ఆకస్మికంగా విషమించిన సీనియర్ కమెడియన్ ఆరోగ్య స్థితి
on Aug 18, 2022
వెంటిలేటర్పై ఉన్న బాలీవుడ్ కమెడియన్ రాజు శ్రీవాస్తవ ఆరోగ్య స్థితి గత రాత్రి (ఆగస్ట్ 17) ఆకస్మాత్తుగా క్షీణించింది. ప్రస్తుతం ఆయన ఢిల్లీలోని ఎయిమ్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. రాజు శ్రీవాస్తవ ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఆయన కుటుంబ సభ్యులు, స్నేహితులు షాక్కు గురయ్యారు. మెదడులో వాపు కలగడమే గత రాత్రి ఆయన ఆరోగ్యం ఆకస్మికంగా క్షీణించడానికి కారణమని ఆయన స్నేహితులు తెలిపారు. డాక్టర్లు ఆయనకు ఇంజెక్షన్లు ఇచ్చాక, మెదడు వాచిందని సమాచారం. వాపు తగ్గాక రాజు పరిస్థితి మెరుగవుతుందనీ, ఆయన మెదడు మళ్లీ సరిగా పనిచేస్తుందనీ డాక్టర్లు తెలిపారు.
ఆగస్ట్ 10న రాజు శ్రీవాస్తవ గుండెపోటుకు గురయ్యారు. వర్కవుట్స్లో భాగంగా ట్రెడ్మిల్పై ఉన్నప్పుడు ఛాతీ నొప్పితో ఆయన కుప్పకూలారు. వెంటనే ఆయన ట్రైనర్ ఆయనను ఢిల్లీలోని ఎయిమ్స్ హాస్పిటల్కు తరలించారు. ఆయన గుండె సరిగా పనిచేయడం కోసం రెండు సార్లు వైద్యులు ఆయనకు సీపీఆర్ ఇచ్చారు.
గుండెపోటు తర్వాత ఆయన మళ్లీ స్పృహలోకి రాలేదు. హార్ట్ ఎటాక్ సమయంలోనే ఆయన మెదడు కూడా దెబ్బతింది. ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో వైద్యులు వెంటిలేటర్పై ఉంచి చికిత్స అందిస్తున్నారు. అప్పట్నుంచీ ఆయన స్థితి మెరుగుపడలేదు, అలాగని మరింత క్షీణించలేదు.
'మైనే ప్యార్ కియా', 'తేజాబ్', 'బాజీగర్' లాంటి సూపర్ హిట్ సినిమాల్లో తన కామెడీతో అలరించిన రాజు శ్రీవాస్తవ పలు కామెడీ షోలతో వీక్షకులకు మరింత దగ్గరయ్యారు. వాటిలో ద గ్రేట్ ఇండియన్ లాఫ్టర్ ఛాలెంజ్, కామెడీ సర్కస్, ద కపిల్ శర్మా షో, శక్తిమాన్ ముఖ్యమైనవి.
Also Read