ప్రకాశం బ్యారేజి పై ఉద్రిక్తత... మీద చేయి వేస్తే దూకేస్తాం...

ఎపి రాజధాని అమరావతి తరలింపుకు వ్యతిరేకంగా రైతులు, మహిళలు 400 రోజులకు పైగా ఎండనక, వాననక ఉద్యమం చేస్తున్న సంగతి తెల్సిందే. ఈరోజు ప్రపంచ మహిళా దినోత్సవ సందర్భంగా రాజధాని ప్రాంత మహిళా రైతులు విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించునేందుకు వెళుతుఅండగా ప్రకాశం బ్యారేజ్ వద్ద వారిని పోలీసులు అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులకు, మహిళా రైతులకు మధ్య వాగ్వాదం, తోపులాట చోటు చేసుకుంది. దీంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. మహిళా దినోత్సవం అని కూడా చూడకుండా సీఎం జగన్, డీజీపీ తమ పట్ల దారుణంగా వ్యవహరిస్తున్నారని ఆ మహిళలు మండిపడ్డారు. ఇదే సందర్భంలో ఎవరైనా తమపై చేయి వేస్తే ప్రకాశం బ్యారేజీలో దూకుతామని పోలీసులను హెచ్చరించారు. తాము అమ్మవారి దర్శనానికి వెళుతుంటే ఈ విధంగా అక్రమంగా అడ్డుకుంటున్నారని.. వారు విమర్శించారు. అంటేకూండా ఇప్పటికే భూములు ఎలాగూ కోల్పోయామని, ఇక బతకడం అనవసరమని, ప్రకాశం బ్యారేజ్‌లో దూకి చనిపోతామని ఏవరు ఆవిడెదన ౫వ్య౫క్తం చేసారు. రాజధాని కోసం తాము నిరసన తెలుపుతుంటే ప్రజలు చూసి వెళ్లిపోతున్నారే కానీ ఎమాత్రం స్పందించడంలేదని.. ఇది సిగ్గుచేటని ఆ మహిళలు ఆవేదన వ్యక్తం చేసారు