Read more!

దమ్ముందా..? బండికి కేటీఆర్ కౌంటర్

దేశవ్యాప్తంగా ఐటీఐఆర్ మూలకు పెట్టింది బీజేపీ ప్రభుత్వమేనన్నారు కేటీఆర్. ఐటీఐఆర్ రాకపోవడానికి రాష్ట్ర ప్రభుత్వమే కారణమంటూ రాష్ట్ర బీజేపీ చీఫ్ బండి సంజయ్ రాసిన లేఖకు కౌంటర్ ఇచ్చారు మంత్రి కేటీఆర్. ITIR ప్రాజెక్టును పక్కన పెట్టామంటూ కేంద్రమంత్రి స్పష్టంగా ప్రకటన చేశారని గుర్తు చేశారు. సొంత పార్టీ మంత్రి చేసిన ప్రకటన బండి సంజయ్ కు తెలియకపోవడం ఆయన అజ్ఞానానికి నిదర్శనమన్నారు. కేంద్రంలో, కర్ణాటకలో అధికారంలో ఉన్న బెంగళూరు ITIR కూడా ఒక్క అడుగు ముందుకు పడలేదన్నారు. మరి బెంగళూరుకు ఐటిఐఆర్ ప్రాజెక్టు రానందుకు కూడా తమ ప్రభుత్వమే కారణమేనా అని ప్రశ్నించారు. 

2014 నుంచి రాసిన లేఖలు, సమర్పించిన DPRలు బండి సంజయ్ కు పంపిస్తామని.. ITIR తీసుకువచ్చే దమ్ముందా అంటూ సవాల్ విసిరారు కేటీఆర్. ఐటీఐఆర్ లేదా ఐటీఐఆర్‌కి సమానమైన మరో ప్రాజెక్టుని హైదరాబాద్ నగరానికి తీసుకురాగలరా అని నిలదీశారు. చిత్తశుద్ధి ఉంటే ITIRపై కేంద్రంతో స్పష్టమైన ప్రకటన చేయించాలన్నారు. అసత్యాలు, అబద్దాలతో ప్రచారం చేస్తూ ప్రజలను BJP నేతలు తప్పు దోవ పట్టిస్తున్నారని KTR ఆరోపించారు. ఐటీఐఆర్ విషయంలో వెనక్కి పోయిన బీజేపీ నిరుద్యోగ యువతకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కేవలం మీడియాలో ప్రచారం కోసంమే అసత్యాలతో బండి సంజయ్ లేఖ రాశారన్నారు. బండి సంజయ్ రాసిన లేఖ ఒక అబద్దాల జాతర అని ఎద్దేవా చేశారు. సిగ్గులేకుండా అసత్యాలు, అబద్దాలను ప్రచారం చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించే బీజేపీ నైజం మరోసారి బయటపడిందన్నారు కేటీఆర్.