పెనుకొండలో సవితమ్మ ప్రచారం అదరహో!

శ్రీ సత్య సాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం గోరంట్ల మండల కేంద్రంలో  అశేష జనవాహిని మధ్య పెనుకొండ తెలుగుదేశం అభ్యర్థి శ్రీమతి సవితమ్మ ఎన్నికల ప్రచారం అద్భుతమైన రీతిలో జరుగుతోంది. ఉత్తేజం కలిగించే తెలుగుదేశం పార్టీ పాటలు మైకులలో వినిపిస్తూ వుండగా, తెలుగుదేశం కార్యకర్తలు పసుపుపచ్చ కండువాలను గాలిలో ఊపుతూ సందడి చూస్తూ ప్రచార కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. 
ఈ రోడ్ షో కార్యక్రమంలో పెనుకొండ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీమతి సవితమ్మ, ఎంపీ అభ్యర్థి బీకే పార్థసారథి, మాజీ ఎంపీ నిమ్మల కిష్టప్ప, బిజెపి జిల్లా అధ్యక్షులు జిఎం శేఖర్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున తెలుగుదేశం జనసేన బిజెపి పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు