మళ్ళీ బిజీగా మారిన కేథరిన్!
on Nov 30, 2021
`చమ్మక్ చల్లో` చిత్రంతో తెలుగు తెరకు కథానాయికగా పరిచయమైన కేథరిన్ ట్రెసా.. ఆపై `ఇద్దరమ్మాయిలతో`, `పైసా`, `ఎర్రబస్సు`, `రుద్రమదేవి` వంటి సినిమాల్లో మెరిసింది. అయితే, అల్లు అర్జున్ తో ముచ్చటగా మూడోసారి జట్టుకట్టిన `సరైనోడు` సినిమాతోనే టాలీవుడ్ లో తొలి హిట్ చూసింది మిస్ ట్రెసా. సదరు బ్లాక్ బస్టర్ మూవీ అనంతరం మరి కొన్ని తెలుగు చిత్రాల్లో మెరిసిన కేథరిన్ కి వాటిలో `నేనే రాజు నేనే మంత్రి` మాత్రమే సక్సెస్ అందించింది. ఇక ప్రీవియస్ మూవీ `వరల్డ్ ఫేమస్ లవర్` ఘోరపరాజయం తరువాత తెలుగు తెరపై మళ్ళీ కనిపించని కేథరిన్.. ఇప్పుడిప్పుడే తిరిగి బిజీ అవుతోంది.
నందమూరి కళ్యాణ్ రామ్ కి జోడీగా నటించిన `బింబిసార` త్వరలోనే విడుదలకు సిద్ధమవగా.. శ్రీ విష్ణుతో కలిసి నటిస్తున్న `భళా తందనాన` సెట్స్ పై ఉంది. అలాగే నితిన్ కథానాయకుడిగా నటిస్తున్న పొలిటికల్ డ్రామా `మాచర్ల నియోజకవర్గం`లో కృతి శెట్టి మెయిన్ లీడ్ గా నటిస్తుండగా.. సెకండ్ లీడ్ గా ఎంటర్టైన్ చేయనుంది కేథరిన్. మొత్తమ్మీద.. వరుస చిత్రాలతో మళ్ళీ బిజీ తారగా మారిపోయిన కేథరిన్.. రాబోయే సినిమాలతో ఎలాంటి ఫలితాలను అందుకుంటుందో చూడాలి.
Also Read