సుశాంత్ గురించి భూమిక ఎమోషనల్ పోస్ట్
on Jun 14, 2021
బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణించి నేటికి(జూన్ 14) ఏడాది పూర్తయ్యింది. సుశాంత్ తొలి వర్థంతి సందర్భంగా అభిమానులు, శ్రేయోభిలాషులు సోషల్ మీడియా వేదికగా ఆయనకు నివాళులు అర్పిస్తున్నారు. సినీ సెలబ్రిటీస్ ఆయనతో అనుభందాన్ని గుర్తు చేసుకుంటున్నారు. ఎంఎస్ ధోని బయోపిక్ లో సుశాంత్ కి సిస్టర్ గా నటించిన భూమిక చావ్లా.. సుశాంత్ ని తలచుకుంటూ సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ పెట్టారు.
ప్రియమైన సుశాంత్ మీరు శాంతిని కనుగొన్నారని ఆశిస్తున్నాము. మీరు మమ్మల్ని విడిచి వెళ్లి సంవత్సరం గడిచిపోయింది. మనం కలిసి పనిచేశాం. నేను ఎంఎస్ ధోని మూవీలో మీకు సిస్టర్ గా నటించాను. ఆ సమయంలో మనం సెట్స్ లో కలిసి కూర్చొని కొన్ని విషయాలు మరియు జీవితం గురించి మాట్లాడుకున్నాము.
గత సంవత్సరం నేను ఈ రోజును చాలా స్పష్టంగా గుర్తుంచుకున్నాను. మీరు లేరనే విషయం తెలిసి జీర్ణించుకోలేక పోయాను. నేను లైఫ్ ని ఒక బబుల్ అనుకున్నాను. ఇప్పడు అది మాయమైంది. ఇది ఎందుకు జరిగిందో నేను గుర్తించలేకపోయాను. పైకి సాధారణంగా కనిపించే మీరు లోపల తెలియని బాధని అనుభవించి ఉంటారు. మీరు దూరమవ్వడం ప్రపంచాన్ని కదిలించింది.
నేను అర్థం చేసుకున్నాను.. జీవితంలో ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే 'మంచి కంపెనీ'. మనకి సరైన మార్గం చూపించే వ్యక్తులు కావాలి. మనకి కుటుంబ మద్దతు లేదా స్నేహితుల మద్దతు ఉండాలి. లేదంటే ఎవరైనా చీకటిలోకి జారిపోతారు. మీరు విలాసవంతమైన జీవితంలో.. చక్కగా మరియు సరదాగా కనిపించే వారి సహవాసంలో ఉన్నప్పుడు.. నిజమైన లోతైన సంభాషణలు ఉండవు. అప్పుడు మీకు తెలియకుండానే మీరు సుడిగుండంలోకి ప్రవేశిస్తారు.
Also Read