English | Telugu

సంచాలక్ గా ఆట సందీప్ ఫెయిల్.. సీరియల్ బ్యాచ్ వల్ల పవరస్త్రాని కోల్పోయిన శివాజీ!

బిగ్ బాస్ షోని చూసే ప్రేక్షకులకు ఎంటర్టైన్మెంట్ మాములుగా ఉండదని టన్నుల్లో ఉంటుందని మరోసారి చూపించాడు బిగ్ బాస్. సీరియల్ బ్యాచ్ చేసే కుట్రలకి కళ్ళెం వేస్తూ మాట్లాడిన ప్రతీ మాట ప్రేక్షకులకు హమ్మయ్య అనే ఊరటనిచ్చాయి. ఆట సందీప్ సీరియల్ బ్యాచ్ లోని ప్రియాంక జైన్, అమర్ దీప్, శోభా శెట్టి లతో కలసి తన ఆటని మరిచిపోయి ఆడుతున్నాడు. బిగ్ బాస్ సీజన్-7 ఇప్పటికే మూడు వారాలు పూర్తి చేసుకొని నాల్గవ వారం ముగింపుకి వచ్చేసింది. ఇక వీకెండ్ లో శనివారం రోజు ఎపిసోడ్ కోసం ఎదురు చూశారు.

ఇక టాస్క్ లో గౌతమ్ కృష్ణని టార్చర్ చేసినందుకు గాను టేస్టీ తేజ మీద ఫైర్ అయ్యాడు హోస్ట్ నాగార్జున. అతను అలా చేసిన నువ్వు వదిలేసావ్ చూడు సూపర్ అని గౌతమ్ కృష్ణని పొగిడేశాడు నాగార్జున. ఇక ఆట సందీప్ ఆ టాస్క్ లో చూసి కూడా ఏం మాట్లాడలేదని, సంచాలక్ గా కంప్లీట్లీ ఫెయిల్ అని నాగార్జున అనగానే సందీప్ కి ఏడుపు ఒక్కటే తక్కువైంది. ఇక టేస్టీ తేజని అలా ఎలా లాగుతావంటు నువ్వు చేసింది తప్పేనా అని టేస్టీ తేజని నాగార్జున అడుగగా.. రియలైజ్ అవ్వడానికి టైం పట్టిందని, ఇక ఆపేద్దామని అనుకున్నాను. కానీ ఇప్పుడు చూస్తే అర్థమైంది. అవును సర్ తప్పే సర్ మీరు ఏ శిక్ష వేసిన నాకు ఒకే సర్ అని టేస్టీ తేజ అన్నాడు. ఇక టేస్టీ తేజని ఏం చేద్దామని సందీప్ ని అడుగగా.. డైరెక్ట్ గా హౌజ్ లో నుండి బయటకు పంపించేద్దామని అంటాడు. అసలైతే సంచాలక్ గా ఫెయిల్ అయిన నిన్ను బయటకు పంపించాలని అని నాగార్జున అంటాడు. ఇక హౌజ్ లోని వాళ్ళంతా షాక్ లో ఉన్నారు.

టాస్క్ లో టేస్టీ తేజ అలా చేస్తుంటే నువ్వు ఎందుకు చెప్పలేదని శివాజీని నాగార్జున అడిగాడు. నేను చూడలేదని, సారీ అని శివాజీ అన్నాడు. ఇక టేస్టీ తేజకి ఏ శిక్ష వేద్దామని కంటెస్టెంట్స్ ని అడుగగా.. జైలుకి పంపించాలని శుభశ్రీ, ప్రియాంక జైన్ అన్నారు. ఇక నాల్గవ హౌజ్ మేట్ అయిన పల్లవి ప్రశాంత్ కి అభినందనలు తెలిపాడు నాగార్జున. హౌజ్ మేట్ గా ముగ్గురిలో ఎవరు ఫెయిల్ అయ్యారని కంటెస్టెంట్స్ ని నాగార్జున అడుగగా.. అమర్ దీప్, ప్రియాంక జైన్, శోభా శెట్టిలతో పాటు రతిక శివాజీకి అన్ డిజర్వింగ్ ఇచ్చారు. ఆ తర్వాత శివాజీ పవరస్త్రాని‌ శోభాశెట్టి చేత బ్రేక్ చేపించాడు నాగార్జున. ఇక శివాజీ కామన్ కంటెస్టెంట్ అని నాగార్జున కంటెస్టెంట్స్ కి తెలియజేసాడు.

Brahmamudi: రాహుల్ మనిషిని పట్టుకున్న రాజ్, కావ్య.. ఇక దేత్తడి!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -905 లో....అప్పు పాప కేసు ఫైల్ చూస్తుంటే ఆఫీసర్ వస్తాడు. నీకు ఎన్నిసార్లు చెప్పాను వద్దని అయినా అలాగే చేస్తున్నావని కోప్పడతాడు. లేదు సర్ పాప చనిపోలేదు.. చనిపోయిన పాప వేరు.. ఆ పాప DNA తో మ్యాచ్ అవ్వడం లేదని రిపోర్ట్స్ చూపించగానే అవునా కేసులో ఒక కొత్త మలుపు తీసుకొని వచ్చావ్ గుడ్ కేరియాన్ అని ఆఫీసర్ అంటాడు. కాసేపటికి రేపు పాప వాళ్ళ ఫాదర్ ని స్టేషన్ కి రప్పించండి అని కానిస్టేబుల్ తో అప్పు చెప్తుంది. మరొకవైపు రాహుల్ అవార్డు ఫంక్షన్ కి రాజ్, కావ్య వెళ్తారు. అక్కడ రాహుల్ డిజైన్స్ చూసి రాజ్, కావ్య షాక్ అవుతారు.

Karthika Deepam2: జ్యోత్స్న చేసిన ఫ్రాడ్ చూసి కార్తీక్, శ్రీధర్ షాక్.. ఇంటి వారసురాలు కాదేమో!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -542 లో..... కార్తీక్, శ్రీధర్ జ్యోత్స్న రెస్టారెంట్ ఫుడ్ ట్రక్స్ బాగా పాపులర్ అయ్యాయని హ్యాపీగా ఉంటారు. ఇద్దరు బయట టీ తాగుతూ కబుర్లు చెప్పుకుంటారు. జ్యోత్స్న చాలా తప్పు డు లెక్కలు చూపించిందని శ్రీధర్ అనగానే ఎంత మొన్న కొన్న ల్యాండ్ గురించా అని  కార్తీక్ అడుగుతాడు. లేదు అది జస్ట్ శాంపిల్ మాత్రమే.... ఎంత అంటే అది చెప్తే శివన్నారాయణ గుండె పట్టుకొని పడిపోయేంత డబ్బులు ఫ్రాడ్ చేసిందని శ్రీధర్ అనగానే కార్తీక్ షాక్ అవుతాడు.