రెండు భాగాలుగా 'సలార్'..!!
on Jun 22, 2021
బాహుబలి మూవీ ఎలాంటి సంచలనాలు సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. రెండు భాగాలుగా విడుదలైన ఈ మూవీ ప్రభాస్ ని పాన్ ఇండియా స్టార్ గా మార్చడంతో పాటు.. టాలీవుడ్ రేంజ్ ని పెంచింది. ఇక కన్నడ బాహుబలి 'కేజీఎఫ్' కూడా అలాంటి సంచలనాలే సృష్టించింది. ఇప్పటికే మొదటి భాగం విడుదలై ఆకట్టుకోగా.. రెండో భాగం కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక బాహుబలి హీరో ప్రభాస్, కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో వస్తున్న 'సలార్' పై భారీ అంచనాలున్నాయి. అయితే ఇప్పుడు ఈ మూవీకి సంబంధించి ఓ క్రేజీ న్యూస్ చక్కర్లు కొడుతోంది.
సలార్ మూవీకి బాహుబలి, కేజీఎఫ్ ల సెంటిమెంట్ రిపీట్ కానుందని తెలుస్తోంది. సలార్ ని కూడా రెండు భాగాలుగా రూపొందిస్తే ఎలా ఉంటుందన్న కోణంలో ప్రభాస్- ప్రశాంత్ నీల్- మేకర్స్ మధ్య చర్చలు జరుగుతున్నాయట. నిజానికి `సలార్` ప్రారంభించే ముందు రెండు భాగాలుగా తెరకెక్కించాలన్న ఆలోచన లేదు. అయితే ప్రస్తుత మార్కెట్ స్ట్రాటజీని దృష్టిలో ఉంచుకుని, రెండు భాగాలుగా తెరకెక్కిస్తే ఎలా ఉంటుందని ఆలోచిస్తున్నారట.
కాగా, అల్లు అర్జున్- సుకుమార్ కాంబినేషన్ లో వస్తున్న పాన్ ఇండియా మూవీ 'పుష్ప' విషయంలోనూ ఇదే జరిగింది. షూటింగ్ మధ్యలో పుష్ప రెండు భాగాలుగా తెరకెక్కించాలని నిర్ణయించుకున్నారు. మరి ఇప్పుడు సలార్ టీమ్ కూడా ఇలాంటి నిర్ణయమే తీసుకుంటుందేమో చూడాలి.