తెలంగాణ రాజయాలలో పెను సంచలనంగా మారిన కొండా సురేఖ ఎపిసోడ్ లో అనూహ్య ట్విస్ట్ చోటు చేసుకుంటోందా? కేబినెట్ నుంచి కొండా సురేఖకు ఉద్వాసన పలికిన తరువాత.. ఆమె పార్టీకి రాజీనామా చేయకపోవడానికి హస్తిన స్థాయిలో ఆమెకు దక్కిన హామీలే కారణమా? ఆమె విషయంలో కాంగ్రెస్ అధిష్ఠానం సాఫ్ట్ కార్నర్ తో ఉందా? అంటే తాజాగా జరుగుతన్న ప్రచారాన్ని బట్టి ఔననే సమాధానమే వస్తున్నది. కేబినెట్ నుంచి ఉద్వాసనకు గురైన కొండా సురేఖకు కేబినెట్ హోదాతో కీలక పదవిని అప్పగించే అవకాశాలున్నాయన్న ప్రచారం జరుగుతోంది.  ఈ విషయమై కొండా సురేఖకు పార్టీ హైకమాండ్ నుంచి స్పష్టమైన హామీ లభించినట్లు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఆమె హైకమాండ్ పిలుపు మేరకుఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారని విశ్వసనీయంగా తెలుస్తోంది.  గతంలో కొండా సురేఖ కుమార్తె సుస్మిత చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు, అలాగే సీఎం రేవంత్ రెడ్డితో కొండా సురేఖకు ఏర్పడిన విభేదాల కారణంగా.. క్రమశిక్షణ చర్య అంటూ ఆమెకు రేవంత్ కేబినెట్ నుంచి ఉద్వాసన పలికిన సంగతి తెలిసిందే. సాధారణంగా కాంగ్రెస్ రాజకీయాలలో ఇటువంటి కఠిన చర్య చాలా అరుదు. దీంతో కొండా సురేఖకు కేబినెట్ నుంచి ఉద్వాసన పలకడం పార్టీ వర్గాలలో సంచలనంగా మారింది.   అయితే,   సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న నాయకురాలిగా  కొండా సురేఖను పూర్తిగా దూరం పెట్టడం మంచిది కాదని భావించిన హైకమాండ్.. కేబినెట్ మంత్రిగా ఉద్వాసనకు గురైన ఆమెకు మరో కీలక పదవిని అప్పగించడం ద్వారా ఆమె గౌరవానికి భంగం కలగకుండా ఆమె సేవలను పార్టీకి అందేలా చేయాలని నిర్ణయించిందని చెబుతున్నారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న సమాచారం మేరకు కొండా సురేఖకు ఆర్టీసీ చైర్మన్ పదవిని ఆఫర్ చేసే     అవకాశం ఉందని తెలుస్తోంది ఆర్టీసీ చైర్మన్ పదవికి   కేబినెట్ హోదా  ఉండటంతో ఆమె గౌరవానికి తగిన పదవి అవుతుందని పార్టీ వర్గాలు అంటున్నాయి.   కేబినెట్ నుంచి ఉద్వాసనకు గురైనప్పటికీ..  కొండా సురేఖ   పార్టీ నాయకత్వంపై  దుందుడుకుగా ఎటువంటి విమర్శలు, వ్యాఖ్యలూ చేయలేదు. ఆమె సహజ వైఖరికి ఇది పూర్తి విరుద్ధం.  రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయడమే తన అంతిమ లక్ష్యమని కస్పష్టం చేసిన సురేఖ.. తనకు అవమానం జరిగినా..  తాను కాంగ్రెస్ ను వీడే ప్రశక్తే లేదని స్పష్టం చేసిన విషయం తెలిసిందే.   కేవలం తన పదవి కోల్పోవడం పట్ల కాకుండా, సరైన కారణం లేకుండా తనను తప్పించారనే చిన్న అసంతృప్తి ఉన్న మాట వాస్తవమేనన్న కొండా సురేఖ.. ఆ అసంతృప్తి వినా.. పార్టీని వీడాలన్న యోచన తనలో ఇసుమంతైనా లేదని స్పష్టం చేశారు. ఆమెఅనుసరించిన ఈ వైఖరే కొండా పట్ల హైమాండ్ లో సాఫ్ట్ కార్నర్ ఏర్పడటానికి కరాణంగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.    [Konda Surekha, Telangana Congress Politics, Cabinet Rank Post,  RTC Chairman, Revanth Reddy, Telugu One]
బీసీలపై కపట ప్రేమ ఎందుకు? కేసీఆర్‌ను నిలదీసిన పీసీసీ చీఫ్..! తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం సరికొత్త చర్చనీయాంశంగా మారిన పరిణామంలో, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు సంచలన సవాల్ విసిరారు. మాక్ అసెంబ్లీలు పెట్టి బీసీ నేతకు ముఖ్యమంత్రి స్థానం కల్పించడం కేవలం డ్రామాలని, నిజంగా దమ్ముంటే బీసీ వర్గానికి చెందిన సీనియర్ నేత తలసాని శ్రీనివాస్ యాదవ్‌ను అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. గాంధీభవన్‌లో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడిన మహేష్ కుమార్ గౌడ్, కేసీఆర్ అసెంబ్లీ సమావేశాలకు హాజరుకాకపోవడాన్ని తీవ్రంగా తప్పుపట్టారు.  ఎలాగో బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ సభకు రారూ కదా, మరి బీసీలు  ఎస్సీలపై ఈ కపట ప్రేమ ఎందుకని ఆయన సూటిగా ప్రశ్నించారు. ఒకవేళ కేసీఆర్ తన స్థానంలో తలసాని శ్రీనివాస్ యాదవ్‌కు ప్రతిపక్ష నేత బాధ్యతలు అప్పగిస్తే, ఆయనపై ఉన్న సస్పెన్షన్‌ను కూడా ఎత్తివేయించడానికి కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆయన స్పష్టం చేశారు. కేవలం రాజకీయ లబ్ధి కోసం, ఓట్ల కోసం మాయమాటలు చెబుతూ దళితులు, బీసీలను మోసం చేయడం బీఆర్ఎస్‌కు అలవాటుగా మారిందని విమర్శించారు. దళితుల గురించి మాట్లాడే నైతిక హక్కు కేసీఆర్ కు ఏమాత్రం లేదని మహేష్ కుమార్ గౌడ్ గట్టిగా ఆరోపించారు. గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో దళితుడిని ముఖ్యమంత్రి చేస్తామని ఇచ్చిన మాటను కేసీఆర్ తప్పుగా మలిచారని, మూడెకరాల భూమి పంపిణీ గానీ, ప్రతిష్టాత్మకమైన దళిత బంధు పథకం అమలును గానీ పూర్తిగా విస్మరించారని గుర్తుచేశారు. కేవలం ఎన్నికల సమయంలో అంబేద్కర్ విగ్రహాలు పెట్టడం సరికాదని, ఆయన ఆశయాలను, సూచనలను నిజ జీవితంలో పాటించాలని హితవు పలికారు.  నాటి TRS 2003 డాక్యుమెంట్‌ను కూడా సరిగా పట్టించుకోని చరిత్ర బీఆర్ఎస్ నాయకులదని విమర్శించారు. దళితులు నడిచిన నేలను శుద్ధి చేస్తామనడం సరికాదని, ముందుగా తమ బుర్రలోని పాత, కుహనా ఆలోచనలను శుద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉందని ఆయన చురకలంటించారు. కాలం మారిపోయిందని, నేడు దళితులు నగరాలకు వచ్చి ఉన్నత స్థాయికి చేరుకున్నారని, కాలం చెల్లిన దొరలను ప్రజలు ఫామ్ హౌస్‌లకు పరిమితం చేశారని ఆయన ఎద్దేవా చేశారు. పదేళ్ల పాటు అధికారంలో ఉండి దళితులకు, వెనుకబడిన వర్గాలకు తీవ్రమైన అవమానాలు జరిగినా కేసీఆర్ నుంచి ఎన్నడూ సరైన స్పందన రాలేదని మహేష్ కుమార్ గౌడ్ ఆరోపించారు. అసెంబ్లీలో దళిత స్పీకర్‌ను చూసి 'అధ్యక్షా' అనాల్సి వస్తుందనే భయంతోనే కేసీఆర్ సభకు రాకుండా ఫామ్ హౌస్‌కే పరిమితం అయ్యారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఎలాంటి స్పష్టమైన విజన్ లేకుండా రాష్ట్రాన్ని పాలించి, రాష్ట్రాన్ని తీవ్రమైన అప్పులపాలు చేశారని మండిపడ్డారు.  అయినప్పటికీ గత ప్రభుత్వం చేసిన అప్పులకు వడ్డీలు కడుతూనే, మరోవైపు ప్రజా సంక్షేమ పథకాలను విజయవంతంగా అమలు చేస్తున్నామని స్పష్టం చేశారు. మిగిలిన రెండున్నరేళ్ల పాలనా కాలంలో ప్రజలకు ఇచ్చిన ప్రతి ఒక్క ఎన్నికల హామీని కచ్చితంగా నెరవేర్చి తీరుతామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఇదే సమయంలో రాష్ట్ర ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలుపుతూ పీసీసీ చీఫ్ తన ప్రసంగాన్ని ముగించారు.       [ MLC Mahesh Kumar Goud, Talasani Srinivas Yadav, KCR, PCC Chief, BRS, Congress,  BRS, CM Revanth reddy, KCR, KTR, Telugu One, Telugu News ]
మాజీ మంత్రి కొండా సురేఖకు మద్దతుగా అభిమానులు, కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో వరంగల్‌కు తరలివచ్చారు. కొండా కుటుంబానికి తమ పూర్తి మద్దతు ఉంటుందని కార్యకర్తలు స్పష్టం చేశారు. ఈ సందర్భంగా కొండా మురళి కీలక వ్యాఖ్యలు చేశారు.“కాంగ్రెస్ పార్టీని వీడేది లేదు” అని కొండా మురళి స్పష్టం చేశారు. రానున్న కార్పొరేషన్ ఎన్నికల్లో గెలిచే సత్తా ఉన్న వారికే టికెట్లు ఇస్తామని ఆయన పేర్కొన్నారు. ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా పనిచేస్తామని తెలిపారు. ఇదిలా ఉండగా.. కొండా సురేఖకు మద్దతుగా వచ్చిన కార్యకర్తలు ప్రత్యర్థులపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.  “కొండాను ఢీకొట్టడం ఈ గొర్రెల వల్ల కాదు” అంటూ వ్యాఖ్యానించారు. కొన్ని గొర్రెలు, గుంటనక్కలు అన్నీ ఒక్కటై కొండాను ఢీకొట్టాలని చూస్తున్నాయని, అయితే అది సాధ్యం కాదని అన్నారు. ఈ సందర్భంగా కార్యక ర్తలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. “పులి.. పులి.. పులి.. బెబ్బులి.. కొండా మురళి వేట పులి” అంటూ నినాదాలతో హోరెత్తించారు. కొండా కుటుంబానికి తాము ఎల్లప్పుడూ అండగా ఉంటామని కార్యకర్తలు తెలిపారు. “మీరు నక్సల్స్‌లోకి వెళ్తే.. మీతోనే నక్సల్స్‌లోకి వస్తాం” అంటూ కొండా మురళికి, కొండా సురేఖకు అభయం ఇచ్చారు. కొండా కుటుంబం విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకున్నా తమ మద్దతు ఉంటుందని కార్యకర్తలు స్పష్టం చేశారు. తాజా పరిణా మాలతో స్థానికంగా కొండా వర్గం రాజకీయంగా మరోసారి చర్చనీయాంశంగా మారింది.       [ Konda Murali, Konda Surekha, Congress party, Warangal, CM Revanth reddy, Konda sushmitha, Telugu One, Telugu News]  
ALSO ON TELUGUONE N E W S
Nani’s The Paradise is getting another major boost from its music, with Yasha Nagula turning into a viral sensation within days of its release. The second single has crossed 100 million views and 705K likes, reportedly becoming the fastest Telugu song to reach the milestone. The song’s appeal comes largely from its Telangana folk flavour, which has been given a contemporary treatment by Anirudh Ravichander. Lyrics by Kasarla Shyam, combined with the voices of folk artists, have given Yasha Nagula a distinctly rooted sound while retaining the mass energy expected from a big-screen action film. The track has remained at the No. 1 trending position globally since its release, while the glimpses featuring Nani and Keerthy Suresh have added to the buzz. Interestingly, Anirudh is now finding himself competing with his own numbers, as Aaya Sher, the film’s first single, has already crossed 200 million views. The musical momentum is arriving at an important stage for The Paradise, which is heading for a September 24 worldwide release. Directed by Srikanth Odela, the film stars Nani alongside Mohan Babu, Kayadu Lohar and Raghav Juyal, with Sudhakar Cherukuri producing the project. With the songs already creating a strong digital footprint, the film’s theatrical expectations are naturally getting bigger. Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them. 
ప్రముఖ దర్శకుడు ప్రశాంత్ నీల్ సమర్పణలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న మోస్ట్ అవైటెడ్ హారర్ థ్రిల్లర్ '418' మూవీ రిలీజ్ సడన్‌గా వాయిదా పడింది. ప్రశాంత్ నీల్ శిష్యుడు కీర్తన్ నాదగౌడ దర్శకత్వంలో వస్తున్న ఈ మూవీ ట్రైలర్ హారర్ లవర్స్ ని ఆకట్టుకుంది. "ఇన్నాళ్లూ హారర్ సినిమాల్లో కామెడీ చూసి నవ్వుకున్నది చాలు.. ఇక నుంచి నిజమైన భయం అంటే ఏంటో చూస్తారు" అని మేకర్స్ సవాల్ విసరడమే కాకుండా, సెన్సార్ బోర్డ్ నుండి 'A' సర్టిఫికేట్ సాధించి అందరిలో తీవ్ర ఉత్కంఠను పెంచేశారు. ఇటీవల ఈ సినిమాకు సంబంధించి ఫిల్మ్ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులకు, కొందరు ప్రత్యేక ప్రేక్షకులకు ఎక్స్‌క్లూజివ్ ప్రివ్యూ షోలు వేశారు. అలాగే నార్త్ ఇండియాకు చెందిన ప్రముఖ హిందీ ఎగ్జిబిటర్లు కూడా ఈ సినిమాను ప్రత్యేకంగా వీక్షించారు. సినిమా చూసిన ప్రతి ఒక్కరూ మైండ్ బ్లాక్ అయ్యే రెస్పాన్స్ ఇచ్చారు. ముఖ్యంగా బాలీవుడ్ ఎగ్జిబిటర్స్ అయితే.. "ఈ రేంజ్ హారర్ కంటెంట్‌ను కేవలం సౌత్ లాంగ్వేజెస్‌కే పరిమితం చేస్తే ఎలా? హిందీలో కూడా పాన్ ఇండియా లెవెల్లో గ్రాండ్‌గా రిలీజ్ చేయాల్సిందే" అని మేకర్స్‌కు సూచించారట. హిందీ బెల్ట్‌లో సరైన ప్రాపర్ హారర్ సినిమాలకు ఉన్న డిమాండ్ తెలిసిందే. ఉత్తరాది ఎగ్జిబిటర్ల నుండి వచ్చిన ఈ అనూహ్య స్పందనతో మైత్రీ మూవీ మేకర్స్, ప్రశాంత్ నీల్ ఆలోచనలో పడ్డారు. ఒక గొప్ప కంటెంట్‌ను తక్కువ స్కేల్‌లో రిలీజ్ చేయడం కంటే, కొద్ది రోజులు టైమ్ తీసుకుని దేశవ్యాప్తంగా అన్ని భాషల్లో ఒకేసారి భారీగా విడుదల చేస్తే రేంజ్ వేరేలా ఉంటుందని భావించారు. అందుకే మేకర్స్ అధికారికంగా ప్రకటిస్తూ.. "మీ నిరీక్షణ కాస్త పెరిగినా, '418' అనుభవం మాత్రం అంతకు మించిన గ్రాండ్ రేంజ్‌లో ఉండబోతోంది" అని స్పష్టం చేశారు. అన్ని ప్రాంతాల మార్కెట్లలో విస్తృతంగా ప్రమోషన్స్ నిర్వహించి, సరికొత్త విడుదల తేదీని త్వరలోనే అనౌన్స్ చేయనున్నారు.       [418 Movie Postponed, 418 Pan India Release, 418 Release Date, Prashanth Neel, Mythri Movie Makers, Kirtan Nadagouda, Telugu Film News, Telugu News]  
  గాడ్ ఆఫ్ మాసెస్ బాలకృష్ణ 'దాదా' తర్వాత చేయబోయే మూవీ కొరటాల శివతో అని అనౌన్స్ మెంట్ రావడంతో ఫ్యాన్స్ ఆనందం అంతా ఇంతా కాదు. కమర్షియల్ టచ్ కి సోషల్ మెసేజ్ ని నింపడంలో కొరటాల సిద్ధహస్తుడు కావడంతో స్టోరీతో పాటు బాలకృష్ణ క్యారక్టర్ పై ఫ్యాన్స్ తో పాటు మూవీ లవర్స్ పలురకాల కథల్ని ఊహించుకోవడం స్టార్ట్ చేసారు.    అంతేకాకుండా, ఈ చిత్రానికి సౌత్ రాక్‌స్టార్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నట్లు వార్తలు రావడంతో అంచనాలు స్థాయి కూడా పెరిగింది. అయితే, గత కొన్ని రోజులుగా సోషల్ మీడియా వేదికగా ఈ సినిమా ఆగిపోయిందంటూ అనేక రూమర్లు చక్కర్లు కొడుతున్నాయి. సుమారు రూ. 150 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మించడానికి ప్రణాళికలు సిద్ధం చేయగా, బాలకృష్ణ గారు ఇటీవల బడ్జెట్ మరియు కమర్షియల్ సేఫ్టీ విషయాల్లో మరింత జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారనే ప్రచారం మొదలైంది. రూ. 100 కోట్ల పరిధిలోనే ప్రాజెక్టులు పూర్తి చేయాలని ఆలోచిస్తున్నారని, అందుకే రూ. 150 కోట్ల బడ్జెట్ హర్డిల్ కారణంగా కొరటాల శివ సినిమాపై అనిశ్చితి ఏర్పడిందని వార్తలు వ్యాపించాయి. ఈ పుకార్లతో నందమూరి అభిమానులు తీవ్ర ఆందోళనకు గురై, సినిమా అప్‌డేట్ వెంటనే ఇవ్వాలని నెట్టింట డిమాండ్ చేయడం ప్రారంభించారు.         Also Read: జై జై రామ్ సాంగ్: ఎందుకిలా చేసారు? ఉన్న అర్హత ఏంటి! అయితే అదే సమయంలో బాలయ్య డై హార్డ్ ఫాన్స్ కూడా సోషల్ మీడియా వేదికగా స్పందిస్తు' అనవసరమైన రూమర్లని  నమ్మవద్దని, త్వరలోనే అధికారిక ఫస్ట్ లుక్ లేదా టైటిల్ అనౌన్స్‌మెంట్ అప్‌డేట్ రాబోతోందని సమాచారం.ఏది ఏమైనా బాక్స్ ఆఫీస్ కూడా కొత్తగా బరిలోకి దిగబోతున్న ఒంగోలు గిత్తలా బాలయ్య, కొరటాల మూవీ కోసం కాసుకొని కూర్చుంటుందనేది పక్కా.         [Balakrishna, Koratala Siva, , NBK112 , Fans Demand, Telugu Cinema, Telugu Cinema  News, Tollywood Cinema News, Tollywood]  
భవ్య శ్రీ మూవీ మేకర్స్, నక్కిన నెరేటివ్స్ బ్యానర్ల మీద కాండ్రేగుల నాయుడు, త్రినాథరావు నక్కిన నటిస్తూ, నిర్మించిన రా అండ్ రస్టిక్‌ చిత్రం ‘అనకాపల్లి’. ఈ మూవీలో విక్రమ్ సహిదేవ్, సంధ్యా వశిష్ట, తారక్ పొన్నప్ప ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమాకి ఖగేష్ తమ్మినేని దర్శకత్వం వహించారు. ఇప్పటికే విడుదల చేసిన పాటలు, టీజర్, ట్రైలర్‌లు సినిమాపై అంచనాల్ని పెంచేశాయి. ఇక ఆగస్ట్ నెలలోనే ఈ మూవీని అనకాపల్లి ప్రజలకు ప్రత్యేకంగా ప్రదర్శించారు. ‘అనకాపల్లి’ సినిమాని అనకాపల్లి ప్రజలు వీక్షించి అద్భుతమైన రెస్సాన్స్‌ను అందించారు. ఈ మూవీని తెలుగులో పాటుగా తమిళంలోనూ భారీ ఎత్తున విడుదల చేసేందుకు మేకర్స్ రెడీ అయ్యారు. అక్టోబర్ 2న ఈ చిత్రాన్ని విడుదల చేయబోతోన్నట్టుగా మేకర్స్ ప్రకటించారు. ఈ మేరకు విడుదల చేసిన రిలీజ్ డేట్ పోస్టర్ అందరినీ ఆకట్టుకుంటోంది. ప్రధాన పాత్రల్ని చూపిస్తూ వినాయక చవితి సందర్భంగా రిలీజ్ చేసిన ఈ పోస్టర్ ఇప్పుడు అందరిలోనూ మరింత ఇంట్రెస్ట్‌ను క్రియేట్ చేస్తోంది. మైత్రి మూవీ డిస్ట్రిబ్యూషన్, పూర్వి డిస్ట్రిబ్యూషన్స్ సంస్థలు కలిసి ఈ సినిమాని అక్టోబర్ 2న గ్రాండ్‌గా రిలీజ్ చేయబోతోన్నాయి. ఈ చిత్రానికి మాయా.వి కెమెరామెన్‌గా, శ్రీకృష్ణ అత్తలూరి ఎడిటర్‌గా పని చేశారు. త్రినాథరావు నక్కిన కథ, స్క్రీన్ ప్లే అందించిన ఈ చిత్రానికి ఉదయ్ భాగవతులు డైలాగ్ రైటర్‌గా వర్క్ చేశారు.        [Anakapalli Release Date, Anakapalli on October 2, Anakapalli Movie Telugu, Trinadha Rao Nakkina, Vikram Sahidev, Telugu Film News, Telugu News]  
జ్యోతి పూర్వజ్, పూర్వాజ్ లీడ్ రోల్స్ లో నటిస్తున్న సై ఫై థ్రిల్లర్ మూవీ 'కిల్లర్'. మనీష్ గిలాడా, చంద్రకాంత్ కొల్లు, విశాల్ రాజ్, అర్చన అనంత్, గౌతమ్ చక్రధర్ కొప్పిశెట్టి ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాను థింక్ సినిమా, ఏయూ అండ్ ఐ స్టూడియోస్ బ్యానర్స్ పై పూర్వాజ్ , పద్మనాభ రెడ్డి నిర్మిస్తున్నారు. పూర్వాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. 'కిల్లర్' సినిమా అక్టోబర్ 30న రిలీజ్ రాబోతోంది. ఈ రోజు మహిళల కోసం 'కిల్లర్' మేకర్స్ 'సూపర్ షీ ఛాలెంజ్'ను అనౌన్స్ చేశారు. రాత్రికి రాత్రే మీకు సూపర్ పవర్ వస్తే ఏం చేస్తారో చెబుతూ రీల్స్ చేసి పంపితే వారిలో బెస్ట్ రీల్స్ చేసిన పది మందికి ఒక్కొక్కరికి 10 వేల రూపాయల చొప్పున క్యాష్ ప్రైజ్ ఇవ్వబోతున్నట్లు ప్రకటించారు. అలాగే తమ ఆన్సర్స్ ను టెక్ట్స్ మెసేజ్ పంపిన వారిలో బెస్ట్ ఆన్సర్స్ పంపిన 20 మంది ఒక్కొక్కరు 2 వేల రూపాయల చొప్పున క్యాష్ ప్రైజ్  అందుకోవచ్చు. త్వరలో జరగనున్న కిల్లర్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో విజేతలను వేదిక మీదకు పిలిచి ఈ క్యాష్ ప్రైజ్ అందిస్తారు. ఔత్సాహికులు తమ రీల్స్, టెక్ట్స్ మెసేజ్ లు హీరోయిన్ జ్యోతి పూర్వజ్ ఇన్ స్టాగ్రామ్ అక్కౌంట్ కు ట్యాగ్ చేసి, #SuperSHE #KilleR అనే హ్యాష్ ట్యాగ్స్ రాయాలి. ఈ వివరాలను వెల్లడిస్తూ హీరోయిన్ జ్యోతి పూర్వజ్ ఓ స్పెషల్ వీడియో రిలీజ్ చేశారు. ఓవర్సీస్ లో "కిల్లర్" మూవీ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఓఎంజి పిక్చర్స్ ఈ సినిమాను ఓవర్సీస్ డిస్ట్రిబ్యూట్ చేస్తోంది. ఈ సంస్థ "కిల్లర్" సినిమాను అమెరికా, యూరప్, కెనడా, అరబ్ దేశాలు, మలేషియా, న్యూజిలాండ్, రష్యా వంటి దేశాల్లో విడుదల చేయబోతోంది. https://www.instagram.com/reel/DdThJ8nzLPg/       [Killer Movie, Super She Challenge, Jyothi Poorvaj, Instagram, Sci Fi Thriller Telugu, KilleR, Telugu Film News, Telugu News]
      భారతీయ సినీ ప్రేమికులతో పాటు, రామభక్తులు కోటి ఆశలతో ఎదురుచూస్తున్న రామాయణకి కౌంట్ డౌన్ కి స్టార్ట్ అయ్యింది. ఇంకెంత మహా అయితే నెలన్న రోజులు.  దీంతో రిలీజ్ డేట్ నవంబర్ 6 వడివడిగా వస్తుండటంతో మేకర్స్ కూడా ప్రమోషన్స్ లో వేగం పెంచారు. ఈ క్రమంలోనే నిన్న వినాయకుడికి చవితి శుభాకాంక్షలు చెప్తూ  'జై జై రామ్' సాంగ్ ని మేకర్స్ రిలీజ్ చేసారు. అయితే 'సియారామ్ సియారామ్' అనే హుక్ లైన్ వెంటనే క్యాచ్ అయ్యేలా ఉంది. దీంతో ఇంతటి ప్రెస్టేజియస్ట్ పాటలో ఇప్పటికే చాలా భక్తి పాటల్లో వినిపించిన  'సియారామ్' ఫీల్ ని ఎందుకు నమ్ముకున్నారని, పరిచయమైన భక్తి సాంగ్ లాగానే ఉందనే విమర్శలు వస్తున్నాయి. ప్రశ్న ని సోషల్ మీడియా వేదికగా కొంత మంది లేవనెత్తుతున్నారు. ఏది ఏమైనా అందరకీ నచ్చాల్సిన అవసరం లేదు. కానీ సాంగ్ రిలీజైన కొద్దీ సేపటి నుంచే రికార్డు వ్యూస్ తో దూసుకుపోతుంది.   రామాయణ నుంచి రిలీజైన తొలి సాంగ్ కూడా కావడంతో పండగ మూడ్ లో కూడా అభిమానులు,సంగీత ప్రియులు జై జై రామ్'  సాంగ్ మూడ్ లో ఉండిపోయారు. రామ భక్తులైతే సోషల్ మీడియా వేదికగా స్పందిస్తు 'ఆస్కార్ విజేతలు ఏ.ఆర్. రెహమాన్ హన్స్ జిమ్మర్ సంగీత సారథ్యంలో రూపొందిన జై జై రామ్ వింటుంటే ఒక రకమైన ఆధ్యాత్మిక ప్రశాంతతను, మైమరిపించే భక్తి భావాన్ని అందిస్తోంది. డాక్టర్ కుమార్ విశ్వాస్ అందించిన అత్యద్భుతమైన సాహిత్యం భక్తి రసాన్ని పండించగా, భారతీయ సంగీత దిగ్గజాలు అరిజిత్ సింగ్ మరియు శ్రేయా ఘోషాల్ తమ అమృతతుల్యమైన గాత్రంతో ఈ పాటకు మరింత జీవం పోశారు.ఈ పాట కేవలం ఒక కమర్షియల్ సినిమా గీతంలా కాకుండా ఒక పవిత్రమైన ప్రార్థనలా ప్రారంభమై, శ్రోతలను నేరుగా రామరాజ్యపు ఆధ్యాత్మిక వాతావరణంలోకి తీసుకెళ్తుందనే అభిప్రయాన్ని వ్యక్తం చేస్తున్నారు.       Also Read: ఒంటిపై బట్టలు లేకుండా ఈ హీరోయిన్ ఏం చేసిందో తెలుసా!  సాంగ్ లో  విజువల్స్ పరంగా చూసుకుంటే  శ్రీరాముడిగా రణబీర్ కపూర్, సీతాదేవిగా సాయి పల్లవి తమ క్యారెక్టర్స్ లో ఒదిగిపోయిన తీరు ప్రేక్షకుల మనసులను హత్తుకుంటోంది. రణబీర్ కపూర్ దైవికమైన కాంతి, తేజస్సుతో మెరిసిపోతుండగా, సాయి పల్లవి సీతమ్మవారి పాత్రలో చూపించిన పవిత్రత మరియు సాత్వికమైన వ్యక్తీకరణలు ఈ వీడియోకు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. విఎఫ్ఎక్స్ (VFX), సిజిఐ (CGI) హంగుల కంటే కూడా భావోద్వేగాలకే ప్రాధాన్యతనిస్తూ దర్శకుడు నితిన్ తివారి ప్రతి ఫ్రేమ్‌ని  ఎంతో భక్తి  శ్రద్ధల తో రూపొందించినట్లు స్పష్టమవుతోంది.  ప్రపంచ సినీ ప్రేమికులని రామాయణ థియేటర్స్ కి తీసుకురావడమే లక్ష్యంగా రామాయణని నమిత్ మల్హోత్రా నిర్మించాడు.          [Ramayana,Jai Jai Ram Song Review, Ranbir Kapoor, Sai Pallavi, Namith Malhotra,Nitesh Tiwari, Telugu Cinema, Telugu Cinema  News, Tollywood Cinema News, Tollywood]  
'ఆ నలుగురు', 'మధుమాసం', 'అందరి బంధువయా', 'ఇదీ సంగతి', 'ఆటగదరా శివా' తదితర సినిమాలతో విలక్షణ దర్శకుడిగా తనకంటూ ఓ ప్రత్యేకతను సంపాదించుకున్నారు చంద్ర సిద్ధార్థ్. ఆయన తెరకెక్కించిన తాజా సినిమా 'ఈ పాట కోరినవారు నెమలిపాలెం నుండి రమ, జ్యోత్స్న, నందు, మురళి, కబీర్, ఢోల్ రవి మొదలగువారు'. ఎ ఫర్‌బిడెన్ రాగ ఫ్రమ్ ఎ ఫర్‌బిడెన్ సాగా... అనేది ఉపశీర్షిక. తెలుగు సినిమా చరిత్రలో అత్యంత పొడవైన టైటిల్‌తో వస్తున్న సినిమాగా రికార్డులకు ఎక్కింది. ప్రముఖ దర్శక రచయిత మదన్ అందించిన కథతో వై.వి.సత్యనారాయణ రాజు సమర్పణలో ఫిల్మోత్సవ్ పతాకంపై చంద్ర సిద్ధార్థ్ నిర్మించిన ఈ సినిమా సెప్టెంబర్ 18న విడుదల కానుంది. బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి చేతుల మీదుగా టీజర్ విడుదల చేశారు.  'ఈ పాట కోరినవారు..' టీజర్ విడుదల చేసిన అనిల్ రావిపూడి, సినిమా మంచి విజయం సాధించాలని ఆకాంక్షించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ''ఇంత పెద్ద టైటిల్‌తో సినిమా రావడం ఇంట్రెస్టింగ్‌గా ఉంది. చంద్ర సిద్ధార్థ్ గారి దగ్గర 'మధుమాసం', 'హౌస్‌ఫుల్', 'అందరి బంధువయా' చిత్రాలకు నేను స్క్రిప్ట్ విభాగంలో పని చేశాను. ఆయన సెన్సిబుల్ సినిమాలు తీశారు. పొడవాటి టైటిల్‌తో వస్తున్న ఈ సినిమా కూడా ప్రేక్షకుల ఆదరణ సొంతం చేసుకుంటుందని ఆశిస్తున్నాను'' అని చెప్పారు. దర్శక నిర్మాత చంద్ర సిద్దార్థ్ మాట్లాడుతూ... ''మా సినిమా టీజర్ విడుదల చేసిన అనిల్ రావిపూడి గారికి థాంక్స్. మేం అడిగిన వెంటనే ఓకే చెప్పారు. ఆయన బిజీ షెడ్యూల్‌లో మాకు కొంత టైమ్ ఇచ్చారు. ఆయనకు టైటిల్, టీజర్ నచ్చడం పాజిటివ్ సైన్. మాకు సంతోషంగా ఉంది. టైటిల్ రెస్పాన్స్ బావుంది. ఆడియన్స్ అందరిలో సినిమాపై క్యూరియాసిటీ క్రియేట్ చేసింది. ఇప్పటి వరకు తెలుగులో వచ్చిన థ్రిల్లర్ సినిమాల్లో ఇదొక డిఫరెంట్ సినిమా అవుతుంది. థియేటర్లలో మంచి విజయం సాధిస్తుందని ఆశిస్తున్నాం'' అని అన్నారు. హర్ష హీరోగా,  అమైరా గోస్వామి, సుజనా రెడ్డి హీరోయిన్లుగా పరిచయమవుతున్న 'ఈ పాట కోరినవారు...' సినిమాలో ఇనాయా సుల్తానా, రవివర్మ, అశోక్‌ వర్ధన్, రేఖా నిరోషా ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. టీజర్ విషయానికి వస్తే... 'నీ రేడియో కావాలి' అంటూ హీరో హర్ష ఒకరి ఇంటికి వెళతాడు. అక్కడ రేఖా నిరోషా 'నేను వద్దా' అని అడుగుతారు. అది చూసి ఆమె భర్త ఓ లుక్ ఇస్తారు. తర్వాత 'ఇంత అందంగా ఉన్నారు. మిమ్మల్ని ఎలా వదులుకున్నారు' అని ఇనాయ సుల్తానాను అడిగితే... 'ఎప్పుడూ మీరే వదిలేయాలా? మేం వదలకూడదా' అని ఆమె సమాధానం ఇస్తారు. ప్రేయసిని షేర్ చేసుకోవాలనుకునే ప్రియుడు, పెళ్లి పీటల మీద భర్తతో పాటు మరొకరు కావాలని కోరిన భార్య వంటి సన్నివేశాలు సినిమాపై ఆసక్తి పెంచాయి. ఈ మిస్టికల్ మ్యూజికల్ థ్రిల్లర్ మీద అంచనాలు పెంచాయి.   'ఆ నలుగురు'తో మానవ సంబంధాలు, భావోద్వేగాలను బలంగా ఆవిష్కరించిన చంద్ర సిద్ధార్థ్, ఈసారి ఆధునిక థ్రిల్లర్ నేపథ్యంతో మరో భిన్నమైన చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తెస్తున్నారు. సంగీతం, ధ్వని, మానవ మెదడు మధ్య ఉన్న సంబంధాన్ని కథలో కీలకంగా మలుస్తూ రూపొందిన చిత్రమిది. సౌండ్ థెరపీ, బ్రెయిన్ మ్యాపింగ్, మెమరీస్, గిల్ట్ వంటి అంశాలను మిస్టరీ కథనంతో మేళవించిన చిత్రమిది.        [Ee Paata Korinavaaru Movie, Ee Paata Korinavaaru Teaser, Anil Ravipudi, Chandra Siddhartha, Telugu Movies 2026, Telugu Film News, Telugu News]  
    ప్రపంచ సినీ ప్రేమికులకి పరిచయం అక్కర్లేని పేరు 'సిడ్నీస్వీనీ.. 'యుఫోరియా' సిరీస్ తో అయితే తన కట్ అవుట్ కి మంచి గుర్తింపుని తెచ్చుకుంది. వివాదాలని ఎప్పుడు కావాలంటే అప్పుడు పిలిపించుకొనే ఆత్మీయ బంధువులా లూప్ లైన్ లో ఉంచుకునే   'సిడ్నీ స్వీనీ'  మరోసారి అంతర్జాతీయంగా తీవ్ర వివాదంలో చిక్కుకొని గ్లోబల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. స్పోర్ట్స్ ప్రిడిక్షన్,  ట్రేడింగ్ వేదిక'నోవిగ్' (Novig) అనే బ్రాండ్ ప్రచారం కోసం సిడ్నీ స్వీనీ చేసిన నూతన స్పోర్ట్స్  ప్రకటన సోషల్ మీడియా వేదికల్లో వైరల్ కావడంతో పాటు ప్రపంచవ్యాప్తంగా క్రీడాకారుల నుంచి తీవ్ర విమర్శలని ఎదుర్కొంటోంది. యాడ్‌లో సిడ్నీ స్వీనీ ఒంటిపై దుస్తులు లేకుండా, కేవలం టెన్నిస్ రాకెట్లు, బాస్కెట్‌బాల్స్, ఫుట్‌బాల్స్, హాకీ స్టిక్స్ మరియు వివిధ క్రీడా పరికరాల సహాయంతో శరీరాన్ని కప్పుకుంటూ ఉంది. అయితే నోవిగ్ బ్రాండ్ కేవలం స్పోర్ట్స్ ప్రిడిక్షన్ మార్కెట్ అని చాటిచెప్పడమే దీని ప్రధాన ఉద్దేశమని సదరు కంపెనీ ప్రతినిధులు వివరణ ఇచ్చారు. అంతేకాకుండా, మొదటి నుంచి ఈ ప్రచారాన్ని ఎంతో క్రియేటివ్‌గా, హ్యూమర్ మరియు కాన్ఫిడెన్స్‌తో రూపొందించడంలో తాను స్వయంగా భాగస్వామ్యం వహించానని సిడ్నీ స్వీనీ గతంలో చెప్పుకొచ్చింది.  అయితే, యాడ్ విడుదలైన కొద్దిసేపటికే ప్రపంచం నలుమూలల నుంచి విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా క్రీడా ప్రపంచం నుండి ప్రతికూల స్పందనలు వెల్లువెత్తాయి. ఆస్ట్రేలియాకు చెందిన నాలుగు సార్లు ఒలింపిక్ స్వర్ణ పతక విజేత, మాజీ స్విమ్మర్ అరియార్న్ టిట్మస్ ఈ ప్రచారంపై సోషల్ మీడియాలో  ఘాటుగా స్పందించింది. మహిళా అథ్లెట్లు క్రీడల్లో తమ స్థానాన్ని నిలబెట్టుకోవడానికి, గౌరవం సాధించడానికి కొన్ని దశాబ్దాలుగా ఎంతో కష్టపడుతుంటే, కేవలం బ్రాండ్ ప్రచారం కోసం మహిళల శరీరాలను ఇలా సరుకుగా మార్చడం దారుణమని మండిపడ్డారు. బ్రిటీష్ రన్నర్ ఏమీ హంట్, యుఎస్ జిమ్నాస్ట్ గ్రేసీ క్రామర్, రగ్బీ ప్లేయర్ సోఫీ ఫెల్లా వంటి పలువురు క్రీడాకారిణులు కూడా ఈ యాడ్‌ను తీవ్రంగా తప్పుపట్టారు.       Also Read: ఎపిక్ షాకింగ్ కలెక్షన్స్: డిజాస్టర్ అంటుంది ఎవరు! అయితే ఈ వ్యాఖ్యలపై సిడ్నీ స్వీనీ నేరుగా ఏ ప్రకటన చేయకుండా, తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో ఒక ఆసక్తికరమైన సైలెంట్ కౌంటర్ ఇచ్చారు. గతంలో స్పోర్ట్స్ విభాగంలో ప్రముఖ మ్యాగజైన్లకు నగ్నంగా లేదా దాదాపు దుస్తులు లేకుండా ఫొటోషూట్లు చేసిన దిగ్గజ అథ్లెట్ల ఫొటోలను ఆమె వరసగా షేర్ చేశారు. అందులో టెన్నిస్ లెజెండ్ సెరెనా విలియమ్స్, బాస్కెట్‌బాల్ స్టార్ మేగన్ రాపినో, యూఎఫ్‌సీ ఫైటర్ రోండా రౌసీ, ఎన్‌ఎఫ్‌ఎల్ స్టార్స్ రాబ్ గ్రోంకోవ్స్కీ, జేసన్ కెల్స్ వంటి దిగ్గజాల ESPN 'బాడీ ఇష్యూ' ఫొటోషూట్స్ ఉన్నాయి. క్రీడా దిగ్గజాలు చేసినప్పుడు లేని అభ్యంతరం, తన వరకు వచ్చేసరికి ఎందుకు వివాదాస్పదం చేస్తున్నారనే ప్రశ్నని  ఆమె పరోక్షంగా లేవనెత్తి నెటిజన్లను ఆశ్చర్యపరిచారు. గత ఏడాది అమెరికన్ ఈగిల్ డెనిమ్ బ్రాండ్ ప్రచారంతో చర్చనీయాంశమైన రెండు సార్లు ఎమ్మీ నామినీ పొందిన ఈ హాలీవుడ్ నటి, ఇప్పుడు ఈ కొత్త గ్లోబల్ స్పోర్ట్స్ యాడ్ వివాదంతో మరోసారి ప్రపంచవ్యాప్తంగా ట్రెండింగ్‌లో నిలిచారు.     [Sydney Sweeney , Sports Ad Controversy, Telugu Cinema, Telugu Cinema  News, Tollywood Cinema News, Tollywood]    
Chandra Siddharth, the acclaimed filmmaker known for his distinctive and sensitive storytelling in films such as Aa Naluguru, Madhumasam, Andari Bandhuvaya, Idhi Sangathi and Aatagadara Siva, is now coming up with yet another unconventional film titled ‘Ee Paata Korinavaaru Nemalipalem Nundi Rama, Jyotsna, Nandu, Murali, Kabir, Dhol Ravi Modhalagunavaru’. The film carries the intriguing subtitle ‘A Forbidden Raag from a Forbidden Saga’ and has already entered the record books as the film with one of the longest titles in the history of Telugu cinema. Based on a story by noted filmmaker and writer Madan, the film is presented by Y.V. Satyanarayana Raju and produced by Chandra Siddharth under the banner of Filmotsav. The film is slated for a grand theatrical release on September 18. The teaser of ‘Ee Paata Korinavaaru…’ was unveiled by blockbuster director and ‘Hit Machine’ Anil Ravipudi, who wished the team great success. Speaking on the occasion, Anil Ravipudi said, “ It is interesting to see a film coming with such a long title. I worked in the script department with Chandra Siddharth garu on Madhumasam, Housefull and Andari Bandhuvaya. He has always made sensible and meaningful films. I hope this film, which comes with such an unusual title, will also receive a great response from audiences.” Director and producer Chandra Siddharth said, “ I sincerely thank Anil Ravipudi garu for launching our teaser. He immediately agreed when we approached him and graciously gave us some time despite his busy schedule. The fact that he liked both the title and the teaser is a very positive sign for us, and we are extremely happy. The response to the title has been very encouraging, and it has already created a great deal of curiosity among audiences. Among the thrillers made in Telugu so far, we believe this film will stand out as something truly different. We are confident that it will receive a good response in theatres.” Starring Harsha as the male lead, with Amaira Goswami and Sujana Reddy making their debuts as female leads, Ee Paata Korinavaaru… features Inaya Sultana, Ravi Varma, Ashok Vardhan and Rekha Nirosha in prominent roles.The teaser opens with Harsha visiting someone’s house saying, “I want your radio.” Rekha Nirosha then asks, “Don’t you want me?”, prompting a telling reaction from her husband. In another intriguing moment, when Inaya Sultana is asked, “You are so beautiful. How could he leave you?”, she responds, “Why should you always be the one to leave? Can’t we be the ones to leave too?” The teaser also features unusual and provocative situations—a lover who wants to share his girlfriend and a wife who wants someone else along with her husband at the wedding altar. These intriguing situations have heightened curiosity around the film and have raised expectations for this mystical musical thriller. Chandra Siddharth, who powerfully explored human relationships and emotions in Aa Naluguru, is now presenting audiences with a completely different cinematic experience set against the backdrop of a contemporary thriller. The film explores the fascinating relationship between music, sound and the human brain, weaving elements such as sound therapy, brain mapping, memories and guilt into an intriguing mystery narrative. With its unconventional title, mysterious premise and distinctive storytelling, Ee Paata Korinavaaru… promises to offer audiences a thriller unlike anything they have seen before. Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them. 
A land dispute involving Allu Arjun’s father-in-law Kancherla Chandrasekhar Reddy has now escalated into a criminal case, adding another twist to the long-running controversy surrounding a prime property in Nanakramguda. According to the complaint, the dispute revolves around land linked to the Mantri Cosmos premises. Representatives of the residents’ association have alleged that Chandrasekhar Reddy, along with two others, entered the property and attempted to assert control over the disputed portion. The situation reportedly turned tense when residents and security personnel objected to the move. The complaint also contains allegations of damage to property, confrontation with security staff and threats during the episode. Based on the complaint, Gachibowli police have registered a case and are looking into the allegations. CCTV footage from the premises is reportedly being examined as part of the investigation. The development has naturally attracted attention because of Chandrasekhar Reddy’s connection to the Allu family. He is the father of Sneha Reddy, Allu Arjun’s wife, making the otherwise local property dispute a matter of interest in film circles as well. For now, the case remains at the investigation stage, and the allegations made in the complaint are yet to be established. The immediate focus will be on the police probe and the competing claims over the disputed Nanakramguda property. Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them. 
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు  కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత  కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.  జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు.  2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది. "ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు. సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు. గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.                                      *నిశ్శబ్ద.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఒకప్పుడు ఎర్ర జెండాను దిగ్విజయంగా ఎదిరించి, మార్క్సిస్టులను మట్టి కరిపించిన మమతా దీదీ ప్రస్తుతం, కాషాయ కూటమి నుంచి గట్టి సవాలును ఎదుర్కుంటున్నారు. వరసగా పదేళ్ళు పాలించడం వలన సహజంగా వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత  కంటే, హిందూ ఓటు పోలరైజేషన్ ఆమెను మరింతగా భయపెడుతోంది. నిజానికి ఐదేళ్ళ క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఐదు శాతం కంటే తక్కువ ఓట్లు, మూడంటే మూడు అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ..  2019 లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా 40 శాతం ఓట్లతో 18 స్థానాలు గెలుచుకుంది. ఈ  మార్పు ఇంకా కొన్ని కారణాలు ఉంటే ఉండవచ్చును కానీ.. హిందువుల ఓటు పోలరైజ్  కావడమే ప్రధాన కారణం.  ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ చివరకు కమ్యూనిస్టులు కూడా బీజేపీలో  చేరారు. ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత కూడా సిట్టింగ్ ఎమ్మెల్ల్యేలు సహా  తృణమూల్ టికెట్ వచ్చిన నాయకులు కూడా బీజేపీలో చేరుతున్నారు. అనేక మంది ఇతర రంగాల ప్రముఖులు, ముఖ్యంగా ఇంతకాలం, బీజేపీని హిదుత్వ అనుకూల ‘అచ్చుత్’ (అంటారని) పార్టీగా చూసిన ‘సెక్యులర్’ ప్రముఖులు కాషాయం కప్పుకోవడంతో మమతా బెనర్జీకి కొంచెం అలస్యంగానే అయినా, తత్త్వం బోధపడింది. అందుకే ఆమె ఇప్పుడు గుళ్ళూ,గోపురాలకు తిరుగుతున్నారు. కార్యకర్తల సమావేశాల్లో తానూ హిందువునేనని, చెప్పుకుంటున్నారు.  నిజానికి ఇలా నేనూ హిందువునే  అని సెక్యులర్ నేతలు బహిరంగంగా ప్రకటించుకోవడం మమతా బెనర్జీతోనే మొదలు కాలేదు. రాహుల్ గాంధీ తాను హిందువునని, జన్యుధారీ కశ్మీరీ బ్రాహ్మణుని అనీ.. తమ గోత్రం, ‘దత్తాత్రేయ’ గోత్రమని బహిరంగంగా ప్రకటించుకున్నారు. అలాగే  కొద్ది రోజుల క్రితం ప్రియాంకా గాంధీ తానూ హిందువునని చెప్పుకునేందుకు ‘మౌని అమావాస్య’ సందర్భంగా అలహాబాద్ లో గంగా స్నానం చేశారు. గతంలోనూ ఆమె ఎన్నికలకు ముందు గంగా యాత్ర చేశారు. అంతవరకు ఎందుకు కొద్దిరోజుల క్రితం సిపిఐ నారాయణ విశాఖ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. చంద్రబాబు, జగన్ రెడ్డి, కేసీఆర్ ఇలా తెలుగు నేతలు అనేక మంది లౌకిక వాదానికి కాలం చెల్లిందన్న సత్యాన్ని గ్రహించి కావచ్చు ‘నేనూ హిందువును’ అంటూ ప్రకటించుకునేందుకు పోటీ పడుతున్నారు. రాముడిని తలచుకున్నా, జై శ్రీరామ్ అన్నా తమ  లౌకిక వాదం మయలపడి పోతుందని భయపడిన నాయకులు ఇప్పుడు .. జై శ్రీరామ్ అనేందుకు కూడా వెనకాడడం లేదు.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది. గత కొంత కాలంగా సబర్మలతో సహా అనేక అంశాలపై స్పందిస్తూ.. కేరళను టార్గెట్ చేస్తున్న బీజేపీ నాయకులు అక్కడ తమ జెండా ఎగరేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా పార్టీ పాలసీని కూడా పక్కన పెట్టి మెట్రో మ్యాన్ శ్రీధరన్ ను పార్టీలో చేర్చుకుని ఆయనే తమ సీఎం అభ్యర్థి అని ప్రకటించిన 24 గంటలలో యూ టర్న్ తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం సీఎంగా ఉన్న కమ్యూనిస్ట్ నేత పినరై విజయన్ పై గోల్డ్ స్మగ్లింగ్ ఆరోపణలు రావడంతో.. ఈ ఎన్నికలలో ఎల్డిఎఫ్ భవిష్యత్తుపై ప్రజలు ఏ తీర్పు ఇవ్వబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది ఈ నేపథ్యంలో అక్షరాస్యతలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న ఆ రాష్ట్ర ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారు అనే అంశంపై ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ నౌ, సీ ఓటరుతో కలిసి ఒక సర్వేను నిర్వహించారు. ఈ సర్వే ప్రకారం చూస్తే పాపం కమలనాథులు అక్కడ పవర్ చేతికి రావటం అటుంచి కనీసం రెండు మూడు అసెంబ్లీ స్థానాల్లో గెలవటం కూడా కష్టమేనని ఆ సర్వే తేల్చి చెబుతోంది. కేరళలో ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తన హవా చాటుతుందన్న ఆ పార్టీ నేతల మాటలలో ఎలాంటి నిజం లేదని.. ప్రస్తుతానికి అది ఏమాత్రం సాధ్యం కాదని ఈ తాజా సర్వే తేల్చి చెప్పింది. అంతేకాకుండా మొత్తం 140 స్థానాలు ఉన్న కేరళలో.. ప్రస్తుత సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్డ్ డెమొక్రటిక్ ఫ్రంట్ కు 82 సీట్లు పక్కా అని.. ఆయనే తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటాడని సర్వే చెపుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూనైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ కు 56 నుంచి 60 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వేలో తేలింది. అంతేకాకుండా 2016 ఎన్నికలతో పోలిస్తే ఎల్ డీఎఫ్ ఓటింగ్ శాతం కూడా కొంత పెరగటం ఇక్కడ గమనార్హం. ప్రస్తుతం సీఎంగా ఉన్న విజయన్ మరోసారి సీఎం కావాలని 43.34 శాతం మంది మొగ్గు చూపినట్లుగా సర్వేలో తేలింది. కరోనా సమయంలో విజయన్ సీఎంగా బాగా పని చేసారని ఈ సర్వే పేర్కొంది. మరోపక్క దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ ఉండాలని కేరళ ప్రజల్లో 55.84 శాతం మంది కోరుకుంటున్నట్లుగా ఈ సర్వే;లో తేలింది. అయితే కేరళలో ఎలాగైనా పాగా వేయాలని పట్టుదలతో కృషి చేస్తున్న బీజేపీకి ఈసారి కూడా నిరాశ తప్పదని ఈ సర్వేలో స్పష్టం అయింది. ఈ ఎన్నికలలో బీజేపీకి రెండు సీట్లు కూడా రావటం కూడా కష్టమేనని ఈ సర్వే తేల్చింది. అయితే ఎన్నికలకు ముందు ఇలాంటి సర్వేలు బయటకు రావడం.. తరువాత అందులో కొన్ని చతికిల పడడం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ సర్వే ఫలితాలు నిజామా అవుతాయో లేదో తేలాలంటే కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే.        
రాజకీయాలు అంటేనే అదో జూదం. పూలమ్మిన చోటనే కట్టెలు అమ్మవలసి రావచ్చును. అలాంటి పరిస్థితే వచ్చినా, తలవంచుకుని పోగలిగితేనే, ఎవరైనా రాజకీయాలలో రాణించగలరు. అలాకాదని, అలిమి కానిచోట, కూడా తామే అధికులమని భావిస్తే, ఎందుకూ కాకుండా పోతారు. అలాంటి వారు ఇద్దరూ కూడా ఇప్పుడు మన కళ్ళముందే ఉన్నారు.  జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు. అలాగే జయ మరణం తర్వాత ఆమె పరిస్థితి ఏమిటో కూడా వేరే చెప్పవలసిన, అవసరం లేదు. జైలు పాలయ్యారు. సర్వం తానై నడిపించిన పార్టీ నుంచి  బహిష్కరణకు గురయ్యారు. జయ ఉన్నంత వరకు తన వారుగా ఉన్న వారందరూ కానివారయ్యారు. ఒంటరిగా మిగిలారు.  నిజానికి నాలుగేళ్ళు జైలు జీవితం గడిపిన తర్వాత కూడా ఆమె తలచుకుంటే.. రాష్ట్ర రాజకీయాలలో, ముఖ్యంగా అధికారంలో ఉన్న డిఎంకే కూటమిలో అలజడి సృష్టించగలరు. ఎన్నికలలో ఆమె గెలవక పోవచ్చును కానీ.. తనను కాదన్న అన్నాడిఎంకేను ఓడించగలరు. అయిన  ఆమె అందుకు విరుద్ధంగా  రాజకీయాలకు వీడ్కోలు పలికి మౌనంగా పక్కకు తప్పుకున్నారు. రాజకీయ సన్యాసం ప్రకటించారు. ఉమ్మడి శతృవు డిఎంకే ను ఓడించేందుకు అన్నా డిఎంకే కూటమి  పోటీ చేయాలని, కూటమి ఐక్యతను దెబ్బతీయరాదనే ఉద్దేశంతోనే ఆమె రాజకీయ సన్యాసం ప్రకటించారు.    శశికళ మౌనంగా వెళ్లి పోవడం వెనక ఇంకా అనేక కారణాలున్నా ,అసలు కారణం ఆమె, రాజకీయ విజ్ఞత, వివేకం. ఆమె జైలుకు వెళ్ళిన సమయంలో జయలలిత సమాధి వద్ద ఎంత కసిగా, కోపంగా ‘మౌన’ ప్రతిజ్ఞ చేశారో చూశా. అలాంటి ఆమె ఇప్పుడు ఇలా ‘మౌనం’గా వెనకడుగు వేశారంటే, అది ఆలోచించ వలసిన విషయమే.ఆమె వ్యుహతంకంగానే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అనేక మంది అనేక కోణాల్లో శశికళ సంచలన నిర్ణయాన్ని విశ్లేషించారు.జైలు జీవితం తర్వాత కూడా అన్నా డిఎంకే నాయకులు తనను అగ్రనేతగా అంగీకరించక పోవడం, అమిత్ షా చెప్పినా.. అన్నా డిఎంకే నాయకులు ఆమెను, మేనల్లుడు దినకరన్’ను కులం పేరున, కుటుంబం పేరున దూరం చేయడం, తిరిగి పార్టీలోకి తీసుకోకపోవడంతో ఆమె మనసు కష్టపెట్టుకుని, సన్యాస నిర్ణయం తీసుకున్నారని కొందరంటున్నారు. పార్టీ మీద పట్టు లేదని, చరిష్మా అసలే లేదని, అందుకే ఆమె అలా నిశ్శబ్ధంగా రాజకీయ సన్యాసం స్వీకరించారని ఇంకొందరు విశ్లేషించారు. ఈ విశ్లేషణలో కొంత నిజం ఉంటే ఉండవచ్చును.. కానీ ఆమె గతాన్ని, నైజాన్ని గుర్తు చేసుకుంటే ఆమె స్ట్రైక్ బ్యాక్ వ్యూహంతోనే ఒకడుగు వెనక్కివేశారని ఆమెతో సన్నిహితంగా మెలిగినవారు, ఆమె రాజకీయ చాణక్యం తెలిసిన వారు అంటారు.   నిజానికి జైలులో ఉన్న కాలంలో కానీ, జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత కానీ, ఆమె రాజకీయ సన్యాసం వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపించలేదు. బెంగుళూరు జైలు నుంచి విడుదలై చెన్నైలో ప్రవేశించిన నప్పుడు ఆమె పెద్ద కాన్వాయ్ తో  తమ కారుకు అన్నాడిఎంకే జెండాతోనే ఎంటరయ్యారు. అలా ఎంట్రీలోనే రాజకీయ ఆకాంక్షను వెంట తెచ్చుకున్నారు. చివరకు ‘సన్యాస’ ప్రకట చేసే వరకు కూడా ఆమె రాజకీయ కార్యకలాపాలు సాగిస్తూనే ఉన్నారు. అటు ఢిల్లీని ఇటు చెన్నైనికూడా కదిల్చారు. అంతేకాదు, రాజకీయాలపై విరక్తితో కాదు, రాజకీయ కసితో, ఉమ్మడి శత్రువు (డిఎంకే) ను ఓడించేందుకే తాను రాజకీయాలనుంచి తపుకుంటున్నట్లు చెప్పారు.  సో .. సన్యాసం తీసుకోవాలనే ఆలోచన, రాజకీయవ్యూహం లోంచి పుట్టిందే కానీ,వైరాగ్యంతో పుట్టింది కాదు ,అన్నవిశ్లేషణ వాస్తవానికి ఇంకొంత దగ్గరగా ఉందని అనుకోవచ్చును. ఇది ‘కామా’నే కాని ‘ఫుల్స్టాప్’ కాదని అంటున్నారు.  ముఖ్యమంత్రి ఎడప్పాడి కే. పళని స్వామి (ఈపీఎస్) ఆమెను పార్టీలోకి అనుమతిస్తే తన కుర్చికీ ఎసరు పెడతారనే భయంతోనే,, ఆమె ఎంట్రీని అడ్డుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, శశికళ ఒకే సామజిక వర్గానికి చెందిన వారు కావడం కూడా, ముఖ్యమంత్రి ఈపీఎస్’ భయానికి కారణంగా పేర్కొంటారు. అందుకే  ఆయన, ‘మన్నార్గుడి’ ఫ్యామిలీని బూచిగా చూపించి, ఆమెను దూరంగా ఉంచారని పార్టీలో ఒక వర్గం గట్టిగా విశ్వసిస్తుంది. అయితే ఆమె శక్తియుక్తులను కూడతీసుకుని  పులిలా పంజా విసిరేందుకే ఆమె వ్యూహాత్మకంగా ఒక అడుగు వెనక్కి వేశారు కావచ్చును అని కూడా, తమిళ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది.  గతంలో ఆమె జయలలితతో విబేధాలు వచ్చిన సమయంలో కూడా ఇలాగే కొద్ది కాలం మౌనంగా తెర చాటుకు వెళ్లి పోయారు.  కొద్ది కాలంలోనే మళ్ళీ ‘పోయస్ గార్డెన్’లో ప్రత్యక్షమయ్యారు. జయలలిత స్వయంగా ఆమెను వెనక్కి పిలుపించుకోవలసిన పరిస్థితులను సృష్టించారు. అలా  మళ్ళీ  చక్రం తిప్పారు. జయలలిత మరణం వరకు ఆమె అందరికీ చిన్నమ్మగా అమ్మకు పెద్దమ్మగా సర్వం తానై నిలిచారు. చివరకు జయ అంత్యక్రియల్లో కూడా ఆమెదే పై చేయిగా కనిపించింది.   జయలలిత చనిపోయిన సందర్భంలోనే అన్నా డిఎంకే ఎమ్మెల్ల్యేలో సుమారు 30 మంది వరకు ఆమెకు మద్దతుగా ఉన్నారన్న వార్తలొచ్చాయి. నిజానికి,ఇప్పటికి కూడా ఒక్క అన్నా డిఎంకే లోనేకాదు,డిఎంకే ఇతర పార్టీలలో కూడా  ఆమె అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ‘మన్నార్గుడి’ ఫ్యామిలీ మద్దతు లేకుండా గెలిచే అవకాశం లేదు.  ఇవ్వన్నీ నిజమే అయినా.. అన్నీ ఉండి, ఎవరు లేని శశికళలో, ఇంకా  ఎవరి కోసం తాపత్రయ పడాలి? అనే ప్రశ్న జనించి ఉంటే, ఆమె రాజకీయ సన్యాసం నిజం కావచ్చును. ఎందుకంటే ఆమె నెచ్చలి, జయలిత లేరు, భర్త అంతకంటే ముందే చనిపోయారు, పిల్లలు లేరు... పైగా నాలుగేళ్ళ జైలు జీవితం ఆమెలో మార్పు తెచ్చి ఉండవచ్చును. ఈ వయస్సులో తనవారంటూ ఎవరు లేని తనకు రాజకీయాలు ఎందుకు ? శేష జీవితాన్ని ఇలా సాగిద్దామనే ఆలోచన నిజంగా వచ్చి ఉంటే, ఆమె సన్యాసం సత్యం అయినా కావచ్చును, కాకపోనూ వచ్చును. కానీ  శశికళ... ఆమెను అర్థం చేసుకోవడం, అంచనా వేయడం , అంత తేలిగ్గా అయ్యే పని కాదు..
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు. కాంగ్రెస్ అధినాయకత్వం పై నేరుగా అస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ పేరు చెప్పకుండానే, ఆయన నాయకత్వానికి పనికిరాడని తేల్చి చెప్పారు. ఎవరైనా పార్టీ అధ్యక్షుడు అయితే కావచ్చును, కానీ, ప్రజానాయకుడు కాలేడని, రాహుల గాంధీ ప్రజానాయకుడు కాదు కాలేరు,అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరచూ రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసే  ‘నామ్’ధారీ వ్యంగ్యాస్త్రాన్నే కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా సందించారు. ఇక అక్కడి నుంచి విధేయ, అసమ్మతి వర్గాల మధ్య మాటల యుద్ధం ఎదో ఒక రూపంలో సాగుతూనే వుంది. అదే క్రమంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, కరుడు కట్టిన ముస్లిం మతోన్మాది, అబ్బాస్ సిద్దిఖీతో కాంగ్రెస్ పార్టీ చేతులు కలపడం అసమ్మతి నాయకులకు మరో అస్త్రాన్ని అందించింది. విషయంలోకి వెళితే, ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా లోక్’సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు, పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్’రంజన్ చౌదరి, ముస్లిం మత ప్రచారకుడు, అబ్బాస్ సిద్దిఖీతో  వేదిక పంచుకున్నారు.అంతకు ముందే వామ పక్ష కూటమితో  పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్ పార్టీ, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)ను కూటమిలో చేర్చుకుంది. ఇలా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) అమోదం లేకుండా మతోన్మాద ఐఎస్ఎఫ్’ తో ఎన్నికల పొత్తు పెట్టుకోవడం ఆ పార్టీ నాయకుడు,సిద్ధిఖీతో  పీసీసీ చీఫ్ వేదిక  పంచుకోవడం పై అసమ్మతి నేతలు మండి పడుతున్నారు. ఇలా సిద్దిఖీతో వేదిక పంచుకోవడం పార్టీ మౌలిక సిద్ధాంతాలకు వ్యతిరేకం అంటూ అసమ్మతి వర్గానికి చెందిన కీలక నేత, రాజ్యసభ సభ్యుడు,ఆనంద్ శర్మ మండిపడ్డారు. అంతే కాదు, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)తో జనవరిలో కుదుర్చుకున్న పొత్తుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)అమోదం లేదని ఆనంద్ శర్మ, అభ్యంతరం వ్యక్త చేశారు. పార్టీ విశ్వసించే లౌకిక వాదానికి కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం గొడ్డలి పెట్టని ఆయన తీవ్రంగా స్పందించారు.   శర్మ వ్యాఖ్యలపై అధీర్ రంజన్ చౌదరి అంతే ఘాటుగా ప్రతిస్పందించారు. “నిజాలు తెలుసుకోండి ఆనంద్ శ‌ర్మ జీ” అంటూ ఆయ‌న వ‌రుస ట్వీట్లు చేశారు. వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలు ప‌క్క‌న‌పెట్టి, ప్ర‌ధానిని పొగిడి టైమ్ వేస్ట్ చేయ‌కండంటూ ఆయ‌న ఓ ట్వీట్లో అన్నారు. ఆనంద్ శ‌ర్మ అన‌వ‌స‌రంగా కాంగ్రెస్‌ను ల‌క్ష్యంగా చేసుకుంటున్నార‌ని, ఈ అంశాన్ని పెద్ద‌ది చేసి చూపిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఆయ‌న ఉద్దేశాలు స‌రైన‌వే అయితే నేరుగా తనతో మాట్లాడ వలసిందని అన్నారు. బెంగాల్‌లో సీపీఐ(ఎం) కూట‌మికి నేతృత్వం వ‌హిస్తోంది. అందులో కాంగ్రెస్ ఓ భాగం. మ‌త‌తత్వ‌, విభ‌జ‌న రాజ‌కీయాలు చేస్తున్న బీజేపీకి చెక్ పెట్ట‌డానికే ఈ కూట‌మి అని మ‌రో ట్వీట్‌లో అధిర్ రంజ‌న్ అన్నారు. అక్కడతోనూ ఆగలేదు ... ట్వీట్ల మీద ట్వీట్లు సంధిస్తూ, ఆనంద్ శర్మ, బీజేపీ మత విభజన, అజెండాను బలపరుస్తున్నారని, పరోక్షంగా జీ23 నాయకులు బీజేపీకి ప్రయోజనం చేకూరుస్తున్నారని ఆరోపించారు.అంతే కాదు, క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితులు తెలియకుండా, ఆనంద్ శర్మ పార్టీ మీద దండెత్తడం ఉచితం కాదని చౌదరి ఎదురుదాడి చేశారు. అసమ్మతిలో అసమ్మతి. ఇదలా ఉంటే, కాంగ్రెస్ పార్టీ  సమూల పక్షాళన కోరుతూ సోనియా గాంధీకి,గత సంవత్సరం  జీ 23గా ప్రాచుర్యం పొందిన సీనియర్ నాయకులు రాసిన లేఖపై సంతకాలు చేసిన  నాయకుల్లో నలుగురు,జమ్మూలోసమావేసమైన నాయకుల తాజా నిర్ణయాలు, వ్యాఖ్యలు,విమర్శల పట్ల అసంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరం సోనియా గాంధీకి రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలకు కట్టుబడి ఉన్నామని, అయితే, జీ 23లోని కొందరు సహచరులు, ఇటీవల గీతదాటి చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలను తాము సమర్ధించడం లేదని ఆ నలుగురు పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా, రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్, పీజే కురియన్ అయితే, “కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన సంస్కరణలు తెచ్చేందుకు చేసే ప్రయత్నాలను పూర్తిగా సమర్దిస్తాను, కానీ, ‘లక్ష్మణ రేఖ’ దాటితే ఒప్పుకునేది లేదు”అని అసమ్మతిలో అసమ్మతికి తెర తీశారు.అలాగే, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారడు, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్,మధ్య ప్రదేశ్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అజయ్ సింగ్’ కూడా గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, ఆనంద్ శర్మ, మనీష్ తివారీ వంటి జీ 23 కీలక నేతలు అధినాయకత్వంపై చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. అలాగే, పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీమంత్రి వీరప్ప మొయిలీ కూడా,గత సంవత్సరం పార్టీ సీనియర్ నాయకులు  ఒక పరిమిత లక్ష్యంతో  సోనియా గాంధీకి లేఖ రాయడం జరిగిందని, ఆ పేరున జరుగతున్న  కార్యక్రమాలు లేఖ సంకల్పానికి  విరుద్ధమని అన్నారు. జీ 23 కార్యకలాపాలపై రాహుల్ గాంధీ కూడా పరోక్షగా స్పందించారు, ఒకప్పుడు ఎన్ఎస్’యుఐ, యూత్ కాంగ్రెస్’ కు సంస్థాగత ఎన్నికలు వద్దన్న వారే ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నారని పరోక్షంగానే అయినా సంస్థాగత ఎన్నికలు నిర్వహించడంతో పాటుగా, పార్టీ పక్షాలనకు తమ కుటుంబం వ్యతిరేకం కాదని, అందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీలో చెలరిగిన కలకలం  ఇక ముందు ఏమవుతుందో .. ఇంకెన్ని  మలుపులు తిరుగుతోందో ..చూడవలసిందే కానీ ఉహించలేము.
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఆ ఒపీనియన్ పోల్ ఫలితాలు నిజంగా నిజం అయితే, కేరళలో మళ్ళీ సీపీఎం సారధ్యంలోని వామపక్ష కూటమి అధికారంలోకి వస్తుంది. ఇదే ఆ అద్భుతం. ఎందుకంటే, గత నాలుగు దశాబ్దాలలో కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే కూటమి వరసగా రెండవసారి అధికారంలోకి వచ్చిన చరిత్ర లేనే లేదు. ఒక సారి ఎల్డీఎఫ్ అధికారంలోకి వస్తే ఐదేళ్ళ తర్వాత కాంగ్రెస్ సారధ్యంలోని ఐక్య ప్రజాస్వామ్య కూటమి(యూడీఎఫ్) అధికారంలోకి రావడం, దేవభుమిలో దైవ నిర్ణయమా అన్నట్లుగా ప్రతి ఎన్నికల్లోనూ అధికారం చేతులు మారుతూ వస్తోంది. అలాంటిది, ఈసారి ఒపీనియన్ పోల్స్ నిజమై వరసగా రెండవసారి వామపక్ష కూటమి అధికారంలోకి వస్తే, అది చరిత్రే అవుతుంది. ఇక ఒపీనియన్ పోల్స్ విషయానికి వస్తే, జాతీయ న్యూస్ ఛానెల్ ఏబీపీ, సీ ఓటర్ సంస్థలు సంయుక్తంగా ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఈ సర్వే ప్రకారం, 140 స్థానాలున్న కేరళ అసెంబ్లీలో వామపక్ష కూటమికి 83 నుంచి  91 స్థానాలు, యూడీఎఫ్ కూటమికి 47 నుంచి 55 స్థానాలు మాత్రమే దక్కుతాయని తెలుస్తోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రంలో ఇలా జాతకాలు తిరగబడడంపై సోషల్ మీడియాలో,’లెగ్ మహిమ’ లాంటి జోక్స్  ట్రోలవుతున్నాయి. అయితే 2016లో జరిగిన ఎన్నికల్లో కేవలం 47 సీట్లకే పరిమితం అయిన కాంగ్రెస్’కు ఈసారి ఒకటీ అరా సీట్లు ఎక్కువస్తే, రావచ్చును. అదే కాంగ్రెస్’కు కాసింత ఊరట. అదలా ఉంటే, పశ్చిమ బెంగాల్లో సైతం పట్టు సాధించిన బీజేపే, కేరళలో మాత్రం పట్టు కాదు కదా, పట్టుమని పది సీట్లు తెచ్చుకునే స్థితిలో లేదు. నిజానికి, దేశంలో బీజేపీకి అసలు ఏ మాత్రం మింగుడు పడని రాష్ట్రాలు ఎవైన ఉన్నాయంటే కేరళ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల  పేర్లే ప్రముఖంగా వినిపిస్తాయి. ఈ సారి కూడా కమల దళం కేరళలో కాలు పెట్టె పరిస్తి లేదని సర్వే ఫలితాలు చెపుతున్నారు. ఎప్పటిలానే ఇప్పడు కూడా  బీజేపీకి సున్నా నుంచి రెండు సీట్లు వచ్చే అవకాశం ఉందని, సర్వేస్వరుల అభిప్రాయంగా ఉంది. కేరళలో మొత్తం 140 స్థానాలకు ఏప్రిల్ 6 తేదీన ఒకే విడతలో పోలింగ్ జరుగుతుంది. మే 2 తేదీన ఫలితాలు వెలువడతాయి. కేరళ ఎలక్షన్ పై యావత్ దేశం ఆసక్తి కనబరుస్తోంది.    
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం ఓటరు తీర్పుకు వెళుతున్నా, అందరి దృష్టి, ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల ఏలుబడిలో ఉన్న ఉభయ తెలుగు రాష్ట్రాలు, మరీ ముఖ్యంగా ఇప్పటికే బీజేపీ కన్నుపడిన తెలంగాణ రాష్ట్ర ప్రజలు, రాజకీయ పార్టీల దుష్టి  మాత్రం పశ్చిమ బెంగాల్ పైనే వుంది.  పశ్చిమ బెంగాల్లో ‘అద్భుతం’ జరిగి బీజేపీ విజయం సాధిస్తే, ఇక  కమల దళం ఫోకస్, తెలంగాణకు షిఫ్ట్ అవుతుంది. ఇది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. ఈ నేపధ్యంలో బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయి అనే విషయంలో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. బెంగాల్లో బీజేపీ గెలిస్తే, ఇప్పటికే అంతర్గత కుటుంబ కలహాలతో సతమతవుతున్న తెరాస నాయకత్వానికి మరిన్నితిప్పలు తప్పవన్న మాట అంతఃపుర వర్గాలలో సైతం వినవస్తోంది.  పశ్చిమ బెంగాల్’లో ఎలాగైతే కమలదళం ఓ వంక తమ ట్రేడ్ మార్క్, హిందుత్వ రాజకీయాలు సాగిస్తూ, మరో వైపు నుంచి ‘ఆకర్ష్’ అస్త్రంతో అధికార పార్టీని నిర్వీర్యం చేసిన విధంగానే, ఇక్కడ కూడా ఫిరాయింపులను ప్రోత్సహింఛి పార్టీని నిట్టనిలువునా చీల్చే ప్రమాదాన్ని కొట్టివేయలేమని పార్టీ వర్గాలు కూడా అనుమానం వ్యక్త పరుస్తున్నాయి.  ఇప్పటికే తెలంగాణ  బీజేపీ నాయకులు 30 మంది తెరాస ఎమ్మెల్యేలు తమ టచ్ లో ఉన్నారని బెదిరిస్తున్నారు.అది నిజం అయినా కాకపోయినా..తెరాసలో అసంతృప్తి అగ్గి రగులుతోందనేది మాత్రం ఎవరూ కాదనలేని నిజం. అంతే కాకుండా రాష్ట్రానికి వచ్చిన కేంద్రనాయకులు ఎవరిని పలకరించినా, నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అని ఎలాంటి సషబిషలు లేకుండా కుండబద్దలు కొడుతున్నారు.అందుకే, బెంగాల్లో బీజేపీ గెలిస్తే.. అనే ఊహా కూడా  గులాబీ గూటిలో గుబులు పుట్టిస్తోంది. అయితే, బెగాల్’లో బీజేపీ గెలిస్తే ఒక్క తెలంగాణలోనే కాదు, దేశ రాజకీయ వాతావరణంలోనే పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.  అలాగే,  దేశ ముఖ చిత్రంలో కూడా పెను మార్పులు తప్పవని అంటున్నారు. అయితే రాజకీయాలలో ఎప్పుడు ఏం జరుగుతుందో.. ఎవరూహించెదరు..
లైఫ్ లో సక్సెస్ కావాలంటే  మనిషి ఆలోచన ఎలా ఉండాలి.! జీవితంలో విజయం సాధించడం అనేది అనుకోకుండా జరిగే ఒక సంఘటన కాదు. అది ఒక నిరంతర ప్రయాణం. ఈ ప్రయాణంలో మన గమ్యాన్ని, మన స్థాయిని నిర్ణయించేది మన ఆలోచనా సరళి మాత్రమే. ఒక మనిషి ఎలా ఆలోచిస్తే అతని జీవితం అలానే తయారవుతుంది. ప్రతికూల పరిస్థితులు ఎదురైనప్పుడు మనం స్పందించే తీరు, మన మానసిక స్థితి , మనం తీసుకునే నిర్ణయాలు మన భవిష్యత్తును రూపుదిద్దుతాయి. విజేతలకు, సాధారణ వ్యక్తులకు మధ్య ఉండే ప్రధాన తేడా వారి ప్రతిభ లేదా అదృష్టం మాత్రమే కాదు, వారి ఆలోచనా విధానం కూడా. విజయం సాధించడానికి  మనిషి ఆలోచనా సరళి ఎలా ఉండాలో వివరంగా తెలుసుకుంటే..  చాలామంది తమ సామర్థ్యాలకు ఒక హద్దును ఏర్పరచుకుంటారు. కానీ, సరైన శిక్షణ, శ్రమ , నిరంతరం  నేర్చుకుంటూ ఉండటం వంటి వాటి ద్వారా ఏ నైపుణ్యాన్నైనా పెంపొందించుకోవచ్చనే నమ్మకం ఉండాలి. ఓటమి అనేది ప్రయాణానికి ముగింపు కాదని, అది ఒక అనుభవమని గ్రహించాలి. ప్రతి వైఫల్యం ఒక కొత్త పాఠాన్ని నేర్పుతుంది. తప్పుల నుంచి నేర్చుకుంటూ ముందుకు సాగే ఆలోచన ఉన్నప్పుడే వ్యక్తిగత వికాసం సాధ్యమవుతుంది. స్పష్టమైన లక్ష్యాలు.. మనిషి ఆలోచన ఎప్పుడూ స్పష్టమైన లక్ష్యాల వైపు మొగ్గు చూపాలి. స్పష్టత లేని ఆలోచనలు గమ్యం లేని ప్రయాణం లాంటివి.  జీవితంలో ఏం సాధించాలనుకుంటున్నారు, దాని కోసం ఏ రోజు ఏమి చేయాలి అనే విషయంలో స్పష్టత ఉండాలి. లక్ష్యాలను షార్ట్ టర్మ్ గోల్స్, లాంగ్ టర్మ్ గోల్స్ అని విభజించుకుని, వాటిని సాధించడానికి  ప్రణాళికలు రచించుకోవాలి. కేవలం ఆలోచించడమే కాకుండా, ఆ ఆలోచనలను ఆచరణలో పెట్టే క్రమశిక్షణ ఉండాలి. పారిపోవడం కాదు పరిష్కారం వెతకాలి.. పరిస్థితులు ఎల్లప్పుడూ మనకు అనుకూలంగా ఉండవు. కష్టాలు, సవాళ్లు ఎదురైనప్పుడు నిరాశపడకుండా ధైర్యంగా నిలబడే ఆలోచనా ధోరణి ఉండాలి. సమస్యలు వచ్చినప్పుడు "ఇది నాకే ఎందుకు జరిగింది" అని బాధపడటం కంటే, "ఈ సమస్యను నేను ఎలా పరిష్కరించగలను" అని ఆలోచించడం ముఖ్యం. సమస్యల వైపు కాకుండా పరిష్కారాల వైపు దృష్టి సారించే ఆలోచనా సరళి మనిషిని మానసికంగా బలంగా మారుస్తుంది. పరిస్థితుల సర్దుబాటు.. విజయం  సాధించాలంటే మారిన పరిస్థితులకు అనుగుణంగా మనిషి కూడా మారడం చాలా అవసరం. ప్రపంచం వేగంగా మారుతోంది. పాత ఆలోచనలకే పరిమితమైపోతే పురోగతి సాధ్యం కాదు. కొత్త విషయాలను నేర్చుకోవడానికి, కొత్త సాంకేతికతలను అవగాహన చేసుకోవడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలి. ఎప్పుడూ నేర్చుకుంటూ ఉండటం  అనేది మనిషి ఆలోచనను పదునుపెడుతుంది. ఏ వయసులోనైనా కొత్త విషయాలు నేర్చుకోవడానికి వెనుకాడకూడదు. పాజిటివ్ ఆలోచన.. ఆలోచనల్లో పాజిటివ్నెస్ ఉండటం చాలా ముఖ్యం. మన ఆలోచనలే మన భావోద్వేగాలను, మన చర్యలను శాసిస్తాయి. ప్రతికూల ఆలోచనలు మన శక్తిని క్షీణింపజేస్తాయి , భయాన్ని పెంచుతాయి. పాజిటివ్ ఆలోచనలు మనలో నమ్మకాన్ని, ఉత్సాహాన్ని నింపుతాయి. మీ చుట్టూ ఉన్న పరిసరాలు, మీరు సహవాసం చేసే వ్యక్తులు కూడా మీ ఆలోచనలపై ప్రభావం చూపుతారు. కాబట్టి సానుకూల దృక్పథం ఉన్న వ్యక్తులతో సమయం గడపడం, ప్రేరణనిచ్చే పుస్తకాలు చదవడం అలవాటు చేసుకోవాలి. సమయం విలువ.. గొప్ప విజయాలు సాధించిన వారెవరూ సమయాన్ని వృథా చేయరు. కాలం అత్యంత విలువైనది. నేటి పనిని నేడే పూర్తి చేయాలనే ఆలోచన ఉండాలి. వాయిదా వేసే అలవాటు విజయానికి అతిపెద్ద శత్రువు. ప్రతి నిమిషాన్ని ఉపయోగకరంగా మార్చుకునే ఆలోచన ఉన్నప్పుడే అనుకున్న గమ్యాన్ని త్వరగా చేరుకోగలము. అవరోధాలు అధిగమించడం.. విజయం సాధించే క్రమంలో అనేక అడ్డంకులు వస్తాయి. మొదట్లోనే ఫలితాలు రాకపోవచ్చు. అంత మాత్రాన ప్రయత్నాన్ని ఆపకూడదు. పట్టుదల, సహనం అనేవి ఆలోచనా విధానంలో భాగం కావాలి. ఫలితం ఆలస్యమైనా, సరైన మార్గంలో పయనిస్తున్నామనే నమ్మకంతో నిలకడగా శ్రమించాలి. చివరగా.. విజయం అనేది కేవలం డబ్బు లేదా హోదాకు మాత్రమే పరిమితం కాదు. సమాజానికి ఉపయోగపడేలా, ఇతరులకు ప్రేరణగా నిలిచేలా ఆలోచించడం నిజమైన విజయం. మన ఆలోచనలు ఎంత ఉన్నతంగా ఉంటే, మన జీవితం కూడా అంత ఉన్నతంగా ఉంటుంది. కాబట్టి మీ ఆలోచనలను సానుకూలంగా, స్పష్టంగా, , లక్ష్య సాధన వైపు నడిపించేలా మలుచుకోవాలి. అలా చేస్తే జీవితంలో విజయం తప్పక సొంతమవుతుంది.                       *రూపశ్రీ.  
మానవ శరీరానికి ఇంధనం అందించే పోషకాహారంలో కొవ్వులు (Fats) అత్యంత ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. అయితే, మనం రోజూ తీసుకునే ఆహారంలో ఉండే అన్ని రకాల కొవ్వులు ఆరోగ్యానికి మేలు చేయవు. ముఖ్యంగా మన హృదయ ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో  సంతృప్త కొవ్వులు (Saturated Fats) మరియు  అసంతృప్త కొవ్వులు  (Unsaturated Fats) మధ్య ఉన్న తేడాను తెలుసుకోవడం ఎంతో అవసరం. వైద్య నిపుణులు మరియు అంతర్జాతీయ ఆరోగ్య సంస్థల ప్రకారం, అసంతృప్త కొవ్వులు గుండెకు రక్షణ కవచంలా పనిచేస్తే, పరిమితికి మించి తీసుకునే సంతృప్త కొవ్వులు ప్రాణాంతకమైన గుండె జబ్బులకు దారితీస్తాయి. ఈ రెండు రకాల కొవ్వుల వెనుక ఉన్న శాస్త్రీయ నిజాలు, అవి మన రక్తనాళాలపై చూపే ప్రభావం మరియు గుండెను సురక్షితంగా ఉంచుకునే మార్గాల గురించి సమగ్రంగా తెలుసుకుందాం. మొదటగా  సంతృప్త కొవ్వులు  (Saturated Fats) గురించి పరిశీలిస్తే, ఇవి సాధారణ గది ఉష్ణోగ్రత వద్ద ఘనరూపంలో ఉంటాయి. వెన్న, నెయ్యి, రెడ్ మీట్, చీజ్, పామాయిల్ మరియు కొబ్బరి నూనె వంటి ఆహార పదార్థాలలో ఇవి ఎక్కువగా లభిస్తాయి. ఆహారంలో సంతృప్త కొవ్వులు ఎక్కువైతే, అవి కాలేయంలో చెడు కొలెస్ట్రాల్ అంటే ఎల్‌డిఎల్ (LDL , Low Density Lipoprotein) ఉత్పత్తిని గణనీయంగా పెంచుతాయి. ఈ చెడు కొలెస్ట్రాల్ రక్తనాళాల గోడలలో కొవ్వు పొరలుగా (Plaque) పేరుకుపోయి, ధమనులను మూసివేస్తుంది. దీనిని వైద్య పరిభాషలో  అథెరోస్క్లెరోసిస్  (Atherosclerosis) అంటారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) మరియు అమెరికన్ హార్ట్ అసోసియేషన్ నివేదికల ప్రకారం, మనం రోజూ తీసుకునే మొత్తం క్యాలరీలలో సంతృప్త కొవ్వుల వాటా 7 శాతం నుండి 10 శాతానికి మించకూడదు. ఈ పరిమితి దాటితే గుండెపోటు (Heart Attack) మరియు పక్షవాతం (Stroke) వచ్చే ప్రమాదం 30 శాతానికి పైగా పెరుగుతుంది.   దీనికి భిన్నంగా  అసంతృప్త కొవ్వులు  (Unsaturated Fats) గుండెకు అమృతం లాంటివి. ఇవి గది ఉష్ణోగ్రత వద్ద ద్రవరూపంలో ఉంటూ, ఆలివ్ ఆయిల్, ఆవనూనె, పొద్దుతిరుగుడు నూనె, బాదం, వాల్‌నట్స్, అవిసె గింజలు (Flaxseeds) మరియు సాల్మన్ వంటి కొవ్వు చేపల్లో పుష్కలంగా లభిస్తాయి. అసంతృప్త కొవ్వులను ఏక అసంతృప్త (MUFA) మరియు బహుళ అసంతృప్త (PUFA) కొవ్వులుగా వర్గీకరిస్తారు. ఇవి రక్తంలో ఉన్న చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తూ, మంచి కొలెస్ట్రాల్ అయిన హెచ్‌డిఎల్ (HDL  , High,Density Lipoprotein) స్థాయిలను పెంచుతాయి. అంతేకాకుండా, ఇవి శరీరంలోని ట్రైగ్లిజరైడ్స్ (Triglycerides) స్థాయిలను తగ్గించి, రక్తనాళాల వాపును (Inflammation) నివారిస్తాయి. దీనివల్ల గుండె కొట్టుకునే వేగం క్రమబద్ధంగా ఉండటమే కాకుండా, రక్తప్రసరణ ఎలాంటి అవరోధాలు లేకుండా సాగుతుంది. శాస్త్రీయ పరిశోధనలు మరియు అంతర్జాతీయ న్యూట్రిషన్ అధ్యయనాలు వెల్లడించిన గణాంకాల ప్రకారం, మన దైనందిన ఆహారంలో సంతృప్త కొవ్వుల నుండి వచ్చే 5 శాతం క్యాలరీలను అసంతృప్త కొవ్వులతో భర్తీ చేయడం వల్ల హృద్రోగాల ప్రమాదం ఏకంగా 13 శాతం నుండి 25 శాతం వరకు తగ్గుతుంది. అలాగే, ప్రాసెస్ చేసిన ఆహారాలు, బేకరీ తినుబండారాలలో ఉండే  ట్రాన్స్ ఫ్యాట్స్  (Trans Fats) నిత్య జీవితంలో 1 శాతం కంటే తక్కువగా ఉండేలా చూసుకోవాలని వైద్యులు తీవ్రంగా హెచ్చరిస్తున్నారు. మొత్తం రోజువారీ క్యాలరీలలో కొవ్వుల శాతం 20 నుండి 35 శాతం వరకు ఉండవచ్చని, కానీ అందులో అత్యధిక భాగం అసంతృప్త కొవ్వులే ఉండాలని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు. కాబట్టి, ఆరోగ్యకరమైన గుండె కోసం మనం రోజూ వాడే వంట నూనెలు మరియు ఆహార పదార్థాల ఎంపికలో మార్పులు చేయడం అత్యంత ఆవశ్యకం. డీప్ ఫ్రై చేసిన పదార్థాలు, రెడ్ మీట్, అధికంగా వెన్న మరియు డాల్డా వాడకాన్ని తగ్గించి, వాటి స్థానంలో డ్రై ఫ్రూట్స్, సీడ్స్, ఆలివ్ ఆయిల్, నాణ్యమైన అసంతృప్త నూనెలను ఆహారంలో భాగం చేసుకోవాలి. రోజువారీ ఆహారంలో సరైన కొవ్వుల సమతుల్యతను పాటించడంతో పాటు నిత్యం 30 నిమిషాల వ్యాయామం చేయడం వల్ల గుండె సురక్షితంగా, ఆరోగ్యంగా ఉంటుంది. సరైన ఆహార అవగాహనే శ్రేయోభరితమైన సుదీర్ఘ జీవితానికి పునాది.       [Saturated Fats, Unsaturated Fats, Heart Health, LDL Cholesterol, HDL Cholesterol, Atherosclerosis, Trans Fats, Healthy Fats, Cholesterol, Cardiovascular Health]
స్త్రీ సంతానోత్పత్తి వ్యవస్థ మరియు గర్భధారణ విషయంలో మహిళల్లో తరచుగా అనేక అపోహలు, సందేహాలు నెలకొంటాయి. ముఖ్యంగా తల్లికావాలని కోరుకునే మహిళలు ఎదుర్కొనే ప్రధానమైన చర్చ  అండాల సంఖ్య  (Egg Quantity) మరియు  అండాల నాణ్యత  (Egg Quality). చాలామంది మహిళలు అండాల సంఖ్య ఎక్కువగా ఉంటే చాలు, త్వరితగతిన గర్భం దాల్చవచ్చని భావిస్తుంటారు. కానీ, సంతానోత్పత్తి నిపుణులు (Fertility Experts) వెల్లడిస్తున్న నిజాల ప్రకారం అండాల సంఖ్య ఎంత ముఖ్యమో, అంతకంటే అండాల నాణ్యత అత్యంత ప్రాధాన్యమైనది. సంతానలేమి సమస్యలతో బాధపడేవారిలో ఈ రెండింటి మధ్య తేడాను సరిగ్గా అర్థం చేసుకోవడం ఎంతో అవసరం. గర్భధారణ విజయవంతం కావడానికి ఈ రెండు అంశాలు ఏ విధంగా తోడ్పడతాయి, వాటి వెనుక ఉన్న శాస్త్రీయ నిజాలేంటో ఇప్పుడు సమగ్రంగా తెలుసుకుందాం. జన్యుపరంగా పరిశీలిస్తే, ప్రతి పెళ్లైన మహిళ లేదా అమ్మాయి తన పుట్టుకతోనే అండాల నిల్వలతో జన్మిస్తుంది. శారీరక నిర్మాణం ప్రకారం ఒక ఆడపిల్ల జన్మించినప్పుడు ఆమె అండాశయాలలో దాదాపు 10 లక్షల నుండి 20 లక్షల (1 to 2 million) అండాలు ఉంటాయి. అయితే, వయస్సు పెరుగుతున్న కొద్దీ ఈ నిల్వలు సహజంగానే క్షీణిస్తూ ఉంటాయి. యుక్తవయస్సుకు (Puberty) చేరుకునేసరికి ఈ అండాల సంఖ్య దాదాపు 3,00,000 నుండి 4,00,000 వరకు తగ్గిపోతుంది. ఒక మహిళ తన జీవితకాలంలో కేవలం 300 నుండి 400 అండాలను మాత్రమే అోవ్యులేషన్ (Ovulation) ద్వారా విడుదల చేస్తుంది. మిగిలిన అండాలన్నీ శరీరంలో కరిగిపోతాయి. ముఖ్యంగా 30 సంవత్సరాల వయసు నాటికి మహిళల్లో ప్రారంభ నిల్వలలో కేవలం 12 శాతం అండాలు మాత్రమే మిగులుతాయి. 40 ఏళ్లు దాటేసరికి ఈ నిల్వలు మరింత పడిపోయి కేవలం 3 శాతానికి చేరుకుంటాయి. వైద్య భాషలో అండాల సంఖ్యను  ఓవేరియన్ రిజర్వ్  (Ovarian Reserve) అని పిలుస్తారు. దీనిని అంచనా వేయడానికి బ్లడ్ టెస్ట్ ద్వారా AMH (Anti Müllerian Hormone) మరియు ఆంత్రల్ ఫోలికల్ కౌంట్ (AFC) స్కాన్ నిర్వహిస్తారు. అయితే ఇక్కడే ఒక ముఖ్యమైన విషయాన్ని గమనించాలి. AMH పరీక్ష అనేది కేవలం మీ అండాశయంలో ఎన్ని అండాలు అందుబాటులో ఉన్నాయో (Quantity) మాత్రమే చెబుతుంది తప్ప, ఆ అండాలు ఎంత ఆరోగ్యకరంగా ఉన్నాయో (Quality) చెప్పలేదు. ఉదాహరణకు, 35 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్న మహిళకు మంచి AMH స్థాయిలు ఉన్నప్పటికీ, వయస్సు ప్రభావం వల్ల అండాల నాణ్యత తగ్గిపోవచ్చు. మరోవైపు, 25 సంవత్సరాల యువతికి తక్కువ AMH (ఉదాహరణకు 1.0 ng/mL కంటే తక్కువ) ఉన్నప్పటికీ, ఆమె అండాల నాణ్యత చాలా బాగుండటం వల్ల త్వరగా గర్భం దాల్చే అవకాశాలు 60 నుండి 70 శాతం వరకు ఉంటాయి.   అండాల నాణ్యత అంటే అండంలోని జన్యు పదార్థం (DNA/Chromosomes) ఎంత ఆరోగ్యకరంగా ఉందనేది సూచిస్తుంది. నాణ్యమైన అండం మాత్రమే శుక్రకణంతో విజయవంతంగా ఫలదీకరణ (Fertilization) చెంది, ఆరోగ్యకరమైన పిండంగా (Embryo) మారగలదు. నాణ్యత లోపిస్తే ఫలదీకరణ జరగకపోవడం, లేదా పిండం ఏర్పడినా గర్భస్రావం (Miscarriage) కావడం వంటి సమస్యలు తలెత్తుతాయి. మహిళ వయస్సు 35 ఏళ్లు దాటిన తర్వాత అండాల్లో క్రోమోజోమ్ లోపాలు (Aneuploidy) పెరిగే అవకాశం దాదాపు 50 శాతానికి పైగా పెరుగుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. దీనివల్ల సంతానోత్పత్తి క్రమంగా తగ్గుతుంది. అయితే అండాల నాణ్యతను కేవలం వయస్సే కాకుండా మన రోజువారీ జీవనశైలి, ఆహార అలవాట్లు, శరీర బరువు (BMI), మానసిక ఒత్తిడి మరియు ధూమపానం వంటి దురలవాట్లు తీవ్రంగా ప్రభావితం చేస్తాయి. అండాల సంఖ్యను తిరిగి పెంచడం సాధ్యం కాకపోయినప్పటికీ, అందుబాటులో ఉన్న అండాల నాణ్యతను మెరుగుపరచడం లేదా కాపాడుకోవడం ఖచ్చితంగా సాధ్యమేనని వైద్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు. యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండే పండ్లు, ఆకుకూరలు, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ మరియు నిపుణుల సలహాతో కోఎంజైమ్ Q10 (CoQ10), ఫోలిక్ యాసిడ్ వంటి సప్లిమెంట్లు తీసుకోవడం వల్ల అండాల ఆరోగ్యకరమైన ఎదుగుదలకు తోడ్పడుతుంది. అలాగే రోజూ 30 నిమిషాల పాటు వ్యాయామం చేయడం, రసాయనాలు మరియు ప్లాస్టిక్ వాడకానికి దూరంగా ఉండటం, తగినంత నిద్రపోవడం ద్వారా అండాశయ ఆరోగ్య పరిరక్షణ సాధ్యమవుతుంది. కాబట్టి గర్భధారణకు ప్రయత్నించే మహిళలు కేవలం AMH స్కోర్ చూసి కంగారు పడకుండా, అండాల నాణ్యతను పెంపొందించే ఆరోగ్యకరమైన మార్గాలను ఎంచుకోవడం ఎంతో శ్రేయస్కరం.     [Egg Quality, Egg Quantity, Ovarian Reserve, AMH Test, Fertility, Female Fertility, Ovulation, Pregnancy, Reproductive Health, Fertility Tips]
వయసు పెరగడం సహజం.. కానీ వయసుతో వచ్చే ఆరోగ్య సమస్యలను నిర్లక్ష్యం చేయడం మాత్రం మంచిది కాదు. ముఖ్యంగా 60 ఏళ్లు దాటిన తర్వాత మన శరీరంలో అనేక మార్పులు చోటుచేసుకుంటాయి. కిడ్నీలు, ఊపిరితిత్తులు, మెదడు, ఎముకలు వంటి ముఖ్యమైన అవయవాల పనితీరులో కూడా వయసుకు అనుగుణంగా మార్పులు వస్తాయి. 60+ వయసులో పడిపోవడం, నీరసం, వినికిడి తగ్గడం, చూపు సమస్యలు, నిద్రలో మార్పులు వంటి సమస్యలు సాధారణంగా కనిపించవచ్చు. అయితే వీటిని చిన్న సమస్యలుగా భావించి నిర్లక్ష్యం చేస్తే ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంటుంది. ఈ వీడియోలో General Geriatrics & Lifestyle Specialist డాక్టర్ శ్రావణి కుమారి 60 ఏళ్లు దాటిన వారు తమ ఆరోగ్యం విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో వివరిస్తున్నారు. వయసుకు తగ్గట్టుగా మందుల మోతాదు, పోషకాహారం, నిద్ర, శారీరక ఆరోగ్యం వంటి అంశాలపై ప్రత్యేక శ్రద్ధ ఎందుకు అవసరమో తెలియజేస్తున్నారు. అంతేకాదు, నాగార్జున, చిరంజీవి వంటి ప్రముఖులు వయసు పెరిగినా ఫిట్‌గా, యాక్టివ్‌గా మరియు గ్రేస్‌ఫుల్‌గా కనిపించడానికి కారణం ఏమిటి? వయసును ఆరోగ్యంగా, అందంగా స్వీకరించేందుకు ఎలాంటి జీవనశైలి పాటించాలి? అనే అంశాలపై కూడా ఈ వీడియో ఆసక్తికరమైన అవగాహన కల్పిస్తుంది. మీ వయసు 60 దాటిందా? లేదా మీ కుటుంబంలో 60+ వయసున్న వారు ఉన్నారా? అయితే ఈ వీడియోను తప్పక చూడండి. గమనిక: ఈ వీడియోలోని సమాచారం ఆరోగ్య అవగాహన కోసం మాత్రమే. మందులు, ఆహారం లేదా ఇతర చికిత్సలకు సంబంధించి వ్యక్తిగత నిర్ణయాలు తీసుకునే ముందు వైద్యుల సలహా తీసుకోవాలి. మీ ఆరోగ్య సమస్య ఏదైనా... మా హెల్త్ యూట్యూబ్ ఛానల్‌లో సీనియర్ డాక్టర్స్ చెప్పిన సలహాలు... సూచనలు ఉన్నాయి. మా యూట్యూబ్ ఛానల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 👉 TeluguOne Health (సబ్‌స్క్రైబ్ చేయడం మర్చిపోకండి!)
కీళ్ల నొప్పులు, వాపు, ఉదయం లేవగానే కీళ్లు బిగుసుకుపోవడం వంటి సమస్యలు రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ (Rheumatoid Arthritis)లో కనిపించవచ్చు. ఇది సాధారణ కీళ్ల నొప్పులతో పోలిస్తే భిన్నమైన ఆటో ఇమ్యూన్ సమస్య. రుమటాయిడ్ ఆర్థరైటిస్‌కు ఆయుర్వేదం పనిచేస్తుందా? ఇంగ్లీష్ మెడిసిన్ తప్పనిసరా? కొన్ని సందర్భాల్లో సంప్రదాయ వైద్య చికిత్స అవసరం లేదా? ఆటో ఇమ్యూన్ కీళ్ల సమస్యల్లో ఆయుర్వేదాన్ని ఎందుకు కొందరు నిపుణులు సిఫారసు చేయరు? ఫంక్షనల్ మెడిసిన్ విధానం ఎలా భిన్నంగా ఉంటుంది? ఈ వీడియోలో Acupuncture మరియు Functional Medicine నిపుణులు డా. పి.ఎస్. సాగర్ రుమటాయిడ్ ఆర్థరైటిస్‌కు సంబంధించిన వివిధ చికిత్సా విధానాల గురించి వివరిస్తున్నారు. ఆయుర్వేదం, కన్వెన్షనల్ మెడిసిన్, ఫంక్షనల్ మెడిసిన్ మధ్య ఉన్న తేడాలు, వాటి విధానాలు, పరిమితులు మరియు రుమటాయిడ్ ఆర్థరైటిస్‌లో చికిత్సను ఎంచుకునేటప్పుడు పరిగణించాల్సిన అంశాల గురించి తెలుసుకోండి. కీళ్ల నొప్పులు ఉన్నవారు ఈ వీడియోను పూర్తిగా చూడండి. మీ ఆరోగ్య పరిస్థితికి సరైన చికిత్సను నిర్ణయించుకునే ముందు అర్హత కలిగిన వైద్య నిపుణుడిని సంప్రదించడం ముఖ్యం. మీ ఆరోగ్య సమస్య ఏదైనా... మా హెల్త్ యూట్యూబ్ ఛానల్‌లో సీనియర్ డాక్టర్స్ చెప్పిన సలహాలు... సూచనలు ఉన్నాయి. మా యూట్యూబ్ ఛానల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి TeluguOne Health (సబ్‌స్క్రైబ్ చేయడం మర్చిపోకండి!)  
వినాయక చవితి అంటే మనకు ముందుగా గుర్తుకువచ్చేది భక్తిశ్రద్ధలు, రంగురంగుల మండపాలు, అంతకుమించి స్వామివారికి నివేదించే రకరకాల నైవేద్యాలు. బొజ్జ గణపయ్యకు పెట్టే ప్రసాదాలు కేవలం సంప్రదాయంలో భాగం మాత్రమే కాదు, వాటి వెనుక అద్భుతమైన ఆరోగ్య రహస్యాలు కూడా దాగి ఉన్నాయి. వర్షాకాలంలో వచ్చే ఈ పండుగ సమయంలో వాతావరణంలో అనేక మార్పులు చోటుచేసుకుంటాయి. వర్షాల వల్ల రోగనిరోధక శక్తి తగ్గి, జీర్ణక్రియ మందగించే అవకాశం ఉంటుంది. మన పెద్దలు ఆ కాలానికి తగినట్లుగా, శరీరానికి మేలు చేసే పదార్థాలనే వినాయకుడి ప్రసాదాలుగా మార్చారు. ఆ ప్రసాదాలు ఏమిటి, వాటి వల్ల లభించే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో వివరంగా తెలుసుకుంటే.. కుడుములు , ఉండ్రాళ్ళు.. వినాయక చవితి అనగానే అందరికీ ముందుగా గుర్తొచ్చేవి కుడుములు, ఉండ్రాళ్ళు. వీటిని నూనె లేకుండా కేవలం ఆవిరి మీద మాత్రమే ఉడికిస్తారు. ఆవిరి మీద ఉడికే ఆహార పదార్థాలు జీర్ణం కావడానికి చాలా సులభంగా ఉంటాయి. బియ్యపు పిండి, పెసరపప్పు లేదా శనగపప్పు, బెల్లం, కొబ్బరి కలగలిపి వీటిని తయారుచేస్తారు. బియ్యపు పిండి కార్బోహైడ్రేట్లను కలిగి ఉంటుంది, శరీరానికి తక్షణ శక్తిని అందిస్తుంది. ఆవిరి వంటకం కావడం వల్ల జీర్ణక్రియకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. ముఖ్యంగా పొట్టలో మంట, గ్యాస్ వంటి సమస్యలు రాకుండా ఇవి కాపాడతాయి. కొందరు కుడుములను మైదా పిండితో నూనెలో డీప్ ఫ్రై చేసి చేస్తారు. ఇది అంత ఆరోగ్యానికి మంచిది కాదు.   బెల్లం , పప్పుధాన్యాల కాంబినేషన్.. అన్ని రకాల ప్రసాదాలలో బెల్లం ప్రధాన పాత్ర పోషిస్తుంది. బెల్లంలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. ఇది రక్తహీనతను నివారించడంలో సహాయపడుతుంది. అలాగే కాలేయాన్ని శుభ్రపరచడానికి, శరీరంలోని విషపదార్థాలను బయటకు పంపడానికి బెల్లం ఎంతో ఉపయోగపడుతుంది. కుడుముల్లో వాడే శనగపప్పు, పెసరపప్పుల ద్వారా శరీరానికి కావలసిన ప్రోటీన్లు లభిస్తాయి. వర్షాకాలంలో పెరిగే బ్యాక్టీరియాను ఎదుర్కోవడానికి బెల్లం, పప్పుధాన్యాల కాంబినేషన్ శరీరానికి మంచి బలవర్ధకమైన ఆహారంగా పనిచేస్తుంది. జిల్లేడు కాయలు , మోదకాలు.. విఘ్నేశ్వరుడికి అత్యంత ప్రీతిపాత్రమైన మోదకాలను బియ్యపు పిండిలో బెల్లం, కొబ్బరి పూరకంతో చేస్తారు. కొబ్బరిలో ఉండే మంచి కొవ్వులు చర్మానికి, జుట్టుకు చాలా మంచివి. అంతేకాకుండా కొబ్బరి శరీరానికి అవసరమైన శక్తిని త్వరగా అందిస్తుంది. కొబ్బరి , బెల్లం కలిపి తినడం వల్ల శరీరంలో నిరోధక శక్తి పెరుగుతుంది. వర్షాకాలంలో వచ్చే చర్మ సమస్యలు, వాత రోగాల నివారణకు  ఈ కాంబినేషన్ చక్కగా తోడ్పడుతుంది. పాయసం , పరమాన్నం.. పాలు, బియ్యం, బెల్లం లేదా చక్కెరతో తయారుచేసే పాయసం నివేదనలో ముఖ్యమైనది. పాలల్లో లభించే కాల్షియం ఎముకలను దృఢంగా చేస్తుంది. ఇందులో వేసే యాలకులు జీర్ణక్రియను వేగవంతం చేస్తాయి. నోటి దుర్వాసనను పోగొట్టడమే కాకుండా, కడుపులో ఉన్న ఉబ్బరాన్ని తగ్గిస్తాయి. పాయసంలో వాడే నెయ్యి శరీరానికి కావలసిన విటమిన్లు ఎ, డి లభించేలా చేస్తుంది , కీళ్ళకు అవసరమైన నూనెను అందిస్తుంది. పులిహోర.. ఏ పండుగైనా పులిహోర లేకపోతే నివేదన పూర్తికాదు. వినాయక చవితి నాడు నిమ్మకాయ లేదా చింతపండు పులిహోరను ప్రసాదంగా పెడతారు. చింతపండు, నిమ్మకాయలలో విటమిన్ సి అధికంగా ఉంటుంది. వర్షాకాలంలో విటమిన్ సి లభించడం వల్ల జలుబు, దగ్గు, గొంతు నొప్పుల వంటి వ్యాధులు దరిచేరకుండా ఉంటాయి. పులిహోర తాళింపులో వాడే పసుపు సహజమైన యాంటీబయోటిక్‌గా పనిచేస్తుంది. పసుపులోని కుర్కుమిన్ అనే అంశం శరీరంలో మంటను తగ్గించి, రోగనిరోధక శక్తిని పెంపొందిస్తుంది. అలాగే ఇందులో వేసే అల్లం, మిరియాలు జీర్ణరసాలను ఉత్పత్తి చేసి ఆకలిని పెంచుతాయి. చలిమిడి , వడపప్పు.. వినాయక చవితి పూజ ముగిసిన తర్వాత ఇచ్చే ముఖ్యమైన ప్రసాదం చలిమిడి ,   పచ్చి పెసరపప్పును నీటిలో నానబెట్టి వడపప్పుగా ఇస్తారు. నానబెట్టిన పెసరపప్పులో పీచు పదార్థం, ప్రోటీన్లు ఎక్కువ స్థాయిలో ఉంటాయి. ఇది శరీరాన్ని చల్లబరుస్తుంది. వేడి చేసిన బియ్యపు పిండి, బెల్లం కలిపి చేసే చలిమిడి శరీరానికి తక్షణ బలాన్ని ఇస్తుంది. వర్షాకాలంలో కలిగే అలసటను నివారించడంలో ఈ  కాంబినేషన్ అద్భుతంగా పనిచేస్తుంది. పండ్ల నివేదన , పత్రీ ప్రభావం.. స్వామివారికి ప్రసాదాలతో పాటు రకరకాల పండ్లను సమర్పిస్తారు. ముఖ్యంగా వెలగపండు, నేరేడు పళ్ళు, అరటిపళ్ళు నివేదిస్తారు. వెలగపండు జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది, కడుపులోని క్రిములను సంహరిస్తుంది. నేరేడు పళ్ళు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రణలో ఉంచుతాయి. వీటితో పాటు పూజలో ఉపయోగించే ఏకవింశతి పత్రి కూడా ఒక రకమైన ఔషధ గని. పూజ చేసే సమయంలో ఆ పత్రి తాకిడి, వాటి సువాసనల వల్ల శ్వాసకోశ సంబంధిత సమస్యలు తొలగిపోతాయని ఆయుర్వేదం చెబుతోంది. ఈ విధంగా వినాయక చవితి ప్రసాదాలు కేవలం నైవేద్యం మాత్రమే కాకుండా, మారుతున్న వాతావరణానికి అనుగుణంగా మన ఆరోగ్యాన్ని పరిరక్షించే ఔషధాలుగా పనిచేస్తాయి. మన సంస్కృతిలో భాగమైన ఈ ప్రసాదాలను తిని, పండుగను భక్తితో పాటు ఆరోగ్యకరంగా జరుపుకోవడం ఆ వినాయకుడు ఇచ్చే అదృష్టం.. !                          *రూపశ్రీ.