును, కానీ, ప్రజానాయకుడు కాలేడని, రాహుల గాంధీ ప్రజానాయకుడు కాదు కాలేరు,అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరచూ రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసే  ‘నామ్’ధారీ వ్యంగ్యాస్త్రాన్నే కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా సందించారు. ఇక అక్కడి నుంచి విధేయ, అసమ్మతి వర్గాల మధ్య మాటల యుద్ధం ఎదో ఒక రూపంలో సాగుతూనే వుంది. అదే క్రమంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, కరుడు కట్టిన ముస్లిం మతోన్మాది, అబ్బాస్ సిద్దిఖీతో కాంగ్రెస్ పార్టీ చేతులు కలపడం అసమ్మతి నాయకులకు మరో అస్త్రాన్ని అందించింది. విషయంలోకి వెళితే, ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా లోక్’సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు, పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్’రంజన్ చౌదరి, ముస్లిం మత ప్రచారకుడు, అబ్బాస్ సిద్దిఖీతో  వేదిక పంచుకున్నారు.అంతకు ముందే వామ పక్ష కూటమితో  పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్ పార్టీ, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)ను కూటమిలో చేర్చుకుంది. ఇలా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) అమోదం లేకుండా మతోన్మాద ఐఎస్ఎఫ్’ తో ఎన్నికల పొత్తు పెట్టుకోవడం ఆ పార్టీ నాయకుడు,సిద్ధిఖీతో  పీసీసీ చీఫ్ వేదిక  పంచుకోవడం పై అసమ్మతి నేతలు మండి పడుతున్నారు. ఇలా సిద్దిఖీతో వేదిక పంచుకోవడం పార్టీ మౌలిక సిద్ధాంతాలకు వ్యతిరేకం అంటూ అసమ్మతి వర్గానికి చెందిన కీలక నేత, రాజ్యసభ సభ్యుడు,ఆనంద్ శర్మ మండిపడ్డారు. అంతే కాదు, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)తో జనవరిలో కుదుర్చుకున్న పొత్తుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)అమోదం లేదని ఆనంద్ శర్మ, అభ్యంతరం వ్యక్త చేశారు. పార్టీ విశ్వసించే లౌకిక వాదానికి కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం గొడ్డలి పెట్టని ఆయన తీవ్రంగా స్పందించారు.   శర్మ వ్యాఖ్యలపై అధీర్ రంజన్ చౌదరి అంతే ఘాటుగా ప్రతిస్పందించారు. “నిజాలు తెలుసుకోండి ఆనంద్ శ‌ర్మ జీ” అంటూ ఆయ‌న వ‌రుస ట్వీట్లు చేశారు. వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలు ప‌క్క‌న‌పెట్టి, ప్ర‌ధానిని పొగిడి టైమ్ వేస్ట్ చేయ‌కండంటూ ఆయ‌న ఓ ట్వీట్లో అన్నారు. ఆనంద్ శ‌ర్మ అన‌వ‌స‌రంగా కాంగ్రెస్‌ను ల‌క్ష్యంగా చేసుకుంటున్నార‌ని, ఈ అంశాన్ని పెద్ద‌ది చేసి చూపిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఆయ‌న ఉద్దేశాలు స‌రైన‌వే అయితే నేరుగా తనతో మాట్లాడ వలసిందని అన్నారు. బెంగాల్‌లో సీపీఐ(ఎం) కూట‌మికి నేతృత్వం వ‌హిస్తోంది. అందులో కాంగ్రెస్ ఓ భాగం. మ‌త‌తత్వ‌, విభ‌జ‌న రాజ‌కీయాలు చేస్తున్న బీజేపీకి చెక్ పెట్ట‌డానికే ఈ కూట‌మి అని మ‌రో ట్వీట్‌లో అధిర్ రంజ‌న్ అన్నారు. అక్కడతోనూ ఆగలేదు ... ట్వీట్ల మీద ట్వీట్లు సంధిస్తూ, ఆనంద్ శర్మ, బీజేపీ మత విభజన, అజెండాను బలపరుస్తున్నారని, పరోక్షంగా జీ23 నాయకులు బీజేపీకి ప్రయోజనం చేకూరుస్తున్నారని ఆరోపించారు.అంతే కాదు, క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితులు తెలియకుండా, ఆనంద్ శర్మ పార్టీ మీద దండెత్తడం ఉచితం కాదని చౌదరి ఎదురుదాడి చేశారు. అసమ్మతిలో అసమ్మతి. ఇదలా ఉంటే, కాంగ్రెస్ పార్టీ  సమూల పక్షాళన కోరుతూ సోనియా గాంధీకి,గత సంవత్సరం  జీ 23గా ప్రాచుర్యం పొందిన సీనియర్ నాయకులు రాసిన లేఖపై సంతకాలు చేసిన  నాయకుల్లో నలుగురు,జమ్మూలోసమావేసమైన నాయకుల తాజా నిర్ణయాలు, వ్యాఖ్యలు,విమర్శల పట్ల అసంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరం సోనియా గాంధీకి రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలకు కట్టుబడి ఉన్నామని, అయితే, జీ 23లోని కొందరు సహచరులు, ఇటీవల గీతదాటి చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలను తాము సమర్ధించడం లేదని ఆ నలుగురు పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా, రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్, పీజే కురియన్ అయితే, “కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన సంస్కరణలు తెచ్చేందుకు చేసే ప్రయత్నాలను పూర్తిగా సమర్దిస్తాను, కానీ, ‘లక్ష్మణ రేఖ’ దాటితే ఒప్పుకునేది లేదు”అని అసమ్మతిలో అసమ్మతికి తెర తీశారు.అలాగే, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారడు, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్,మధ్య ప్రదేశ్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అజయ్ సింగ్’ కూడా గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, ఆనంద్ శర్మ, మనీష్ తివారీ వంటి జీ 23 కీలక నేతలు అధినాయకత్వంపై చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. అలాగే, పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీమంత్రి వీరప్ప మొయిలీ కూడా,గత సంవత్సరం పార్టీ సీనియర్ నాయకులు  ఒక పరిమిత లక్ష్యంతో  సోనియా గాంధీకి లేఖ రాయడం జరిగిందని, ఆ పేరున జరుగతున్న  కార్యక్రమాలు లేఖ సంకల్పానికి  విరుద్ధమని అన్నారు. జీ 23 కార్యకలాపాలపై రాహుల్ గాంధీ కూడా పరోక్షగా స్పందించారు, ఒకప్పుడు ఎన్ఎస్’యుఐ, యూత్ కాంగ్రెస్’ కు సంస్థాగత ఎన్నికలు వద్దన్న వారే ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నారని పరోక్షంగానే అయినా సంస్థాగత ఎన్నికలు నిర్వహించడంతో పాటుగా, పార్టీ పక్షాలనకు తమ కుటుంబం వ్యతిరేకం కాదని, అందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీలో చెలరిగిన కలకలం  ఇక ముందు ఏమవుతుందో .. ఇంకెన్ని  మలుపులు తిరుగుతోందో ..చూడవలసిందే కానీ ఉహించలేము.
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఆ ఒపీనియన్ పోల్ ఫలితాలు నిజంగా నిజం అయితే, కేరళలో మళ్ళీ సీపీఎం సారధ్యంలోని వామపక్ష కూటమి అధికారంలోకి వస్తుంది. ఇదే ఆ అద్భుతం. ఎందుకంటే, గత నాలుగు దశాబ్దాలలో కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే కూటమి వరసగా రెండవసారి అధికారంలోకి వచ్చిన చరిత్ర లేనే లేదు. ఒక సారి ఎల్డీఎఫ్ అధికారంలోకి వస్తే ఐదేళ్ళ తర్వాత కాంగ్రెస్ సారధ్యంలోని ఐక్య ప్రజాస్వామ్య కూటమి(యూడీఎఫ్) అధికారంలోకి రావడం, దేవభుమిలో దైవ నిర్ణయమా అన్నట్లుగా ప్రతి ఎన్నికల్లోనూ అధికారం చేతులు మారుతూ వస్తోంది. అలాంటిది, ఈసారి ఒపీనియన్ పోల్స్ నిజమై వరసగా రెండవసారి వామపక్ష కూటమి అధికారంలోకి వస్తే, అది చరిత్రే అవుతుంది. ఇక ఒపీనియన్ పోల్స్ విషయానికి వస్తే, జాతీయ న్యూస్ ఛానెల్ ఏబీపీ, సీ ఓటర్ సంస్థలు సంయుక్తంగా ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఈ సర్వే ప్రకారం, 140 స్థానాలున్న కేరళ అసెంబ్లీలో వామపక్ష కూటమికి 83 నుంచి  91 స్థానాలు, యూడీఎఫ్ కూటమికి 47 నుంచి 55 స్థానాలు మాత్రమే దక్కుతాయని తెలుస్తోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రంలో ఇలా జాతకాలు తిరగబడడంపై సోషల్ మీడియాలో,’లెగ్ మహిమ’ లాంటి జోక్స్  ట్రోలవుతున్నాయి. అయితే 2016లో జరిగిన ఎన్నికల్లో కేవలం 47 సీట్లకే పరిమితం అయిన కాంగ్రెస్’కు ఈసారి ఒకటీ అరా సీట్లు ఎక్కువస్తే, రావచ్చును. అదే కాంగ్రెస్’కు కాసింత ఊరట. అదలా ఉంటే, పశ్చిమ బెంగాల్లో సైతం పట్టు సాధించిన బీజేపే, కేరళలో మాత్రం పట్టు కాదు కదా, పట్టుమని పది సీట్లు తెచ్చుకునే స్థితిలో లేదు. నిజానికి, దేశంలో బీజేపీకి అసలు ఏ మాత్రం మింగుడు పడని రాష్ట్రాలు ఎవైన ఉన్నాయంటే కేరళ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల  పేర్లే ప్రముఖంగా వినిపిస్తాయి. ఈ సారి కూడా కమల దళం కేరళలో కాలు పెట్టె పరిస్తి లేదని సర్వే ఫలితాలు చెపుతున్నారు. ఎప్పటిలానే ఇప్పడు కూడా  బీజేపీకి సున్నా నుంచి రెండు సీట్లు వచ్చే అవకాశం ఉందని, సర్వేస్వరుల అభిప్రాయంగా ఉంది. కేరళలో మొత్తం 140 స్థానాలకు ఏప్రిల్ 6 తేదీన ఒకే విడతలో పోలింగ్ జరుగుతుంది. మే 2 తేదీన ఫలితాలు వెలువడతాయి. కేరళ ఎలక్షన్ పై యావత్ దేశం ఆసక్తి కనబరుస్తోంది.    
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం ఓటరు తీర్పుకు వెళుతున్నా, అందరి దృష్టి, ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల ఏలుబడిలో ఉన్న ఉభయ తెలుగు రాష్ట్రాలు, మరీ ముఖ్యంగా ఇప్పటికే బీజేపీ కన్నుపడిన తెలంగాణ రాష్ట్ర ప్రజలు, రాజకీయ పార్టీల దుష్టి  మాత్రం పశ్చిమ బెంగాల్ పైనే వుంది.  పశ్చిమ బెంగాల్లో ‘అద్భుతం’ జరిగి బీజేపీ విజయం సాధిస్తే, ఇక  కమల దళం ఫోకస్, తెలంగాణకు షిఫ్ట్ అవుతుంది. ఇది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. ఈ నేపధ్యంలో బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయి అనే విషయంలో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. బెంగాల్లో బీజేపీ గెలిస్తే, ఇప్పటికే అంతర్గత కుటుంబ కలహాలతో సతమతవుతున్న తెరాస నాయకత్వానికి మరిన్నితిప్పలు తప్పవన్న మాట అంతఃపుర వర్గాలలో సైతం వినవస్తోంది.  పశ్చిమ బెంగాల్’లో ఎలాగైతే కమలదళం ఓ వంక తమ ట్రేడ్ మార్క్, హిందుత్వ రాజకీయాలు సాగిస్తూ, మరో వైపు నుంచి ‘ఆకర్ష్’ అస్త్రంతో అధికార పార్టీని నిర్వీర్యం చేసిన విధంగానే, ఇక్కడ కూడా ఫిరాయింపులను ప్రోత్సహింఛి పార్టీని నిట్టనిలువునా చీల్చే ప్రమాదాన్ని కొట్టివేయలేమని పార్టీ వర్గాలు కూడా అనుమానం వ్యక్త పరుస్తున్నాయి.  ఇప్పటికే తెలంగాణ  బీజేపీ నాయకులు 30 మంది తెరాస ఎమ్మెల్యేలు తమ టచ్ లో ఉన్నారని బెదిరిస్తున్నారు.అది నిజం అయినా కాకపోయినా..తెరాసలో అసంతృప్తి అగ్గి రగులుతోందనేది మాత్రం ఎవరూ కాదనలేని నిజం. అంతే కాకుండా రాష్ట్రానికి వచ్చిన కేంద్రనాయకులు ఎవరిని పలకరించినా, నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అని ఎలాంటి సషబిషలు లేకుండా కుండబద్దలు కొడుతున్నారు.అందుకే, బెంగాల్లో బీజేపీ గెలిస్తే.. అనే ఊహా కూడా  గులాబీ గూటిలో గుబులు పుట్టిస్తోంది. అయితే, బెగాల్’లో బీజేపీ గెలిస్తే ఒక్క తెలంగాణలోనే కాదు, దేశ రాజకీయ వాతావరణంలోనే పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.  అలాగే,  దేశ ముఖ చిత్రంలో కూడా పెను మార్పులు తప్పవని అంటున్నారు. అయితే రాజకీయాలలో ఎప్పుడు ఏం జరుగుతుందో.. ఎవరూహించెదరు..
వైవాహిక బంధం అనేది ఇద్దరు వ్యక్తులు కలిసి సాగించే ఒక అందమైన ప్రయాణం. ఇందులో సుఖదుఃఖాలు, గెలుపోటములు, సంతోషాలు మాత్రమే కాదు, సర్దుబాట్లు కూడా ఉంటాయి. అయితే.. సమాజంలో ఏళ్ల  తరబడి నడుస్తున్న ఒక ఆనవాయితీ లేదా సంప్రదాయం  ఏమిటంటే, పెళ్లి తర్వాత సర్దుకుపోవడం, త్యాగాలు చేయడం అనేది కేవలం భార్య బాధ్యత మాత్రమే అని. కాలం ఇంత మారినా,  మహిళలు ఆర్థికంగా కూడా ఎంత ఎదిగినా..  ఇప్పటికీ అత్తింట్లో కానీ,  భర్త నుండి కానీ ఇబ్బంది,  కష్టం,  బాధ ఎదురైతే..  అమ్మాయిలకు సర్థుకుపొమ్మని చెబుతూ ఉంటారు కానీ అమ్మాయిల ఆలోచన మారుతోంది.  మగాడు చేసే తప్పులకు,  అత్తింట్లో అత్తమామలు చేసే తప్పులకు,  బాధితులుగా తాము ఎందుకు ఉండిపోవాలని ప్రశ్నిస్తున్నారు.  ఎప్పుడైనా భార్యాభర్తల మధ్య ఏదైనా గొడవ జరిగితే... అన్నింటికి బాధితులుగా అమ్మాయిలు ఉండిపోవాల్సిందేనా?   సర్థుబాటు తత్వం కేవలం భార్యలకేనా?  భర్తలకు అవసరం లేదా అని ప్రశ్నిస్తున్నారు.  దీని గురించి వివరంగా తెలుసుకుంటే.. మహిళల స్థానం.. కుటుంబ వ్యవస్థలో పూర్వం నుంచి స్త్రీ స్థానాన్ని ఇల్లు వదిలి కొత్త ఇంటికి వచ్చే వ్యక్తిగా చూశారు. ఒక కొత్త వాతావరణం, కొత్త మనుషులు, కొత్త అలవాట్లకు అలవాటు పడే క్రమంలో ఆమె సర్దుకుపోవాల్సి రావడం సహజంగా మారింది. కానీ, కాలక్రమేణా సర్దుబాటు అనేది కేవలం ఒకరి వైపు నుంచే జరిగే బాధ్యతగా మారిపోయింది. కుటుంబంలో శాంతి ఉండాలన్నా, బంధం నిలవాలన్నా భార్య మాత్రమే తన ఇష్టాలను, అభిప్రాయాలను, చివరికి తన ఆత్మగౌరవాన్ని కూడా పక్కన పెట్టి నడుచుకోవాలనే విధంగా వ్యవస్థ ఏర్పడింది. సర్దుబాటుతత్వం.. నిజమైన వైవాహిక జీవితం అనేది ఒకరి ఆధిపత్యం, మరొకరి లొంగుబాటు మీద ఆధారపడి ఉండదు. పెళ్లి అనేది రెండు మనసుల కలయిక అయినప్పుడు, ఆ బంధాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఇద్దరి పైనా సమానంగా ఉంటుంది. భార్య మాత్రమే సర్దుకుపోవాలి అని అనుకోవడం బంధానికి పునాది కాదు. ఒకవైపు నుంచి మాత్రమే సర్దుబాట్లు జరుగుతుంటే, కాలక్రమేణా ఆ వ్యక్తిలో నైరాశ్యం, కోపం, అసంతృప్తి పేరుకుపోతాయి. అది బంధాన్ని దృఢంగా ఉంచడానికి బదులు, లోలోపల బలహీనపరుస్తుంది. భర్త వైపు నుంచి కూడా సర్దుబాటు తత్వం చాలా అవసరం. భార్య భావోద్వేగాలను అర్థం చేసుకోవడం, ఆమె ఆలోచనలకు విలువ ఇవ్వడం, కొత్త కుటుంబంలో ఆమె ఎదుర్కొంటున్న ఇబ్బందుల్లో తోడుగా నిలవడం వంటివి భర్త వైపు నుంచి రావాల్సిన ముఖ్యమైన సర్దుబాట్లు. మారుతున్న కాలంలో భార్యాభర్తలిద్దరూ ఉద్యోగాలు చేస్తున్నారు. అటువంటప్పుడు ఇంటి పనులు, పిల్లల పెంపకం, కుటుంబ బాధ్యతల్లో ఇద్దరూ సర్దుబాటు చేసుకుంటూ ముందుకు సాగాలి. అసలైన సర్థుబాటు ఇదే.. ఒకరినొకరు గౌరవించుకోవడం, ఒకరి బలహీనతలను మరొకరు భరించడం, సమస్యలు వచ్చినప్పుడు కలిసి కూర్చుని మాట్లాడుకోవడం అసలైన సర్దుబాటు. ఇది ఏ ఒక్కరికో పరిమితమైన సూత్రం కాదు. ఒకరికొకరు తోడుగా ఉండటానికి, కలిసి బ్రతకడానికి చేసుకునే అనుకూలతే నిజమైన సర్దుబాటు తత్వం. వైవాహిక బంధంలో సర్దుబాటు తత్వం అనేది భార్యకు మాత్రమే అవసరమైన విషయం అనుకోవడం చాలా తప్పు. బంధంలో ప్రేమ, గౌరవం, శాంతి నిలవాలంటే ఇద్దరూ సమానంగా అడుగులు వేయాలి. ఒకరి ఒత్తిడికి మరొకరు లొంగిపోవడం సర్దుబాటు అనిపించుకోదు. ఇద్దరూ పరస్పర అవగాహనతో, ప్రేమతో ఒకరి కోసం మరొకరు మారడానికి సిద్ధపడినప్పుడే ఆ వైవాహిక జీవితం సార్థకమవుతుంది. తల్లుల పాత్ర.. నిజానికి సర్థుబాటు తత్వం అనేది  మహిళలకు మాత్రమే అవసరం అని అనుకునేముందు ప్రతి తల్లి తమ పిల్లలకు పెళ్ళి చేసే ముందు అమ్మాయికి అయినా,  అబ్బాయికి అయినా సర్థుబాటు తత్వం ఎందుకు ముఖ్యం, ఎలాంటి పరిస్థితిలో ఎవరు సర్థుబాటు చేసుకోవాలి అని  తెలియజెప్పాలి. అత్తా ఒక ఇంటి కోడలే.. తల్లి ఒక ఇంటికి కోడలే.. పెద్దలు తాము ఎదుర్కొన్న పరిస్థితులు కనీసం రేపటి తరం అయినా ఎదుర్కోకుండా ఉండాలని ఆశించాలి.  కొడుకుకు అయినా,  కూతురుకు అయినా వివాహం తర్వాత సర్దుకుపోవడాన్ని గురించి వివరిస్తే..  వివాహం తర్వాత భార్యాభర్తల మధ్య గొడవల తాలూకు వచ్చే దూరాలు,  విడిపోవడాలు చాలా వరకు తగ్గుతాయి.  వారి జీవితం నూరేళ్ల పాటు సంతోషంగా సాగుతుంది.                                        *రూపశ్రీ.  
  మానవ మెదడు వికాసం టీనేజ్ పూర్తికాగానే ఆగిపోదని, యుక్తవయస్సు మరియు 20ల మధ్యకాలం వరకు నిరంతరం మారుతూనే ఉంటుందని శాస్త్రజ్ఞులకు ఇప్పటికే తెలుసు. అయితే ఈ సుదీర్ఘ ఎదుగుదల కాలంలో మన జ్ఞాపకశక్తి సర్క్యూట్లు ఎలా పరిపక్వత చెందుతాయో వివరిస్తూ ఆల్బర్ట్ ఐన్స్టీన్ కాలేజ్ ఆఫ్ మెడిసిన్ పరిశోధకులు ఒక సంచలనాత్మక జీవశాస్త్ర ప్రక్రియను వెల్లడించారు. ప్లోస్ బయోలజీ జర్నల్‌లో ప్రచురితమైన ఈ అధ్యయనంలో, లేట్ అడోలెసెన్స్ లేదా లేట్ టీనేజ్ దాటాక మెదడులోని ఒక ముఖ్యమైన జ్ఞాపకశక్తి ప్రాంతం ఊహించని రీతిలో రీమోడలింగ్ లేదా పునర్నిర్మాణానికి గురవుతుందని గుర్తించారు. ఈ మార్పుల వల్ల చిన్నతనంలో లేదా టీనేజ్ ప్రారంభంలో ఏర్పడిన జ్ఞాపకాలను గుర్తుచేసుకోవడం తాత్కాలికంగా కష్టమవుతుందని, తరువాత కాలంలో అవి తిరిగి గుర్తుకొచ్చినా పూర్తి వివరాలతో కాకుండా కేవలం అనుభూతి ప్రాధాన్యతతో మాత్రమే గుర్తుంటాయని సైంటిస్టులు రుజువు చేశారు. ఈ పరిశోధన కోసం శాస్త్రవేత్తలు మెదడులోని  రెట్రోస్ప్లేనియల్ కార్టెక్స్  అనే కీలక ప్రాంతంపై దృష్టి సారించారు. సుదీర్ఘకాల జ్ఞాపకాలను భద్రపరచడంలో, వాటిని క్రమబద్ధీకరించడంలో ఈ ప్రాంతం అత్యంత ప్రాధాన్యమైన పాత్ర పోషిస్తుంది. జ్ఞాపకశక్తి సర్క్యూట్‌లను స్థిరంగా ఉంచడానికి  పెరిన్యూరోనల్ నెట్స్  అని పిలిచే రక్షణ వలయం వంటి నిర్మాణాలు సహాయపడతాయి. అయితే లేట్ అడోలెసెన్స్ సమయంలో ఈ రక్షణ వలయాలు తాత్కాలికంగా క్షీణించి, ఆ తర్వాత అడల్ట్‌హుడ్ లేదా పూర్తి పెద్దవయస్సు వచ్చేసరికి తిరిగి పునర్నిర్మించబడతాయని పరిశోధనలో తేలింది. విశేషమేమిటంటే, ఈ మార్పులు కేవలం రెట్రోస్ప్లేనియల్ కార్టెక్స్‌లోనే సంభవించాయి తప్ప, నిమిషాల వ్యవధిలో జ్ఞాపకాలను ప్రాసెస్ చేసే హిప్పోకాంపస్‌లో నమోదు కాలేదు. ఈ జీవశాస్త్ర మార్పులు ప్రవర్తనను ఎలా ప్రభావితం చేస్తాయో తెలుసుకోవడానికి పరిశోధకులు ఎలుకలపై ప్రయోగాలు నిర్వహించారు. చిన్నతనంలో లేదా ప్రారంభ అడోలెసెన్స్‌లో నేర్చుకున్న అనుభవాలు, లేట్ అడోలెసెన్స్ సమయానికి వచ్చేసరికి సరిగ్గా గుర్తుకురాకపోవడాన్ని గమనించారు. అయితే పెద్దయిన తర్వాత అదే జ్ఞాపకాలు మళ్లీ బయటకు వచ్చినా, వాటిలోని పక్కా వివరాలు మాయమై కేవలం ఆ సంఘటన వెనుక ఉన్న భావోద్వేగం మాత్రమే మిగులుతుందని తేలింది. మానవులలో కనిపించే రెమినిసెన్స్ బంప్  అనే దృగ్విషయానికి ఈ జీవ ప్రక్రియే మూలకారణమని సైంటిస్టులు భావిస్తున్నారు. పెద్దయ్యాక మనకు టీనేజ్ అనుభవాలు ఎక్కువగా గుర్తుకురావడం వెనుక ఉన్న అసలు సీక్రెట్ ఇదేనని వారు స్పష్టం చేస్తున్నారు. ఈ ఆవిష్కరణ మానవ మెదడు వికాసంపై మనకున్న అవగాహనను పూర్తిగా మార్చివేస్తోంది. యుక్తవయస్సులో పాత జ్ఞాపకాలు తాత్కాలికంగా మసకబారడం వెనుక ఒక గొప్ప అంతర్లీన ప్రయోజనం ఉందనేది పరిశోధకుల అభిప్రాయం. చిన్ననాటి జ్ఞాపకాల కంటే, పెద్దయ్యే కొద్దీ ఎదురయ్యే కొత్త సవాళ్లు మరియు కొత్త జీవిత పరిస్థితులకు త్వరగా అలవాటు పడటానికి మెదడు పాత జ్ఞాపకాల యాక్సెస్‌ను తగ్గించి కొత్తవాటికి ప్రాధాన్యత ఇస్తుంది. మెదడు తను చేసే ఈ అద్భుతమైన వైరింగ్ సర్దుబాటు ద్వారానే మనుషులు వయస్సుతో పాటు కొత్త పరిజ్ఞానాన్ని, అనుభవాలను సులువుగా స్వీకరించగలుగుతున్నారు.       How brain maturation affects memory recall, Einstein study on adolescent brain memory changes.
    సిజోఫ్రెనియా వంటి తీవ్రమైన మానసిక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న రోగులకు  క్లోజాపైన్  అనే యాంటీసైకోటిక్ ఔషధం ఒక అత్యంత శక్తివంతమైన సంజీవనిలా పనిచేస్తుంది. ఇతర మందులకు లొంగని కఠినమైన వ్యాధి లక్షణాలను సైతం నియంత్రించడంలో ఇది ఎంతో ప్రభావవంతమైనదని వైద్య ప్రపంచం కొనియాడుతుంది. అయితే ఈ అద్భుతమైన మందు వాడే రోగులలో విపరీతమైన ఆకలి పెరగడం, తీవ్రమైన బరువు పెరగడం, కొలెస్ట్రాల్, ఫ్యాటీ లివర్ మరియు టైప్,2 డయాబెటిస్ వంటి జీవక్రియ సమస్యలు తలెత్తడం అత్యంత ప్రధానమైన లోపంగా మారింది. బరువు పెరుగుతామనే భయంతో లేదా శారీరక రుగ్మతల వల్ల చాలామంది రోగులు మధ్యలోనే ఈ మందును వాడటం ఆపివేసి, తిరిగి తీవ్రమైన మానసిక అనారోగ్యం బారిన పడుతున్నారు. దశాబ్దాలుగా వైద్యులను వేధిస్తున్న ఈ పెద్ద సమస్యకు పరిష్కారం కనుగొనే దిశగా అమెరికాలోని యుటి సౌత్‌వెస్టర్న్ మెడికల్ సెంటర్ శాస్త్రవేత్తలు సంచలనాత్మక పరిశోధనా వివరాలను ప్రముఖ  నేచర్ కమ్యూనికేషన్స్  జర్నల్‌లో ప్రచురించారు. శాస్త్రవేత్తల బృందం చేపట్టిన ఈ ప్రీక్లినికల్ అధ్యయనం ప్రకారం, క్లోజాపైన్ ఔషధం మెదడులోని ఆకలిని నియంత్రించే కేంద్రాలపై ఎలా ప్రతికూల ప్రభావం చూపుతుందో స్పష్టమైన సైంటిఫిక్ ఆధారాలతో బహిర్గతం చేసింది. మన మెదడులోని హైపోథాలమస్ ప్రాంతంలో ఉండే  మెలనోకార్టిన్ 4 రిసెప్టర్  లేదా MC4R నైరూప్య నాడీ కణాలు శరీరంలో ఆకలిని అణచివేసి, కడుపు నిండిన భావనను కలిగిస్తాయి. అయితే ఈ న్యూరాన్లలో  Kir7.1  అనే పొటాషియం ఛానల్స్ బ్రేకింగ్ సిస్టమ్‌లా పనిచేస్తాయి. క్లోజాపైన్ మరియు రిస్పెరిడోన్ వంటి మందులను శరీరానికి అందించినప్పుడు, అవి MC4R మరియు Kir7.1 మధ్య ఉన్న సంబంధాన్ని మరింత బలపరిచి, ఆకలిని నివారించే నాడీ వ్యవస్థ కార్యకలాపాలను పూర్తిగా నిష్క్రియం చేస్తున్నాయని పరిశోధకులు గుర్తించారు. దీనివల్ల మెదడు ఆకలి సంకేతాలను ఆపలేక రోగులు ముఖ్యంగా రాత్రి వేళల్లో మితిమీరి ఆహారం తీసుకునేలా ప్రేరేపించబడుతున్నారు. ఈ పరిశోధనలో భాగంగా ఎలుకలపై నిర్వహించిన ప్రయోగాలలో, 12 వారాల పాటు క్లోజాపైన్ మందును అందించినప్పుడు ఎలుకలు విపరీతంగా ఆహారాన్ని తిని, కొవ్వు పెరిగి, ఫ్యాటీ లివర్ మరియు ఇన్సులిన్ నిరోధకతను సంతరించుకున్నాయి. మెదడులోని ఈ సంకేత వ్యవస్థను పునరుద్ధరించడానికి శాస్త్రవేత్తలు Setmelanotide మరియు ML418 అనే ప్రయోగాత్మక మందులను పరీక్షించారు. Kir7.1 పొటాషియం ఛానల్ బ్లాకర్ ఆధారిత చికిత్సను అందించినప్పుడు ఎలుకలలో ఆహార వినియోగం తగ్గి, బరువు గణనీయంగా నియంత్రణలోకి వచ్చింది. అత్యంత ఆసక్తికరమైన విషయమేమిటంటే, ఈ ఆకలి అణచివేసే మార్గాన్ని బ్లాక్ చేయడం వల్ల క్లోజాపైన్ యొక్క అసలైన మానసిక చికిత్స సామర్థ్యం లేదా సైకోసిస్ నియంత్రణ శక్తి కొంచెం కూడా తగ్గకపోవడం గమనార్హం. ఈ నూతన పరిశోధన భవిష్యత్తులో మానసిక రోగుల సంరక్షణలో ఒక విప్లవాత్మక మార్పుకు నాంది పలకనుంది. క్లోజాపైన్ వాడే బాధితులు మానసికంగా కోలుకుంటూనే, శారీరక బరువు మరియు జీవక్రియ రుగ్మతల బారిన పడకుండా కాపాడే కొత్త కాంబినేషన్ ఔషధాల తయారీకి ఈ అధ్యయనం పునాది వేసింది. డాక్టర్ చెన్ ల్యూ నాయకత్వంలోని శాస్త్రవేత్తల బృందం వెల్లడించిన ఈ బ్రెయిన్ సిగ్నలింగ్ మెకానిజం, ప్రపంచవ్యాప్తంగా సిజోఫ్రెనియా రోగులకు మెరుగైన, సురక్షితమైన ఉజ్జ్వల భవిష్యత్తును ప్రసాదించబోతోంది. A southwestern study on clozapine side effects,brain pathway explains antipsychotic weight gain.
వాతావరణ మార్పులు, జలుబు, ఇన్ఫెక్షన్లు లేదా సైనస్ సమస్యల వల్ల శ్వాసనాళాల్లో చిక్కటి కఫం పేరుకుపోతుంటుంది. దీనివల్ల శ్వాస తీసుకోవడం కష్టంగా మారడమే కాకుండా నీరసం, గొంతు బొంగురుపోవడం వంటి సమస్యలు ఎదురవుతాయి. సాధారణంగా దీని ఉపశమనం కోసం యాంటీబయోటిక్స్ లేదా ఇతర మందులు వాడుతుంటారు, కానీ ఇవి ప్రతిసారీ ఆశించిన ఫలితాన్ని ఇవ్వకపోగా శరీరానికి హాని కలిగించే అవకాశం ఉంది. ఔషధాల ప్రమేయం లేకుండా, ఇంట్లోనే  రెండు  ప్రభావవంతమైన పద్ధతుల ద్వారా కొన్ని నిమిషాల్లోనే కఫం నుంచి ఉపశమనం పొందవచ్చు. వైద్యులు రికమెండ్ చేస్తున్న ఈ చిట్కాలు ఏమిటో తెలుసుకుంటే.. హెర్బల్ స్టీమ్.. సాధారణ నీటి ఆవిరి పట్టుకోవడం వల్ల శ్వాసనాళాలు కాసేపు రిలాక్స్ అవుతాయి కానీ.. గట్టిగా ఉన్న కఫం కరగదు. నీటిలో కొన్ని రకాల సహజ మూలికలను చేర్చి ఆవిరి పట్టినప్పుడు, ఆ ఆవిరి ఊపిరితిత్తుల లోతుల్లోకి వెళ్లి కఫాన్ని సులభంగా కరిగిస్తుంది. కావాల్సిన పదార్థాలు.. పుదీనా ఆకులు.. 10 నుండి 12 తులసి ఆకులు..  10 నుండి 12 హిమాలయన్ పింక్ సాల్ట్..  1 టీస్పూన్ తురిమిన అల్లం..  అర అంగుళం నీరు.. ఆవిరి రావడానికి సరిపడా ఇందులోని పదార్థాల ప్రత్యేకత..  పుదీనాలో ఉండే మెంతోల్ శ్వాసనాళాలను తెరిచి కఫాన్ని పలుచన చేస్తుంది.  తులసిలోని యాంటీమైక్రోబయల్ గుణాలు ఇన్ఫెక్షన్ కలిగించే సూక్ష్మజీవులను నశింపజేసి, వాపును తగ్గిస్తాయి.  హిమాలయన్ ఉప్పు కఫాన్ని కరిగించడానికి తోడ్పడతుంది.   అల్లం గొంతు మంటను తగ్గించి శ్వాసకోశాల్లోని వ్యర్థాలను బయటకు పంపడానికి సహాయపడుతుంది. తయారీ , ఉపయోగించే విధానం.. ఒక పాత్రలో నీటిని తీసుకుని బాగా మరిగించాలి. స్టవ్ ఆపివేసిన తర్వాత, ఆ వేడి నీటిలో పుదీనా, తులసి ఆకులు, హిమాలయన్ సాల్ట్ , తురిమిన అల్లం వేయాలి. వెంటనే పాత్రపై ఒక టవల్ మూసి రెండు నిమిషాల పాటు ఉంచాలి. దీనివల్ల ఆ మూలికలలోని ఆరోమాటిక్ ఆయిల్స్ నీటిలోకి విడుదలవుతాయి. ఆ తర్వాత పాత్ర మూత తీసి, ముఖాన్ని   తగినంత దూరంలో ఉంచి, తలను టవల్‌తో లేదా దుప్పటితో  కప్పుకోవాలి. ముక్కు , నోటి ద్వారా లోతుగా శ్వాస తీసుకుంటూ 5 నుండి 10 నిమిషాల పాటు ఆవిరిని పీల్చాలి. రోజుకు ఒకటి లేదా రెండు సార్లు ఈ విధంగా చేయడం వల్ల శ్వాసకోశాల్లో పేరుకుపోయిన కఫం త్వరగా కరిగిపోతుంది. డీప్ ఎక్స్‌పాన్షన్ బ్రీతింగ్ వ్యాయామం.. ఆవిరి పద్ధతితో పాటు డీప్  ఎక్స్‌పాన్షన్ ప్రత్యేక శ్వాస వ్యాయామాన్ని కలిపి చేసినప్పుడు ఫలితం మరింత వేగంగా ఉంటుంది. ఇది ఊపిరితిత్తుల లోపలి భాగాల్లో చిక్కుకున్న కఫాన్ని పైకి నెట్టి, సులభంగా బయటకు వచ్చేలా చేస్తుంది. చేసే విధానం.. మొదట ఒక కుర్చీలో నిటారుగా, శరీరాన్ని ప్రశాంతంగా ఉంచి కూర్చోవాలి. ముక్కు ద్వారా శ్వాసను ఎంత వీలైతే అంత లోతుగా లోపలికి తీసుకోవాలి. శ్వాస తీసుకున్న తర్వాత, దానిని 3 నుండి 4 సెకన్ల పాటు ఊపిరితిత్తుల్లోనే పట్టి ఉంచాలి. ఇలా చేయడం వల్ల ఊపిరితిత్తుల్లో ఒత్తిడి పెరిగి, నాళాలకు అతుక్కుపోయిన కఫం వదులవుతుంది. తరువాత పెదవులను కొవ్వొత్తిని ఊదుతున్నట్లుగా చిన్నగా చేసి, నోటి ద్వారా గాలిని బలంగా బయటకు వదలాలి. ఈ పద్ధతిని వరుసగా 5 నుండి 7 సార్లు పునరావృతం చేయాలి. ఇది ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని పెంచడమే కాకుండా శ్వాసనాళాలను శుభ్రపరుస్తుంది. ముగింపు.. జలుబు, దగ్గు లేదా మొండి కఫంతో బాధపడుతున్నప్పుడు ఈ రెండు సహజ పద్ధతులను క్రమం తప్పకుండా పాటించడం వల్ల ఎలాంటి మందుల అవసరం లేకుండానే ఊపిరితిత్తులు శుభ్రపడి, హాయిగా శ్వాస తీసుకోగలుగుతారు.                           *రూపశ్రీ.    
రోజూ తినే ఆహారం సరిగ్గా జీర్ణం కావడం లేదా? గ్యాస్, అజీర్తి, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు ఇబ్బంది పెడుతున్నాయా? అలాంటి వారికి శొంఠి పొడి (ఎండు అల్లం పొడి) ఉపయోగకరంగా ఉంటుందని ఆయుర్వేదంలో చెబుతారు. అయితే శొంఠిని సరైన మోతాదులో, సరైన విధంగా తీసుకోవడం చాలా ముఖ్యం. తాజా అల్లంతో పోలిస్తే ఎండు అల్లం లేదా శొంఠికి కొన్ని ప్రత్యేకమైన లక్షణాలు ఉంటాయి. ముఖ్యంగా జీర్ణక్రియకు శొంఠి ఎలా సహాయపడుతుంది? మజ్జిగలో పావు టీస్పూన్ శొంఠి పొడిని కలిపి తీసుకోవడం వల్ల ఏమైనా ప్రయోజనాలు ఉన్నాయా? పిల్లల నుంచి పెద్దల వరకు శొంఠిని ఎలా ఉపయోగించాలి? ఏ ఆహార పదార్థాలతో కలిపి తీసుకుంటే మంచిది? ఈ విషయాలపై ప్రముఖ ఆయుర్వేద నిపుణులు డాక్టర్ చిట్టిబొట్ల మధుసూదన్ శర్మ వివరించారు. శొంఠి పొడి వల్ల కలిగే ప్రయోజనాలు, తీసుకునే సరైన విధానం, మోతాదు వంటి ముఖ్యమైన విషయాలను ఈ వీడియోలో తెలుసుకోండి. గ్యాస్, అజీర్తి, బ్లోటింగ్ వంటి జీర్ణ సంబంధిత సమస్యలతో బాధపడేవారు శొంఠిని ఆహారంలో ఎలా చేర్చుకోవచ్చో తెలుసుకోవడానికి ఈ వీడియోను పూర్తిగా చూడండి. గమనిక: ఆరోగ్య సమస్యలు ఉన్నవారు ఏదైనా ఇంటి చిట్కా లేదా ఆయుర్వేద పదార్థాన్ని క్రమం తప్పకుండా ఉపయోగించే ముందు వైద్య నిపుణుల సలహా తీసుకోవడం మంచిది. మీ ఆరోగ్య సమస్య ఏదైనా... మా హెల్త్ యూట్యూబ్ ఛానల్‌లో సీనియర్ డాక్టర్స్ చెప్పిన సలహాలు... సూచనలు ఉన్నాయి. మా యూట్యూబ్ ఛానల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి  TeluguOne Health (సబ్‌స్క్రైబ్ చేయడం మర్చిపోకండి!)
50 తర్వాత వృద్ధాప్యం ఎందుకు వేగంగా కనిపిస్తుంది? 30 నుంచి 50 ఏళ్ల మధ్య శరీరంలో, చర్మంలో జరిగే మార్పులకు అసలు కారణాలు ఏమిటి? కొల్లాజెన్, Vitamin D లోపం వృద్ధాప్యంపై ఎలాంటి ప్రభావం చూపుతాయి? ఇవి ఆహారం ద్వారా మాత్రమే అందుకోవచ్చా? లేక supplements అవసరమా? ప్రముఖ బ్యూటీ ఎక్స్‌పర్ట్, Celebrity Medical Aesthetic Specialist డాక్టర్ శ్రీ సత్య జగదీష్ ఈ వీడియోలో వయసు పెరిగే కొద్దీ శరీరంలో వచ్చే ముఖ్యమైన మార్పుల గురించి వివరిస్తున్నారు. ముఖ్యంగా Hormonal Imbalance, Collagen తగ్గడం, Vitamin D, Zinc, Omega nutrients వంటి అంశాలు ఆరోగ్యం, చర్మం మరియు వృద్ధాప్య ప్రక్రియపై ఎలా ప్రభావం చూపుతాయో సులభంగా తెలియజేస్తున్నారు. 30 నుంచి 50 ఏళ్ల మధ్య ఆరోగ్యం, చర్మ సౌందర్యం, పోషకాహారం విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? కొల్లాజెన్, Vitamin D వంటి పోషకాలు ఆహారం నుంచే సరిపోతాయా? Supplements ఎప్పుడు అవసరం కావచ్చు? ఈ ప్రశ్నలకు డాక్టర్ చెప్పిన ముఖ్యమైన సూచనలు ఈ వీడియోలో తెలుసుకోండి. వయసు పెరగడం సహజమే అయినా, సరైన ఆహారం, పోషకాలు మరియు ఆరోగ్యకరమైన జీవనశైలితో శరీరంలో వచ్చే మార్పులను సమర్థంగా నిర్వహించుకోవచ్చు. పూర్తి వివరాల కోసం వీడియోను చూడండి. మీ ఆరోగ్య సమస్య ఏదైనా... మా హెల్త్ యూట్యూబ్ ఛానల్‌లో సీనియర్ డాక్టర్స్ చెప్పిన సలహాలు... సూచనలు ఉన్నాయి. మా యూట్యూబ్ ఛానల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 👉 TeluguOne Health (సబ్‌స్క్రైబ్ చేయడం మర్చిపోకండి!)