సూర్య కోసం.. ఇద్దరు స్టార్ కంపోజర్స్ గానం!
on Dec 8, 2021
`సూరరై పోట్రు` (తెలుగులో `ఆకాశం నీ హద్దురా!), `జై భీమ్` చిత్రాలతో ఓటీటీ వేదికగా ఏడాది గ్యాప్ లో రెండు భారీ విజయాలందుకున్నారు కోలీవుడ్ స్టార్ సూర్య. రెండు సినిమాలతోనూ నటుడిగా మరింత గుర్తింపుని పొందారు. ఈ నేపథ్యంలో.. సూర్య తదుపరి చిత్రంపై ఎనలేని ఆసక్తి నెలకొంది. `ఎదర్కుమ్ తుణిందవన్` పేరుతో సూర్య నెక్స్ట్ ప్రాజెక్ట్ జనం ముందుకు రాబోతోంది. గత రెండు సినిమాల తరహాలో ఓటీటీలో కాకుండా నేరుగా థియేటర్స్ లోనే ఈ యాక్షన్ థ్రిల్లర్ సందడి చేయనుంది. పాండిరాజ్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో సూర్యకి జంటగా `గ్యాంగ్ లీడర్` ఫేమ్ ప్రియాంకా అరుళ్ మోహన్ కనిపించనుంది.
రిపీట్ మోడ్ లో కీర్తి సురేశ్.. ఫస్ట్ నాని, నెక్ట్స్ సూర్య!
ఇదిలా ఉంటే.. `ఎదర్కుమ్ తుణిందవన్`కి ప్రముఖ సంగీత దర్శకుడు డి. ఇమాన్ బాణీలు అందిస్తున్నారు. కాగా, ఈ చిత్రం కోసం ఇద్దరు స్టార్ కంపోజర్స్ గాత్రమందించారని సమాచారం. ఆ ఇద్దరు మరెవరో కాదు.. అనిరుధ్, జీవీ ప్రకాశ్ కుమార్. గతంలో సూర్య కాంబినేషన్ లో వేర్వేరుగా సినిమాలు చేసిన ఈ యువ స్వరకర్తలు.. `ఎదర్కుమ్ తుణిందవన్` కోసం విడివిడిగా రెండు పాటలు పాడారట. ఈ రెండు గీతాలు కూడా సినిమాకి ప్రత్యేక ఆకర్షణ కానున్నాయని కోలీవుడ్ బజ్. త్వరలోనే ఈ పాటల తాలూకు లిరికల్ వీడియోస్ రిలీజ్ కాబోతున్నాయట.
కాగా, ఫిబ్రవరి 4న `ఎదర్కుమ్ తుణిందవన్` థియేటర్స్ లోకి రాబోతోంది. తెలుగులోనూ ఈ సినిమా అనువాదమయ్యే అవకాశముంది.