పోర్నోగ్రఫీ కేసులో భర్త అరెస్ట్.. తొలిసారి స్పందించిన శిల్పా శెట్టి
on Jul 23, 2021
బాలీవుడ్ నటి శిల్పా శెట్టి భర్త రాజ్ కుంద్రా పోర్నోగ్రఫీ కేసులో అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన ముంబై పోలీసుల కస్టడీలో ఉన్నాడు. అయితే రాజ్ కుంద్రా అరెస్ట్ తర్వాత శిల్పా శెట్టి బాహ్య ప్రపంచానికి కనిపించకుండా పోయింది. ఓ దశలో ఆమె దేశం విడిచి పారిపోతుందని కూడా కామెంట్స్ వినిపించాయి. అయితే తన భర్త అరెస్ట్ అయిన తర్వాత తాజాగా శిల్పా శెట్టి తొలిసారి సోషల్ మీడియాలో స్పందించింది.
ప్రముఖ రచయిత జేమ్స్ థర్బర్ రచించిన పుస్తకంలోని వాక్యాలను శిల్పా శెట్టి తన ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసింది. లుకింగ్ ఎరౌండ్ అనే టైటిల్తో ఉన్న పుస్తకంలోని పేజీని స్క్రీన్ షాట్ తీసి పెట్టింది. ఆవేశంలో గతాన్ని, భయంతో భవిష్యత్ను చూడకు. నీ చుట్టూ ఉన్న పరిస్థితులపై అవగాహన కల్పించుకో అంటూ అందులో ఉంది. 'గతంలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నాను. భవిష్యత్తులో కూడా సవాళ్లను ఎదుర్కొంటాను. ఈ రోజు ఉన్న పరిస్థితులను చూసి ఆందోళన చెందను' అనే విధంగా శిల్పా శెట్టి పోస్టు పెట్టింది.
అశ్లీల చిత్రాల నిర్మాణంలో పాత్ర ఉందనే అభియోగంపై జూలై 19న రాజ్ కుంద్రా అరెస్టయ్యాడు. అతనికి జూలై 23 దాకా పోలీస్ట్ కస్టడీ విధించారు. రాజ్ కుంద్రా ఇంటిపై దాడి చేసిన పోలీసులు 70 అశ్లీల చిత్రాల వీడియోలను స్వాధీనం చేసుకున్నారు.
Also Read