ఏపీలో 15 వేలు దాటిన కరోనా కేసులు

ఏపీలో కరోనా కేసుల సంఖ్య 15 వేల మార్క్ ని దాటింది. గత 24 గంటల్లో 657 మందికి కరోనా పాజిటివ్ గా తేలింది. వారిలో ఏపీ వాసులు 611 మంది కాగా, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారు 39మంది, విదేశాల నుంచి వచ్చిన వారు ఏడుగురు ఉన్నారు. గత 24 గంటల్లో కరోనా కారణంగా ఆరుగురు చనిపోయారు. కర్నూల్ జిల్లాలో ముగ్గురు, కృష్ణా జిల్లాలో ముగ్గురు మృతి చెందారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 15,252 కి చేరింది. మృతుల సంఖ్య మొత్తం 193కి చేరింది. ప్రస్తుతం 8071 యాక్టివ్ కేసులు ఉన్నాయి.