English | Telugu

జగతి, మహేంద్రలకు నిజం చెప్పేసిన వసుధార!

స్టార్ మాలో ప్రసారమవుతున్న 'గుప్పెడంత మనసు' సీరియల్ ఎపిసోడ్-678 లోకి అడుగుపెట్టింది. కాగా శనివారం జరిగిన ఎపిసోడ్ లో... కాలేజీలో రాజీవ్ చేసిన గొడవని జగతి, మహేంద్రలు గుర్తుచేసుకుంటారు. "అసలు వసుధార ఎందుకు ఇలా చేస్తుంది.. పెళ్లి చేసుకుంది.. తన లైఫ్ చూసుకోకుండా, మళ్ళీ రిషి జీవితంలోకి వచ్చి ఇబ్బంది పెడుతుంది.. చక్రపాణి మన ఇంటికి వచ్చి ఏదో చెప్పాలనుకున్నాడు.. మనం వెళ్లి చక్రపాణిని అడిగితే అసలు నిజం బయట పడుతుంది" అని జగతితో మహేంద్ర అంటాడు. అలా అనుకుంటూ ఇద్దరు బయలుదేరుతారు.

అలా ఇద్దరు వెళ్ళగానే.. "రండి సర్.. రండి టీచరమ్మా" అంటూ కూర్చోమంటాడు. చక్రపాణికి కాలేజీకి వచ్చి రాజీవ్ చేసిన గొడవ గురించి చెప్తారు. అసలు వసుధార మెడలో తాళి ఎవరు కట్టారు అంటూ ప్రశ్నిస్తుంది జగతి. వసుధార ఎవరికీ చెప్పొద్దూ అని ఒట్టు వేయించుకున్న మాటలు గుర్తు చేసుకుంటాడు చక్రపాణి. అంతలోనే వసుధార వస్తుంది. రాజీవ్ తనని రూమ్ లో బంధించిన విషయం దగ్గర నుండి రిషిని చంపేస్తానని బెదిరించిన విషయం వరకు అంతా చెప్తుంది‌‌ వసుధార. ఈ తాళి ఏంటని జగతి అడుగగా.. "అప్పుడు ఏం చెయ్యాలో తెలియక నేనే తాళి మెడలో వేసుకున్నాను. ఇది మీరు పంపిన తాళి. రిషి సర్ నా మెడలో వేశారని అనుకొని నా ఇష్టప్రకారంగా నాకు నేను నా మెడలో వేసుకున్న తాళి. అమ్మేమో హాస్పిటల్ లో, నేనేమో పోలీస్ స్టేషన్ లో.. నిజానిజాలు చెప్పే పరిస్థితిలో నేను లేను" అంటూ చెప్తుంది వసుధార. ఇప్పటికైనా ఈ నిజం రిషికి చెప్పు వసు అని జగతి అంటుంది. "లేదు మేడం.. రిషి సర్ కి మనసులో ఒకటుంది. అది తనంతట తానే తెలుసుకొని, వాస్తవం తెలుసుకోవాలి.. రిషి సార్ మా ప్రేమని బ్రతికించుకుంటాడు. దయచేసి మా ఇద్దరి మధ్యలో ఎవరు కలుగుజేసుకోవద్దు" అని వసుధార చెప్తుంది. వసుధార మాటలు విన్న జగతి, మహేంద్రలు.. సారీ వసు అని దగ్గరికి తీసుకుంటుంది జగతి. "నిన్ను అర్ధం చేసుకోకుండా తప్పుగా మాట్లాడాం వసుధార" అని మహేంద్ర అంటాడు..

"రిషి సర్ లేకపోతే నేను బతకలేనని నేను ఎలా తెలుసుకున్నానో,‌ రిషి సర్ కూడా తెలుసుకోవాలి. వసుధార చివరి శ్వాస వరకు రిషి సర్ కోసమే జీవిస్తుందని తెలుసుకోవాలి.. నా మెడలో ఎవరో తాళి కట్టారని ఎలా అనుకుంటారు? నిజం తెలుసుకోవాలి మేడం.. మీరు మాత్రం రిషి సర్ కి నిజం చెప్తే మా ప్రేమ మీద ఒట్టే" అని జగతి చేతిని తన నెత్తి మీద పెట్టుకుంటుంది వసుధార. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.