న్యూడ్ ఫొటో షూట్ చేసిన రణవీర్పై కేసు! నిపుణులు ఏమంటున్నారంటే...
on Jul 27, 2022
సోషల్ మీడియాలో తన న్యూడ్ పిక్చర్స్ను పోస్ట్ చేసిన బాలీవుడ్ స్టార్ యాక్టర్ రణవీర్ సింగ్పై ముంబై పోలీసులు మంగళవారం ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అతనిపై చెంబూరు పోలీస్ స్టేషన్లో ముంబైకి చెందిన ఓ ఎన్జీవో, వేదిక చౌబే అనే లాయర్ ఫిర్యాదు చేశారు. బహిరంగంగా అశ్లీలతను ప్రదర్శించిన అభియోగాల కింద రణవీర్పై ఐపీసీ 292, 293, 509 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు.
మహిళల మనోభావాలను రణవీర్ గాయపరిచాడనీ, తన ఫొటోల ద్వారా వారి సచ్ఛీలతను అవమానపర్చాడనీ తన ఫిర్యాదులో ఎన్జీవో ఆఫీస్ బేరర్ ఆరోపించారు. రణవీర్ సింగ్ 'ఎ లిస్ట్ యాక్టర్' అనీ, అతని సినిమాలను యువత బాగా చూస్తుంటారనీ, అతని చర్యలకు వారు ఈజీగా ప్రభావితం అవుతారనీ ఫిర్యాదుదారు ప్రతినిధి అయిన లాయర్ అఖిలేష్ చౌబే అన్నారు. "అతని ఫొటోలు అశ్లీలంగా ఉన్నాయి. డబ్బు కోసమే అతను ఆ ఫొటో షూట్ చేసినట్లు కనిపిస్తోంది. అతనికి తప్పకుండా శిక్ష పడాలి" అని ఆయన అన్నారు.
అశ్లీలతా నిరోధక చట్టం కింత చట్టపరమైన చర్యలు ఎదుర్కోనున్న లేటెస్ట్ సినీ సెలబ్రిటీ రణవీర్. ఇదివరకు 'ద డర్టీ పిక్చర్'లో సిల్క్ స్మితగా నటించిన విద్యా బాలన్, ఓ కొత్త సంవత్సరం స్టేజ్ పర్ఫార్మెన్స్కు సంబంధించి మల్లికా షెరావత్, ఒక పబ్లికేషన్లో ప్రచురితమైన ఫొటోలకు సంబంధించి శిల్పా శెట్టి ఈ చట్టం కింద విచారణ ఎదుర్కొన్నారు.
అయితే రణవీర్ విషయంలో సీనియర్ న్యాయవాది నితీన్ ప్రధాన్ అభిప్రాయం వేరుగా ఉంది. అతను ఎలాంటి చట్ట ఉల్లంఘన పని చేయలేదని ఆయన అన్నారు. ఆ ఫొటో షూట్ చేసింది మీడియా అనీ, అతను స్వచ్ఛందంగా ఆ ఫొటోలను తన సోషల్ మీడియా హ్యాండిల్లో పోస్ట్ చేసినా, అది చట్ట ఉల్లంఘన కాదనీ ఆయన అన్నారు. ఆర్ట్ అంటే ఏంటో ఎవరైనా తెలుసుకోవాలనుకుంటే, వాళ్లు ఖజురహో దేవాలయాన్ని సందర్శించవచ్చని ఆయన సూచించారు.
Also Read