Read more!

English | Telugu

ఒకప్పుడు ఆవులకు, దూడలకు వేసిది.. ఇప్పుడు నువ్వు తింటున్నావ్!


  
అనసూయ భరద్వాజ్.. టెలివిజన్ రంగంలో యాంకర్ గా అడుగుపెట్టి గుర్తింపు తెచ్చుకుంది. జబర్దస్త్ కామెడీ షో ద్వారా పాపులారిటి తెచ్చుకున్న అనసూయ..‌ 'రంగస్థలం' సినిమాలో రంగమ్మత్తగా నటించి ఆకట్టుకుంది. ఆ తర్వాత చాలా సినిమాలలో నటించిన అనసూయ.. తాజాగా 'రంగమార్తాండ' సినిమాలో మంచి పాత్రని చేసానని మీడీయా ముందు ఎమోషనల్ అయింది. తన తర్వాతి సినిమా 'విమానం' మూవీ పోస్టర్ ని తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసి అక్కడి నుండే ప్రమోషన్ ని మొదలుపెట్టింది. అయితే 'విమానం' సినిమా కథ బాగుండటంతో విమర్శకుల ప్రశంసలు పొంది భారీ హిట్ గా నిలిచింది. దాంతో అనసూయ ఈ సినిమా సక్సెస్ ని ఎంజాయ్ చేస్తుంది.

అనసూయ రెగ్యులర్ గా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది. వీకెండ్ పార్టీలని, హోమ్ టూర్ అని, సమ్మర్ వేకేషన్ అంటూ తన ప్రతీ అప్డేడ్ ని ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తుంటుంది. అయితే నిన్న మొన్నటిదాకా విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ తో గొడవ పడుతూ పోస్ట్ లు చేసిన అనసూయ‌.. ఆ గొడవ సద్దుమణిగిందనేలోపే, మళ్ళీ హాట్ టాపిక్ గా మారింది. నిన్నటి దాకా జ్యువలరీ ప్రమోషన్స్, శారీ ప్రమోషన్స్ అంటూ బ్రాండ్స్ కోసం ప్రచారం చేస్తూ బిజీగా ఉంటుంది.

తాజాగా తన ఇన్ స్టాగ్రామ్ లో కొన్ని ఫొటోస్ షేర్ చేసింది అనసూయ. హ్యాపీ వీకెండ్ గాయ్స్ అంటూ తను మార్నింగ్ బ్రేక్ ఫాస్ట్ తింటున్న ఫొటోస్ ని షేర్ చేసింది అనసూయ. అయితే అనసూయ ఏది చేసిన తప్పే అన్నట్లుగా నెటిజన్ల తీరు ఉంది. ఒక్కొక్కరు ఒక్కోలా అనసూయని తిడుతూ కామెంట్ చేస్తున్నారు. ఇదంతా వాళ్ళ కామెంట్లు చూసి చెప్పొచ్చు. అయితే అనసూయ చేసిన పోస్ట్ కి  "నువ్వు తినేది.. ఒకప్పుడు మేము ఆవులకు, దూడలకు వేసేవాళ్ళం. ఇప్పుడు నువ్వు తింటున్నావ్" అని ఒకతను కామెంట్ చేశాడు. "అది విజయ్ దేవరకొండ వెళ్లిన హోటల్ కదా.. సేమ్ అదే హోటల్ లో విజయ్ దేవరకొండ దిగిన ఫోటో తన ఇన్ స్టాగ్రామ్ లో ఉంది" అని మరొకరు కామెంట్ చేశారు. ఇప్పటికే అనసూయ, విజయ్  దేవరకొండ ఫ్యాన్స్ మధ్య రచ్చ నడుస్తుంది. ఇక ఈ కామెంట్స్ కి అనసూయ ఎలా స్పందిస్తుందో చూడాలి మరి.