Read more!

English | Telugu

కార్తీక దీపం స్టార్ట్ అయింది.. ఇక మీ అమ్మగారి ఆరోగ్యం బాగుపడుతుంది

కార్తీక దీపం ఎంతమంది మీద ఎలాంటి  ఎఫెక్ట్ చూపించిందో వేరే చెప్పక్కర్లేదు. లేడీ ఫాన్స్ మాత్రమే కాదు జెంట్స్ కూడా ఈ సీరియల్ కి ఫాన్స్ ఉన్నారు. డాక్టర్ బాబు, వంటలక్క, మోనిత ఈ సీరియల్ ని ఎక్కడికో తీసుకెళ్లిపోయారు. ఈ సీరియల్ ఐపోయేసరికి చాలామంది హర్ట్ అయ్యారు కూడా. ఇప్పుడు కార్తీక దీపం సీజన్ 2 స్టార్ట్ అయ్యింది. దీని మీద సింగర్ సమీరా భరద్వాజ్ ఒక ఫన్నీ రీల్ చేసింది ఆ రీల్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. 

"అమ్మా పిన్ని వాళ్ళు వచ్చారు, తమ్ముడి రిజల్ట్స్ వచ్చాయి, అమ్మా మామ్మకు బాలేదని హాస్పిటల్ లో చేర్చారట, కనీసం నా పెళ్లికైనా వస్తావా" అని కూతురు రకరకాలుగా అడుగుతుండేసరికి "పిన్ని వాళ్ళను అక్కడ కూర్చోమను, తమ్ముడు పాస్ ఐనా ఫెయిల్ ఐనా దీపం పెట్టాకే, బామ్మకు ఏదైతే అది అయ్యింది, నీ పెళ్లి ముహూర్తం ఏమన్నా సమయం మారిస్తే బాగుండు అన్నీ దీపం పెట్టాకే" అంటూ ఉంటుంది సమీరా. చివరికి తనకు ఒంట్లో బాగోకపోయేసరికి "మళ్ళీ దీపాన్ని ఎప్పుడు పెడతానో బహశా చూడకుండానే.." అని ఏడుస్తూ ఉంటుంది. ఆమెను హాస్పిటల్లో చేర్పిస్తారు. "మీ అమ్మ ఒక మహా భక్తురాలు అనుకుంటా. ఆవిడ దీపం పెట్టలేకపోయినందుకు డిప్రెషన్ లోకి వెళ్లిపోయారు. బహుశా ఆవిడతో దీపం పెట్టించేస్తే నయమైపోతుందేమో" అని చెప్పేసరికి ...తర్వాత ఆమె కూతురు లైన్లోకి వచ్చి "భక్తి లేదు ఏమీ లేదు..దీపం పెట్టాలి దీపం పెట్టాలి అంటే కార్తీక దీపం సీరియల్ గురించి..ఈ సీరియల్ ఆగిపోయిన దగ్గర నుంచి ఇలా మంచాన పడింది ..ఏదో ఒకటి చెయ్యండి..." అని అడిగేసరికి " ఒక డాక్టర్ గా ఏమీ చేయలేకపోవచ్చు కానీ కార్తీక దీపం ఫ్యాన్ గా మీ అమ్మగారికి ఒక గుడ్ న్యూస్..కార్తీకదీపం కొత్త ఎపిసోడ్స్ వచ్చేస్తున్నాయి..ఇంక  మీ అమ్మగారి ఆరోగ్యానికి డోకా లేదు అంతే" అని చెప్పింది ఆ డాక్టర్.