పూజా హెగ్డే రోల్లో జాక్వెలిన్ ఫెర్నాండెజ్!
on Feb 23, 2021
అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రధారిగా రూపొందుతోన్న 'బచ్చన్ పాండే' మూవీ సెట్స్పై సోమవారం అడుగుపెట్టింది జాక్వెలిన్ ఫెర్నాండెజ్. తమిళంలో ఘన విజయం సాధించిన 'జిగర్తాండ'కు ఇది రీమేక్. ఈ సినిమా తెలుగు రీమేక్ 'గద్దలకొండ గణేష్' హిట్టయిన విషయం తెలిసిందే. తెలుగులో వరుణ్ తేజ్ పోషించిన టైటిల్ రోల్ను హిందీలో అక్షయ్ కుమార్ చేస్తున్నాడు. హీరోయిన్ మృణాళినీ రవి పాత్రను కృతి సనన్ పోషిస్తోంది. అధర్వ చేసిన ఔత్సాహిక దర్శకుడి క్యారెక్టర్ను అర్షద్ వార్సి చేస్తున్నాడు.
ఇక ఫ్లాష్బ్యాక్లో వచ్చే సీన్లలో యంగ్ వరుణ్ తేజ్ ప్రియురాలిగా కనిపించిన పూజా హెగ్డే రోల్ను బచ్చన్ పాండేలో జాక్వెలిన్ ఫెర్నాండెజ్ చేస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం అక్షయ్, జాక్వెలిన్ సన్నివేశాలను డైరెక్టర్ ఫరాద్ సమ్జీ తీస్తున్నాడు.
వారం రోజుల పాటు ఈ సన్నివేశాలను తీసి, మార్చి 1 నాటికి మొత్తం షూటింగ్ను కంప్లీట్ చేయనున్నారు. అక్షయ్, జాక్వెలిన్పై జైసల్మేర్లో ఓ పాటను కూడా తీయనున్నారు. తెలుగులో "ఎల్లువొచ్చి గోదారమ్మ ఎల్లాకిల్లా పడ్డాదమ్మా" అంటూ 'దేవత'లో వేటూరి రాసిన పాటను రీమిక్స్ చేసి వరుణ్, పూజపై తీసిన విషయం తెలిసిందే. 2022 రిపబ్లిక్ డేకి 'బచ్చన్ పాండే'ను విడుదల చేయాలని ఇప్పటికే నిర్మాత సాజిద్ నదియడ్వాలా నిర్ణయించాడు.