అమ్మానాన్నలతో చిన్ననాటి ఫొటోలను షేర్ చేసిన చైతన్య.. రియాక్టయిన శోభిత!
on Jul 7, 2022
నాగచైతన్య తన రాబోయే ఫిల్మ్ 'థాంక్ యూ'ను ప్రమోట్ చేయడానికి సరైన దారినే ఎంచుకున్నాడు. తనకు అత్యంత ముఖ్యమైన వ్యక్తులతో గడిపిన కొన్ని అమూల్య క్షణాలను షేర్ చేశాడు. ఆ పోస్ట్ను తన ఫ్యామిలీకి అంకితం చేసిన అతను, తన జీవితంలో వారి అపారమైన భాగస్వామ్యాన్ని ప్రస్తావించాడు.
ఆ పోస్ట్లో తల్లి లక్ష్మి తనను ఎత్తుకొని ముద్దాడుతున్నఅందమైన చిన్ననాటి బ్లాక్ అండ్ వైట్ ఫొటోను షేర్ చేశాడు. దాంతో పాటు నాన్న నాగార్జునతో ఒక చిన్న గోడ మూడ కూర్చొని పెప్సీ తాగుతున్న ఫొటోను పంచుకున్నాడు. చివరగా తన పెట్ డాగ్తో ఉన్న రీసెంట్ ఫొటోను కూడా అతను షేర్ చేశాడు. ఈ మూడు ఫొటోలకు "#themagicwordisthankyou థాంక్ యూ - తరచుగా నేను వాడే పదం. కానీ చాలా ముఖ్యమైన సందర్భానికి అది సరిపోదు. ఈ ఆలోచనను నా నెక్ట్స్ మూవీ 'థాంక్ యూ' రిఫ్లెక్ట్ చేస్తుంది.. ఈ సినిమా ప్రయాణంలో నన్ను కదిలించింది." అంటూ రాశాడు.
అమ్మపై చైతూ తన అభిప్రాయాలను పంచుకున్నాడు. "అమ్మా - నా అంతర్భాగంగా, ఎప్పటికప్పుడు నాకు దారిచూపుతూ, సాధ్యమైన ప్రతి మార్గంలో నాకు బేషరతు ప్రేమను పంచుతూ వస్తున్నావు" అని రాశాడు. ఆ తర్వాత తన ఫ్రెండ్, ఫిలాసఫర్, మార్గదర్శి అయిన తండ్రి గురించి, "నాన్నా - నాకు ఒక దిశను చూపినందుకు, మరే ఫ్రెండ్ చేయలేని విధంగా నాకు ఫ్రెండ్గా ఉన్నందుకు" అని షేర్ చేశాడు. చివరగా తన పెట్ గురించి, "హ్యాష్ - ఫీల్ అయ్యేవిధంగా చేసినందుకు, ఎలా ప్రేమించాలో చూపిస్తూ, ఒక మనిషిగా ఉంచుతున్నందుకు! జూలై 22న #thankyouthemovie రిలీజవుతోంది" అని రాసుకొచ్చాడు. అనేకమంది అతని పోస్ట్ను లైక్ చేయగా, వారిలో 'గూఢచారి', 'మేజర్' సినిమాల నటి, ఇటీవల చైతూ పేరుతో కలిసి వినిపించిన నటి శోభితా ధూళిపాళ కూడా ఉంది. ఆమె హార్ట్ ఎమోజీని జోడించి, అతని ఇన్స్టా పోస్ట్ను లైక్ చేసింది.
చైతూ త్వరలో ఆమిర్ ఖాన్ మూవీ 'లాల్ సింగ్ చడ్ఢా'తో బాలీవుడ్లో అడుగుపెడుతున్నాడు. ఈ మూవీలో ఆర్మీలో లాల్సింగ్ ఫ్రెండ్గా అతను కనిపించనున్నాడు. ఆమిర్ ఖాన్ వల్లే ఈ సినిమాను అంగీకరించానని ఇటీవల వెల్లడించాడు చైతూ. ఆమిర్తో తెర పంచుకొనే అవకాశాన్ని, అతని ద్వారా నేర్చుకునే అవకాశాన్ని వదులుకోవాలని అనుకోలేదని అతను చెప్పాడు. ఆగస్ట్ 11న ఈ మూవీ థియేటర్లలో విడుదలవుతోంది.
Also Read