LATEST NEWS
  కర్ణాటక పాలిటిక్స్‌లోకి టీవీకే ఎంట్రీ సంచలన వ్యూహం.. దక్షిణాది సినీ రంగంలో తిరుగులేని చక్రవర్తిగా వెలిగి, ఇటీవల జరిగిన 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో సరికొత్త రికార్డు సృష్టించిన కోలీవుడ్ సూపర్ స్టార్, 'దళపతి' విజయ్ ఇప్పుడు మరో సంచలన నిర్ణయంతో వార్తల్లో నిలిచారు. తమిళనాడులో తన సొంత పార్టీ 'తమిళగ వెట్రి కజగం' (TVK) తరఫున ఒంటరిగా బరిలోకి దిగి 34.9 శాతం ఓట్ల శాతాన్ని కొల్లగొట్టడమే కాకుండా, ఏకంగా 108 స్థానాలను కైవసం చేసుకుని అతిపెద్ద పార్టీగా అవతరించిన విజయ్, కాంగ్రెస్ మరియు సీపీఐ(ఎం) మద్దతుతో 118 మంది ఎమ్మెల్యేల మ్యాజిక్ ఫిగర్‌ను దాటి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించారు.  అయితే తమిళనాడులో సాధించిన ఈ చారిత్రాత్మక విజయంతో ఆయన ప్రస్థానం ఆగడం లేదు. పొరుగు రాష్ట్రమైన కర్ణాటక రాజకీయాల్లోకి కూడా అడుగుపెట్టేందుకు దళపతి విజయ్ వ్యూహాత్మక అడుగులు వేస్తుండటం ఇప్పుడు దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టిస్తోంది. ఈ వార్త రాజకీయ వర్గాల్లో ఒక్కసారిగా ప్రకంపనలు రేపుతోంది.  ముఖ్యంగా కర్ణాటకలోని బెంగుళూరు నగరంతో పాటు తమిళ ప్రజలు అధిక సంఖ్యలో నివసించే సరిహద్దు జిల్లాలను లక్ష్యంగా చేసుకుని విజయ్ తన 'టివికె' పార్టీని విస్తరించాలని యోచిస్తున్నారు.  కర్ణాటకలో త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలు, ముఖ్యంగా బృహత్ బెంగళూరు మహానగర పాలిక (BBMP) మరియు గ్రామీణ స్థానిక సంస్థల (GBA) ఎన్నికల్లో తన పార్టీ అభ్యర్థులను రంగంలోకి దించడానికి గ్రౌండ్ వర్క్ సిద్ధం చేస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. కర్ణాటక వ్యాప్తంగా విజయ్‌కు లక్షలాది మంది అభిమానులు ఉండటం, బెంగళూరులోని కొన్ని ప్రాంతాలలో తమిళ ఓటర్ల శాతం దాదాపు 25 నుండి 30 శాతం వరకు ఉండటంతో ఈ ఓటు బ్యాంకును తమ వైపు తిప్పుకోవచ్చని టీవీకే అధినేత భావిస్తున్నారు.  ఈ పరిణామాలు కర్ణాటకలోని అధికార కాంగ్రెస్ ప్రభుత్వానికి మరియు ప్రతిపక్ష బీజేపీ-జేడీఎస్ కూటమికి పెద్ద తలనొప్పిగా మారేలా కనిపిస్తున్నాయి. కర్ణాటక డిప్యూటీ సీఎం డి.కె. శివకుమార్, ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఇప్పటికే అంతర్గత నివేదికల ద్వారా విజయ్ ఎంట్రీ ప్రభావంపై ఆరా తీస్తున్నట్లు పొలిటికల్ సర్కిల్స్‌లో టాక్ నడుస్తోంది. తమిళనాడులో 2024 ఫిబ్రవరిలో పార్టీ పెట్టిన కేవలం రెండేళ్లలోనే ద్రావిడ దిగ్గజాలైన డీఎంకే, ఏఐఏడీఎంకేలను మట్టికరిపించి 234 స్థానాల్లోనూ బలమైన ఉనికిని చాటుకున్న విజయ్ క్రేజ్ సాధారణమైనది కాదు.  గతంలో 2025 సెప్టెంబర్ 27న జరిగిన కరూర్ భారీ బహిరంగ సభలో తొక్కిసలాట జరిగి 41 మంది అభిమానులు మరణించిన దురదృష్టకర సంఘటన జరిగినప్పటికీ, విజయ్ ప్రజాబలం ఏమాత్రం తగ్గలేదు. అటువంటి ప్రజాకర్షణ కలిగిన నాయకుడు బెంగళూరు రాజకీయాల్లో వేలు పెడితే, అది కర్ణాటక పాలిటిక్స్ సమీకరణాలను పూర్తిగా మార్చేస్తుందనడంలో సందేహం లేదు. రాబోయే రోజుల్లో దళపతి విజయ్ కర్ణాటక పర్యటనకు రానున్నట్లు సమాచారం రావడంతో కన్నడ నాట రాజకీయం మరింత వేడెక్కింది  
  బీజేపీ ఎదుగుదలకు కాంగ్రెస్సే అసలు కారణమన్న మాజీ డిప్యూటీ సీఎం.. తమిళనాడు రాజకీయ ముఖచిత్రం ఒక్కసారిగా మారిపోయింది. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల అనంతరం ఊహించని పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ప్రముఖ సినీ నటుడు విజయ్ నేతృత్వంలోని 'తమిళగ వెట్రి కళగం' (టీవీకే) మైనారిటీ ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీ అనూహ్యంగా మద్దతు ప్రకటించింది. ఈ పరిణామంతో డీఎంకే కూటమిలో తీవ్ర అసంతృప్తి, అగ్నిపర్వతం బద్దలైంది. డీఎంకే యువజన విభాగం అధినేత ఉదయనిధి స్టాలిన్ కాంగ్రెస్ వైఖరిపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఒక ముఖ్యమైన పార్టీ అంతర్గత సమావేశంలో ఉదయనిధి స్టాలిన్ మాట్లాడుతూ, హస్తం పార్టీకి కనీస కృతజ్ఞతా భావం లేదని మండిపడ్డారు. ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ప్రతిష్ఠ, డీఎంకే కార్యకర్తల అహర్నిశల శ్రమ వల్లే గత ఎన్నికల్లో కాంగ్రెస్ ఐదుగురు శాసనసభ్యులను గెలిపించుకోగలిగిందని గుర్తు చేశారు. కానీ నేడు అధికార కాంక్షతో, తమకు ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా విజయ్ పార్టీ వైపు వెళ్లడం దారుణమన్నారు. కాంగ్రెస్‌ను ఒక 'వెన్నుపోటుదారు'గా అభివర్ణించారు. ఇకపై కాంగ్రెస్ పార్టీని ఎట్టిపరిస్థితుల్లోనూ నమ్మకూడదని, ఆ పార్టీని తమ దరిదాపుల్లోకి కూడా రానివ్వకూడదని డీఎంకే శ్రేణులకు ఉదయనిధి పిలుపునిచ్చారు. స్వార్థ రాజకీయాలకు పాల్పడుతున్న వారికి తమిళనాడు ఓటర్లు త్వరలోనే సరైన రీతిలో బుద్ధి చెబుతారని హెచ్చరించారు. దేశంలో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఇంతలా బలోపేతం కావడానికి నరేంద్ర మోదీ, అమిత్ షా కారణం కాదని, అసలు కారణం కాంగ్రెస్ చేతకానితనమేనని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ రాజకీయ సంక్షోభం నేపథ్యంలో డీఎంకే పార్టీ ప్రత్యేక తీర్మానాలను ఆమోదించింది. కాంగ్రెస్ పార్టీని మిత్రపక్షాల శ్రమను దోచుకునే జలగలుగా ఆ తీర్మానంలో పేర్కొనడం గమనార్హం. గతంలో లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఉనికిని కాపాడింది డీఎంకే అధినేత ఎంకే స్టాలినే అని పార్టీ శ్రేణులు స్పష్టం చేస్తున్నాయి. మరోవైపు మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే సుప్రీమో ఎంకే స్టాలిన్ సైతం సరికొత్త విజయ్ ప్రభుత్వంపై విమర్శల బాణాలు విసిరారు. నటుడు విజయ్ నేతృత్వంలోని ఈ సంకీర్ణ ప్రభుత్వం ఎక్కువ కాలం మనుగడ సాగించలేదని జోస్యం చెప్పారు. కేవలం 120 మంది ఎమ్మెల్యేల మద్దతుతో నడుస్తున్న ఈ సర్కార్ ఏ క్షణంలోనైనా కూలిపోవడం ఖాయమని అన్నారు. సీపీఐ, సీపీఎం, వీసీకే వంటి డీఎంకే పాత మిత్రపక్షాలన్నీ ఇప్పుడు మంత్రిపదవుల కోసం విజయ్ ప్రభుత్వంలో చేరడాన్ని స్టాలిన్ తప్పుబట్టారు. చిన్న పిల్లలకు కొత్త బొమ్మలు దొరికితే కొద్దిరోజులు ఆడుకుని బోర్ కొట్టినట్లు, ప్రజలకు కూడా ఈ నటుడి పాలనపై త్వరలోనే విరక్తి కలుగుతుందని ఎద్దేవా చేశారు. ప్రజలు మళ్లీ తమ వైపే చూస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో తమిళనాడులో సరికొత్త రాజకీయ సమీకరణాలు మారే అవకాశం ఉంది. డీఎంకే ఒంటరి పోరాటానికి సిద్ధమవుతుండగా, విజయ్ నేతృత్వంలోని కూటమి తమ బలాన్ని నిరూపించుకోవడానికి ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో తమిళ రాజకీయాల్లో ప్రజా తీర్పు ఎటువైపు మొగ్గుతుందో వేచి చూడాలి.  
గొడ్డలి పార్టీ. ఈ పదం ప్రధానంగా వైసీపీని విమర్శించడానికి కూటమి నేతలు తరచూ వాడుతున్నారు. ఇక చంద్రబాబు అయితే.. సమాజానికి గొడ్డలి పార్టీ హానికరం అని మరో మారు కామెంట్ చేశారు. గొడ్డలి పార్టీ నెవర్‌ అగైన్‌ అనే క్యాంపెయిన్ కూడా స్టార్ట్ చేశారు.  రప్పారప్పా రంకెలు.. జంతు రక్తంతో కటౌట్లకు అభిషేకాలా? సీబీఎన్‌ దగ్గర తోక జాడిస్తే.. ప్రజాహితం కోసం తోక కట్ చేస్తానని హెచ్చరించారు. గొడ్డలి పార్టీ పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు, ప్రజాస్వామ్యంలో ఆ పార్టీకి చోటులేదని కూడా అన్నారు. అభివృద్ధి, సంక్షేమంతో పాటు ప్రజల ప్రాణాలు, ఆస్తులకు రక్షణ ఇవ్వాలి. కులాలు, మతాల మధ్య చిచ్చుపెట్టి రోజుకొక నాటకమాడుతున్నారు. అసత్య ప్రచారాలతో రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారు. కోడి కత్తి, గులకరాయి నాటకాలు గుర్తున్నాయి కదా? దళిత యువకుడు సుబ్రమణ్యాన్ని హత్య చేసి డోర్‌ డెలివరీ చేసిన వారికి సన్మానాలా? కుటుంబ బంధాలపై గొడ్డలి వేటు.. తల్లి, చెల్లికి ఆస్తులివ్వకుండా వేధించారు. తల్లి, చెల్లికి న్యాయం చేయలేని వారు.. ప్రజలను ఏం చూస్తారని ప్రశ్నించారు.  కూటమి ప్రభుత్వం వచ్చాక ప్రజలు స్వేచ్ఛగా బతుకుతున్నారు. నేను ప్రజల సేవకుణ్ణి.. పెత్తందారు కాదు. నిరంతరం పనిచేసి పేదల రుణం తీర్చుకుంటా. ప్రజల ఆస్తులు, ప్రాణాలకు రక్షణ కల్పించింది- ఎన్డీయే కూటమి  అంటూ కామెంట్ చేశారు ఏపీ సీఎం. దీనంతటికీ కారణం.. వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో గొడ్డలి వాడకం తీవ్ర చర్చనీయాంశమైంది. అప్పటినుంచి ప్రత్యర్థి పార్టీలు వైసిపిని టార్గెట్ చేస్తూ గొడ్డలి పార్టీ అని, ఆ పార్టీ సంస్కృతిని గొడ్డలి సంస్కృతి అని పిలుస్తూ విమర్శలు గుప్పిస్తున్నారు చంద్రాబు తదితర కూటమి పార్టీల నేతలు.. ఇక పోతే కాక్రోచ్ ఆర్ బొద్దింక. ఇటీవల దేశ రాజకీయాల్లో బాగా వైరల్ అయిందీ పదం. ఎలా పుట్టింది ఈ కాక్రోచ్ జనతా పార్టీ? అని చూస్తే.. సుప్రీం కోర్ట్  కోర్టు విచారణల సందర్భంలో దేశంలోని నిరుద్యోగ యువతను, కొందరు సోషల్ మీడియా యాక్టివిస్టులను ఉద్దేశించి బొద్దింకలు, సమాజ పరాన్న జీవులు అంటూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి చేసిన కొన్ని వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ఆ తర్వాత ఆయన వివరణ ఇచ్చుకున్నా.. అది కాక్రోచ్ జనతా పార్టీ అంటూ కొత్త రూపు తీసుకుని ఫాలోయర్స్ సంఖ్య అమాంతం పెంచుకుని కొత్త రికార్డులు క్రియేట్ చేసింది. ప్రస్తుత కాలమాన పరిస్థితులపై ఒక వ్యంగ్యాస్త్రంగానూ నిలుస్తోంది.  ఇలాంటివే మరికొన్ని పదాలను చూస్తే.. పేటీఎం బ్యాచ్, రూ.5 బ్యాచ్.. ఇవి గత కొన్నేళ్లుగా ఉన్నా, ఇప్పటికీ ఫుల్ ట్రెండింగ్‌లో ఉన్న పదాల్లో కొన్ని.  ఒక పార్టీకి మద్దతుగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడానికి, ట్రోల్స్ చేయడానికి డబ్బులు తీసుకునే వారిని,  మరీ ముఖ్యంగా వైసిపి సోషల్ మీడియా వింగ్‌ను, టిడిపి, జనసేన శ్రేణులు  పేటీఎం బ్యాచ్ అని పిలుస్తుంటారు. ప్రతి పోస్టుకు ఐదు రూపాయలు ఇస్తారనే ప్రచారంతో  ఐదు రూపాయల బ్యాచ్ అని కూడా అంటారు. ఇక పోతే ఇటీవలి కాలంలో బాగా ట్రెండింగ్ లోకి వచ్చిన ఇంకో పదం..  మెలోడీ- ఇది మరీ ఇంటర్నేషనల్ క్రేజ్. ఇది ఏ ఒక్క దేశానికో పరిమితమైన పదం కాదు. భారత ప్రధాని నరేంద్ర మోదీ, ఇటలీ ప్రధాని జార్జియా మెలోని పేర్లను కలిపి నెటిజన్లు సృష్టించిన   నేమ్ మెలోడీ.  అంతర్జాతీయ సదస్సుల్లో వీరిద్దరూ కలిసినప్పుడు దిగిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యాయి. ఇద్దరి మధ్య ఉన్న స్నేహపూర్వక సంభాషణలు, నవ్వులను చూసి నెటిజన్లు  మెలోడీ అనే హ్యాష్‌ట్యాగ్‌తో వేల సంఖ్యలో రీల్స్, మీమ్స్ సృష్టించారు. స్వయంగా ఇటలీ ప్రధాని మెలోని కూడా ఒక సెల్ఫీ వీడియో పెడుతూ " హలో ఫ్రం మెలోడీ టీమ్’  అనడంతో ఈ పదం గ్లోబల్ ట్రెండ్ అయిపోయింది. టాఫీ డిప్లమసీ లేదా చాక్లెట్ రాజకీయం కూడా ఇదే కోవలోకి వచ్చే పదమే.  ఇక రీల్స్ మంత్రి, బిర్యానీ పాలిటిక్స్ అంటూ రకరకాల మీమ్స్ కమ్ వర్డ్స్ కూడా ట్రెండింగ్ లోకి వచ్చాయి. ఒకప్పుడు రాజకీయం అంటే కేవలం సీరియస్ ఉపన్యాసాలు మాత్రమే ఉండేవి. కానీ ఇప్పుడు.. గొడ్డలి పార్టీ, కాక్రోచ్ పార్టీ అంటూ సెటైరికల్ కామెంట్లతో పాటు మెలోడీ, టాఫీలాంటి సిల్లీ పదాల వల్ల పాలిటిక్స్ కాస్త ఎంటర్‌టైన్‌మెంట్‌గా, మీమ్స్ మెటీరియల్‌గా మారిపోయాయి.
ALSO ON TELUGUONE N E W S
  మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi)అప్ కమింగ్ మూవీ విశ్వంభర ఫేమ్ మౌని రాయ్ మరోసారి సోషల్ మీడియాలో సెన్సేషన్ సృష్టించింది. సినిమాలతో పాటు సోషల్ మీడియాలోనూ తన అద్భుతమైన గ్లామర్‌తో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న ఈ సుందరి, ఎప్పటికప్పుడు స్టైలిష్ ఫోటోలు, గ్లామరస్ లుక్స్‌nin అభిమానులతో పంచుకుంటూ నెట్టింట  యాక్టివ్‌గా ఉంటూ ఉంటుంది.అందుకే  రోజురోజుకి ఫాలోవర్ల సంఖ్య కూడా భారీగా పెరుగుతోంది. తన ఫిట్‌నెస్‌ను ఎంతో అద్భుతంగా మెయింటైన్ చేస్తూ, టాలీవుడ్, బాలీవుడ్ స్టార్ హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోని అందంతో ఆకట్టుకుంటున్న మౌని రాయ్ తాజాగా షేర్ చేసిన లేటెస్ట్ ఫోటోషూట్ ఇప్పుడు ఇంటర్నెట్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఇటీవల ఆమె తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని సూపర్ కూల్ అండ్ స్టైలిష్ లుక్‌లో ఉన్న ఫోటోలని  అభిమానులతో పంచుకుంది. ఈ తాజా ఫోటోలలో మౌని రాయ్ వైట్ అండ్ స్కై బ్లూ కలర్ కాంబినేషన్ (తెలుపు, ఆకాశం రంగు) లో ఉన్న ఒక ట్రెండీ అవుట్‌ఫిట్‌తో మెరిసిపోయింది. ఈ వెరైటీ వెస్ట్రన్ డ్రెస్‌లో ఆమె ఇచ్చిన విభిన్నమైన స్టైలిష్ పోజులు అభిమానులని ఎంతగానో మెస్మరైజ్ చేస్తున్నాయి. ముఖ్యంగా ఈ ఫోటోషూట్ కోసం ఆమె తన కురులను ఎంతో అందంగా ముడి వేసుకుని, అల్ట్రా స్టైలిష్ హెయిర్ స్టైల్‌లో కనిపించడం విశేషం. ఆమె కళ్లలోని తీక్షణత, ముఖంలో ఉన్న గ్లామర్ చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. మొత్తంగా మౌని రాయ్ లేటెస్ట్ లుక్ నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటూ అన్ని సాషల్ మీడియా ప్లాట్‌ఫారమ్స్‌లో వైరల్‌గా మారుతోంది. Also read: Allu Arjun: వైరల్ గా మారిన అల్లు అర్జున్ వాచీ రేట్.. ఆ రేటుతో హైదరాబాద్ లో  ఏం కొనచ్చో తెలుసా! 'నాగిని' సీరియల్ ద్వారా దేశవ్యాప్తంగా విపరీతమైన పాపులారిటీ తెచ్చుకున్న మౌని రాయ్, ఆ తర్వాత వెండితెరపై కూడా తన ముద్ర వేసింది. ముఖ్యంగా 2022లో వచ్చిన 'బ్రహ్మాస్త్ర' సినిమాలో ఆమె పోషించిన నెగెటివ్ రోల్ విమర్శకుల నుంచి  ప్రశంసలు అందుకుంది. ఆ సినిమాలో ఆమె నటనకు గానూ ఐఫా (IIFA) అవార్డుల్లో ఉత్తమ సహాయ నటి అవార్డును కూడా గెలుచుకుంది. రీసెంట్‌గా జరిగిన ప్రతిష్టాత్మక కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ (Cannes Film Festival) లో కూడా ఆమె తన స్టైల్ స్టేట్‌మెంట్‌తో అందరి దృష్టిని ఆకర్షించింది. విశ్వంభర లో స్పెషల్ సాంగ్ చేసిన మౌని రాయ్ తన భర్త రాహుల్ నంబియార్ నుంచి విడాకులు తీసుకుంటున్న విషయం తెలిసిందే.  
Action King Arjun Sarja, Preeti Mukundan and Abhirami starrer much-awaited action entertainer ‘Blast Zone’ is all set for a grand theatrical release on May 28. The film is being prestigiously distributed across Andhra Pradesh and Telangana by Sithara Entertainments. Directed by Subhash K Raj and produced by AGS Entertainment, the film has music composed by ‘KGF’ fame Ravi Basrur. Ahead of the release, the film’s team held a grand press meet on Monday at Park Hyatt Hyderabad. Speaking at the event, Arjun Sarja said, “Blast Zone is a very special film for me. The film carries a powerful message about standing against injustice in society and empowering women with courage and confidence. The movie blends women empowerment with strong commercial elements. Preeti Mukundan and Abhirami have performed outstanding action sequences after undergoing martial arts training. Ravi Basrur’s background score is exceptional, and every technical department has delivered brilliant work. This film will not feel like a dubbed movie; every character will connect emotionally with the audience. I am confident everyone will thoroughly enjoy Blast Zone in theatres on May 28.” Actress Abhirami said, “I am extremely happy to be part of such a powerful mass entertainer. I have never performed such an intense role or action sequences before. I worked very hard for this film and even underwent special training. The trailer has received a fantastic response, and the film is packed with stunning visuals, music, and action. Blast Zone is definitely a theatrical experience.” Actress Preeti Mukundan said, “We are overwhelmed by the tremendous response to the Telugu trailer. I strongly believe Blast Zone will become a huge success in Telugu as well. I thank Sithara Entertainments for releasing our film on a grand scale.” Director Subhash K Raj said, “Audiences will witness vintage Arjun sir in this film. The movie will be a treat for his fans. Preeti Mukundan and Abhirami delivered exceptional performances. After seeing the response to the trailer, I understood the expectations are very high, and I assure audiences that the film will exceed those expectations.” Associate Creative Producer Aishwarya Kalpathi thanked Sithara Entertainments for releasing the film grandly in Telugu and expressed confidence that audiences would wholeheartedly support the movie in theatres. Disclaimer: This news article is written based on information shared by various sources. The organization is not responsible for their factual nature. While we try to conduct thorough research, sources can sometimes misguide us. Therefore, we encourage viewers' discretion before reacting to the news.
  ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun)స్టైల్ కి ఉన్న క్రేజ్  గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.  ఆఫ్ ది స్క్రీన్  ఆయన మెయింటైన్ చేసే లగ్జరీ లైఫ్ స్టైల్ ఎప్పుడూ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారుతుంటుంది. తాజాగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) స్టార్ క్రికెటర్ వెంకటేష్ అయ్యర్, అల్లు అర్జున్‌ ని  ప్రత్యేకంగా కలిశారు. ఈ క్రేజీ మీటింగ్‌కు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఈ ఫొటోల్లో అల్లు అర్జున్ లుక్ ఎంత స్టైలిష్‌గా ఉందో, ఆయన చేతికి ఉన్న ఒక లగ్జరీ వాచ్ అంతకంటే ఎక్కువగా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. నెటిజన్లు ఆ వాచ్ వివరాలను ఆరా తీయడం మొదలుపెట్టడంతో ఒక ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది. ఈ వైరల్ ఫోటోలలో అల్లు అర్జున్ ప్రపంచ ప్రఖ్యాత లగ్జరీ బ్రాండ్ అయిన 'పాటెక్ ఫిలిప్' (Patek Philippe) కంపెనీకి చెందిన అత్యంత ప్రతిష్టాత్మకమైన నాటిలస్ మూన్‌ఫేస్ రోజ్ గోల్డ్ (Nautilus Moonphase Rose Gold) వాచ్‌ని  ధరించాడు. ఈ అల్ట్రా లగ్జరీ టైమ్‌పీస్ ధర వింటే ఎవరికైనా మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే. వాల్యూ దాదాపు 2.75 కోట్లు ఉంటుందని సమాచారం. ఈ భారీ మొత్తంతో, హైదరాబాద్‌ వంటి మహానగరంలో ఒక అద్భుతమైన లగ్జరీ ఫ్లాట్ లేదా గేటెడ్ కమ్యూనిటీ విల్లాను సులభంగా కొనుగోలు చేయవచ్చు.  Also read: sharwanand: శర్వానంద్, శ్రీను వైట్ల కాంబోలో చిరు భామ.. ఈ మధ్యనే సూపర్ హిట్ అందుకుంది క్రికెట్ మరియు సినిమా రంగాల కలయికగా సాగిన ఈ భేటీలో కేవలం వాచ్ మాత్రమే కాకుండా ఒక క్యూట్ మూమెంట్ కూడా అభిమానులను ఆకట్టుకుంది. ఈ సమావేశంలో వెంకటేష్ అయ్యర్ ఒక స్వీట్ జెస్టర్‌తో అల్లు ఫ్యామిలీని ఖుషీ చేశారు. అల్లు అర్జున్ కుమారుడు అల్లు అయాన్ కోసం ప్రత్యేకంగా ఒక ఆర్‌సీబీ (RCB) జెర్సీని కానుకగా అందించారు. ఈ క్రేజీ గిఫ్ట్ ఇచ్చినందుకు అల్లు అర్జున్ సోషల్ మీడియా వేదికగా వెంకటేష్ అయ్యర్‌కి  ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. అల్లు అర్జున్ ప్రెజెంట్ అట్లీ తో చేస్తున్న రాకా(Raaka)తో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. అట్లీ దర్సకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ అల్లు అర్జున్ కెరీర్ లోనే అత్యధిక భారీ వ్యయంతో నిర్మాణం జరుపుకోనుంది.  
నటసింహం నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna), డైరెక్టర్ కొరటాల శివ (Koratala Siva) కాంబినేషన్‌లో అఫీషియల్‌గా అనౌన్స్ అయిన క్రేజీ ప్రాజెక్ట్ 'NBK 112' ఇప్పుడు ఫిల్మ్ నగర్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. రీసెంట్‌గా విడుదలైన అధికారిక పోస్టర్‌తోనే అంచనాలను ఆకాశానికి తీసుకెళ్లిన ఈ చిత్రం, త్వరలోనే ఘనంగా ప్రారంభం కానుంది.  విశ్వసనీయ సమాచారం ప్రకారం, ఈ భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ యొక్క ముహూర్తపు వేడుకను జూన్ 25న అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు. చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖుల సమక్షంలో పూజా కార్యక్రమాలతో ఈ సినిమాను అధికారికంగా ప్రారంభించనున్నారు.  ముహూర్తం పూర్తయిన తర్వాత, కేవలం కొన్ని రోజుల్లోనే ప్రీ-ప్రొడక్షన్ పనులన్నీ పూర్తి చేసి, ఆగస్ట్ నెల నుండి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్‌ను పట్టాలెక్కించేందుకు దర్శకుడు కొరటాల శివ పక్కా ప్రణాళిక సిద్ధం చేశారు. ఈ క్రేజీ కాంబినేషన్ అనౌన్స్‌మెంట్ పోస్టర్‌పై ఉన్న “Power Meets Purpose, Mass Becomes A Movement” అనే ట్యాగ్‌లైన్ నందమూరి అభిమానుల్లో పూనకాలు తెప్పించింది. కొరటాల శివ తన ప్రతి సినిమాలో ఒక బలమైన సామాజిక ఇతివృత్తాన్ని కమర్షియల్ హంగులతో జోడించి అద్భుతమైన విజయాలను అందుకున్నారు. ఈసారి కూడా బాలయ్య ఇమేజ్‌కు సరిపోయేలా, సమాజంలో ఉండే ఒక పవర్‌ఫుల్ పాయింట్‌ను ఎలివేట్ చేస్తూ ఈ స్క్రిప్ట్‌ను లాక్ చేసినట్లు తెలుస్తోంది.  ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన లుక్ టెస్ట్‌ను కూడా బాలకృష్ణ విజయవంతంగా పూర్తి చేశారు. ఈ సినిమాలో బాలయ్య సరికొత్త మేకోవర్‌తో, మునుపెన్నడూ చూడని అత్యంత శక్తిమంతమైన మాస్ అవతారంలో కనిపించనున్నారని ఇండస్ట్రీ టాక్. బాలకృష్ణ ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తన 111వ సినిమాలో నటిస్తున్నారు. దానితో పాటు పారలాల్ గా కొరటాల శివ ప్రాజెక్ట్‌ షూటింగ్ లో పాల్గొననున్నారు.  SLV సినిమాస్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్స్ పై భారీ బడ్జెట్‌తో నిర్మితమవుతున్న ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు, సాంకేతిక నిపుణుల సమాచారం జూన్ 25న జరిగే లాంచింగ్ ఈవెంట్‌లో అధికారికంగా వెల్లడి కానున్నాయి.  బాలయ్య మార్క్ ఊరమాస్ యాక్షన్, కొరటాల శివ మార్క్ సోషల్ మెసేజ్ కలసి రాబోతున్న ఈ చిత్రం టాలీవుడ్‌లో సరికొత్త రికార్డులను సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది.  
కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ (Thalapathy Vijay) తమిళనాడు ముఖ్యమంత్రిగా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన సంగతి తెలిసిందే. సినీ ఇండస్ట్రీకి చెందిన ఓ అగ్ర నటుడు ఇంతటి ఘన విజయాన్ని సాధించడంపై సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో, తాజాగా జరిగిన 'బ్లాస్ట్ జోన్' (Blast Zone) మూవీ ప్రెస్ మీట్‌లో పాల్గొన్న యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా (Arjun Sarja).. సీఎం విజయ్ గురించి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. ప్రెస్ మీట్‌లో భాగంగా జర్నలిస్టులు అడిగిన ఆసక్తికరమైన ప్రశ్నలకు అర్జున్ తనదైన శైలిలో సమాధానమిచ్చారు. ఇటీవల ముఖ్యమంత్రి విజయ్‌ను కలవడంపై స్పందించారు. ముఖ్యంగా విజయ్ సీఎం కుర్చీలో కూర్చున్న విధానం, ఆయన శరవేగంగా సాగిస్తున్న పరిపాలన చూస్తుంటే అర్జున్ బ్లాక్‌బస్టర్ హిట్ చిత్రం ‘ఒకే ఒక్కడు’ గుర్తుకు వస్తోందని ఇండస్ట్రీ వర్గాలతో పాటు ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు. ఇదే విషయంపై అర్జున్ స్పందిస్తూ.. తాను విజయ్‌ని కలిసినప్పుడు స్వయంగా విజయ్ కూడా ఇదే విషయాన్ని ప్రస్తావించారని ఒక క్రేజీ సీక్రెట్ బయటపెట్టారు. "నేను సీఎం సీట్ చూసినప్పుడు నాకూ ఫస్ట్ 'ఒకే ఒక్కడు' సినిమానే గుర్తొచ్చింది సార్.. ఆ కుర్చీలో కూర్చున్నప్పుడు అదే ఫీలింగ్ కలిగింది" అని విజయ్ తనతో అన్నట్లు అర్జున్ చెప్పుకొచ్చారు.  తమ సినీ ఇండస్ట్రీకి చెందిన ఒక నటుడు, మొన్నటివరకు కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్న తోటి నటుడు ఈరోజు ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడం ఇండస్ట్రీ మొత్తానికి గర్వకారణమని అర్జున్ ప్రశంసల జల్లు కురిపించారు. మొదటి ప్రయత్నంలోనే ఇంతటి భారీ విజయం అందుకోవడం మామూలు విషయం కాదన్నారు. ఇదే తరుణంలో ఏపీలో పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం కావడం, తమిళనాడులో విజయ్ సీఎం కావడం చూస్తుంటే దక్షిణాది ప్రజలు సినీ సెలబ్రిటీలను రాజకీయాల్లో ఓన్ చేసుకుంటున్నారనే చర్చ నడిచింది. దీనిపై స్పందిస్తూ, భవిష్యత్తులో అర్జున్ కూడా చట్టసభల్లోకి అడుగుపెట్టే అవకాశం ఉందా? అని జర్నలిస్ట్ ప్రశ్నించారు. దానికి అర్జున్ నవ్వుతూ సమాధానమిస్తూ.. తనకు పాలిటిక్స్ లోకి వచ్చే ఉద్దేశం ఏమాత్రం లేదని కుండబద్దలు కొట్టారు. రాజకీయాల్లోకి రావాలంటే లోపల ఆ బలమైన సంకల్పం ఉండాలని, సమాజానికి మంచి చేయాలనే కోరిక తనకు ఉన్నప్పటికీ దాన్ని బయట ఉండి కూడా చేయవచ్చని అర్జున్ స్పష్టం చేశారు. అంతేకాకుండా ప్రస్తుత రాజకీయాల్లో డబ్బు ప్రభావం చాలా ఎక్కువని, అంత భారీగా ఖర్చు పెట్టేంత డబ్బు తన వద్ద లేదని, తనకున్న కొన్ని వ్యక్తిగత ప్రిన్సిపల్స్ వల్ల పాలిటిక్స్ తనకు సెట్ కావని తేల్చిచెప్పారు.  విజయ్ కూడా పెద్దగా డబ్బు ఖర్చు పెట్టకుండా కేవలం క్రేజ్, జనాదరణతోనే సీఎం అయ్యారు కదా అని జర్నలిస్టులు గుర్తు చేయగా.. "ఆయనకున్నంత భారీ ఫ్యాన్ బేస్, పేరు నాకు లేదు కదా" అంటూ అర్జున్ చాలా సింపుల్‌గా, హుందాగా సమాధానమిచ్చారు. యాక్షన్ కింగ్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి.  
    నారీనారీ నడుమ మురారి, బైకర్ వంటి వరుస విజయంతమైన చిత్రాలతో శర్వానంద్(sharwanand)మంచి జోరు మీద ఉన్నాడు. హిట్ చిత్రాల దర్శకుడు శ్రీను వైట్ల(Srinu Vaitla) కాంబోలో ఒక మూవీ చేస్తున్నాడు. ఇప్పుడు ఈ చిత్రంలో కన్నడ బ్యూటీ, టాలీవుడ్ లక్కీ చార్మ్ ఆషికా రంగనాథ్(Ashika ranganath)ఎంపికైనట్లు తెలుస్తోంది. దర్శక నిర్మాతలు ఈ చిత్రంలో హీరోయిన్ క్యారక్టర్  కోసం చాలా మంది హీరోయిన్స్ ని  పరిశీలించినప్పటికీ, చివరికి ఆషికా రంగనాథ్ వైపే మొగ్గు చూపినట్లు సమాచారం. ఆషికా క్యారక్టర్ ఎంతో ప్రాధాన్యతతో కూడి ఉంటుందని, కథను మలుపు తిప్పే కీలకమైన ఎమోషన్స్ ఆమె  చుట్టూనే తిరుగుతాయని టాక్ వినిపిస్తోంది. దాదాపుగా 100 శాతం వినోదం, విలక్షణమైన ప్రేమకథ నేపథ్యంలో సాగడంతో పాటు శర్వానంద్, ఆషికా రంగనాథ్ మధ్య వచ్చే లవ్ ట్రాక్,  కెమిస్ట్రీ సినిమాకే ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి.ఆషికాకి సంబంధించి  త్వరలోనే  అధికారిక ప్రకటన వెలువడనుందని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. also read: Tollywood Trending: టాలీవుడ్ ట్రెండింగ్ లో ఈ రోజు హెడ్ లైన్స్ చూద్దాం ఇక ఈ సినిమా బడ్జెట్ మరియు టెక్నికల్ వాల్యూస్ విషయంలో నిర్మాతలు ఎక్కడా రాజీ పడటం లేదని తెలుస్తోంది. దాదాపు 30 కోట్ల రూపాయల భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నారట. శర్వానంద్ గత చిత్రాల మార్కెట్‌ను దృష్టిలో ఉంచుకుని, బిజినెస్ పరంగా కూడా ఈ ప్రాజెక్ట్ చాలా సేఫ్ జోన్‌లో ఉండేలా ప్రణాళికలు రచిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ కూడా త్వరలోనే ప్రారంభం కానుంది. ఆషికా  ఈ సంక్రాంతికి రవితేజతో కలిసి భర్త మహాశయులకు విజ్ఞప్తితో  మెప్పించడంతో పాటు మెగాస్టార్ విశ్వంభరలో కనువిందుచేయనున్న విషయం తెలిసిందే.     
గ్లామర్ ప్రపంచంగా వెలిగిపోయే చిత్ర పరిశ్రమ వెనుక ఎన్నో చీకటి కోణాలు, నిశ్శబ్ద యుద్ధాలు దాగి ఉన్నాయన్నది బహిరంగ రహస్యం. ముఖ్యంగా వెండితెర వెనుక జరిగే అన్యాయాలపై, లైంగిక వేధింపులపై గళమెత్తే నటీమణులకు ఇండస్ట్రీలో సరైన ఆదరణ లభించడం లేదు సరికదా, వారిపై అప్రకటిత నిషేధం విధిస్తున్నారనే ఆందోళనకరమైన నిజాలు ప్రస్తుతం ఫిలింనగర్ సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారాయి. వ్యవస్థలోని లొసుగులను ప్రశ్నించే వారిని సమస్యాత్మక వ్యక్తులుగా ముద్ర వేసి, సినిమా అవకాశాలు రాకుండా పక్కన పెడుతున్నారనే చర్చ నడుస్తోంది. బాలీవుడ్‌లో సంచలనం సృష్టించిన ‘మీటూ’ ఉద్యమానికి శ్రీకారం చుట్టిన తార నుంచి నిన్నమొన్నటి దక్షిణాది నటీమణుల వరకు ఈ వివక్ష స్పష్టంగా కనిపిస్తోంది. సీనియర్ నటులపై ధైర్యంగా ఫిర్యాదు చేసిన పలువురు నాయికలకు ఆ తర్వాత పరిశ్రమలో అవకాశాలు పూర్తిగా నిలిచిపోయాయి. అలాగే మలయాళ, కన్నడ రంగాల్లోనూ మహిళా హక్కుల కోసం, తోటి నటీమణుల రక్షణ కోసం పోరాడిన ముద్దుగుమ్మలకు సినిమా ఛాన్సులు తగ్గించి తీవ్ర వివక్ష చూపిస్తున్నారనే ఆవేదన వ్యక్తమవుతోంది. తమిళ ఇండస్ట్రీలోనూ ప్రముఖులపై ఆరోపణలు చేసిన సింగర్స్, డబ్బింగ్ ఆర్టిస్టులను కూడా పరిశ్రమ వర్గాలు చాలా కాలం దూరం పెట్టాయి. మన టాలీవుడ్‌ విషయానికి వస్తే.. కాస్టింగ్ కౌచ్, వేధింపుల గురించి మాట్లాడి తమ కెరీర్‌ను రిస్క్‌లో పడేసుకున్న వారిలో కొందరు నటీమణుల పేర్లు ప్రముఖంగా వినిపిస్తాయి. ఇండస్ట్రీలోని పలువురు పెద్దలపై తిరుగుబాటు చేసినందుకు ఒక వివాదాస్పద నటిని తెలుగు చిత్ర పరిశ్రమ దాదాపు పూర్తిగా దూరం పెట్టింది. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) నుండి కూడా ఆమె తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంది. అలాగే మరో సీనియర్ తెలుగు నటి సైతం పరిశ్రమలోని లొసుగులను ప్రశ్నించడం వల్లే తనకు నటిగా మంచి ప్రతిభ ఉన్నా అవకాశాలు ఇవ్వకుండా తొక్కేసారని పలు ఇంటర్వ్యూలలో నిర్మొహమాటంగా స్పష్టం చేసింది. గాడ్ ఫాదర్ లేకపోవడం, అన్యాయాన్ని ఎదిరించడమే వీరు చేసిన తప్పా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. గతంలో కూడా స్టార్ డైరెక్టర్ల మేకింగ్ శైలిపై కామెంట్స్ చేసిన ఒక టాప్ హీరోయిన్, కేవలం టాలీవుడ్ లోనే కాకుండా సౌత్ మొత్తంలో అవకాశాలు కోల్పోయి, ఆ తర్వాత బాలీవుడ్ బాట పట్టాల్సి వచ్చింది. ఇలా తప్పును ప్రశ్నించిన వారిని ఇండస్ట్రీ వెలివేయడం అనేది, ఇతర నటీమణులు నోరు విప్పకుండా భయపెట్టే ఒక వ్యూహాత్మక చర్యగానే విశ్లేషకులు భావిస్తున్నారు. నిజానికి ఇలా అవకాశాలు కోల్పోయిన వారిలో చాలామంది "మాకు ఛాన్సులు ఇవ్వడం లేదు" అని బయటకు చెప్పుకోవడానికి కూడా భయపడుతున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా ఈ అంశంపై నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు. ప్రతిభ ఉన్న నటీమణులను ఇలా కక్షసాధింపు చర్యలతో తొక్కేయడం సరికాదని మద్దతు తెలుపుతున్నారు. అయితే పరిశ్రమలో మహిళల రక్షణ కోసం, సమస్యల పరిష్కారం కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక కమిటీలు, కమిషన్లు ఇలాంటి సమయాల్లో ఎందుకు మౌనంగా ఉంటున్నాయనే విమర్శలు కూడా గట్టిగా వినిపిస్తున్నాయి. మరి రాబోయే రోజుల్లో అయినా ఈ ‘సైలెంట్ బ్యాన్’ సంస్కృతికి తెరపడి, ప్రతిభకు మాత్రమే ఇండస్ట్రీ పెద్దలు పట్టం కడతారో లేదో చూడాలి.
కార్తీ హీరోగా రూపొందిన స్పై యాక్షన్ థ్రిల్లర్ 'సర్దార్' ఎంతటి ఘనవిజయాన్ని సాధించిందో అందరికీ తెలిసిందే. తండ్రీకొడుకులుగా కార్తీ చూపించిన అద్భుత నటన, దేశభక్తి కథాంశం ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఇప్పుడు ఈ బ్లాక్‌బస్టర్ చిత్రానికి సీక్వెల్‌గా వస్తున్న ‘సర్దార్ 2’పై ట్రేడ్ వర్గాల్లోనూ, ప్రేక్షకుల్లోనూ అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన అప్‌డేట్స్ బయటకు వచ్చాయి. దర్శకుడు పీఎస్ మిత్రన్ ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని ప్రిన్స్ పిక్చర్స్ పతాకంపై నిర్మాత ఎస్‌. లక్ష్మణన్ నేతృత్వంలో అత్యంత భారీ వ్యయంతో నిర్మిస్తున్నారు. ఈ రెండో భాగం కోసం దాదాపు రూ.130 కోట్ల బడ్జెట్‌ను కేటాయించినట్లు సమాచారం. మొదటి భాగం తరహాలోనే ఇందులోనూ కార్తీ ద్విపాత్రాభినయంలో మెరిపించనున్నారు. వృద్ధుడైన గూఢచారి ‘సర్దార్’ పాత్రతో పాటు, యువ పోలీస్ ఆఫీసర్ ‘విజయ్’ పాత్రలు ఈ కథను నడిపించనున్నాయి. అయితే ఈసారి కథ కేవలం సీక్వెల్‌గానే కాకుండా, ప్రీక్వెల్‌గానూ సాగుతుందని చిత్ర రచయిత రత్నకుమార్ వెల్లడించారు. అంటే సర్దార్ అసలు రా ఏజెంట్‌గా ఎలా మారాడు? అతని గతంలో దాగున్న రహస్యాలు ఏమిటి? అనే అంశాలను ఈ సినిమాలో చూపించబోతున్నారు. దీనితో పాటు ప్రస్తుత కాలంలో విజయ్ చేపట్టే సరికొత్త ఇంటర్నేషనల్ మిషన్ కథకు ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. ఈ చిత్రంలో విలన్ పాత్ర కోసం విలక్షణ నటుడు ఎస్‌జే సూర్యను ఎంపిక చేశారు. 'బ్లాక్ డ్యాగర్' అనే పవర్‌ఫుల్ అంతర్జాతీయ ముఠా నేపథ్యంతో సాగే ఈ కథలో ఎస్‌జే సూర్య క్యారెక్టర్ సినిమాకే హైలైట్‌గా నిలుస్తుందని ఇండస్ట్రీ టాక్. అలాగే ఈ సినిమాలో గ్లామర్ డోస్ పెంచుతూ మాళవిక మోహనన్, ఆషికా రంగనాథ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. రాజ్ శివాని, యోగిబాబు ఇతర కీలక పాత్రల్లో కనిపించనున్నారు. సామ్ సీఎస్ అందిస్తున్న బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ యాక్షన్ సీక్వెన్స్‌లకు ప్రాణం పోయనుంది. ఇటీవలే కార్తీ పుట్టినరోజు సందర్భంగా విడుదలైన స్పెషల్ పోస్టర్‌తో పాటు మేకింగ్ గ్లింప్స్ సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అయ్యాయి. డప్పుల మధ్య మాస్ లుక్‌లో కనిపించిన కార్తీ గెటప్ అభిమానుల్లో పూనకాలు తెప్పించింది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ విజయవంతంగా ముగిసింది. చిత్ర యూనిట్ సెట్స్‌లోనే కేక్ కట్ చేసి సెలబ్రేషన్స్ జరుపుకున్న ఫోటోలు కూడా నెట్టింట హల్‌చల్ చేస్తున్నాయి. మొదటగా ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ను 2026 సమ్మర్ కానుకగా విడుదల చేయాలని భావించినప్పటికీ, నిర్మాణానంతర పనుల ఆలస్యం వల్ల వాయిదా పడింది. అయితే ప్రస్తుత సమాచారం ప్రకారం, ఈ ఏడాది ఆఖర్లోనే చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఫస్ట్ పార్ట్ అందించిన థ్రిల్ కంటే పది రెట్లు ఎక్కువ యాక్షన్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో రాబోతున్న ‘సర్దార్ 2’ బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది.
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు  కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత  కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.  జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు.  2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది. "ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు. సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు. గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.                                      *నిశ్శబ్ద.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఒకప్పుడు ఎర్ర జెండాను దిగ్విజయంగా ఎదిరించి, మార్క్సిస్టులను మట్టి కరిపించిన మమతా దీదీ ప్రస్తుతం, కాషాయ కూటమి నుంచి గట్టి సవాలును ఎదుర్కుంటున్నారు. వరసగా పదేళ్ళు పాలించడం వలన సహజంగా వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత  కంటే, హిందూ ఓటు పోలరైజేషన్ ఆమెను మరింతగా భయపెడుతోంది. నిజానికి ఐదేళ్ళ క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఐదు శాతం కంటే తక్కువ ఓట్లు, మూడంటే మూడు అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ..  2019 లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా 40 శాతం ఓట్లతో 18 స్థానాలు గెలుచుకుంది. ఈ  మార్పు ఇంకా కొన్ని కారణాలు ఉంటే ఉండవచ్చును కానీ.. హిందువుల ఓటు పోలరైజ్  కావడమే ప్రధాన కారణం.  ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ చివరకు కమ్యూనిస్టులు కూడా బీజేపీలో  చేరారు. ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత కూడా సిట్టింగ్ ఎమ్మెల్ల్యేలు సహా  తృణమూల్ టికెట్ వచ్చిన నాయకులు కూడా బీజేపీలో చేరుతున్నారు. అనేక మంది ఇతర రంగాల ప్రముఖులు, ముఖ్యంగా ఇంతకాలం, బీజేపీని హిదుత్వ అనుకూల ‘అచ్చుత్’ (అంటారని) పార్టీగా చూసిన ‘సెక్యులర్’ ప్రముఖులు కాషాయం కప్పుకోవడంతో మమతా బెనర్జీకి కొంచెం అలస్యంగానే అయినా, తత్త్వం బోధపడింది. అందుకే ఆమె ఇప్పుడు గుళ్ళూ,గోపురాలకు తిరుగుతున్నారు. కార్యకర్తల సమావేశాల్లో తానూ హిందువునేనని, చెప్పుకుంటున్నారు.  నిజానికి ఇలా నేనూ హిందువునే  అని సెక్యులర్ నేతలు బహిరంగంగా ప్రకటించుకోవడం మమతా బెనర్జీతోనే మొదలు కాలేదు. రాహుల్ గాంధీ తాను హిందువునని, జన్యుధారీ కశ్మీరీ బ్రాహ్మణుని అనీ.. తమ గోత్రం, ‘దత్తాత్రేయ’ గోత్రమని బహిరంగంగా ప్రకటించుకున్నారు. అలాగే  కొద్ది రోజుల క్రితం ప్రియాంకా గాంధీ తానూ హిందువునని చెప్పుకునేందుకు ‘మౌని అమావాస్య’ సందర్భంగా అలహాబాద్ లో గంగా స్నానం చేశారు. గతంలోనూ ఆమె ఎన్నికలకు ముందు గంగా యాత్ర చేశారు. అంతవరకు ఎందుకు కొద్దిరోజుల క్రితం సిపిఐ నారాయణ విశాఖ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. చంద్రబాబు, జగన్ రెడ్డి, కేసీఆర్ ఇలా తెలుగు నేతలు అనేక మంది లౌకిక వాదానికి కాలం చెల్లిందన్న సత్యాన్ని గ్రహించి కావచ్చు ‘నేనూ హిందువును’ అంటూ ప్రకటించుకునేందుకు పోటీ పడుతున్నారు. రాముడిని తలచుకున్నా, జై శ్రీరామ్ అన్నా తమ  లౌకిక వాదం మయలపడి పోతుందని భయపడిన నాయకులు ఇప్పుడు .. జై శ్రీరామ్ అనేందుకు కూడా వెనకాడడం లేదు.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది. గత కొంత కాలంగా సబర్మలతో సహా అనేక అంశాలపై స్పందిస్తూ.. కేరళను టార్గెట్ చేస్తున్న బీజేపీ నాయకులు అక్కడ తమ జెండా ఎగరేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా పార్టీ పాలసీని కూడా పక్కన పెట్టి మెట్రో మ్యాన్ శ్రీధరన్ ను పార్టీలో చేర్చుకుని ఆయనే తమ సీఎం అభ్యర్థి అని ప్రకటించిన 24 గంటలలో యూ టర్న్ తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం సీఎంగా ఉన్న కమ్యూనిస్ట్ నేత పినరై విజయన్ పై గోల్డ్ స్మగ్లింగ్ ఆరోపణలు రావడంతో.. ఈ ఎన్నికలలో ఎల్డిఎఫ్ భవిష్యత్తుపై ప్రజలు ఏ తీర్పు ఇవ్వబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది ఈ నేపథ్యంలో అక్షరాస్యతలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న ఆ రాష్ట్ర ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారు అనే అంశంపై ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ నౌ, సీ ఓటరుతో కలిసి ఒక సర్వేను నిర్వహించారు. ఈ సర్వే ప్రకారం చూస్తే పాపం కమలనాథులు అక్కడ పవర్ చేతికి రావటం అటుంచి కనీసం రెండు మూడు అసెంబ్లీ స్థానాల్లో గెలవటం కూడా కష్టమేనని ఆ సర్వే తేల్చి చెబుతోంది. కేరళలో ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తన హవా చాటుతుందన్న ఆ పార్టీ నేతల మాటలలో ఎలాంటి నిజం లేదని.. ప్రస్తుతానికి అది ఏమాత్రం సాధ్యం కాదని ఈ తాజా సర్వే తేల్చి చెప్పింది. అంతేకాకుండా మొత్తం 140 స్థానాలు ఉన్న కేరళలో.. ప్రస్తుత సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్డ్ డెమొక్రటిక్ ఫ్రంట్ కు 82 సీట్లు పక్కా అని.. ఆయనే తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటాడని సర్వే చెపుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూనైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ కు 56 నుంచి 60 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వేలో తేలింది. అంతేకాకుండా 2016 ఎన్నికలతో పోలిస్తే ఎల్ డీఎఫ్ ఓటింగ్ శాతం కూడా కొంత పెరగటం ఇక్కడ గమనార్హం. ప్రస్తుతం సీఎంగా ఉన్న విజయన్ మరోసారి సీఎం కావాలని 43.34 శాతం మంది మొగ్గు చూపినట్లుగా సర్వేలో తేలింది. కరోనా సమయంలో విజయన్ సీఎంగా బాగా పని చేసారని ఈ సర్వే పేర్కొంది. మరోపక్క దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ ఉండాలని కేరళ ప్రజల్లో 55.84 శాతం మంది కోరుకుంటున్నట్లుగా ఈ సర్వే;లో తేలింది. అయితే కేరళలో ఎలాగైనా పాగా వేయాలని పట్టుదలతో కృషి చేస్తున్న బీజేపీకి ఈసారి కూడా నిరాశ తప్పదని ఈ సర్వేలో స్పష్టం అయింది. ఈ ఎన్నికలలో బీజేపీకి రెండు సీట్లు కూడా రావటం కూడా కష్టమేనని ఈ సర్వే తేల్చింది. అయితే ఎన్నికలకు ముందు ఇలాంటి సర్వేలు బయటకు రావడం.. తరువాత అందులో కొన్ని చతికిల పడడం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ సర్వే ఫలితాలు నిజామా అవుతాయో లేదో తేలాలంటే కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే.        
రాజకీయాలు అంటేనే అదో జూదం. పూలమ్మిన చోటనే కట్టెలు అమ్మవలసి రావచ్చును. అలాంటి పరిస్థితే వచ్చినా, తలవంచుకుని పోగలిగితేనే, ఎవరైనా రాజకీయాలలో రాణించగలరు. అలాకాదని, అలిమి కానిచోట, కూడా తామే అధికులమని భావిస్తే, ఎందుకూ కాకుండా పోతారు. అలాంటి వారు ఇద్దరూ కూడా ఇప్పుడు మన కళ్ళముందే ఉన్నారు.  జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు. అలాగే జయ మరణం తర్వాత ఆమె పరిస్థితి ఏమిటో కూడా వేరే చెప్పవలసిన, అవసరం లేదు. జైలు పాలయ్యారు. సర్వం తానై నడిపించిన పార్టీ నుంచి  బహిష్కరణకు గురయ్యారు. జయ ఉన్నంత వరకు తన వారుగా ఉన్న వారందరూ కానివారయ్యారు. ఒంటరిగా మిగిలారు.  నిజానికి నాలుగేళ్ళు జైలు జీవితం గడిపిన తర్వాత కూడా ఆమె తలచుకుంటే.. రాష్ట్ర రాజకీయాలలో, ముఖ్యంగా అధికారంలో ఉన్న డిఎంకే కూటమిలో అలజడి సృష్టించగలరు. ఎన్నికలలో ఆమె గెలవక పోవచ్చును కానీ.. తనను కాదన్న అన్నాడిఎంకేను ఓడించగలరు. అయిన  ఆమె అందుకు విరుద్ధంగా  రాజకీయాలకు వీడ్కోలు పలికి మౌనంగా పక్కకు తప్పుకున్నారు. రాజకీయ సన్యాసం ప్రకటించారు. ఉమ్మడి శతృవు డిఎంకే ను ఓడించేందుకు అన్నా డిఎంకే కూటమి  పోటీ చేయాలని, కూటమి ఐక్యతను దెబ్బతీయరాదనే ఉద్దేశంతోనే ఆమె రాజకీయ సన్యాసం ప్రకటించారు.    శశికళ మౌనంగా వెళ్లి పోవడం వెనక ఇంకా అనేక కారణాలున్నా ,అసలు కారణం ఆమె, రాజకీయ విజ్ఞత, వివేకం. ఆమె జైలుకు వెళ్ళిన సమయంలో జయలలిత సమాధి వద్ద ఎంత కసిగా, కోపంగా ‘మౌన’ ప్రతిజ్ఞ చేశారో చూశా. అలాంటి ఆమె ఇప్పుడు ఇలా ‘మౌనం’గా వెనకడుగు వేశారంటే, అది ఆలోచించ వలసిన విషయమే.ఆమె వ్యుహతంకంగానే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అనేక మంది అనేక కోణాల్లో శశికళ సంచలన నిర్ణయాన్ని విశ్లేషించారు.జైలు జీవితం తర్వాత కూడా అన్నా డిఎంకే నాయకులు తనను అగ్రనేతగా అంగీకరించక పోవడం, అమిత్ షా చెప్పినా.. అన్నా డిఎంకే నాయకులు ఆమెను, మేనల్లుడు దినకరన్’ను కులం పేరున, కుటుంబం పేరున దూరం చేయడం, తిరిగి పార్టీలోకి తీసుకోకపోవడంతో ఆమె మనసు కష్టపెట్టుకుని, సన్యాస నిర్ణయం తీసుకున్నారని కొందరంటున్నారు. పార్టీ మీద పట్టు లేదని, చరిష్మా అసలే లేదని, అందుకే ఆమె అలా నిశ్శబ్ధంగా రాజకీయ సన్యాసం స్వీకరించారని ఇంకొందరు విశ్లేషించారు. ఈ విశ్లేషణలో కొంత నిజం ఉంటే ఉండవచ్చును.. కానీ ఆమె గతాన్ని, నైజాన్ని గుర్తు చేసుకుంటే ఆమె స్ట్రైక్ బ్యాక్ వ్యూహంతోనే ఒకడుగు వెనక్కివేశారని ఆమెతో సన్నిహితంగా మెలిగినవారు, ఆమె రాజకీయ చాణక్యం తెలిసిన వారు అంటారు.   నిజానికి జైలులో ఉన్న కాలంలో కానీ, జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత కానీ, ఆమె రాజకీయ సన్యాసం వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపించలేదు. బెంగుళూరు జైలు నుంచి విడుదలై చెన్నైలో ప్రవేశించిన నప్పుడు ఆమె పెద్ద కాన్వాయ్ తో  తమ కారుకు అన్నాడిఎంకే జెండాతోనే ఎంటరయ్యారు. అలా ఎంట్రీలోనే రాజకీయ ఆకాంక్షను వెంట తెచ్చుకున్నారు. చివరకు ‘సన్యాస’ ప్రకట చేసే వరకు కూడా ఆమె రాజకీయ కార్యకలాపాలు సాగిస్తూనే ఉన్నారు. అటు ఢిల్లీని ఇటు చెన్నైనికూడా కదిల్చారు. అంతేకాదు, రాజకీయాలపై విరక్తితో కాదు, రాజకీయ కసితో, ఉమ్మడి శత్రువు (డిఎంకే) ను ఓడించేందుకే తాను రాజకీయాలనుంచి తపుకుంటున్నట్లు చెప్పారు.  సో .. సన్యాసం తీసుకోవాలనే ఆలోచన, రాజకీయవ్యూహం లోంచి పుట్టిందే కానీ,వైరాగ్యంతో పుట్టింది కాదు ,అన్నవిశ్లేషణ వాస్తవానికి ఇంకొంత దగ్గరగా ఉందని అనుకోవచ్చును. ఇది ‘కామా’నే కాని ‘ఫుల్స్టాప్’ కాదని అంటున్నారు.  ముఖ్యమంత్రి ఎడప్పాడి కే. పళని స్వామి (ఈపీఎస్) ఆమెను పార్టీలోకి అనుమతిస్తే తన కుర్చికీ ఎసరు పెడతారనే భయంతోనే,, ఆమె ఎంట్రీని అడ్డుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, శశికళ ఒకే సామజిక వర్గానికి చెందిన వారు కావడం కూడా, ముఖ్యమంత్రి ఈపీఎస్’ భయానికి కారణంగా పేర్కొంటారు. అందుకే  ఆయన, ‘మన్నార్గుడి’ ఫ్యామిలీని బూచిగా చూపించి, ఆమెను దూరంగా ఉంచారని పార్టీలో ఒక వర్గం గట్టిగా విశ్వసిస్తుంది. అయితే ఆమె శక్తియుక్తులను కూడతీసుకుని  పులిలా పంజా విసిరేందుకే ఆమె వ్యూహాత్మకంగా ఒక అడుగు వెనక్కి వేశారు కావచ్చును అని కూడా, తమిళ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది.  గతంలో ఆమె జయలలితతో విబేధాలు వచ్చిన సమయంలో కూడా ఇలాగే కొద్ది కాలం మౌనంగా తెర చాటుకు వెళ్లి పోయారు.  కొద్ది కాలంలోనే మళ్ళీ ‘పోయస్ గార్డెన్’లో ప్రత్యక్షమయ్యారు. జయలలిత స్వయంగా ఆమెను వెనక్కి పిలుపించుకోవలసిన పరిస్థితులను సృష్టించారు. అలా  మళ్ళీ  చక్రం తిప్పారు. జయలలిత మరణం వరకు ఆమె అందరికీ చిన్నమ్మగా అమ్మకు పెద్దమ్మగా సర్వం తానై నిలిచారు. చివరకు జయ అంత్యక్రియల్లో కూడా ఆమెదే పై చేయిగా కనిపించింది.   జయలలిత చనిపోయిన సందర్భంలోనే అన్నా డిఎంకే ఎమ్మెల్ల్యేలో సుమారు 30 మంది వరకు ఆమెకు మద్దతుగా ఉన్నారన్న వార్తలొచ్చాయి. నిజానికి,ఇప్పటికి కూడా ఒక్క అన్నా డిఎంకే లోనేకాదు,డిఎంకే ఇతర పార్టీలలో కూడా  ఆమె అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ‘మన్నార్గుడి’ ఫ్యామిలీ మద్దతు లేకుండా గెలిచే అవకాశం లేదు.  ఇవ్వన్నీ నిజమే అయినా.. అన్నీ ఉండి, ఎవరు లేని శశికళలో, ఇంకా  ఎవరి కోసం తాపత్రయ పడాలి? అనే ప్రశ్న జనించి ఉంటే, ఆమె రాజకీయ సన్యాసం నిజం కావచ్చును. ఎందుకంటే ఆమె నెచ్చలి, జయలిత లేరు, భర్త అంతకంటే ముందే చనిపోయారు, పిల్లలు లేరు... పైగా నాలుగేళ్ళ జైలు జీవితం ఆమెలో మార్పు తెచ్చి ఉండవచ్చును. ఈ వయస్సులో తనవారంటూ ఎవరు లేని తనకు రాజకీయాలు ఎందుకు ? శేష జీవితాన్ని ఇలా సాగిద్దామనే ఆలోచన నిజంగా వచ్చి ఉంటే, ఆమె సన్యాసం సత్యం అయినా కావచ్చును, కాకపోనూ వచ్చును. కానీ  శశికళ... ఆమెను అర్థం చేసుకోవడం, అంచనా వేయడం , అంత తేలిగ్గా అయ్యే పని కాదు..
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు. కాంగ్రెస్ అధినాయకత్వం పై నేరుగా అస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ పేరు చెప్పకుండానే, ఆయన నాయకత్వానికి పనికిరాడని తేల్చి చెప్పారు. ఎవరైనా పార్టీ అధ్యక్షుడు అయితే కావచ్చును, కానీ, ప్రజానాయకుడు కాలేడని, రాహుల గాంధీ ప్రజానాయకుడు కాదు కాలేరు,అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరచూ రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసే  ‘నామ్’ధారీ వ్యంగ్యాస్త్రాన్నే కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా సందించారు. ఇక అక్కడి నుంచి విధేయ, అసమ్మతి వర్గాల మధ్య మాటల యుద్ధం ఎదో ఒక రూపంలో సాగుతూనే వుంది. అదే క్రమంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, కరుడు కట్టిన ముస్లిం మతోన్మాది, అబ్బాస్ సిద్దిఖీతో కాంగ్రెస్ పార్టీ చేతులు కలపడం అసమ్మతి నాయకులకు మరో అస్త్రాన్ని అందించింది. విషయంలోకి వెళితే, ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా లోక్’సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు, పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్’రంజన్ చౌదరి, ముస్లిం మత ప్రచారకుడు, అబ్బాస్ సిద్దిఖీతో  వేదిక పంచుకున్నారు.అంతకు ముందే వామ పక్ష కూటమితో  పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్ పార్టీ, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)ను కూటమిలో చేర్చుకుంది. ఇలా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) అమోదం లేకుండా మతోన్మాద ఐఎస్ఎఫ్’ తో ఎన్నికల పొత్తు పెట్టుకోవడం ఆ పార్టీ నాయకుడు,సిద్ధిఖీతో  పీసీసీ చీఫ్ వేదిక  పంచుకోవడం పై అసమ్మతి నేతలు మండి పడుతున్నారు. ఇలా సిద్దిఖీతో వేదిక పంచుకోవడం పార్టీ మౌలిక సిద్ధాంతాలకు వ్యతిరేకం అంటూ అసమ్మతి వర్గానికి చెందిన కీలక నేత, రాజ్యసభ సభ్యుడు,ఆనంద్ శర్మ మండిపడ్డారు. అంతే కాదు, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)తో జనవరిలో కుదుర్చుకున్న పొత్తుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)అమోదం లేదని ఆనంద్ శర్మ, అభ్యంతరం వ్యక్త చేశారు. పార్టీ విశ్వసించే లౌకిక వాదానికి కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం గొడ్డలి పెట్టని ఆయన తీవ్రంగా స్పందించారు.   శర్మ వ్యాఖ్యలపై అధీర్ రంజన్ చౌదరి అంతే ఘాటుగా ప్రతిస్పందించారు. “నిజాలు తెలుసుకోండి ఆనంద్ శ‌ర్మ జీ” అంటూ ఆయ‌న వ‌రుస ట్వీట్లు చేశారు. వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలు ప‌క్క‌న‌పెట్టి, ప్ర‌ధానిని పొగిడి టైమ్ వేస్ట్ చేయ‌కండంటూ ఆయ‌న ఓ ట్వీట్లో అన్నారు. ఆనంద్ శ‌ర్మ అన‌వ‌స‌రంగా కాంగ్రెస్‌ను ల‌క్ష్యంగా చేసుకుంటున్నార‌ని, ఈ అంశాన్ని పెద్ద‌ది చేసి చూపిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఆయ‌న ఉద్దేశాలు స‌రైన‌వే అయితే నేరుగా తనతో మాట్లాడ వలసిందని అన్నారు. బెంగాల్‌లో సీపీఐ(ఎం) కూట‌మికి నేతృత్వం వ‌హిస్తోంది. అందులో కాంగ్రెస్ ఓ భాగం. మ‌త‌తత్వ‌, విభ‌జ‌న రాజ‌కీయాలు చేస్తున్న బీజేపీకి చెక్ పెట్ట‌డానికే ఈ కూట‌మి అని మ‌రో ట్వీట్‌లో అధిర్ రంజ‌న్ అన్నారు. అక్కడతోనూ ఆగలేదు ... ట్వీట్ల మీద ట్వీట్లు సంధిస్తూ, ఆనంద్ శర్మ, బీజేపీ మత విభజన, అజెండాను బలపరుస్తున్నారని, పరోక్షంగా జీ23 నాయకులు బీజేపీకి ప్రయోజనం చేకూరుస్తున్నారని ఆరోపించారు.అంతే కాదు, క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితులు తెలియకుండా, ఆనంద్ శర్మ పార్టీ మీద దండెత్తడం ఉచితం కాదని చౌదరి ఎదురుదాడి చేశారు. అసమ్మతిలో అసమ్మతి. ఇదలా ఉంటే, కాంగ్రెస్ పార్టీ  సమూల పక్షాళన కోరుతూ సోనియా గాంధీకి,గత సంవత్సరం  జీ 23గా ప్రాచుర్యం పొందిన సీనియర్ నాయకులు రాసిన లేఖపై సంతకాలు చేసిన  నాయకుల్లో నలుగురు,జమ్మూలోసమావేసమైన నాయకుల తాజా నిర్ణయాలు, వ్యాఖ్యలు,విమర్శల పట్ల అసంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరం సోనియా గాంధీకి రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలకు కట్టుబడి ఉన్నామని, అయితే, జీ 23లోని కొందరు సహచరులు, ఇటీవల గీతదాటి చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలను తాము సమర్ధించడం లేదని ఆ నలుగురు పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా, రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్, పీజే కురియన్ అయితే, “కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన సంస్కరణలు తెచ్చేందుకు చేసే ప్రయత్నాలను పూర్తిగా సమర్దిస్తాను, కానీ, ‘లక్ష్మణ రేఖ’ దాటితే ఒప్పుకునేది లేదు”అని అసమ్మతిలో అసమ్మతికి తెర తీశారు.అలాగే, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారడు, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్,మధ్య ప్రదేశ్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అజయ్ సింగ్’ కూడా గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, ఆనంద్ శర్మ, మనీష్ తివారీ వంటి జీ 23 కీలక నేతలు అధినాయకత్వంపై చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. అలాగే, పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీమంత్రి వీరప్ప మొయిలీ కూడా,గత సంవత్సరం పార్టీ సీనియర్ నాయకులు  ఒక పరిమిత లక్ష్యంతో  సోనియా గాంధీకి లేఖ రాయడం జరిగిందని, ఆ పేరున జరుగతున్న  కార్యక్రమాలు లేఖ సంకల్పానికి  విరుద్ధమని అన్నారు. జీ 23 కార్యకలాపాలపై రాహుల్ గాంధీ కూడా పరోక్షగా స్పందించారు, ఒకప్పుడు ఎన్ఎస్’యుఐ, యూత్ కాంగ్రెస్’ కు సంస్థాగత ఎన్నికలు వద్దన్న వారే ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నారని పరోక్షంగానే అయినా సంస్థాగత ఎన్నికలు నిర్వహించడంతో పాటుగా, పార్టీ పక్షాలనకు తమ కుటుంబం వ్యతిరేకం కాదని, అందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీలో చెలరిగిన కలకలం  ఇక ముందు ఏమవుతుందో .. ఇంకెన్ని  మలుపులు తిరుగుతోందో ..చూడవలసిందే కానీ ఉహించలేము.
భారతదేశంలో ధనికుల కంటే పేదవారే ఎక్కువ.  పేదవారిలో కూడా చాలా పేదవారు,  ఒక మోస్తరు పేదవారు అని కూడా ఉంటారు. అయితే కాలం ఎంత గడిచినా జీవితాలలో ఏ మాత్రం మార్పు లేకుండా పేదవారిగానే ఉండిపోయే  వారు ఎంతో మంది ఉన్నారు. సాధారణంగా కాలం గడిచేకొద్ది జీవితాలలో  ఎంతో కొంత ఎదుగుదల అనేది ఉండాలి.  అలా ఉండకపోవడానికి కారణాలు ఉన్నాయి. పేదవాడిగా పుట్టడం తప్పు కాదు.. కానీ పేదవాడిగా మరణించడం తప్పు అని ఒక వాక్యం ఉంది.  మనిషి జీవితంలో ఎదగాలని కాలంతో పాటు జీవితాన్ని మెరుగ్గా మార్చుకోవాలని ఈ వాక్యం చెబుతుంది, చాలామంది పేదవాళ్లుగానే మిగిలిపోవడానికి దారితీసే కారణాలు ఏంటో తెలుసుకుంటే.. టీవి, పోన్.. చాలామందికి రోజంతా టీవీ లేదా ఫోన్ చూస్తూ గడిపే అలవాటు ఉంటుంది.  టీవి, ఫోన్ వంటివి మనిషిని వ్యసనపరుడిగా మారుస్తాయి.  టీవిలో ఛానెల్స్ కానీ,  స్మార్ట్ ఫోన్ లో ఎంటర్టైన్మెంట్ యాప్స్ కానీ ఎంత సేపు అయినా అలా మార్చి మార్చి చూస్తుంటారు.  పోన్ లో అయితే స్క్రోల్ చేస్తూ ఉంటే అసలు సమయమే తెలియకుండా గడిచిపోతుంది.   జీవితంలో ఏమీ సాధించకుండా పేదవారిగా ఉండిపోవడానికి టీవి,  స్మార్ట్ ఫోన్ వంటివి ప్రధాన కారణాలు. అలవాట్లు,  అభిరుచులు.. ప్రతి ఒక్కరికి అభిరుచులు, అలవాట్లు అంటూ కొన్ని ఉంటాయి. జీవితంలో ఎదుగుదల ఏమీ లేకుండా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉండిపోయినట్టు ఉన్నవారిని గమనిస్తే.. వారికి ఎలాంటి అలవాట్లు,  అభిరుచులు ఉండవు.  అందుకే వారికి జీవితంలో ఎదుగుదల లేకుండా కేవలం ఒకేచోట కూర్చుని కాలక్షేపం చేస్తూ అందులోనే సుఖం అనుభవిస్తూ ఉంటారు. లక్ష్యాలు.. ప్రతి వ్యక్తి జీవితంలో ఏదో ఒక లక్ష్యం అనేది ఉండాలి.  లక్ష్యం లేని జీవితంలో ఎదుగుదల అనేది అసలు ఉండదు. లక్ష్యం ఉంటే కష్టపడటం,  జ్ఞానాన్ని ఆర్జించడం,  ఏదో ఒకటి నేర్చుకుంటూ ఉండటం వంటివి జరుగుతాయి. కానీ లక్ష్యం లేకపోతే జీవితం ఒకేచోట పాతిన స్ధంభంలా ఉండిపోతుంది. కంఫర్ట్ జోన్.. చాలామందికి సుఖంగా బ్రతకడం ఇష్టం.  ఛాలెంజ్ తీసుకోవాలన్నా, రిస్క్ చేయాలన్నా అస్సలు ఇష్టపడరు. ఉన్న సంతోషం,  ఉన్న సౌకర్యాలు చాల్లే అనుకుంటారు.  కొత్తగా అ ప్రయత్నం చేయాలన్నా అస్సలు సిద్దపడరు. అందుకే కాలం ఎంత గడిచినా అలాంటి వారు పేదవారిగానే ఉండిపోతారు తప్ప ధనవంతులు, గొప్ప వారు కాలేరు. అదృష్టం.. ప్రపంచంలో కష్టం కంటే అదృష్టాన్ని నమ్మేవారే ఎక్కువగా ఉన్నారు. ఏ అదృష్టమో వచ్చి తమను ధనవంతులను చేస్తుందని నమ్ముతూ.. కష్టపడకుండా, ఎలాంటి ప్రయత్నాలు చేయకుండా అలాగే ఉండిపోతారు. జాతకాలలోనూ, రంగు రాళ్లలోనూ,  గ్రహాల మార్పులోనూ తమ భవిష్యత్తు ఆధారపడి ఉందని నమ్ముతూ ఉంటారు. ఇతరులను నిందించడం.. నన్ను బాగా చదివించి ఉంటే నేను పెద్ద  ఉద్యగం తెచ్చుకునేవాడిని,  నాకు  బాగా డబ్బు ఇచ్చి ఉంటే నేను మంచి వ్యాపారం చేసేవాడిని అని తల్లిదండ్రుల మీద నిందలు వేస్తూ జీవితంలో ఎదగకుండా ఆగిపోయిన వారు చాలామంది ఉంటారు.  తాము ఎదగకపోవడానికి కారణం పక్కవారే అని చెప్పి పేదవారిగానే ఉండిపోతున్న వారే ఎక్కువగా ఉన్నారు. జీవితంలో ఎదగడానికి కష్టపడేవారు చాలా తక్కువ ఉన్నారు.  పైన చెప్పుకున్న విషయాలే.. ఏ మనిషి అయినా పేదవాడిగానే ఉండిపోవడానికి అసలు కారణాలు.                            *రూపశ్రీ.
పిల్లలు జీవితంలోని ప్రతి దశలో  ఆత్మవిశ్వాసంతో, బాధ్యతాయుతంగా నిలబడాలని ప్రతి తల్లిదండ్రులు కలలు కంటారు. నేటికాలంలో మంచి పేరెంటింగ్ అంటే కేవలం మంచి విద్యను అందించడం లేదా మంచి గ్రేడ్‌లు సాధించడం అని చాలామంది అనుకుంటారు. కానీ పిల్లలలో  మానసిక బలాన్ని పెంపొందించడం, వారు భవిష్యత్తులో గొప్పగా ఎదగడం మరీ ముఖ్యంగా నాయకత్వ లక్షణాలతో ఉండటం చాలా ముఖ్యం.  ఆత్మవిశ్వాసం అనేది ఏ బిడ్డ వ్యక్తిత్వానికైనా పునాది. అది వారికి తమ మనసులోని మాటను నిర్భయంగా చెప్పే ధైర్యాన్ని, అలాగే వైఫల్యాల నుండి నేర్చుకుని ఓపికతో ముందుకు సాగే బలాన్ని ఇస్తుంది. ఆత్మవిశ్వాసం ఉన్న పిల్లలు కాలక్రమేణా బాధ్యతాయుతమైన పౌరులుగా ఎదుగుతారు. అయితే, ఈ లక్షణాలు రాత్రికి రాత్రే పుట్టేవి కాదు.. వీటికి చిన్నతనం నుండే సరైన మార్గదర్శకత్వం అవసరం. పిల్లలలో ఆత్మవిశ్వాసం పెంచి వారిలో నాయకత్వ లక్షణాలు మెరుగుపడి వారు లీడర్లుగా తయారవ్వాలంటే.. ప్రతి తల్లిదండ్రి తమ పిల్లలను పెంచే సమయంలో కొన్ని టిప్స్ పాటించాలి.  అవేంటో తెలుసుకుంటే.. పిల్లలలో ఆత్మవిశ్వాసం పెంచి నాయకత్వ లక్షణాలు పెంచే టిప్స్.. వ్యక్తీకరణ..  పిల్లలకు వారి అభిప్రాయాలను, భావాలను వ్యక్తపరిచే అవకాశం ఇవ్వడం వల్ల వారు స్వేచ్ఛగా తమను తాము వ్యక్తపరచుకోవడానికి , వారి ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోవడానికి సహాయపడుతుంది. విజయాల గుర్తింపు.. పిల్లలు ఒక చిత్రాన్ని గీసినా లేదా ఒక పద్యాన్ని చదివినా, వారి కృషిని ప్రశంసించాలి. ఇలా మెచ్చుకోవడం వల్ల  పిల్లలలో తాము గౌరవించబడుతున్నామనే భావన కలుగుతుంది, ఇది వారి ఆత్మవిశ్వాసాన్ని, ప్రేరణను రెండింటినీ పెంచుతుంది. విలువలు,సంప్రదాయాలు.. పిల్లలను కుటుంబ సంప్రదాయాలు, పండుగలు , ఆచారాలతో అనుసంధానించడం వారిలో సాంస్కృతిక అవగాహనను పెంపొందించడానికి , వారి గుర్తింపు పట్ల విశ్వాసాన్ని పెంపొందించడానికి సహాయపడుతుంది. సహనం, ఓర్పు..  గెలవడం ఎల్లప్పుడూ అవసరం కాదని, వెంటనే  ఫలితాలు ఆశించాల్సిన అవసరం లేదని పిల్లలకు నేర్పించడం ముఖ్యం. ఓర్పు, సహనం వారు పరిణతి చెందడానికి సహాయపడతాయి. ఆరోగ్యకరమైన అలవాట్లు..  సరైన ఆహారం తీసుకోవడం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, సమయానికి నిద్రలేవడం , రాత్రి సమయానికి నిద్రపోవడం,  వంటివి పిల్లలలో ఆత్మవిశ్వాసాన్ని అంతర్గతంగా బలపరుస్తాయి. ఇది క్రమశిక్షణ , ఆత్మనియంత్రణను కూడా నేర్పిస్తుంది. వైఫల్యాల నుండి నేర్చుకోవడం..  పిల్లలు చేసే  ఏదైనా పనిలో  విఫలమైతే, వైఫల్యం అనేది నేర్చుకోవడంలో ఒక భాగమని వారికి వివరించాలి. ఇది వైఫల్యం  తర్వాత తిరిగి లేచి ముందుకు సాగడాన్ని వారికి నేర్పుతుంది, ఇదే ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడానికి కీలకం అవుతుంది. చెప్పేది వినాలి..   పిల్లలతో నిష్కపటంగా మాట్లాడాలి. వారు చెప్పేది శ్రద్ధగా వినాలి. దీనివల్ల, వారు తమ సమస్యలను, ప్రశ్నలను  పంచుకోగలరనే నమ్మకం వారిలో పెరుగుతుంది . వినయం..  ఇతరులకు సహాయం చేయడం, చిన్న విషయాలకే కృతజ్ఞత చూపడం, అందరితో మర్యాదగా ప్రవర్తించడం పిల్లలకు నేర్పాలి. ఇవి వారు ఇతరులతో మమేకమవ్వడానికి, సమాజంలో గౌరవం సంపాదించుకోవడానికి సహాయపడతాయి. తల్లిదండ్రులు తమ పిల్లల విషయంలో పైవన్నీ నేర్పిస్తూ ఉంటే.. పిల్లలు తప్పకుండా తమ జీవితంలో ఆత్మవిశ్వాసంలో ఉంటారు.  నాయకత్వ లక్షణాలు పుణికి పుచ్చుకుని వారి జీవితంలో ఎంతో ఉన్నత స్థానానికి ఎదుగుతారు.                                             *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...
  వేసవికాలం అనగానే మండే ఎండలు గుర్తుకు వస్తాయి.  ప్రతి ఏడాది ఈ ఎండల ప్రభావం పెరుగుతూనే ఉంటోంది. ఈ కారణంగానే చాలామంది ఇళ్లలో ఏసీలు పెట్టించుకుంటారు.  అయితే ఏసీ పెట్టించుకునే అంత స్తోమత లేనివారు కనీసం కూలర్ అయినా వాడుతూ ఉంటారు. వేసవి కాలం వస్తోందని అనిపించగానే కూలర్లు సిద్దం చేస్తుంటారు. అయితే.. చాలామంది కూలర్ విషయంలో ఎదుర్కునే సమస్య చల్లదనం రాకపోవడం. కూలర్ ఎంత స్పీడ్ లో ఉన్నా చల్లదనం లేకపోవడం,  గదిలో ఉన్నవారికి చెమట పట్టడం, మరీ ముఖ్యంగా ముఖం మీద జిడ్డుగా మారడం వంటివి జరుగుతూ ఉంటాయి.  దీనికి కూలర్ సరిగా పనిచేయడం లేదని అనుకుంటూ ఉంటారు. కానీ దీనికి అసలు కారణం చాలామంది చేసే పొరపాట్లే..  ఆ పొరపాట్లు ఏంటో తెలుసుకుంటే.. గదిని పూర్తీగా మూసి ఉంచడం.. ఏసీ వాడేటప్పుడు గదిలోని కిటికీలు, తలుపులన్నీ ఎలాగైతే మూసి ఉంచాలో, కూలర్ విషయంలో కూడా అలాగే చేయాలని  తరచుగా అనుకుంటారు. ఇది చాలా పెద్ద పొరపాటు. కూలర్లు గాలిలోకి తేమను విడుదల చేస్తాయి. గదిని పూర్తిగా మూసి ఉంచితే, ఆ తేమ బయటకు వెళ్లలేక, గాలిలో విపరీతమైన తేమ ఏర్పడుతుంది. అందువల్ల, గాలి ప్రసరణ జరిగేలా , గదిలోని నిస్సారమైన గాలి బయటకు వెళ్లేలా చేయడానికి, ఒక కిటికీని లేదా తలుపును కొద్దిగా తెరిచి ఉంచాలి. కూలర్ అమరిక.. కూలర్‌ను గది మధ్యలో లేదా గోడకు ఆనించి, దానికి స్వచ్ఛమైన గాలి అందని చోట ఉంచితే, అది గదిలోని వేడి గాలిని బయటకు పంపుతూనే ఉంటుంది. కూలర్‌ను ఎల్లప్పుడూ కిటికీ లేదా తలుపు దగ్గర ఉంచాలి. తద్వారా అది బయటి నుండి స్వచ్ఛమైన గాలిని లోపలికి లాగి, దానిని లోపలికి పంపుతుంది. ఎగ్జాస్ట్ ఫ్యాన్.. బయట విపరీతమైన వేడి, తేమ ఉన్నప్పుడు, కేవలం కిటికీ తెరవడం ద్వారా కూలర్‌లోని తేమను బయటకు పంపడం కష్టమవుతుంది. గదిలో తప్పకుండా ఒక చిన్న ఎగ్జాస్ట్ ఫ్యాన్‌ను అమర్చాలి.   కూలర్‌ను నడుపుతున్నప్పుడు, ఎగ్జాస్ట్ ఫ్యాన్‌ను కూడా ఆన్ చేయాలి. ఇది గదిలోని జిగటగా ఉండే వేడి గాలి మొత్తాన్ని బయటకు లాగి, గదిని చల్లగా ఉంచుతుంది. కూలర్ ప్యాడ్స్.. కొన్నిసార్లు  సంవత్సరాల తరబడి కూలర్ పక్క ప్యాడ్‌లను మార్చకుండా ఉంటారు.  వాటిపై దుమ్ము, ఉప్పునీరు పేరుకుపోయి, తెల్లటి పొరలా ఏర్పడుతుంది. దీనివల్ల గాలి లోపలికి వెళ్లదు,  కూలర్ ఫ్యాన్‌లా కేవలం వేడి గాలిని మాత్రమే బయటకు పంపుతుంది. అందువల్ల, ప్రతి సీజన్‌లో కూలర్ ప్యాడ్‌లను తప్పకుండా మార్చాలి. కూలర్ లో హనీకూంబ్ ప్యాడ్స్ ఉంటే వాటిని బయటకు తీసి బాగా శుభ్రం చేయాలి. సూర్యరశ్మి.. గది గోడలు లేదా కిటికీలపైకి నేరుగా సూర్యరశ్మి పడితే, అవి వేడెక్కుతాయి. కూలర్‌లోని గాలి వేడెక్కిన గోడలను తాకినప్పుడు దాని ప్రభావం తగ్గిపోతుంది. అందువల్ల, పగటిపూట కిటికీలకు మందపాటి, ముదురు రంగు కర్టెన్లను వేయాలి. ఇది సహజంగా గది ఉష్ణోగ్రతను తగ్గించి, కూలర్ వేగంగా చల్లబడటానికి సహాయపడుతుంది. వాతావరణం చాలా వేడిగా ఉంటే, కూలర్‌లోని వాటర్ ట్యాంక్‌లో కొన్ని ఐస్ క్యూబ్స్ వేయాలి.  దీనివల్ల నీరు వెంటనే చల్లబడుతుంది. కూలర్ నుండి వచ్చే గాలి ఎయిర్ కండిషనర్ లాగా అనిపిస్తుంది.                                     *రూపశ్రీ.
దంతాల నొప్పి (Toothache) అనేది ఈ రోజుల్లో చాలా మందిని వేధించే ఒక సాధారణ సమస్య. పంటి నొప్పి వస్తే ఆ బాధ వర్ణనాతీతం. ఒక్కోసారి రాత్రి వేళల్లో అకస్మాత్తుగా నొప్పి వస్తే ఏం చేయాలో తోచక ఇబ్బంది పడుతుంటారు. ఇలాంటి సమయంలో మన ఇంటి చుట్టుపక్కల సులభంగా దొరికే జామ ఆకులు (Guava Leaves) అద్భుతమైన ఔషధంగా పనిచేస్తాయని ప్రముఖ హెర్బలిస్ట్ చెబుతున్నారు.  తెలుగువన్ హెల్త్ (TeluguOne Health) ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆస్ట్రేలియన్ హెర్బల్ క్లినిక్ & మెడిసిన్ కన్సల్టెంట్ హెర్బలిస్ట్ డాక్టర్ జి. లక్ష్మణరావు, Ph.D (Australia) గారు జామ ఆకుల విశిష్టతను, వాటితో దంతాల నొప్పిని ఎలా నయం చేసుకోవచ్చో క్లియర్ గా ఈ వీడియోలో వివరించారు.  జామ ఆకుల్లోని ఔషధ గుణాలు: జామ ఆకుల్లో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ (Anti-inflammatory), యాంటీ మైక్రోబియాల్ (Anti-microbial) మరియు అనల్జెసిక్ (నోప్పి నివారణ) గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి నోట్లోని బ్యాక్టీరియాను నశింపజేసి, చిగుళ్ల వాపులను మరియు పంటి నొప్పిని తక్షణమే తగ్గించడంలో సహాయపడతాయి. డాక్టర్ లక్ష్మణరావు గారు సూచించిన సులువైన ఇంటి చిట్కాలు: జామ ఆకులను నమలడం: లేత జామ ఆకులను శుభ్రంగా కడిగి, నోట్లో వేసుకుని బాగా నమలాలి. ఆ రసం పంటి నొప్పి ఉన్న భాగంలోకి చేరడం వల్ల నొప్పి నుండి త్వరగా ఉపశమనం లభిస్తుంది.  జామ ఆకుల కషాయం (మౌత్ వాష్): కొన్ని జామ ఆకులను నీళ్లలో వేసి బాగా మరిగించాలి. ఆ నీరు గోరువెచ్చగా అయిన తర్వాత కొద్దిగా ఉప్పు కలిపి, నోట్లో పోసుకుని పుక్కిలించాలి (Gargling). ఇది సహజసిద్ధమైన మౌత్ వాష్‌లా పనిచేసి చిగుళ్ల వాపులను, నోటి దుర్వాసనను దూరం చేస్తుంది. మీ ఆరోగ్య సమస్య ఏదైనా... మా హెల్త్ యూట్యూబ్ ఛానల్‌లో సీనియర్ డాక్టర్స్ చెప్పిన సలహాలు... సూచనలు ఉన్నాయి. మా యూట్యూబ్ ఛానల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 👉 [TeluguOne Health] సబ్‌స్క్రైబ్ చేయడం మర్చిపోకండి!
ఎండల ప్రభావం వల్ల లేదా మనం తినే ఆహారపు అలవాట్ల వల్ల చాలామందిలో శరీర ఉష్ణోగ్రత (Body Heat) అకస్మాత్తుగా పెరిగిపోతూ ఉంటుంది. ఆయుర్వేదం ప్రకారం దీనిని 'పిత్త దోషం' అధికమవ్వడం అంటారు. శరీరం వేడెక్కినప్పుడు కళ్ల మంటలు, కాళ్లల్లో నొప్పులు, నీరసం, చర్మంపై చెమటకాయలు, అజీర్తి వంటి అనేక సమస్యలు తలెత్తుతాయి. మరి ఈ సమస్య నుండి ఎలాంటి మందులు వాడకుండా, ఇంట్లోనే ఉండే సహజ సిద్ధమైన పదార్థాలతో ఎలా ఉపశమనం పొందాలో ప్రముఖ ఆయుర్వేద నిపుణులు డాక్టర్ చిట్టిబొట్ల మధుసూదన శర్మ గారు ఈ వీడియోలో క్లియర్ గా వివరించారు. 👇 🌟శరీరంలో వేడి తగ్గడానికి ముఖ్యమైన ఆయుర్వేద చిట్కాలు: మజ్జిగ మరియు సబ్జా గింజలు: ప్రతిరోజూ పల్చటి మజ్జిగ తాగడం లేదా నీళ్లలో నానబెట్టిన సబ్జా గింజలను తీసుకోవడం వల్ల శరీరం తక్షణమే చలవబడుతుంది. ధనియాల నీరు: రాత్రి పూట ఒక గ్లాసు నీటిలో చెంచా ధనియాలు నానబెట్టి, ఉదయాన్నే ఆ నీటిని వడకట్టి తాగడం వల్ల పిత్త దోషం అదుపులోకి వస్తుంది. కొబ్బరినీళ్లు: వారంలో కనీసం రెండు లేదా మూడు సార్లు కొబ్బరినీళ్లు తాగడం వల్ల శరీరానికి అవసరమైన ఎలక్ట్రోలైట్స్ అంది, వేడి తగ్గుతుంది. తీసుకోవలసిన ఆహారాలు: పుచ్చకాయ, కీరదోసకాయ, సొరకాయ, బీరకాయ వంటి నీటి శాతం ఎక్కువగా ఉండే కూరగాయలు, పండ్లను డైట్‌లో భాగం చేసుకోవాలి. దూరంగా ఉంచాల్సినవి: మిరపకాయలు, మసాలాలు, పచ్చళ్లు, టీ మరియు కాఫీలను కాస్త తగ్గించడం చాలా మంచిది. మీ శరీర తత్వాన్ని బట్టి పిత్త దోషం తీవ్రత మారుతూ ఉంటుంది. మీ ఆరోగ్య సమస్య ఏదైనా... మా హెల్త్ యూట్యూబ్ ఛానల్‌లో సీనియర్ డాక్టర్స్ చెప్పిన సలహాలు... సూచనలు ఉన్నాయి. మా యూట్యూబ్ ఛానల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 👉 [TeluguOne Health] సబ్‌స్క్రైబ్ చేయడం మర్చిపోకండి! 🙌