Read more!

English | Telugu

బిగ్ బాస్ లో ఎంట్రీ ఇచ్చిన నయని పావని ఎవరో తెలుసా?

బిగ్ బాస్ సీజన్-7  ఇప్పటికి మంచి క్రేజ్ తో ముందుకు సాగుతున్న వరల్డ్ బిగ్గెస్ట్ రియాలిటీ షో. సెప్టెంబర్ 3 న గ్రాంఢ్ లాంచ్ పేరుతో 14 మంది కంటెస్టెంట్స్ ని హౌజ్ లోకి పంపించిన విషయం తెలిసిందే. అయితే మొత్తం ఉల్టా ఫుల్టాగా సాగుతున్న ఈ షోలో.. నిన్న 2.0 పేరుతో బిగ్ బాస్ మేనేజ్‌మెంట్ మరొక అయిదుగురిని హౌజ్ లోకి తీసుకొచ్చింది. అయితే అందులో ముగ్గురు అమ్మాయిలే ఉండడం విశేషం. ఇప్పటికే హౌజ్ నుండి వరుసగా అమ్మాయిలే ఎలిమినేట్ కాగా మళ్ళీ ఇప్పుడు హౌస్ లోకి ముగ్గురు అమ్మాయిలను తీసుకొచ్చాడు బిగ్ బాస్.

బిగ్ బాస్ 2.0 లో వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ ఇచ్చింది ఈ హైదరాబాద్  అమ్మాయి నయని పావని. ఈ అమ్మడు పెద్దగా పరిచయం లేని పేరే. కొన్ని వెబ్ సిరీస్ లలో నటించినా అంత ఫాలోయింగ్ మాత్రం సంపాదించుకోలేకపోయింది. ఢీ-14 షో కి వచ్చిన నయని.. కమెడియన్ హైపర్ ఆదితో కలిసి మంచి ఎంటర్‌టైన్‌మెంట్ అందించింది.  టిక్ టాక్ ద్వారా మంచి ఫేమ్ సంపాదించుకుంది నయని. తను పుట్టింది పెరిగింది మొత్తం హైదరాబాద్ లోనే... నయనీకీ డాన్స్, షాపింగ్ అంటే ఇష్టమంట. నయని కలహం, మధురం అనే వెబ్ సిరీస్ లలో నటించింది. అదేవిధంగా  సూర్యకాంతం మూవీలో హీరోయిన్ కి స్నేహితురాలిగా నటించింది నయని. సోషల్ మీడియా లో రెగ్యులర్ గా ఫోటలతో, రీల్స్ తో ఎప్పుడు యాక్టీవ్ గా ఉంటుంది.

ఇప్పటికే తనకి ఇన్ స్ట్రాగ్రామ్ లో అత్యధిక ఫాలోయింగ్ ఉండగా, బిగ్ బాస్ ఎంట్రీ ద్వారా మరింత ఫేమ్ సంపాదించుకోవాలని వచ్చిందట. ఇక ఎంట్రీ లోనే అద్భుతమైన డాన్స్ పర్ఫామెన్స్ తో ఎంట్రీ ఇచ్చింది. ఇప్పటికే అయిదు వారలు పూర్తయింది ఈ సీజన్. 2.0 లో ఎంట్రీ ఇచ్చిన కంటెస్టెంట్స్ లోపల ఉన్నవాళ్ళ ఆటతీరుకి, బయట ప్రేక్షకుల స్పందననలని అన్నింటిని అనాలసిస్ చేసి వెళ్తున్నారు. భారీ అంచనాల మధ్య ఎంట్రీ ఇచ్చిన ఈ సోషల్ మీడియా ఇన్ ఫ్లూయన్సర్ నయని.. హౌజ్ లోకి వెళ్ళి ప్రేక్షకులను ఎలా ఎంటర్టైన్ చేస్తుందో చూడాలి మరి.