లాస్యకు తులసి ఇచ్చిన మాట ఏంటీ?
on Dec 2, 2021
బుల్లితెరపై ఆద్యంతం ఆసక్తికరంగా సాగుతున్న సీరియల్ `ఇంటింటి గృహలక్ష్మి`. కస్తూరి కీలక పాత్రలో నటిస్తున్న ఈ సీరియల్ గత కొన్ని వరాలుగా మహిళా ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకుంటోంది. ఈ గురువారం 492వ ఎపిసోడ్లోకి ఎంట్రీ ఇస్తోంది. ఈ సందర్భంగా పలు ఆసక్తికర సంఘటనలు చోటు చేసుకోబోతున్నాయి. అవేంటనేది ఒకసారి చూద్దాం. గత ఎపిసోడ్లో లాస్య `వెల్నెస్ సెంటర్`కి వచ్చి నందుని కడిగిపారేసిన విషయం తెలిసిందే.
`నీకు నేను కావాలో లేక తులసి కావాలో తేల్చుకో.. తులసిని నన్ను బాధపెడుతున్నావ్.. మా ఇద్దరిలో ఎవరు కావాలో ఇప్పటికైనా తేల్చుకో` అంటూ వార్నింగ్ ఇస్తుంది. దీంతో ఏమీ మాట్లాడలేక నందు బోరుమంటాడు. అదే సమయంలో వాటర్ బాటిల్ అందిస్తూ `ఆంటీ మిమ్మల్ని తులసి ఆంటి పిలుస్తోంది` అంటుంది అంకిత. వెంటనే `నేను రాను అని చెప్పు అంటుంది లాస్య. `మనల్ని కలవాలి అనుకునేవారిని కలవకపోతే మనం చాలా కోల్పోతాం` అంటుంది అంకిత. దాంతో లాస్య మనసు మార్చుకుని తులసి దగ్గరికి వెళుతుంది.
మన మధ్య ఇదంతా జరిగి వుండకపోతే మనం మంచి ఫ్రెండ్స్ అయ్యే వాళ్లమేమో లాస్య. కానీ నిన్ను నేను ఫ్రెండ్ లాగే అనుకున్నాను. నందుకి నటించడం రాదు. ఇక నందు నా జీవితంలోకి రావడం సాధ్యం కాదు. అంటుంది తులసి. నందు అనే వ్యక్తి ఇక నుంచి లాస్యతోనే కలిసి బతకాలి.. అలా జరిగేలా నేను చేస్తాను` అంటూ లాస్యకు తులసి మాటిస్తుంది. ఆ తరువాత ఏం జరిగింది? .. నందు డాక్టర్ అద్వైత కృష్ణపై ఎందుకు సీరియస్ అయ్యాడు? .. తులసి పరిస్థితి ఏంటీ.. ఆమె కథ ఏ మలుపు తీసుకుంది? అన్నది తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే.