![]() |
![]() |

ప్రస్తుతం తాను మానసిక కుంగుబాటుకు లోనైనట్లు 'ఆర్ఎక్స్ 100' భామ పాయల్ రాజ్పూత్ తెలిపింది. కోవిడ్ కారణంగా ఇష్టమైన వ్యక్తుల్ని కోల్పోయానని, ఎంతో బాధగా ఉందని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. ఈ మేరకు సోషల్ మీడియాలో పాయల్ ఓ పోస్ట్ పెట్టింది.
‘నా జీవితంలో ఇదే అతి క్లిష్టమైన దశ. మానసిక కుంగుబాటుకు లోనయ్యా. గట్టిగా ఏడవాలని అనిపిస్తోంది. నాలోని బాధను చెప్పడానికి మాటలు కరవయ్యాయి. నాకెంతో ఇష్టమైన వ్యక్తిని కోల్పోయాను. కోవిడ్ కారణంగా తమ ప్రియమైన వారిని కోల్పోయిన వారికి దేవుడు ధైర్యాన్ని, మానసిక స్థైర్యాన్ని అందించాలని కోరుకుంటున్నాను. దయచేసి అందరూ తమ కుటుంబసభ్యుల్ని సంరక్షించుకోవాలని సూచిస్తున్నాను’ అని పాయల్ పోస్ట్ పెట్టింది.
కాగా, పాయల్ ప్రియుడు సౌరభ్ ఢింగ్రా తల్లి అనితా కోవిడ్ కారణంగా మృతి చెందారు. తనకెంతో ఆప్తురాలైన అనితా ఆంటీ కోవిడ్ కారణంగా కన్నుమూశారని ఇటీవల పాయల్ సోషల్ మీడియా ద్వారా తెలియజేసింది. ఆమె మరణవార్త తనని ఎంతగానో కలచి వేసిందని చెప్పింది.
![]() |
![]() |