Read more!

English | Telugu

30 వస్తే పెళ్లి చేసుకోవాలనేది ఏమీ లేదు...

 


సిక్స్త్ సెన్స్ సీజన్ 6 లేటెస్ట్ ప్రోమో మంచి ఇంటరెస్టింగ్ గా ఉంది. ఈ షోకి వరలక్ష్మి శరత్ కుమార్, బిందు మాధవి వచ్చారు. వీళ్ళ గురించి పెద్దగా చెప్పక్కర్లేదు. ఈ షోలో పెళ్లి గురించి ఓంకార్ ఈ ఇద్దరినీ అడిగేసరికి...ఇద్దరూ తమ తమ అభిప్రాయాలను చెప్పేసారు.  "పెళ్లి ఎప్పుడు చేసుకుంటారు" అడగడంతో  దానికి ఆమె వేళ్ళతో క్రాస్ సిగ్నల్ చూపించింది.   "ఆ సింబల్ ఏంటీ" అని మళ్ళీ అడిగాడు. "భూతం వస్తే క్రాస్ పెడతారు కదా. అది నా పక్కకు రాకూడదని" అంటూ నవ్వుతూ చెప్పింది వరలక్ష్మి. "ఏంటీ పెళ్లి అనేది  భూతమా" అని ఓంకార్ ఇంకా ఫన్నీగా అన్నాడు.

ఆయన మాటలకు వరలక్ష్మీ, బిందు మాధవి తెగ నవ్వేశారు. "పెళ్లి అనేది దేనికి సొల్యూషన్ కాదు. మంచి వాళ్ళు దొరికినప్పుడు చేసుకుంటాను. ఒక టైం ఫ్రేములోనే చేసుకోవాలి అని అనుకోవడం లేదు. ముందు మనల్ని మనం అర్థం చేసుకున్నప్పుడే ఎదుటి వాళ్ళను సంతోషంగా ఉంచగలుగుతాం.. పూర్తిస్థాయిలో అందుకు సిద్ధంగా ఉన్నప్పుడే...పెళ్లి అనే మాట ఎత్తాలి..30 ఏళ్ళు వచ్చాయంటే అమ్మాయిలకు పెళ్లిళ్లు ఐపోవాలి.

లేదంటే ఇక జీవితంలో ఏమీ చేయలేరు అంటూ ఉంటారు..అలా ఫోర్స్ ఫుల్ గా పెళ్లిళ్లు చేసుకోవడం వలన కొన్ని రాంగ్ రిలేషన్స్ లోకి వెళ్లిపోతున్నాయి"  అంటూ పెళ్లిపై తన అభిప్రాయాన్ని వెల్లడించారు. "ఇకపోతే మీ జీవితంలో మీరు సక్సెస్ అవ్వడానికి మీ వెనుక ఎవరైనా ఉన్నారా" అని అడిగేసరికి వరలక్ష్మి ఇలా చెప్పింది.. "నా సక్సెస్ కి కారణం నేనే.. నా ఇంట్లో నాన్నకు నేను నటిని కావడం అస్సలు ఇష్టం లేదు.

మా అమ్మకు అసలు మూవీ  ఇండస్ట్రీ గురించి పెద్దగా ఏమీ తెలియదు. కానీ ఇప్పుడు నన్ను చూసి మా నాన్న గర్వంగా ఫీల్ అవుతున్నానంటూ చెబుతూ ఉంటారు" అంది. బిందు మాధవి మాట్లాడుతూ "అమ్మానాన్న నాకు సపోర్ట్ గా ఉంటారు. డెసిషన్ మేకింగ్ ఎప్పుడూ నాదే..ఇప్పటికీ నా డెసిషన్స్ నేనే తీసుకుంటాను. కానీ ఒక సపోర్ట్ గా నాన్న ఎప్పుడూ నా వెనకే ఉంటారు" అని చెప్పింది. వరలక్ష్మి శరత్ కుమార్ హీరోయిన్ గా సక్సెస్ కాలేకపోయింది..కానీ లేడీ విలన్ గా మంచి ఆర్టిస్ట్ గా గుర్తింపు తెచ్చుకుంది.