LATEST NEWS
తెలుగుదేశం  అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని గత జగన్ సర్కార్ స్కిల్ కేసు పేరిట అక్రమంగా అరెస్టు చేసి గురువారం (సెప్టెంబర్ 10)కి సరిగ్గా మూడేళ్ల అుతున్న సందర్భంగా  రాష్ట్రవ్యాప్తంగా  నిజం గెలిచింది కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని తెలుగుదేశం జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి నారా లోకేశ్  పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. మంగళగిరిలోని కేంద్ర పార్టీ కార్యాలయంలో  జరిగిన  లీడర్‌షిప్ కాంక్లేవ్ సదస్సు వేదికగా ఆయనీ పిలుపు ఇచ్చారు.  సుదీర్ఘ పోరాటాలు, క్లిష్ట పరిస్థితుల్లో శ్రేణులు చేసిన త్యాగాల ఫలితంగానే  తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని, కార్యకర్తల శ్రమను ఎప్పటికీ మరువలేమని లోకేష్ పునరుద్ఘాటించారు.  జగన్ ప్రభుత్వ హయాంలో చంద్రబాబును రాజమండ్రి సెంట్రల్ జైలులో యాభై మూడు రోజుల పాటు అన్యాయంగా నిర్బంధించిన విషయాన్నిగుర్తు చేసిన లోకేష్.. ఎటువంటి ఆధారాలు లేకుండా కేవలం కక్షసాధింపు చర్యల్లో భాగంగానే  నాడు ఆ అరెస్ట్ జరిగిందన్నారు.  చివరికి న్యాయస్థానాలు,  ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఎలాంటి తప్పు జరగలేదని క్లీన్ చిట్ ఇవ్వడంతో నిజమే గెలిచిందని స్పష్టం చేశారు. ఈ చారిత్రక సత్యాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు, చంద్రబాబు అక్రమ అరెస్ట్ మూడేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ప్రతి ఒక్కరూ తమ ఇళ్ల వద్ద,  పార్టీ కార్యాలయాల్లో యాభై మూడు దీపాలను వెలిగించాలని  కోరారు. ఈ సదస్సు వేదికగా పార్టీ నాయకులకు లోకేశ్  పార్టీ, పర్సనల్, ప్రభుత్వం  అనే  3-పీ  మార్గదర్శకాలను నిర్దేశించారు. నాయకులు కేవలం పదవులకే పరిమితం కాకుండా వ్యక్తిగతంగా ప్రజలకు, క్షేత్రస్థాయి కార్యకర్తలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను లబ్ధిదారులకు వివరించడంతో పాటు..  పార్టీ సంస్థాగత పటిష్టత కోసం కార్యకర్తలంతా క్రియాశీలకంగా శ్రమించాలని దిశానిర్దేశం చేశారు. ఉన్నత స్థానాలకు ఎదిగే కొద్దీ మరింత వినయంగా ఉంటూ, ప్రతి ఒక్కరితోనూ మానవతా దృక్పథంతో మమేకం కావాలన్నారు.  జగన్ హయాంలో నిరుద్యోగ యువత ఎదుర్కొన్న ఇబ్బందులను ఎత్తి చూపిన లోకేష్. డీఎస్సీకి, ఏపీపీఎస్సీకి మధ్య   వ్యత్యాసం కూడా తెలియని గత పాలకుల విధానాల వల్ల యువత భవిష్యత్తు అంధకారంలోకి వెళ్లిపోయిందని విమర్శించారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే మెగా డీఎస్సీపై తొలి సంతకం చేసి ఉపాధ్యాయ పోస్టుల భర్తీ ప్రక్రియను ప్రారంభించామని, రాబోయే ఐదు సంవత్సరాల కాలంలో మొత్తం ముప్పై వేల ఉద్యోగాలను భర్తీ చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని వివరించారు.  రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న పారదర్శక పాలనను అడ్డుకునేందుకు ప్రతిపక్షాలు చేస్తున్న తప్పుడు ప్రచారాలను సోషల్ మీడియా వేదికగా, క్షేత్రస్థాయిలో   తిప్పికొట్టాలని సూచించారు. పార్టీలో అంతర్గత విభేదాలకు, అహంకారాలకు  ఎట్టి పరిస్థితుల్లోనూ తావు ఉండకూడదన్న నారా లోకేష్.. ప్రస్తుతం పార్టీని  టీడీపీ 3.0 వెర్షన్‌గా తీర్చిదిద్దుతున్నామన్నారు.  అందరూ సమన్వయంతో కలిసికట్టుగా పనిచేస్తేనే రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి పథంలో ముందుకు నడిపించగలమని పేర్కొన్నారు. ప్రతి కార్యకర్తను కంటికి రెప్పలా కాపాడుకోవడం పార్టీ బాధ్యత అని, కష్టకాలంలో నిలబడిన ప్రతి ఒక్కరికీ సముచిత గుర్తింపు ఉంటుందని భరోసా కల్పించారు.  [TDP P3 Vertion, Nara Lokesh, Chandrababu Naidu arrest anniversary, Nijam Gelichindi program, Telugu Desam Party, AP Leadership Conclave, Telugu One]
స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యల కేసులో నాంపల్లి కోర్టు కీలక నిర్ణయం..!  తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై అనుచిత, అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో అరెస్టయిన ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలకు నాంపల్లి న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది. ఎమ్మెల్సీలు తాత మధుసూదన్ అలియాస్ తాత మధు, ఎన్. నవీన్ కుమార్ రెడ్డిలకు కోర్టు షరతులతో కూడిన బెయిల్ ఇచ్చింది. పోలీసులు సమర్పించిన రిమాండ్ రిపోర్టును పరిగణనలోకి తీసుకున్న న్యాయస్థానం.. ఒక్కొక్క రికి రూ.20 వేల చొప్పున రెండు పూచీకత్తులు సమర్పించాలని ఆదేశించింది.కేసు తదుపరి విచారణను ఈ నెల 17వ తేదీకి నాంపల్లి కోర్టు వాయిదా వేసింది. అదే రోజు తాత మధు, నవీన్ కుమార్ రెడ్డిలు వ్యక్తిగతంగా న్యాయస్థానం ఎదుట హాజరు కావాలని ఆదేశించింది.  ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్న నేపథ్యంలో ప్రజాప్రతిని ధులుగా సభా కార్యక్రమా లకు హాజరుకావాల్సిన అవసరం ఉందని ఎమ్మెల్సీల తరఫు న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఈ అంశాన్ని కూడా న్యాయస్థానం పరిగణనలోకి తీసుకుని బెయిల్ మంజూరు చేసినట్లు తెలుస్తోంది. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో సోమవారం అసెంబ్లీ ప్రధాన ద్వారం వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నల్ల దుస్తులతో నిరసన చేపట్టిన సమయంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. సభలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించిన బీఆర్ఎస్ నేతలను పోలీసులు అడ్డుకోవడంతో వాగ్వాదం, తోపులాట జరిగింది. ఈ సందర్భంగా స్పీకర్‌పై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారంటూ స్పీకర్ ఓఎస్డీ పొల్లేపల్లి వెంకటేశం సైఫాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు ఆధారంగా పోలీసులు భారతీయ న్యాయ సంహిత (బీఎన్‌ఎస్)లోని సెక్షన్ 352, 3(5)తో పాటు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీస్ నిరోధక చట్టంలోని సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. మంగళవారం ఉదయం తాత మధు, నవీన్ కుమార్ రెడ్డిలను పోలీసులు అదుపులోకి తీసుకుని నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. రిమాండ్ కోరుతూ పోలీసులు సమర్పించిన నివేదికను న్యాయస్థానం పరిశీలించింది. అనంతరం ఇద్దరికీ బెయిల్ మంజూరు చేసింది. తనపై వచ్చిన అనుచిత వ్యాఖ్యల ఆరోపణలను ఎమ్మెల్సీ తాత మధు ఇప్పటికే ఖండించారు. తన వ్యాఖ్యలను వక్రీకరించారని, తాను స్పీకర్‌ను ఉద్దేశించి ఆ వ్యాఖ్యలు చేయలేదని ఆయన స్పష్టం చేశారు. తన వ్యాఖ్యల్లో స్పీకర్‌ను దూషించినట్లు భావిస్తే వాటిని ఉపసంహరిం చుకుంటున్నట్లు కూడా పేర్కొన్నారు. మరోవైపు అసెంబ్లీ వద్ద జరిగిన ఘటనలో విధుల్లో ఉన్న పోలీసులతో బీఆర్ఎస్ నేతలు ఘర్షణకు దిగారన్న ఆరోపణలు కూడా రాజకీయంగా దుమారం రేపుతున్నాయి. పోలీసులను అడ్డుకోవడం, దాడికి పాల్పడటం వంటి ఆరోపణలపై పలువురు బీఆర్ఎస్ నేతలపై కేసులు నమోదయ్యాయి. అయితే పోలీసులు తమ పట్ల దురుసుగా వ్యవహరించారని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. అసెంబ్లీ ప్రాంగణంలో బీఆర్ఎస్ మహిళా ప్రజాప్రతినిధుల పట్ల పోలీసులు వ్యవహరించిన తీరుపైనా వివాదం కొనసాగుతోంది.  ఈ వ్యవహారంపై తెలంగాణ హైకోర్టు స్పందిస్తూ.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను అసెంబ్లీకి వెళ్లకుండా పోలీసులు అడ్డుకోవద్దని ఆదేశించింది. అసెంబ్లీ నిబంధనల ఉల్లంఘన జరిగితే చర్యలు తీసుకునే అధికారం స్పీకర్‌కే ఉంటుందని స్పష్టం చేసింది. సంబంధిత పోలీసుల వ్యవహారంపై విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని డీజీపీని ఆదేశించింది. ఇలా స్పీకర్‌పై వ్యాఖ్యల కేసులో ఎమ్మెల్సీల అరెస్టు, నాంపల్లి కోర్టు బెయిల్, అసెంబ్లీ వద్ద పోలీసులతో ఘర్షణ, మహిళా ప్రజాప్రతినిధుల పట్ల పోలీసుల వ్యవహారంపై వివాదం వంటి పరిణామాలతో తెలంగాణ రాజకీయాల్లో ఉద్రిక్తత కొనసాగుతోంది.       (BRS MLCs, Tata Madhusudan, N Naveen Kumar Reddy, Telangana Assembly, Telangana Legislative Council, Assembly Speaker, K Chandrasekhar Rao, KCR, Damodar Rajanarsimha, BRS, Telangana Politics, Assembly Resolution, Assembly Privileges, Legislative Council Chairman, Political Controversy)
టీడీపీ కేంద్ర కార్యాలయంలో రెండో రోజు నిర్వహిస్తున్న లీడర్‌షిప్ కాంక్లేవ్‌లో పొలిటికల్ కమ్యూనికేషన్ అండ్ పబ్లిక్ ఓరియంటేషన్ అంశంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ మాట్లాడారు. ఈ సందర్భంగా పార్టీ నేతలు సోషల్ మీడియాను ఎంతవరకు యాక్టివ్‌గా వినియోగిస్తున్నారనే అంశంపై ఆయన ఆరా తీశారు. సోషల్ మీడియాను నేతలు సమర్థంగా వినియోగించాలని లోకేష్ సూచించారు. సోషల్ మీడియానే కదా అని తేలిగ్గా తీసుకోవద్దని.. దీనిపై సీరియస్‌గా దృష్టి పెట్టాలని చెప్పారు. ఏఎంసీ, కార్పొరేషన్ ఛైర్మన్లు కూడా తాము చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను సోషల్ మీడియా ద్వారా ఎప్పటికప్పుడు ప్రజలకు తెలియజేస్తున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను సోషల్ మీడియా ద్వారా ప్రజలకు వివరించాలని.. ప్రభుత్వ పనితీరుపై ఓపెన్‌గా మాట్లాడాలని నేతలకు సూచించారు. ప్రధాని నరేంద్ర మోదీ సైతం సెల్ఫీ వీడియోల ద్వారా తన సందేశాన్ని ప్రజలకు చేరవేస్తున్నారని గుర్తుచేశారు. తాను కూడా సుజ్లాన్ విండ్ ప్రాజెక్టులకు శంకుస్థాపన, డీఎస్సీపై జరుగుతున్న దుష్ప్రచారానికి సంబంధించి సెల్ఫీ వీడియోలు రూపొందించి సోషల్ మీడియాలో పోస్ట్ చేసినట్లు లోకేష్ తెలిపారు. విషయం చిన్నదైనా, పెద్దదైనా ప్రజలకు వాస్తవాలను తెలియజేయాల్సిన బాధ్యత నాయకులపై ఉందన్నారు. ప్రతిపక్షాల పని ఎప్పుడూ బురదజల్లడమేనని వ్యాఖ్యానించిన లోకేష్.. వారి దుష్ప్రచారాన్ని సోషల్ మీడియా వేదికగా ఎప్పటికప్పుడు తిప్పికొట్టాలని సూచించారు. పార్టీ ఆదేశాలు, కార్యక్రమాలపై సోషల్ మీడియా టీమ్స్ తక్షణమే స్పందించేలా పనిచేయాలని అన్నారు. జగన్‌కు సంబంధించిన అంశాల్లో వైసీపీ నేతలు, కార్యకర్తలు గుడ్డిగా సమర్థిస్తున్నారని లోకేష్ విమర్శించారు. అమరావతిని అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేస్తున్నామని.. ఈ విషయాన్ని మరింత విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని పార్టీ నేతలకు సూచించారు.       (Minister  Nara Lokesh, Telugu Desam Party, Amaravati, Leadership Conclave, Political Communication, Public Orientation, Social Media, TDP Leaders, Social Media Strategy, CM Chandrababu, YS Jagan, YSRCP, Telugu One, Telugu News)
ALSO ON TELUGUONE N E W S
జనరల్ గా ఎంత పెద్ద హిట్ సినిమా అయినా రెండో వారం దాటి మూడో వారంలోకి అడుగుపెడితే కలెక్షన్ల వేగం నెమ్మదించడం కామన్.  కానీ 'ఇరుముడి' విషయంలో మాత్రం ఆ బాక్సాఫీస్ సూత్రాలన్నీ బుంగమూతి పెట్టుకోవడం స్టార్ట్ చేసాయి. ఎందుకంటే మూడో ఆదివారం నాడు కూడా  ఏకంగా 2.15 లక్షల టికెట్లు అమ్ముడవడమే.  ముఖ్యంగా నైజాం ఏరియాలో 'ఇరుముడి' సృష్టిస్తున్న కలెక్షన్ల సునామీ ఒక విధ్వంసమనే చెప్పాలి. ఇప్పటికే నైజాం ప్రాంతంలో  83 .75 కోట్ల గ్రాస్ లోకి చేరింది. అంటే  58 కోట్ల షేర్ రాబట్టి , నాన్, మల్టీస్టారర్ మరియు నాన్-సీక్వెల్ విభాగంలో టాలీవుడ్ టాప్ రికార్డులని  ఒక్కొక్కటిగా అధిగమిస్తోంది. గతంలో 55 కోట్ల షేర్ నమోదు చేసిన 'పెద్ది' మార్కును దాటేసి నైజాంలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల టాప్ 5 జాబితాలో సగర్వంగా నిలిచింది. ప్రస్తుతం 'కల్కి' 93 కోట్లు, 'సలార్' .72 కోట్లు, 'దేవర' 63 కోట్లు వంటి భారీ చిత్రాల సరసన నిలిచిన 'ఇరుముడి', అతి త్వరలోనే నైజాంలో ఏకంగా 100 కోట్ల గ్రాస్ మైలురాయిని అందుకోవడానికి అడుగులు వేస్తోంది. రానున్న వినాయక చవితి పండుగ సెలవులు కూడా తోడుకానుండటం అదనపు బలం.       Also Read: ఆ భాషపై శివరాజ్ కుమార్ వ్యాఖ్యలు వైరల్..పెద్దిలో గౌరు నాయుడుగా అలరించాడు కదా! దర్శకుడు శివ నిర్వాణ తండ్రీకూతుళ్ల అనుబంధం, భక్తి, భావోద్వేగాల కలయికతో తీర్చిదిద్దిన ఈ కథ ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంటోంది. పెట్టుబడికి ఇప్పటికే 100 కోట్లకు పైగా నికర లాభాలను అందించి, ఏకంగా 4 నుండి 5 రెట్ల ప్రతిఫలాన్ని నిర్మాతలకు తెచ్చిపెట్టింది. రవితేజ శక్తివంతమైన నటన, ప్రియా భవానీ శంకర్ సహజ అభినయం, చిన్నారి బేబీ నక్షత్ర అమాయకత్వం, దీనికితోడు జీవీ ప్రకాష్ అందించిన అద్భుతమైన నేపథ్య సంగీతం ఈ సినిమా విజయంలో కీలక పాత్ర పోషించాయి. కొత్త చిత్రాలు పోటీగా వస్తున్నప్పటికీ, మూడో వారంలోనూ అదే స్థాయి ఆధిక్యాన్ని ప్రదర్శిస్తుండటంతో ఈ చిత్రాన్ని నిర్మాతలు 'జనరేషనల్ బ్లాక్‌బస్టర్'గా కొనియాడుతున్నారు. ఓవర్ ఆల్ గా ఇరుముడి కలెక్షన్స్ చూసుకుంటే ప్రెజెంట్ 250 కోట్ల మార్కుకి చేరువలో ఉంది.     [Irumudi, Nizam Box Office, Peddi, Kalki, salaar, Telugu Cinema, Telugu CinemaNews, Tollywood, Tollywood News]    
డిజిటల్ వినోదాన్ని కోరుకునే సినిమా ప్రియులకు ఈ వారం పండగే అని చెప్పాలి. ప్రతి శుక్రవారం లాగే ఈ వారం కూడా వేర్వేరు ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో ఆసక్తికరమైన సినిమాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి. ముఖ్యంగా తమిళ, మలయాళ చిత్రాలు తెలుగు ఆడియెన్స్‌ను అలరించేందుకు సిద్ధమయ్యాయి. తమిళ స్టార్ హీరో సూర్య నటించిన క్రేజీ మూవీ 'విశ్వనాథ్ అండ్ సన్స్' ఈ నెల 11 నుంచి ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. వెంకీ అట్లూరి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సూర్య సరసన మమితా బైజు కథానాయికగా అలరించింది. పాన్ ఇండియా స్థాయిలో ఐదు భాషల్లో ఈ చిత్రం వీక్షకులకు అందుబాటులోకి రానుంది. మరోవైపు యాక్షన్ హీరో విశాల్ నటించిన భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ 'మకుటం' కూడా అదే రోజున డిజిటల్ బాట పడుతోంది. ఈ సినిమా ఈ నెల 11వ తేదీ నుంచి ప్రముఖ డిజిటల్ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులోకి రానుంది. ఇందులో విశాల్ ద్విపాత్రాభినయం చేయడం విశేషం. ఇక ఈ సినిమాల బ్యాక్‌గ్రౌండ్ విషయానికి వస్తే, 'విశ్వనాథ్ అండ్ సన్స్' ఆగస్టులో థియేటర్లలోకి వచ్చి ఏకంగా రూ. 250 కోట్లకు పైగా వసూళ్లతో బాక్సాఫీస్ వద్ద రికార్డు విజయం సాధించింది. ఇక 'మకుటం' విషయానికొస్తే, విశాల్ స్వీయ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ సినిమాలో అంజలి, దుషారా విజయన్ కథానాయికలుగా నటించగా జీవీ ప్రకాష్ కుమార్ స్వరాలు సమకూర్చారు. కేవలం తమిళ చిత్రాలే కాకుండా మలయాళ పరిశ్రమ నుంచి వచ్చిన సస్పెన్స్ డ్రామా 'వరవు' కూడా ఓటీటీ ప్రియులను పలకరించనుంది. షాజీ కైలాస్ దర్శకత్వంలో జోజు జార్జ్, మురళి గోపి ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ చిత్రం 'జీ 5' ప్లాట్‌ఫామ్‌లో సెప్టెంబర్ 11 నుంచి డిజిటల్ స్ట్రీమింగ్ కాబోతోంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ సినిమాల ఓటీటీ ఎంట్రీపై విపరీతమైన బజ్ నడుస్తోంది. థియేటర్లలో మిస్ అయిన సినిమాలను ఇంటి వద్దే వీక్షించేందుకు అభిమానులు, సినిమా ప్రియులు ముచ్చటపడుతూ కామెంట్లు చేస్తున్నారు. ఈ ఫ్రైడే డిజిటల్ స్పేస్‌లో రాబోతున్న ఈ విభిన్నమైన కథాంశాల సినిమాలు ఓటీటీ వీక్షకులను ఏ స్థాయిలో ఆకట్టుకుంటాయో వేచి చూడాలి.
  సౌత్ సినీ ప్రేమికులకి పరిచయం అక్కర్లేని పేరు కరుణాడ చక్రవర్తి  'శివరాజ్‌కుమార్'. ఇటీవల పెద్దిలో గౌరు నాయుడుగా అలరించిన  శివరాజ్‌కుమార్ కి సొంత ఏరియా కర్ణాటకలో ఉన్న ఫాలోయింగ్ గురించి చెప్పుకుంటే ఎవరికైనా మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే. చూడని హిట్టు లేదు, కొట్టని రికార్డు లేదు. మొదటి మూడు సినిమాలు  వరుసగా 100 రోజులు ఆడి బ్లాక్‌బస్టర్ హిట్లుగా నిలిచాయి.  శివ రాజ్‌కుమార్ తాజాగా ఒక వివాదంలో చిక్కుకొని, ఆ తర్వాత అభిమానులకు, కన్నడ ప్రజలకి క్షమాపణలు చెప్పారు. ఇటీవల ఆయన నటించబోయే కొత్త బహుభాషా చిత్రం ‘ఒరిజినల్ మాన్‌స్టర్’ (Original Monster) టైటిల్ లాంచ్ వేడుకలో మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. ఈ క్రమంలో ఒక విలేకరి  హిందీ డైలాగులు చెప్పడం గురించి ప్రశ్నించగా, శివ రాజ్‌కుమార్ స్పందిస్తూ “హిందీ నాకు రెండో భాష, అది చాలా తేలికైన భాష. పైగా అది మన జాతీయ భాష కూడా. దానిని మనం ఎందుకు నేర్చుకోకూడదు?” అని వ్యాఖ్యానించారు. ఆయన చేసిన ఈ ఒక్క వ్యాఖ్య సోషల్ మీడియా వేదికగా తీవ్రమైన దుమారాన్ని రేపింది. కన్నడ భాషాభిమానులు, పలువురు నెటిజన్లు శివ రాజ్‌కుమార్ కామెంట్స్‌పై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. మన దేశంలో అధికారికంగా ఏ ఒక్క భాషకూ జాతీయ భాష హోదా లేదని, భారత్‌లో అన్ని ప్రాంతీయ భాషలూ సమానమేనని స్పష్టం చేస్తూ  విమర్శలు స్టార్ట్ చేసారు. ఈ వివాదం నెట్టింట వ్యాపించి దాదాపు 100% ప్రతికూల చర్చకు దారితీయడంతో శివ రాజ్‌కుమార్ తక్షణమే స్పందించారు.       Also Read: నందమూరి మోక్షజ్ఞకి జోడీగా ఆ స్టార్ హీరోయిన్: ఈ హీరోయిన్ కూడా లిస్ట్ లో ఉంది తాజాగా ఒక మీడియా సమావేశంలో మాట్లాడుతూ నా మాటల వల్ల ఎవరి మనోభావాలైనా దెబ్బతిని ఉంటే మనస్ఫూర్తిగా క్షమాపణలు కోరుతున్నాను. నేను ఆ సమయంలో హిందీని జాతీయ భాష అని పొరపాటున మాట్లాడాను. భారతదేశంలో ఉన్న అనేక ముఖ్యమైన భాషల్లో హిందీ కూడా ఒక భాష మాత్రమే. భారతీయ భాషల విషయంలో నేను కొంత గందరగోళానికి గురై ఆ పదాన్ని వాడాను. నాకు తెలియక జరిగిన ఈ పొరపాటుకి క్షమాపణలు. ఎవరి భాష వారికి గొప్పది, హిందీ మాట్లాడేవారికి ఆ భాష ఎంత ముఖ్యమో, కన్నడిగులకు కన్నడ భాష అంతకంటే ఎక్కువ ప్రాధాన్యమైనది. మా భాష గౌరవాన్ని మేమెప్పుడూ తగ్గిపోనివ్వం” అనిస్పష్టం చేశారు.         [Shiva Rajkumar, Hindi National Language, Apologises , Kannada remark, Telugu Cinema, Telugu CinemaNews, Tollywood, Tollywood News]   
టాలెంటెడ్ యాక్ట్రెస్ నివేదా థామస్ మళ్లీ మనందరి గుండెల్లో నిలిచిపోయే ఒక అద్భుతమైన ఫ్యామిలీ రోల్‌తో రాబోతున్నారు. '35 చిన్న కథ కాదు' సినిమాతో తన నట విశ్వరూపాన్ని చూపించిన నివేదా, ఇప్పుడు ఓటీటీని షేక్ చేయడానికి సిద్ధమయ్యారు. ZEE5 ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లో రాబోతున్న సరికొత్త ఒరిజినల్ సిరీస్ 'శ్రీమతి'. ఈ సిరీస్‌కు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది. ప్రైమ్ షో ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై ప్రొడ్యూస్ అవుతున్న ఈ వెబ్ సిరీస్‌ను విశ్వక్ ఖండేరావు డైరెక్ట్ చేస్తున్నారు. ప్రతి ఇంట ఉండే చిన్న చిన్న ఆనందాలు, వంటగది సెంటిమెంట్స్, బాధ్యతలు అన్నీ కలగలిపిన "ప్రతి ఇంటి కథ"గా ఈ సిరీస్ రూపుదిద్దుకుంటోంది. ఫస్ట్ లుక్ పోస్టర్ చూస్తేనే మనకు హోమ్‌లీ ఫీలింగ్ కలుగుతుంది. పోస్టర్‌లో నివేదా థామస్ చాలా సంప్రదాయబద్ధంగా, చిరునవ్వుతో కనిపిస్తున్నారు. పోస్టర్ లో చుట్టూ కిచెన్ వాతావరణం, నెమలి డిజైన్లతో చాలా కలర్‌ఫుల్‌గా డిజైన్ చేశారు. నివేదా థామస్ కేవలం గ్లామర్ పాత్రలకే పరిమితం కాకుండా, ఎమోషనల్ అండ్ పెర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ క్యారెక్టర్స్‌ను ఎంచుకుంటూ దూసుకుపోతున్నారు. ఇటీవల వచ్చిన '35 చిన్న కథ కాదు' సినిమాలో మధ్యతరగతి తల్లిగా ఆమె నటనకు ఆడియన్స్ బ్రహ్మరథం పట్టారు. ఉత్తమ నటిగా తెలంగాణ గద్దర్ అవార్డు కూడా అందుకున్నారు. ఇప్పుడు మళ్లీ అదే తరహా ఎమోషనల్ డెప్త్ ఉన్న 'శ్రీమతి' అనే రిలేటబుల్ రోల్‌లో కనిపిస్తుండటంతో అభిమానుల్లో అంచనాలు రెట్టింపు అయ్యాయి. కుటుంబ సమేతంగా కూర్చొని చూడదగ్గ ఫ్యూర్ ఎమోషనల్ డ్రామాగా 'శ్రీమతి' అలరించబోతోంది. విశ్వక్ ఖండేరావు మేకింగ్ స్టైల్, ప్రైమ్ షో ఎంటర్‌టైన్‌మెంట్ ప్రొడక్షన్ వాల్యూస్ కలిస్తే ZEE5 లో మరొక క్లాసిక్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ రావడం ఖాయంగా కనిపిస్తోంది. టాలీవుడ్ ఇండస్ట్రీ వర్గాలు కూడా ఈ ఫస్ట్ లుక్ చూసి చాలా పాజిటివ్‌గా స్పందిస్తున్నాయి. https://x.com/i_nivethathomas/status/2097568753462726714     [Srimathi First Look, Nivetha Thomas, Srimathi Web Series, ZEE5 Telugu Original, Vishvak Khanderao, Telugu Web Series, Telugu Film News, Telugu News]  
Ranabaali starring Vijay Deverakonda, Rashmika Mandanna is planned on his career highest budget in the direction of Rahul Sankrityan. The movie explores the story of Singanamala Bobbili Ranabaali who rose against British atrocities forcing villages into femine and severe drought conditions.  The movie teaser states that 8 million Indians have lost their lives during 1876-1878 as British taxes against the grains, and their need to export every piece of produce. Ranabaali, a local cheftain rises against these atrocities and starts killing British officials.  He is known as Savage and the teaser is titled, Savage's Oath, as he decides to not let even one grain of produce be exported from their land. Vijay Deverakonda in this role seems to be trying to hard to fit in as his look and get-up doesn't match him. He tried to be more theatrical and over-the-top which can go off.  The movie seems to not at all try to be understated like Lagaan but more over-the-top and loud. Even antagonist Arnold Vosloo is made to act in the similar way. While the vision of the director and visuals, production values are commendable, this pitch of story-telling could backfire as it seems forced at places. The movie is releasing on 16th October and we have to wait and see, how makers will deliver an output that would negate the tonal disadvantages.  Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.   
విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న నటిస్తున్న పీరియాడిక్ యాక్షన్ ఎపిక్ మూవీ 'రణబాలి'. రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ మూవీ అక్టోబర్ 16న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. తాజాగా రిలీజ్ అయిన టీజర్ గూస్ బంప్స్ తెప్పిస్తోంది.  1876-78 కాలంలో బ్రిటీష్ వాళ్ల దారుణమైన పాలన, మద్రాస్ ప్రెసిడెన్సీలో వచ్చిన ఘోరమైన కరువు, ఆకలి చావులు... ఇవన్నీ చూస్తుంటే కడుపు తరుక్కుపోతుంది. "ఇది అన్నపూర్ణ దేశం రా... అన్నానికి కరువేంది?" అంటూ బ్యాక్‌గ్రౌండ్‌లో వచ్చే డైలాగ్ ప్రతి ఒక్కరి గుండెల్లో గుచ్చుకుంటుంది. బ్రిటీష్ ఆఫీసర్లు మన ధాన్యాన్ని దోచుకుంటూ, మన ప్రజలను బానిసలుగా మారుస్తుంటే... ఆ కరువు రాక్షసుడి ఆకలి తీర్చడానికి, మన నేల మీద నిలబడటానికి ఒక యోధుడు లేచాడు. ఆ యోధుడే సింగనమల బొబ్బిలి రణబాలి.  రణబాలిగా  విజయ్ లుక్, ఆ బాడీ లాంగ్వేజ్, కళ్లల్లో కనిపిస్తున్న ఆ క్రోధం చూస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. తెల్లవాళ్ల తుపాకులకు, ఫిరంగిలకు భయపడకుండా, చేతిలో వేటకత్తి పట్టి ప్రత్యర్థుల తలలు తెగనరికే ఆ సీన్స్ టీజర్‌కే హైలైట్. "ఆ కొండ పైన ఉన్న మా భద్రమల్లాడి మీద ఆన.. ఒక్క మెతుకు కూడా పొలిమేర దాటనివ్వను" అంటూ విజయ్ చెప్పే డైలాగ్స్ అండ్ ఆ వాయిస్ బేస్ నెక్స్ట్ లెవల్ లో ఉంది. అజయ్-అతుల్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ టీజర్‌ను మరో స్థాయికి తీసుకెళ్లింది. ప్రతి ఫ్రేమ్‌లో కనిపించే గ్రాండ్ నెస్, ఆ కాలం నాటి సెట్టింగ్స్ ఆకట్టుకున్నాయి, విజయ్ దేవరకొండ మాస్ అవతార్, చారిత్రక కథాంశం, అద్భుతమైన విజువల్స్ చూస్తుంటే ‘రణబాళి’ బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది.       [Ranabaali Teaser, Vijay Deverakonda, Rashmika Mandanna, Rahul Sankrityan, Mythri Movie Makers, Ranabaali Movie, Telugu Film News, Telugu News]  
    నందమూరి అభిమానులు, గాడ్ ఆఫ్ మాసెస్ బాలకృష్ణ అభిమానులు కలలు ఫలించి    మోక్షజ్ఞ సెల్యులాయిడ్ పై ల్యాండ్ కావడానికి రెడీ అవుతున్న విషయం తెలిసిందే. పాన్ ఇండియా మేకర్స్  మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలు కావడం, మెగాస్టార్ చిరంజీవితో విశ్వంభర తెరకెక్కిస్తున్న వశిష్ట దర్శకుడు కావడంతో అంచనాలు ఏ రేంజ్ లో ఉంటాయో చెప్పక్కర్లేదు .  ఈ ప్రతిష్టాత్మక చిత్రంలో డ్యాన్స్, గ్లామర్‌తో కుర్రకారును ఊపేస్తున్న సెన్సేషనల్ హీరోయిన్ శ్రీలీల కథానాయికగా నటించనున్నట్లు టాలీవుడ్ వర్గాల్లో ఊహాగానాలు జోరందుకున్నాయి.  శ్రీలీల అనే కాదు కానీ, ఎవరికీ తోచిన విధంగా వాళ్ళు పలానా హీరోయిన్ ఓకే అంట కదా అని మాట్లాడుకుంటున్నారు. అభిమానులు మాత్రం శ్రీలీల అనే వార్తలపై స్పందిస్తూ శ్రీలీల  'భగవంత్ కేసరి'తో బాలయ్య బిడ్డగా చేసింది కదా అంటున్నారు. ఏది ఏమైనా మోక్షజ్ఞ సరసన కొత్త హీరోయిన్ అయితే బాగుంటుందనే అభిప్రాయాన్ని సినీ విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు. బాలకృష్ణ కూడా ఈ డెబ్యూ ప్రాజెక్టులో దాదాపు 20 నిమిషాల పాటు సాగే పవర్‌ఫుల్ మాస్ క్యామియో రోల్‌లో కనిపించనున్నారని,  థియేటర్లలో పూనకాలు తెప్పించడం ఖాయమని తెలుస్తోంది.     Also Read: రామాయణకి షాక్: ఆ మూవీతో పోటీ తప్పదా.. స్క్రీన్స్ విషయంలో అన్యాయం!   దసరా పండగ సందర్భంగా అధికారికంగా లాంచ్ చేసి, నవంబర్ నెలాఖరు నుండి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. సుమారు 100 కోట్లకు పైగా భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని 2027 సమ్మర్ కానుకగా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయాలని మైత్రీ మూవీ మేకర్స్ ప్లాన్ చేస్తోంది. ఏది ఏమైనా  "గుహని  వీడిన కూన, వేటకు సిద్ధమైన సింహంలా అడవిలోకి అడుగుపెడుతుండటంతో  పెద్దాయన ఎన్టీఆర్, బాలకృష్ణల నట వారసత్వాన్ని మోక్షజ్ఞ ఏ రీతిలో ముందుకు తీసుకెళ్తాడో చూడటానికి అభిమానులతో పాటు తెలుగు ప్రజలు ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నారు.     [Mokshagna, Balakrishna, vasishta, Sreeleela, Mythri Movie Makers, Telugu Cinema, Telugu CinemaNews, Tollywood, Tollywood News]  
Jailer 2 starring Superstar Rajinikanth in the direction of Nelson Dilipkumar has huge anticipation to repeat the 2023 HGOTY Jailer magic at the box office. Producer Sun Pictures are believing the movie to create unprecedented records at every market in South India for a Tamil movie.  Shocking the trade in Telugu states, they are quoting an amount of Rs.70 crores it seems. While they are asking for Rs.55 crores, GST and publicity, print costs come up to be valued at Rs.70 crores, it seems. The movie has been collect a gross of Rs.150 crores to 175 crores to even breakeven at such a high rate.  So, even the regular distributors and exhibitors who would give fancy rates for Rajinikanth starrer releasing in Telugu are not showcasing similar interest in this film. They are asking for even lesser price but Sun Pictures have decided to not go for prices less than they have quoted.  They have even quoted Rs.25 crores in Kerala and that is much much higher than Jailer final gross. Looks like Sun Pictures are strongly believing that the movie will not miss out on becoming first Rs.1000 crore grosser for Kollywood. Anirudh Ravichander has returned to score music and teaser, trailer and glimpses will release towards the end of this month. Jailer 2 is releasing on 15th October and there are many cameos from big stars like Hrithik Roshan in the film.  Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them. 
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు  కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత  కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.  జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు.  2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది. "ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు. సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు. గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.                                      *నిశ్శబ్ద.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఒకప్పుడు ఎర్ర జెండాను దిగ్విజయంగా ఎదిరించి, మార్క్సిస్టులను మట్టి కరిపించిన మమతా దీదీ ప్రస్తుతం, కాషాయ కూటమి నుంచి గట్టి సవాలును ఎదుర్కుంటున్నారు. వరసగా పదేళ్ళు పాలించడం వలన సహజంగా వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత  కంటే, హిందూ ఓటు పోలరైజేషన్ ఆమెను మరింతగా భయపెడుతోంది. నిజానికి ఐదేళ్ళ క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఐదు శాతం కంటే తక్కువ ఓట్లు, మూడంటే మూడు అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ..  2019 లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా 40 శాతం ఓట్లతో 18 స్థానాలు గెలుచుకుంది. ఈ  మార్పు ఇంకా కొన్ని కారణాలు ఉంటే ఉండవచ్చును కానీ.. హిందువుల ఓటు పోలరైజ్  కావడమే ప్రధాన కారణం.  ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ చివరకు కమ్యూనిస్టులు కూడా బీజేపీలో  చేరారు. ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత కూడా సిట్టింగ్ ఎమ్మెల్ల్యేలు సహా  తృణమూల్ టికెట్ వచ్చిన నాయకులు కూడా బీజేపీలో చేరుతున్నారు. అనేక మంది ఇతర రంగాల ప్రముఖులు, ముఖ్యంగా ఇంతకాలం, బీజేపీని హిదుత్వ అనుకూల ‘అచ్చుత్’ (అంటారని) పార్టీగా చూసిన ‘సెక్యులర్’ ప్రముఖులు కాషాయం కప్పుకోవడంతో మమతా బెనర్జీకి కొంచెం అలస్యంగానే అయినా, తత్త్వం బోధపడింది. అందుకే ఆమె ఇప్పుడు గుళ్ళూ,గోపురాలకు తిరుగుతున్నారు. కార్యకర్తల సమావేశాల్లో తానూ హిందువునేనని, చెప్పుకుంటున్నారు.  నిజానికి ఇలా నేనూ హిందువునే  అని సెక్యులర్ నేతలు బహిరంగంగా ప్రకటించుకోవడం మమతా బెనర్జీతోనే మొదలు కాలేదు. రాహుల్ గాంధీ తాను హిందువునని, జన్యుధారీ కశ్మీరీ బ్రాహ్మణుని అనీ.. తమ గోత్రం, ‘దత్తాత్రేయ’ గోత్రమని బహిరంగంగా ప్రకటించుకున్నారు. అలాగే  కొద్ది రోజుల క్రితం ప్రియాంకా గాంధీ తానూ హిందువునని చెప్పుకునేందుకు ‘మౌని అమావాస్య’ సందర్భంగా అలహాబాద్ లో గంగా స్నానం చేశారు. గతంలోనూ ఆమె ఎన్నికలకు ముందు గంగా యాత్ర చేశారు. అంతవరకు ఎందుకు కొద్దిరోజుల క్రితం సిపిఐ నారాయణ విశాఖ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. చంద్రబాబు, జగన్ రెడ్డి, కేసీఆర్ ఇలా తెలుగు నేతలు అనేక మంది లౌకిక వాదానికి కాలం చెల్లిందన్న సత్యాన్ని గ్రహించి కావచ్చు ‘నేనూ హిందువును’ అంటూ ప్రకటించుకునేందుకు పోటీ పడుతున్నారు. రాముడిని తలచుకున్నా, జై శ్రీరామ్ అన్నా తమ  లౌకిక వాదం మయలపడి పోతుందని భయపడిన నాయకులు ఇప్పుడు .. జై శ్రీరామ్ అనేందుకు కూడా వెనకాడడం లేదు.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది. గత కొంత కాలంగా సబర్మలతో సహా అనేక అంశాలపై స్పందిస్తూ.. కేరళను టార్గెట్ చేస్తున్న బీజేపీ నాయకులు అక్కడ తమ జెండా ఎగరేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా పార్టీ పాలసీని కూడా పక్కన పెట్టి మెట్రో మ్యాన్ శ్రీధరన్ ను పార్టీలో చేర్చుకుని ఆయనే తమ సీఎం అభ్యర్థి అని ప్రకటించిన 24 గంటలలో యూ టర్న్ తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం సీఎంగా ఉన్న కమ్యూనిస్ట్ నేత పినరై విజయన్ పై గోల్డ్ స్మగ్లింగ్ ఆరోపణలు రావడంతో.. ఈ ఎన్నికలలో ఎల్డిఎఫ్ భవిష్యత్తుపై ప్రజలు ఏ తీర్పు ఇవ్వబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది ఈ నేపథ్యంలో అక్షరాస్యతలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న ఆ రాష్ట్ర ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారు అనే అంశంపై ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ నౌ, సీ ఓటరుతో కలిసి ఒక సర్వేను నిర్వహించారు. ఈ సర్వే ప్రకారం చూస్తే పాపం కమలనాథులు అక్కడ పవర్ చేతికి రావటం అటుంచి కనీసం రెండు మూడు అసెంబ్లీ స్థానాల్లో గెలవటం కూడా కష్టమేనని ఆ సర్వే తేల్చి చెబుతోంది. కేరళలో ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తన హవా చాటుతుందన్న ఆ పార్టీ నేతల మాటలలో ఎలాంటి నిజం లేదని.. ప్రస్తుతానికి అది ఏమాత్రం సాధ్యం కాదని ఈ తాజా సర్వే తేల్చి చెప్పింది. అంతేకాకుండా మొత్తం 140 స్థానాలు ఉన్న కేరళలో.. ప్రస్తుత సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్డ్ డెమొక్రటిక్ ఫ్రంట్ కు 82 సీట్లు పక్కా అని.. ఆయనే తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటాడని సర్వే చెపుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూనైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ కు 56 నుంచి 60 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వేలో తేలింది. అంతేకాకుండా 2016 ఎన్నికలతో పోలిస్తే ఎల్ డీఎఫ్ ఓటింగ్ శాతం కూడా కొంత పెరగటం ఇక్కడ గమనార్హం. ప్రస్తుతం సీఎంగా ఉన్న విజయన్ మరోసారి సీఎం కావాలని 43.34 శాతం మంది మొగ్గు చూపినట్లుగా సర్వేలో తేలింది. కరోనా సమయంలో విజయన్ సీఎంగా బాగా పని చేసారని ఈ సర్వే పేర్కొంది. మరోపక్క దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ ఉండాలని కేరళ ప్రజల్లో 55.84 శాతం మంది కోరుకుంటున్నట్లుగా ఈ సర్వే;లో తేలింది. అయితే కేరళలో ఎలాగైనా పాగా వేయాలని పట్టుదలతో కృషి చేస్తున్న బీజేపీకి ఈసారి కూడా నిరాశ తప్పదని ఈ సర్వేలో స్పష్టం అయింది. ఈ ఎన్నికలలో బీజేపీకి రెండు సీట్లు కూడా రావటం కూడా కష్టమేనని ఈ సర్వే తేల్చింది. అయితే ఎన్నికలకు ముందు ఇలాంటి సర్వేలు బయటకు రావడం.. తరువాత అందులో కొన్ని చతికిల పడడం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ సర్వే ఫలితాలు నిజామా అవుతాయో లేదో తేలాలంటే కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే.        
రాజకీయాలు అంటేనే అదో జూదం. పూలమ్మిన చోటనే కట్టెలు అమ్మవలసి రావచ్చును. అలాంటి పరిస్థితే వచ్చినా, తలవంచుకుని పోగలిగితేనే, ఎవరైనా రాజకీయాలలో రాణించగలరు. అలాకాదని, అలిమి కానిచోట, కూడా తామే అధికులమని భావిస్తే, ఎందుకూ కాకుండా పోతారు. అలాంటి వారు ఇద్దరూ కూడా ఇప్పుడు మన కళ్ళముందే ఉన్నారు.  జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు. అలాగే జయ మరణం తర్వాత ఆమె పరిస్థితి ఏమిటో కూడా వేరే చెప్పవలసిన, అవసరం లేదు. జైలు పాలయ్యారు. సర్వం తానై నడిపించిన పార్టీ నుంచి  బహిష్కరణకు గురయ్యారు. జయ ఉన్నంత వరకు తన వారుగా ఉన్న వారందరూ కానివారయ్యారు. ఒంటరిగా మిగిలారు.  నిజానికి నాలుగేళ్ళు జైలు జీవితం గడిపిన తర్వాత కూడా ఆమె తలచుకుంటే.. రాష్ట్ర రాజకీయాలలో, ముఖ్యంగా అధికారంలో ఉన్న డిఎంకే కూటమిలో అలజడి సృష్టించగలరు. ఎన్నికలలో ఆమె గెలవక పోవచ్చును కానీ.. తనను కాదన్న అన్నాడిఎంకేను ఓడించగలరు. అయిన  ఆమె అందుకు విరుద్ధంగా  రాజకీయాలకు వీడ్కోలు పలికి మౌనంగా పక్కకు తప్పుకున్నారు. రాజకీయ సన్యాసం ప్రకటించారు. ఉమ్మడి శతృవు డిఎంకే ను ఓడించేందుకు అన్నా డిఎంకే కూటమి  పోటీ చేయాలని, కూటమి ఐక్యతను దెబ్బతీయరాదనే ఉద్దేశంతోనే ఆమె రాజకీయ సన్యాసం ప్రకటించారు.    శశికళ మౌనంగా వెళ్లి పోవడం వెనక ఇంకా అనేక కారణాలున్నా ,అసలు కారణం ఆమె, రాజకీయ విజ్ఞత, వివేకం. ఆమె జైలుకు వెళ్ళిన సమయంలో జయలలిత సమాధి వద్ద ఎంత కసిగా, కోపంగా ‘మౌన’ ప్రతిజ్ఞ చేశారో చూశా. అలాంటి ఆమె ఇప్పుడు ఇలా ‘మౌనం’గా వెనకడుగు వేశారంటే, అది ఆలోచించ వలసిన విషయమే.ఆమె వ్యుహతంకంగానే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అనేక మంది అనేక కోణాల్లో శశికళ సంచలన నిర్ణయాన్ని విశ్లేషించారు.జైలు జీవితం తర్వాత కూడా అన్నా డిఎంకే నాయకులు తనను అగ్రనేతగా అంగీకరించక పోవడం, అమిత్ షా చెప్పినా.. అన్నా డిఎంకే నాయకులు ఆమెను, మేనల్లుడు దినకరన్’ను కులం పేరున, కుటుంబం పేరున దూరం చేయడం, తిరిగి పార్టీలోకి తీసుకోకపోవడంతో ఆమె మనసు కష్టపెట్టుకుని, సన్యాస నిర్ణయం తీసుకున్నారని కొందరంటున్నారు. పార్టీ మీద పట్టు లేదని, చరిష్మా అసలే లేదని, అందుకే ఆమె అలా నిశ్శబ్ధంగా రాజకీయ సన్యాసం స్వీకరించారని ఇంకొందరు విశ్లేషించారు. ఈ విశ్లేషణలో కొంత నిజం ఉంటే ఉండవచ్చును.. కానీ ఆమె గతాన్ని, నైజాన్ని గుర్తు చేసుకుంటే ఆమె స్ట్రైక్ బ్యాక్ వ్యూహంతోనే ఒకడుగు వెనక్కివేశారని ఆమెతో సన్నిహితంగా మెలిగినవారు, ఆమె రాజకీయ చాణక్యం తెలిసిన వారు అంటారు.   నిజానికి జైలులో ఉన్న కాలంలో కానీ, జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత కానీ, ఆమె రాజకీయ సన్యాసం వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపించలేదు. బెంగుళూరు జైలు నుంచి విడుదలై చెన్నైలో ప్రవేశించిన నప్పుడు ఆమె పెద్ద కాన్వాయ్ తో  తమ కారుకు అన్నాడిఎంకే జెండాతోనే ఎంటరయ్యారు. అలా ఎంట్రీలోనే రాజకీయ ఆకాంక్షను వెంట తెచ్చుకున్నారు. చివరకు ‘సన్యాస’ ప్రకట చేసే వరకు కూడా ఆమె రాజకీయ కార్యకలాపాలు సాగిస్తూనే ఉన్నారు. అటు ఢిల్లీని ఇటు చెన్నైనికూడా కదిల్చారు. అంతేకాదు, రాజకీయాలపై విరక్తితో కాదు, రాజకీయ కసితో, ఉమ్మడి శత్రువు (డిఎంకే) ను ఓడించేందుకే తాను రాజకీయాలనుంచి తపుకుంటున్నట్లు చెప్పారు.  సో .. సన్యాసం తీసుకోవాలనే ఆలోచన, రాజకీయవ్యూహం లోంచి పుట్టిందే కానీ,వైరాగ్యంతో పుట్టింది కాదు ,అన్నవిశ్లేషణ వాస్తవానికి ఇంకొంత దగ్గరగా ఉందని అనుకోవచ్చును. ఇది ‘కామా’నే కాని ‘ఫుల్స్టాప్’ కాదని అంటున్నారు.  ముఖ్యమంత్రి ఎడప్పాడి కే. పళని స్వామి (ఈపీఎస్) ఆమెను పార్టీలోకి అనుమతిస్తే తన కుర్చికీ ఎసరు పెడతారనే భయంతోనే,, ఆమె ఎంట్రీని అడ్డుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, శశికళ ఒకే సామజిక వర్గానికి చెందిన వారు కావడం కూడా, ముఖ్యమంత్రి ఈపీఎస్’ భయానికి కారణంగా పేర్కొంటారు. అందుకే  ఆయన, ‘మన్నార్గుడి’ ఫ్యామిలీని బూచిగా చూపించి, ఆమెను దూరంగా ఉంచారని పార్టీలో ఒక వర్గం గట్టిగా విశ్వసిస్తుంది. అయితే ఆమె శక్తియుక్తులను కూడతీసుకుని  పులిలా పంజా విసిరేందుకే ఆమె వ్యూహాత్మకంగా ఒక అడుగు వెనక్కి వేశారు కావచ్చును అని కూడా, తమిళ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది.  గతంలో ఆమె జయలలితతో విబేధాలు వచ్చిన సమయంలో కూడా ఇలాగే కొద్ది కాలం మౌనంగా తెర చాటుకు వెళ్లి పోయారు.  కొద్ది కాలంలోనే మళ్ళీ ‘పోయస్ గార్డెన్’లో ప్రత్యక్షమయ్యారు. జయలలిత స్వయంగా ఆమెను వెనక్కి పిలుపించుకోవలసిన పరిస్థితులను సృష్టించారు. అలా  మళ్ళీ  చక్రం తిప్పారు. జయలలిత మరణం వరకు ఆమె అందరికీ చిన్నమ్మగా అమ్మకు పెద్దమ్మగా సర్వం తానై నిలిచారు. చివరకు జయ అంత్యక్రియల్లో కూడా ఆమెదే పై చేయిగా కనిపించింది.   జయలలిత చనిపోయిన సందర్భంలోనే అన్నా డిఎంకే ఎమ్మెల్ల్యేలో సుమారు 30 మంది వరకు ఆమెకు మద్దతుగా ఉన్నారన్న వార్తలొచ్చాయి. నిజానికి,ఇప్పటికి కూడా ఒక్క అన్నా డిఎంకే లోనేకాదు,డిఎంకే ఇతర పార్టీలలో కూడా  ఆమె అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ‘మన్నార్గుడి’ ఫ్యామిలీ మద్దతు లేకుండా గెలిచే అవకాశం లేదు.  ఇవ్వన్నీ నిజమే అయినా.. అన్నీ ఉండి, ఎవరు లేని శశికళలో, ఇంకా  ఎవరి కోసం తాపత్రయ పడాలి? అనే ప్రశ్న జనించి ఉంటే, ఆమె రాజకీయ సన్యాసం నిజం కావచ్చును. ఎందుకంటే ఆమె నెచ్చలి, జయలిత లేరు, భర్త అంతకంటే ముందే చనిపోయారు, పిల్లలు లేరు... పైగా నాలుగేళ్ళ జైలు జీవితం ఆమెలో మార్పు తెచ్చి ఉండవచ్చును. ఈ వయస్సులో తనవారంటూ ఎవరు లేని తనకు రాజకీయాలు ఎందుకు ? శేష జీవితాన్ని ఇలా సాగిద్దామనే ఆలోచన నిజంగా వచ్చి ఉంటే, ఆమె సన్యాసం సత్యం అయినా కావచ్చును, కాకపోనూ వచ్చును. కానీ  శశికళ... ఆమెను అర్థం చేసుకోవడం, అంచనా వేయడం , అంత తేలిగ్గా అయ్యే పని కాదు..
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు. కాంగ్రెస్ అధినాయకత్వం పై నేరుగా అస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ పేరు చెప్పకుండానే, ఆయన నాయకత్వానికి పనికిరాడని తేల్చి చెప్పారు. ఎవరైనా పార్టీ అధ్యక్షుడు అయితే కావచ్చును, కానీ, ప్రజానాయకుడు కాలేడని, రాహుల గాంధీ ప్రజానాయకుడు కాదు కాలేరు,అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరచూ రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసే  ‘నామ్’ధారీ వ్యంగ్యాస్త్రాన్నే కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా సందించారు. ఇక అక్కడి నుంచి విధేయ, అసమ్మతి వర్గాల మధ్య మాటల యుద్ధం ఎదో ఒక రూపంలో సాగుతూనే వుంది. అదే క్రమంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, కరుడు కట్టిన ముస్లిం మతోన్మాది, అబ్బాస్ సిద్దిఖీతో కాంగ్రెస్ పార్టీ చేతులు కలపడం అసమ్మతి నాయకులకు మరో అస్త్రాన్ని అందించింది. విషయంలోకి వెళితే, ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా లోక్’సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు, పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్’రంజన్ చౌదరి, ముస్లిం మత ప్రచారకుడు, అబ్బాస్ సిద్దిఖీతో  వేదిక పంచుకున్నారు.అంతకు ముందే వామ పక్ష కూటమితో  పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్ పార్టీ, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)ను కూటమిలో చేర్చుకుంది. ఇలా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) అమోదం లేకుండా మతోన్మాద ఐఎస్ఎఫ్’ తో ఎన్నికల పొత్తు పెట్టుకోవడం ఆ పార్టీ నాయకుడు,సిద్ధిఖీతో  పీసీసీ చీఫ్ వేదిక  పంచుకోవడం పై అసమ్మతి నేతలు మండి పడుతున్నారు. ఇలా సిద్దిఖీతో వేదిక పంచుకోవడం పార్టీ మౌలిక సిద్ధాంతాలకు వ్యతిరేకం అంటూ అసమ్మతి వర్గానికి చెందిన కీలక నేత, రాజ్యసభ సభ్యుడు,ఆనంద్ శర్మ మండిపడ్డారు. అంతే కాదు, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)తో జనవరిలో కుదుర్చుకున్న పొత్తుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)అమోదం లేదని ఆనంద్ శర్మ, అభ్యంతరం వ్యక్త చేశారు. పార్టీ విశ్వసించే లౌకిక వాదానికి కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం గొడ్డలి పెట్టని ఆయన తీవ్రంగా స్పందించారు.   శర్మ వ్యాఖ్యలపై అధీర్ రంజన్ చౌదరి అంతే ఘాటుగా ప్రతిస్పందించారు. “నిజాలు తెలుసుకోండి ఆనంద్ శ‌ర్మ జీ” అంటూ ఆయ‌న వ‌రుస ట్వీట్లు చేశారు. వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలు ప‌క్క‌న‌పెట్టి, ప్ర‌ధానిని పొగిడి టైమ్ వేస్ట్ చేయ‌కండంటూ ఆయ‌న ఓ ట్వీట్లో అన్నారు. ఆనంద్ శ‌ర్మ అన‌వ‌స‌రంగా కాంగ్రెస్‌ను ల‌క్ష్యంగా చేసుకుంటున్నార‌ని, ఈ అంశాన్ని పెద్ద‌ది చేసి చూపిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఆయ‌న ఉద్దేశాలు స‌రైన‌వే అయితే నేరుగా తనతో మాట్లాడ వలసిందని అన్నారు. బెంగాల్‌లో సీపీఐ(ఎం) కూట‌మికి నేతృత్వం వ‌హిస్తోంది. అందులో కాంగ్రెస్ ఓ భాగం. మ‌త‌తత్వ‌, విభ‌జ‌న రాజ‌కీయాలు చేస్తున్న బీజేపీకి చెక్ పెట్ట‌డానికే ఈ కూట‌మి అని మ‌రో ట్వీట్‌లో అధిర్ రంజ‌న్ అన్నారు. అక్కడతోనూ ఆగలేదు ... ట్వీట్ల మీద ట్వీట్లు సంధిస్తూ, ఆనంద్ శర్మ, బీజేపీ మత విభజన, అజెండాను బలపరుస్తున్నారని, పరోక్షంగా జీ23 నాయకులు బీజేపీకి ప్రయోజనం చేకూరుస్తున్నారని ఆరోపించారు.అంతే కాదు, క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితులు తెలియకుండా, ఆనంద్ శర్మ పార్టీ మీద దండెత్తడం ఉచితం కాదని చౌదరి ఎదురుదాడి చేశారు. అసమ్మతిలో అసమ్మతి. ఇదలా ఉంటే, కాంగ్రెస్ పార్టీ  సమూల పక్షాళన కోరుతూ సోనియా గాంధీకి,గత సంవత్సరం  జీ 23గా ప్రాచుర్యం పొందిన సీనియర్ నాయకులు రాసిన లేఖపై సంతకాలు చేసిన  నాయకుల్లో నలుగురు,జమ్మూలోసమావేసమైన నాయకుల తాజా నిర్ణయాలు, వ్యాఖ్యలు,విమర్శల పట్ల అసంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరం సోనియా గాంధీకి రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలకు కట్టుబడి ఉన్నామని, అయితే, జీ 23లోని కొందరు సహచరులు, ఇటీవల గీతదాటి చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలను తాము సమర్ధించడం లేదని ఆ నలుగురు పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా, రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్, పీజే కురియన్ అయితే, “కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన సంస్కరణలు తెచ్చేందుకు చేసే ప్రయత్నాలను పూర్తిగా సమర్దిస్తాను, కానీ, ‘లక్ష్మణ రేఖ’ దాటితే ఒప్పుకునేది లేదు”అని అసమ్మతిలో అసమ్మతికి తెర తీశారు.అలాగే, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారడు, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్,మధ్య ప్రదేశ్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అజయ్ సింగ్’ కూడా గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, ఆనంద్ శర్మ, మనీష్ తివారీ వంటి జీ 23 కీలక నేతలు అధినాయకత్వంపై చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. అలాగే, పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీమంత్రి వీరప్ప మొయిలీ కూడా,గత సంవత్సరం పార్టీ సీనియర్ నాయకులు  ఒక పరిమిత లక్ష్యంతో  సోనియా గాంధీకి లేఖ రాయడం జరిగిందని, ఆ పేరున జరుగతున్న  కార్యక్రమాలు లేఖ సంకల్పానికి  విరుద్ధమని అన్నారు. జీ 23 కార్యకలాపాలపై రాహుల్ గాంధీ కూడా పరోక్షగా స్పందించారు, ఒకప్పుడు ఎన్ఎస్’యుఐ, యూత్ కాంగ్రెస్’ కు సంస్థాగత ఎన్నికలు వద్దన్న వారే ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నారని పరోక్షంగానే అయినా సంస్థాగత ఎన్నికలు నిర్వహించడంతో పాటుగా, పార్టీ పక్షాలనకు తమ కుటుంబం వ్యతిరేకం కాదని, అందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీలో చెలరిగిన కలకలం  ఇక ముందు ఏమవుతుందో .. ఇంకెన్ని  మలుపులు తిరుగుతోందో ..చూడవలసిందే కానీ ఉహించలేము.
గణపతి నవరాత్రులు ఎలా ప్రారంభం అయ్యాయి..వీటి వెనుక ఉన్న భారత చరిత్ర ఏమిటి.! గణపతి నవరాత్రుల మహోత్సవం కేవలం ఒక  పండుగ మాత్రమే కాదు. ఇది భారత స్వాతంత్ర్య సంగ్రామంలో ప్రజా చైతన్యాన్ని, ఐక్యతను పెంపొందించడానికి ఉపయోగపడిన ఒక గొప్ప విప్లవాత్మక సామాజిక ఉద్యమం. ప్రాచీన కాలంలో వినాయక చవితి పూజలు ఇళ్లకే పరిమితమై, ఇళ్లలోనే భక్తి శ్రద్ధలతో జరుగుతుండేవి. శాతవాహనులు, రాష్టకూటులు, విజయనగర రాజుల కాలం నుండి గణేష్ ఉత్సవాల ప్రస్తావన ఉన్నప్పటికీ, అందరూ ఇప్పట్లో వీధుల్లో గణపతిని ప్రతిష్ట చేసి  గణపతి నవరాత్రులు జరుపుకోవడానికి  ప్రధాన కారణం బ్రిటిష్ పాలనా కాలంలో చోటు చేసుకున్న పరిణామాలు. నేటి వినాయకచవితి నవరాత్రి ఉత్సవాల వెనుక చరిత్రలో జరిగిన కారణాలు ఏమిటో తెలుసుకుంటే.. గణపతి ఉత్సవాల వెనుక చరిత్ర.. ఛత్రపతి శివాజీ మహారాజ్ కాలంలో మరాఠా సామ్రాజ్యంలో సంస్కృతి, జాతీయ భావాన్ని పెంపొందించడానికి వినాయక ఉత్సవాలను ప్రాచుర్యంలోకి తెచ్చారు. పీష్వాల పాలనలో వినాయకుడు వారి కులదైవం కావడంతో పూణేలో ఈ ఉత్సవాలు రాజ్యపండుగలా వైభవంగా సాగేవి. అయితే 1818లో పీష్వాల పాలన అంతరించి, బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ అధికారం చేపట్టిన తర్వాత ఈ  ఉత్సవాలు ప్రాభవాన్ని కోల్పోయాయి.  ప్రజలు  ఇళ్లలోనే రహస్యంగా లేదా వ్యక్తిగతంగా పూజలు చేసుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ పరిస్థితిలో 19వ శతాబ్దం చివరలో ఒక పెద్ద మార్పు వచ్చింది. 1857 సిపాయిల తిరుగుబాటు తర్వాత భారతదేశంలో స్వాతంత్ర్య కాంక్ష తీవ్రమైంది. దీనిని అణచివేయడానికి బ్రిటిష్ ప్రభుత్వం 1892 ప్రాంతంలో తీవ్రమైన ఆంక్షలు విధించింది. భారతీయ ప్రజలు రాజకీయంగా సమావేశం కాకుండా, గుమిగూడకుండా నిషేధాజ్ఞలు విధించారు. ఐదుగురి కంటే ఎక్కువ మంది ఒకచోట చేరడం నేరంగా పరిగణించబడేది. ప్రజా సంఘాలు, రాజకీయ సమావేశాలపై కఠినమైన నిఘా ఉండేది. ఈ క్లిష్ట సమయంలో స్వాతంత్ర్య సమరయోధుడు, లోకమాన్య బిపిన్ చంద్రపాల్, లాలా లజపతిరాయ్ లతో కలిసి పనిచేసిన గొప్ప నాయకుడు లోకమాన్య బాల్ గంగాధర్ తిలక్ ఒక అద్భుతమైన ఆలోచన చేశారు. బ్రిటిష్ ప్రభుత్వం రాజకీయ సమావేశాలపై నిషేధం విధించింది కానీ, మతపరమైన ఆచారాలు , ఉత్సవాలపై నేరుగా జోక్యం చేసుకోలేకపోయింది. ఈ అవకాశాన్ని తిలక్ తెలివిగా ఉపయోగించుకున్నారు. 1893లో పూణేలో ఆయన సార్వజనిక గణేశోత్సవ మండలిని ప్రారంభించి, ఇళ్లలోని పూజను వీధులకి, బహిరంగ వేదికలకి తీసుకువచ్చారు. తిలక్ గణపతి ఉత్సవాలను ఒక సామాజిక, రాజకీయ వేదికగా మలిచారు. పందిళ్లు వేసి గణపతి విగ్రహాలను ప్రతిష్టించడం ద్వారా ప్రజలందరూ ఒకచోట చేరే అవకాశం లభించింది. కుల మత భేదాలు లేకుండా ప్రజలందరూ ఒకే వేదికపైకి వచ్చి కలవడానికి ఈ ఉత్సవాలు తోడ్పడ్డాయి. ఉత్సవాల సందర్భంగా సంస్కృతిక కార్యక్రమాలు, నాటకాలు, పద్య పఠనాలు నిర్వహించేవారు. వీటితో పాటు దేశభక్తి ఉపన్యాసాలు ఇస్తూ, స్వాతంత్ర్య ఉద్యమ భావాలను, బ్రిటిష్ పాలనలోని అన్యాయాలను ప్రజల్లోకి తీసుకెళ్లేవారు. ఈ తొమ్మిది లేదా పది రోజుల ఉత్సవాల కాలంలో విప్లవకారులు, స్వాతంత్ర్య సమరయోధులు రహస్యంగా సమావేశమై ప్రణాళికలు రచించుకోవడానికి వీలు కలిగింది. బ్రిటిష్ గూఢచారులు పందిళ్లలో ఏం జరుగుతుందో కనిపెట్టడం కష్టమయ్యేది. తిలక్ స్థాపించిన కేసరి, మరాఠా వార్తాపత్రికల ద్వారా ఈ గణపతి నవరాత్రుల సందేశం మహారాష్ట్ర అంతటా మాత్రమే కాకుండా దేశంలోని ఇతర ప్రాంతాలకు వేగంగా వ్యాపించింది. ముంబై, పూణే, నాగపూర్ వంటి నగరాల్లో వేలాదిగా సార్వజనిక మండపాలు వెలిశాయి. స్వాతంత్రోద్యమంలో ఈ ఉత్సవాలు అందించిన చైతన్యం వెలకట్టలేనిది. ప్రజలలో జాతీయ సమైక్యతను, ఆత్మవిశ్వాసాన్ని నింపడంలో గణపతి నవరాత్రులు కీలక పాత్ర పోషించాయి. 1947లో దేశానికి స్వాతంత్ర్య లభించినప్పటికీ, తిలక్ ప్రారంభించిన ఈ సాంప్రదాయం భారతదేశ సాంస్కృతిక వైభవానికి ప్రతీకగా నిలిచిపోయింది. కాలక్రమేణా ఈ నవరాత్రుల ఉత్సవాలు మహారాష్ట్ర సరిహద్దులు దాటి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు , ఉత్తర భారత దేశమంతటా విస్తరించాయి. హైదరాబాద్ లోని ఖైరతాబాద్ గణేష్ ఉత్సవాలు, లాల్ బాగ్ చారాజా వంటివి ప్రపంచ ప్రసిద్ధి చెందాయి. ఈనాడు గణపతి నవరాత్రులు కేవలం పూజలకే పరిమితం కాకుండా, రకరకాల సామాజిక సేవా కార్యక్రమాలు, వైద్య శిబిరాలు, రక్తదాన శిబిరాలు , పర్యావరణ పరిరక్షణ అవగాహన కార్యక్రమాలకు వేదికగా మారుతున్నాయి. ఈ విధంగా భక్తి భావనతో మొదలై, స్వాతంత్ర్య ఉద్యమ ఆయుధంగా రూపాంతరం చెంది, నేడు మహోన్నత సామాజిక ఉత్సవంగా విలసిల్లుతున్న గణపతి నవరాత్రుల వెనుక శతాబ్దాల భారతీయ చరిత్ర, సమరయోధుల వ్యూహాత్మక ఆలోచనలు , ప్రజల ఐక్యతా శక్తి దాగి ఉన్నాయి.                     *రూపశ్రీ.  
  వర్షాకాలం రాగానే చల్లటి గాలి, ఆహ్లాదకరమైన వాతావరణంతో పాటు పలు రకాల ఆరోగ్య, సౌందర్య సమస్యలు కూడా మొదలవుతాయి. వర్షంలో తడవడం, తేమతో కూడిన వాతావరణం వల్ల కాళ్ల ఆరోగ్యం దెబ్బతింటుంది. ముఖ్యంగా వర్షాకాలంలో చాలామందిని వేధించే ప్రధాన సమస్య పగిలిన మడమలు మరియు పొడిబారిన పాదాలు. వర్షపు నీటిలోని బాక్టీరియా, బురద, మరియు వాతావరణంలో పెరిగే తేమ వల్ల పాదాల చర్మం నెర్రలు బారి పగుళ్లు ఏర్పడతాయి. కొన్నిసార్లు ఈ పగుళ్ల నుంచి తీవ్రమైన నొప్పి, రక్తం కారడం లేదా ఇన్ఫెక్షన్లు రావడం జరుగుతుంది. అందుకే ఈ సీజన్‌లో ముఖ సంరక్షణతో పాటు పాదాల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టడం ఎంతో అవసరం. వర్షాకాలంలో పగిలిన మడమల సమస్య నుంచి ఉపశమనం పొందడానికి, పాదాలను మెరిసేలా మార్చుకోవడానికి నిపుణులు ఒక అద్భుతమైన చిట్కాను సూచిస్తున్నారు. అదే ఇంట్లోనే చేసుకునే సహజ సిద్ధమైన పెడిక్యూర్! ప్రతిరోజూ పార్లర్‌కు వెళ్లాల్సిన పనిలేకుండా, ఇంట్లోనే లభించే వస్తువులతో వారానికి 2 సార్లు ఈ పెడిక్యూర్ చేసుకోవడం వల్ల పగిలిన మడమల సమస్య నుంచి 100 శాతం విముక్తి లభిస్తుంది. ఈ పెడిక్యూర్ ప్రక్రియ పాదాలలోని మృతకణాలను తొలగించి, చర్మానికి అవసరమైన తేమను అందించి పాదాలను ఎంతో మృదువుగామారుస్తుంది. ఈ హోమ్ మేడ్ పెడిక్యూర్ చేయడం అత్యంత సులభం. ముందుగా ఒక వెడల్పాటి బకెట్ లేదా టబ్‌లో పగిలిన పాదాలు మునిగేంత గోరువెచ్చని నీటిని తీసుకోవాలి. అందులో 1 నుండి 2 చెంచాల ఎప్సమ్ సాల్ట్ లేదా సాధారణ ఉప్పు, కొద్దిగా మైల్డ్ షాంపూ మరియు ఒక నిమ్మకాయ రసం పిండాలి. ఈ నీటిలో మీ పాదాలను దాదాపు 15 నుండి 20 నిమిషాల పాటు నానబెట్టాలి. గోరువెచ్చని నీటి వల్ల పాదాలపై ఉన్న గట్టి చర్మం మరియు పగుళ్లు మృదువుగా మారుతాయి. నిమ్మకాయలోని యాంటీబాక్టీరియల్ గుణాలు బాక్టీరియాను అంతం చేస్తే, ఉప్పు అలసటను తగ్గించి రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది. పాదాలు బాగా నానిన తర్వాత ప్యూమిస్ స్టోన్ (Pumice Stone) లేదా ఫుట్ స్క్రబ్బర్ సహాయంతో మడమలను సున్నితంగా రుద్దాలి. దీనివల్ల పాదాలపై ఉన్న మృతకణాలు (Dead Cells) సులభంగా తొలగిపోతాయి. స్క్రబ్బింగ్ పూర్తయిన తర్వాత పాదాలను మంచి నీటితో కడిగి శుభ్రమైన తువ్వాలుతో తుడుచుకోవాలి. అనంతరం పాదాలకు తగినంత తేమను అందించడానికి కొబ్బరి నూనె, ఆలివ్ నూనె లేదా మంచి మోయిశ్చరైజింగ్ క్రీమ్‌ను రాసి 2 నుండి 3 నిమిషాల పాటు బాగా మసాజ్ చేయాలి. రాత్రి పూట ఈ పెడిక్యూర్ చేసుకుని, ఆ తర్వాత సుతిమెత్తని కాటన్ సాక్స్ (Socks) ధరించి నిద్రపోవడం వల్ల నూనె చర్మంలోకి బాగా ఇంకి పాదాలు పట్టులాగా మారుతాయి. వారానికి కనీసం 2 సార్లు ఈ పద్ధతిని క్రమం తప్పకుండా పాటిస్తే కేవలం 2 వారాల్లోనే పగిలిన మడమలు పూర్తిగా నయమై, పాదాలు అందంగా తయారవుతాయి. దీనితో పాటు వర్షాకాలంలో తడి బూట్లు, తడి సాక్స్ ఎక్కువ సేపు వేసుకోకూడదు. వర్షంలో తడిసిన వెంటనే పాదాలను శుభ్రమైన నీటితో కడుక్కుని పొడిగా ఉంచుకోవాలి. సులభమైన ఈ జాగ్రత్తలు పాటిస్తూ, వారానికి రెండుసార్లు పెడిక్యూర్ చేయడం వల్ల వర్షాకాలంలో కూడా మీ పాదాల అందం, ఆరోగ్యం 100 శాతం పదిలంగా ఉంటాయి.     Pedicure twice a week for soft feet, monsoon foot care tips, and remedies.
  మన భారతీయ వంటకాల్లో పచ్చళ్లకు ఉన్న స్థానమే వేరు. రోజూ తినే ఆహారంలో కాస్త పచ్చడి నంచుకుంటే ఆ రుచే వేరు, మనసుకు కలిగే తృప్తి వేరు. అయితే నేటి ఆధునిక జీవనశైలిలో చాలామంది బరువు పెరగడం, కొలెస్ట్రాల్ పెరగడం, గుండె సమస్యలు లేదా ఇతర ఆరోగ్య కారణాల వల్ల నూనె వాడకాన్ని వీలైనంత వరకు తగ్గించాలని భావిస్తున్నారు. సాధారణంగా తెలుగు ఇళ్లలో పచ్చళ్లు చేయాలంటే నూనెలో ఎండుమిర్చి, ఇతర దినుసులు వేయించడం లేదా పచ్చడికి భారీగా తిరగమాత (తాళింపు) వేయడం ఆనవాయితీగా వస్తోంది. కానీ నూనె ఒక్క చుక్క కూడా వాడకుండా, ఎంతో ఘుమఘుమలాడే సువాసనతో, నోరూరించే రుచితో పాటు 100 శాతం నిండు ఆరోగ్య ప్రయోజనాలను అందించే  ఆయిల్ ఫ్రీ కొత్తిమీర పచ్చడి  (Oil Free Coriander Chutney) ని క్షణాల్లో తయారు చేసుకోవచ్చని మీకు తెలుసా? పోషకాలతో నిండిన కొత్తిమీరతో చేసే ఈ సాంప్రదాయ వంటకం కేవలం నోటికి రుచిని అందించడమే కాకుండా శరీరానికి దివ్యమైన ఆరోగ్య వరప్రదాయినిగా పనిచేస్తుంది. కొత్తిమీరను ప్రతిరోజూ మన ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల శరీరానికి ఎన్నో రకాల విటమిన్లు మరియు ఖనిజాలు అందుతాయి. కొత్తిమీరలో విటమిన్ ఎ, విటమిన్  సి, విటమిన్  కె లతో పాటు ఐరన్, పొటాషియం, మెగ్నీషియం, కాల్షియం మరియు పీచు పదార్థం (ఫైబర్) సమృద్ధిగా ఉంటాయి. నూనె లేకుండా ఈ పచ్చడిని తయారు చేసినప్పుడు అందులోని పోషక విలువలు ఏమాత్రం నశించకుండా 100 శాతం శరీరానికి నేరుగా అందుతాయి. కొత్తిమీరలో ఉండే అత్యంత శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలోని హానికర ఫ్రీ రాడికల్స్‌ను అంతం చేసి రోగనిరోధక శక్తిని విశేషంగా పెంపొందిస్తాయి. ముఖ్యంగా రక్తంలో చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో, హై బీపీని అదుపు చేయడంలో మరియు మధుమేహం ఉన్నవారిలో గ్లూకోజ్ స్థాయిలను క్రమబద్ధీకరించడంలో ఈ ఆయిల్ ఫ్రీ పచ్చడి సమర్థవంతంగా పనిచేస్తుంది. జీర్ణవ్యవస్థను వేగవంతం చేసి గ్యాస్, అసిడిటీ మరియు కడుపు ఉబ్బరం వంటి సమస్యల నుంచి తక్షణ ఉపశమనం కలిగిస్తుంది. ఈ అద్భుతమైన నూనె లేని కొత్తిమీర పచ్చడి తయారు చేసుకోవడానికి మన ఇంట్లో ఎప్పుడూ లభించే దినుసులే సరిపోతాయి. ఈ పచ్చడి తయారీ కోసం 2 కప్పుల తాజా కొత్తిమీర (బాగా కడిగి తరిగినది), మీ కారానికి సరిపడా 4 నుండి 6 పచ్చిమిర్చి, 4 వెల్లుల్లి రెబ్బలు, 1 టీస్పూన్ జీలకర్ర, చిన్న నిమ్మకాయ పరిమాణంలో చింతపండు, రుచికి సరిపడా రాతి ఉప్పు మరియు కొద్దిగా రుచిని పెంచడానికి 2 టేబుల్ స్పూన్ల వేయించిన పల్లీలు లేదా పుట్నాల పప్పును సిద్ధం చేసుకోవాలి. తయారీ విధానం అత్యంత సులభం! మొదటగా చింతపండును కొద్దిగా వేడి నీటిలో నానబెట్టుకోవాలి. అనంతరం ఒక బాణలిలో నూనె వేయకుండా కేవలం పచ్చిమిర్చి, జీలకర్రను డ్రై రోస్ట్ (డ్రైగా వేయించడం) చేసుకోవాలి. పల్లీలను కూడా విడిగా వేయించి పొట్టు తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్ లేదా సాంప్రదాయ రోలు తీసుకుని మొదట వేయించిన పచ్చిమిర్చి, జీలకర్ర, వెల్లుల్లి, వేయించిన పల్లీలు, నానబెట్టిన చింతపండు మరియు ఉప్పు వేసి బరకగా రుబ్బుకోవాలి. ఆ తర్వాత తాజా కొత్తిమీరను అందులో వేసి కొద్దిగా నీళ్లు చిలకరించి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. అంతే! ఎలాంటి నూనె లేదా తాళింపు అవసరం లేకుండా ఘుమఘుమలాడే హెల్తీ కొత్తిమీర పచ్చడి సిద్ధమవుతుంది. ఈ పచ్చడిని వేడివేడి అన్నంలో కొద్దిగా కలుపుకుని తిన్నా, ఇడ్లీ, దోస, ఉప్మా, పెసరట్టు, గారెలు లేదా రోటీలలోకి నంచుకుని తిన్నా రుచి అద్భుతంగా ఉంటుంది. జీరో ఆయిల్ కాబట్టి బరువు తగ్గాలనుకునే వారికి మరియు డయాబెటిస్, గుండె జబ్బులు ఉన్నవారికి ఇది 100 శాతం పర్ఫెక్ట్ హెల్త్ డైట్ చట్నీగా నిలుస్తుంది.       Kothimeera pachadi without oil guide, healthy zero oil coriander green chutney.
కిడ్నీకి సంబంధించిన సమస్యలు ఉన్నాయని తెలిసినప్పుడు చాలామందిలో భయం, ఆందోళన మొదలవుతాయి. అయితే ప్రతి కిడ్నీ సమస్య తీవ్రమైనదే అని భావించాల్సిన అవసరం లేదు. సరైన సమయంలో సమస్యను గుర్తించి, తగిన వైద్య సలహా తీసుకుంటే కిడ్నీ ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. ఈ TeluguOne Health వీడియోలో ప్రముఖ నెఫ్రాలజిస్ట్ డాక్టర్ శ్రీ భూషణ్ రాజు, HOD, నెఫ్రాలజీ, NIMS Hospital, Hyderabad, కిడ్నీ సమస్యలకు సంబంధించిన ముఖ్యమైన విషయాలను సులభంగా వివరిస్తున్నారు. కిడ్నీ సమస్యలు ఎందుకు వస్తాయి? ఏ లక్షణాలను నిర్లక్ష్యం చేయకూడదు? కిడ్నీ వ్యాధి ఉందని తెలిసినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? కిడ్నీ సమస్యలు ఉన్నవారు భయపడాల్సిన అవసరం ఎందుకు లేదు? వంటి ముఖ్యమైన ప్రశ్నలకు ఈ వీడియోలో సమాధానాలు తెలుసుకోవచ్చు. కిడ్నీ ఆరోగ్యంపై సరైన అవగాహన కోసం ఈ వీడియోను పూర్తిగా చూడండి. ఆరోగ్యకరమైన జీవనశైలికి అవసరమైన సూచనలను తెలుసుకోండి. గమనిక: ఈ వీడియోలోని సమాచారం సాధారణ ఆరోగ్య అవగాహన కోసం మాత్రమే. వ్యక్తిగత ఆరోగ్య సమస్యలకు తప్పనిసరిగా అర్హత కలిగిన వైద్యుడిని సంప్రదించండి. మీ ఆరోగ్య సమస్య ఏదైనా... మా హెల్త్ యూట్యూబ్ ఛానల్‌లో సీనియర్ డాక్టర్స్ చెప్పిన సలహాలు... సూచనలు ఉన్నాయి. మా యూట్యూబ్ ఛానల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి TeluguOne Health (సబ్‌స్క్రైబ్ చేయడం మర్చిపోకండి!)  
నేటి ఆధునిక జీవనశైలిలో వెన్నునొప్పి అనేది చాలామందిని వేధించే ప్రధాన సమస్యగా మారింది. గంటల తరబడి డెస్క్ ముందు కూర్చుని పనిచేసే ఐటీ ఉద్యోగులు, ఆఫీస్ సిబ్బంది ఒకవైపు అయితే, ప్రతిరోజూ ట్రాఫిక్‌లో కిలోమీటర్ల కొద్దీ బైక్ ప్రయాణాలు చేసేవారు మరొకవైపు. ఈ రెండు రకాల పనుల వల్ల వెన్నెముకపై చాలా ఒత్తిడి పడి, చిన్న వయస్సులోనే తీవ్రమైన వెన్నునొప్పి సమస్యలు ఎదుర్కొంటున్నారు. సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే ఇది భవిష్యత్తులో డిస్క్ సమస్యలు, నరాల బలహీనతకు దారితీసే అవకాశం ఉంటుంది. అయితే, కొన్ని రోజువారీ అలవాట్లను మార్చుకోవడం ద్వారా ఈ సమస్యకు సులభంగా చెక్ పెట్టవచ్చు. అవేంటో తెలుసుకుంటే.. కూర్చునే పద్ధతిపై దృష్టి పెట్టాలి.. కుర్చీలో కూర్చున్నప్పుడు వీపు కుర్చీకి సరిగ్గా ఆనుకుని ఉండేలా చూసుకోవాలి. నడుము వెనుక భాగంలో ఖాళీ లేకుండా చిన్న కుషన్ లేదా పిల్లో పెట్టుకోవడం వల్ల వెన్నెముకపై ఒత్తిడి తగ్గుతుంది. కంప్యూటర్ లేదా లాప్‌టాప్ స్క్రీన్  కళ్ళ ఎత్తులోనే ఉండాలి. స్క్రీన్ కిందకు ఉన్నప్పుడు మెడ, వెన్ను భాగం ముందుకు వంగి నొప్పికి కారణమవుతాయి.  ప్రతి నలభై ఐదు నిమిషాలకు ఒకసారి సీటు నుంచి లేచి కనీసం రెండు నిమిషాలు అటు ఇటూ నడవడం లేదా శరీరాన్ని స్ట్రెచ్ చేయడం అలవాటు చేసుకోవాలి. బైక్ జర్నీలు చేసేవారికి జాగ్రత్తలు.. రైడింగ్ చేసేటప్పుడు వీపును పక్కకు లేదా ముందుకు ఎక్కువగా వంచకుండా నిటారుగా కూర్చోవాలి. బైక్ షాక్ అబ్జార్బర్లను ఎప్పటికప్పుడు చెక్ చేయించుకోవడం చాలా ముఖ్యం. రోడ్డుపై ఉండే గోతులు, స్పీడ్ బ్రేకర్ల వల్ల వచ్చే షాక్స్ నేరుగా వెన్నెముకపై పడతాయి. అందుకే ప్రయాణంలో హెల్మెట్‌తో పాటు నడుముకు సపోర్ట్ ఇచ్చే లుంబార్ బెల్ట్ వాడటం మంచిది. దూర ప్రాంతాలకు బైక్‌పై వెళ్లేవారు మధ్యమధ్యలో ఆగి కాసేపు విశ్రాంతి తీసుకోవడం వల్ల కండరాల ఒత్తిడి తగ్గుతుంది. వెన్నునొప్పికి ప్రధాన కారణం నడుము , పొత్తికడుపు భాగంలోని కండరాలు బలహీనపడటమే. ప్రతిరోజూ ఉదయం లేదా సాయంత్రం వేళల్లో కనీసం ఇరవై నిమిషాలు వ్యాయామం చేయడానికి కేటాయించాలి. భుజాలు, నడుము, మెడ భాగాలను సాగదీసే స్ట్రెచింగ్ వ్యాయామాలు, యోగాలోని భుజంగాసనం, మార్జాలాసనం వంటివి వెన్నెముకను బలంగా, దృఢంగా మారుస్తాయి. ఈ వ్యాయామాలు కండరాలకు రక్తప్రసరణను పెంచి నొప్పి నుంచి తక్షణ ఉపశమనాన్ని ఇస్తాయి. నీరు.. శరీరంలో నీటి శాతం తగ్గితే వెన్నెముక డిస్కులు తమ శోషణ శక్తిని కోల్పోయి త్వరగా అరిగిపోతాయి. అందుకే రోజుకు కనీసం మూడు నుంచి నాలుగు లీటర్ల నీరు తాగాలి. ఆహారంలో క్యాల్షియం, విటమిన్ డి, విటమిన్ బి12 ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. పాలు, ఆకుకూరలు, గుడ్లు, బాదం , నువ్వులు రోజువారీ డైట్‌లో భాగం చేసుకోవాలి. శరీర బరువు పెరగకుండా చూసుకోవడం కూడా వెన్నునొప్పి నివారణలో కీలకమైన పాత్ర పోషిస్తుంది. నిద్ర.. రాత్రి వేళల్లో సరైన నిద్ర లేకపోవడం లేదా సరిగ్గా లేని మెత్తటి పరుపులపై పడుకోవడం వల్ల కూడా వెన్నునొప్పి పెరుగుతుంది. మరీ మెత్తగా ఉన్న పరుపుల కంటే వెన్నెముకకు సరైన ఆధారాన్ని ఇచ్చే ఆర్థోపెడిక్ పరుపులను ఉపయోగించడం మంచిది. చిన్న చిట్కా..  పడుకునేటప్పుడు కాళ్ళ మధ్యలో చిన్న దిండు పెట్టుకోవడం వల్ల నడుముపై పడే భారం తగ్గుతుంది. ఈ చిన్నపాటి మార్పులను జీవితంలో భాగం చేసుకోవడం ద్వారా డెస్క్ జాబ్‌లు, బైక్ ప్రయాణాల వల్ల వచ్చే వెన్నునొప్పికి సులభంగా చెక్ పెట్టవచ్చు. ఒకవేళ నొప్పి తీవ్రంగా ఉండి, కాళ్ళలోకి పాకుతున్నట్లు అనిపిస్తే ఆలస్యం చేయకుండా ఆర్థోపెడిక్ లేదా ఫిజియోథెరపీ వైద్యుడిని సంప్రదించి సరైన చికిత్స తీసుకోవడం శ్రేయస్కరం.                     *రూపశ్రీ.