టీటీడీ కీలక నిర్ణయం 

ఏప్రిల్ 14 వరకు భక్తులకు శ్రీవారి దర్శనం అనుమతి లేదు. నిత్య కైంకర్యలు యథాతథంగా నిర్వహిస్తున్న అర్చకులు. ఇప్పటికే రెండు ఘట్ రోడ్డులు మూసివేత. టిటిడి సిబ్బందికి తిరుమలలో వారం రోజుల పాటు విధులను కేటాయింపు. తిరుపతిలో 50 వేల మందికి  ఉదయం ఉప్మా, మధ్యాహ్నం (సాంబారు) పులిహోర, పెరుగు అన్నం,  రాత్రి కిచిడి  ప్యాకెట్లను పంపిణీ చేస్తున్న టీటీడీ. ఏప్రిల్ 2వ తేది శ్రీరామనవమి సందర్భంగా నిర్వహించే హనుమంత వాహన సేవ రద్దు, ఏకాంతగా శ్రీరామనవమి ఆస్థానం. ఏప్రిల్ నెలలో  మూడు రోజులపాటు నిర్వహించే వార్షిక వసంతోత్సవాలను శ్రీవారి ఆలయంలోని కళ్యాణ మండపంలో ఏకాంతగా నిర్వహించాలని నిర్ణయం.