నో కామెంట్.. మూడు రాజధానులపై నోరు మెదపని మండలి చైర్మన్!

శాసన మండలిలో వికేంద్రీకరణ బిల్లు, సీఆర్డీయే రద్దు బిల్లులను సెలెక్టు కమిటీకి పంపాలనే నిర్ణయం తాను తీసుకోవటం వల్లనే శాసన మండలిలో వైసీపీ ఎమ్మెల్సీలు ఆవేశంగా మాట్లాడారు తప్ప ఉద్దేశ పూర్వకంగా దుర్భాషలాడలేదని కౌన్సిల్ చైర్మన్ షరీఫ్ అన్నారు. తనకున్న విచక్షణాధికారాలతోనే బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపినట్లు ఆయన చెప్పారు. రాష్ట్రానికి రాజధాని ఒకటేనా మూడు ఉండాలన్న దానిపై నో కామెంట్ అనేశారు షరీఫ్. తణుకులోని వేల్పూర్ రోడ్డులోని మసీదుకు వచ్చిన ఆయనకు స్థానికులు ఘనంగా స్వాగతం పలికారు. వ్యక్తిగతంగా కృతజ్ఞతలు చెబుతూ ఫోటోలకు పాలాభిషేకాలు చేస్తూ.. తమ అభిమానాన్ని చాటుకున్నారు. మొత్తం మీద ఈ బిల్లులు ఏ మలుపుకు దారి తీస్తాయోనని సర్వత్రా ఉత్కంఠ రేపుతోంది.