తారక్-కొరటాల మూవీ లాంచ్ కు ముహూర్తం ఫిక్స్.. హీరోయిన్ గా బాలీవుడ్ బ్యూటీ!
on Sep 15, 2021
రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతోన్న 'ఆర్ఆర్ఆర్' తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన తదుపరి సినిమాను కొరటాల శివ దర్శకత్వంలో చేయనున్న సంగతి తెలిసిందే. తారక్-కొరటాల కాంబినేషన్ లో గతంలో వచ్చిన 'జనతా గ్యారేజ్' ఘన విజయం సాధించడంతో.. వీరి కాంబినేషన్ లో వచ్చే సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ సంబంధించి క్రేజీ న్యూస్ వినిపిస్తోంది.
తారక్-కొరటాల మూవీ లాంచ్ కి ముహూర్తం ఖరారయ్యిందట. అక్టోబర్ మొదటి వారంలో ఈ సినిమా గ్రాండ్ గా లాంచ్ అవుతుందని అంటున్నారు. ఈ విషయంపై త్వరలోనే అధికారిక ప్రకటన రానుందని తెలుస్తోంది. ఇక ఈ మూవీలో తారక్ సరసన బాలీవుడ్ బ్యూటీ నటించనుందని సమాచారం. కియారా అద్వానీ, అలియా భట్ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. వీరిద్దరిలో ఎవరో ఒకరు హీరోయిన్ గా నటించే అవకాశం ఉందని అంటున్నారు.
ఇక ఈ సినిమాలో తారక్ స్టూడెంట్ లీడర్ గా కన్పించబోతున్నట్టు సమాచారం. సుధాకర్ మిక్కిలినేని, నందమూరి కల్యాణ్ రామ్ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ మూవీకి సినిమాటోగ్రాఫర్గా రత్నవేలు, మ్యూజిక్ డైరెక్టర్ గా అనిరుధ్ ఫిక్స్ అయ్యారట. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ నవంబర్లో ప్రారంభమవుతుందని తెలుస్తోంది. త్వరలోనే ఈ సినిమాకి సంబంధించిన వివరాల్ని అధికారికంగా వెల్లడించనున్నట్టు సమాచారం.