ఆగస్టు ప్రథమార్ధం.. నూతన దర్శకుల మయం!
on Jun 23, 2022
2022 ఆగస్టు ప్రథమార్ధంలో పలు ఆసక్తికరమైన చిత్రాలు తెరపైకి రాబోతున్నాయి. విశేషమేమిటంటే.. వాటిలో సింహభాగం నూతన దర్శకులు తెరకెక్కిస్తున్నవే కావడం. ఆ వివరాల్లోకి వెళితే..
బింబిసార - మల్లిడి వశిష్ఠ్:
నందమూరి కళ్యాణ్ రామ్ టైటిల్ రోల్ లో నటిస్తున్న ఫాంటసీ యాక్షన్ ఫిల్మ్ `బింబిసార`. కేథరిన్ ట్రెసా, సంయుక్తా మీనన్ నాయికలుగా ఎంటర్టైన్ చేయనున్న ఈ సినిమాతో మల్లిడి వశిష్ఠ్ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. ఆగస్టు 5న ఈ క్రేజీ ప్రాజెక్ట్ సిల్వర్ స్క్రీన్ పైకి రానుంది.
యశోద - హరి - హరీశ్:
స్టార్ బ్యూటీ సమంత టైటిల్ రోల్ లో నటిస్తున్న పాన్ - ఇండియా ప్రాజెక్ట్ `యశోద`. తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానున్న ఈ థ్రిల్లర్ తో హరి - హరీశ్ దర్శకులుగా తొలి అడుగేస్తున్నారు. ఆగస్టు 12న ఈ సినిమా జనం ముందుకు రాబోతోంది.
మాచర్ల నియోజక వర్గం - ఎమ్మెస్ రాజశేఖర్ రెడ్డి:
యూత్ స్టార్ నితిన్ కథానాయకుడిగా నటించిన పొలిటికల్ థ్రిల్లర్ `మాచర్ల నియోజక వర్గం`. కృతి శెట్టి, కేథరిన్ ట్రెసా హీరోయిన్లుగా కనిపించనున్న ఈ సినిమా కోసం ఎమ్మెస్ రాజశేఖర్ రెడ్డి మొదటిసారిగా మెగాఫోన్ పట్టాడు. ఆగస్టు 12న ఈ చిత్రం థియేటర్స్ లోకి వస్తోంది.
స్వాతి ముత్యం - లక్ష్మణ్ కె కృష్ణ:
బెల్లంకొండ గణేశ్, వర్ష బొల్లమ్మ జంటగా నటించిన `స్వాతి ముత్యం`.. ఆగస్టు 13న రిలీజ్ కి రెడీ అయింది. ఈ చిత్రంతో లక్ష్మణ్ కె. కృష్ణ కెప్టెన్ గా పరిచయమవుతున్నాడు.
మరి.. ఆగస్టు ఫస్టాఫ్ లో ఎంటర్టైన్ చేయనున్న ఈ చిత్రాలతో ఆయా నూతన దర్శకులు ఎలాంటి ఫలితాలను అందుకుంటారో చూడాలి.