'బిగ్ బాస్'లో అరుపులు దాటి కొట్లాట వరకూ...
on Oct 7, 2021
'బిగ్ బాస్'లో కంటెస్టెంట్లు మరీ మాస్గా ఉన్నారని స్టార్టింగ్ డే కొంతమంది కామెంట్ చేశారు. అందుకు తగ్గట్టుగా ఎలిమినేట్ అయినవాళ్లు ఆగ్రహావేశాలు, మాటల తూటాలతో రెచ్చిపోయారు. హౌస్లో ఉన్న మిగతావాళ్ళు కొంచెం బెటర్ అనుకుంటే, మొన్నటి వారం నామినేషన్స్లో ప్రియా మీద లోబో అరిచాడు. అయ్యిందేదో అయ్యిందనుకుంటే... ఇప్పుడు అంతకు మించి అన్నట్టు ప్రవర్తిస్తున్నారు.
అరుపులు, మాటల తూటాలు దాటుకుని కొట్లాటలు వరకూ వచ్చారు. 'బిగ్ బాస్' ఇచ్చిన టాస్క్లు కూడా కొట్లాటకు పనికొచ్చాయి. 'రాజ్యానికి ఒక్కడే రాజు' అని ఒక టాస్క్ ఇచ్చారు. అందులో రవి, సన్నీ రాకుమారులు. మిగతావాళ్ళు ప్రజలు. ఎవరికీ ఎక్కువ మద్దతు ఉంటే వారే రాజు. సోమ, మంగళ వరాలు టాస్క్ జరిగింది. అందులో భాగంగా 'మట్టిలో మహాయుద్ధం' అంటూ ఒక పోటీ పెట్టారు. అది కొంత వరకు పర్వాలేదు.
'రాజుగారి గోడ' అని మరో టాస్క్ ఇచ్చారు. అందులో రవి, సన్నీ పేరు మీద రెండు గోడలు ఉంటాయి. వాటిపై ఫోటోలు అతికించాలి. ఎవరి ఫోటోలు గోడ మీదకు ఎక్కువ వస్తే వారే విజేతలు. ఇందులో మానస్, విశ్వ కొట్టుకున్నట్టు చేశారు. శ్రీరామచంద్ర, జెస్సీ అయితే నిజంగా కొట్టుకున్నారు. ఇద్దరికీ చిన్న చిన్న దెబ్బలు తగిలాయి. అరుపులు, గొడవల వరకూ ఓకే కానీ దెబ్బలు తగిలేలా కొట్టుకోవడం ఏంటో? అని కొందరు ఆడియన్స్ విస్తుపోయారు.