Read more!

English | Telugu

గొడవతో మొదలైన రాజ్, కావ్యల తొలి పరిచయం!

'బ్రహ్మముడి' సీరియల్ స్టార్ మా లో గ్రాండ్ గా లాంఛ్ అయిన విషయం తెలిసిందే. ఈ సీరియల్ ఎపిసోడ్-2 లో... కనకం తన ముగ్గురి కూతుళ్ళను గొప్ప ఇంటికి కోడళ్లను చెయ్యాలని ఒక మ్యారేజ్ బ్యూరోకి వెళ్తుంది. ఆ మ్యూరేజ్ బ్యూరోలో "మేం ధనవంతులం... మాకు ధనవంతుల సంబంధం చూపించండి" అని చెప్తుంది. అది విన్న ఆ బ్యూరో అతను దుగ్గిరాల ఫ్యామిలీలోని రాజ్ ని చూపిస్తాడు. ఆ తర్వాత కనకం ధనవంతురాలు కాదు అన్న విషయం తెలిసి ఆ బ్యూరో అతను తనని అవమానిస్తాడు. దానికి "తన ముగ్గురు కూతుళ్లును దుగ్గిరాల ఫ్యామిలీకి కోడళ్లను చేస్తా" అంటూ ఛాలెంజ్ చేస్తుంది. 

మరోవైపు రాజ్ కుటుంబం తమ కంపెనీ వార్షికోత్సవ వేడుకల్లో వినాయకుని పూజ చెయ్యాలని అనుకుంటారు. ఆ వినాయకుడిని కావ్యనే తయారు చేస్తుంది. వాళ్ళు చేసే పూజలో వినాయకుడికి నిజమైన బంగారు ఆభరణాలు అలంకరించుకోవాలి అని తీసుకురావడానికి రాజ్ బయటికి వెళ్తాడు. తిరిగి వస్తుండగా సైకిల్ ను ఢీకొడతాడు. ఆ సైకిల్ మీద ఉన్న కావ్య కిందపడిపోతుంది. సైకిల్ మీద ఉన్న బొమ్మలు పగిలిపోతాయి. కార్ నడిపిన రాజ్ మాత్రం ఏం పట్టనట్టుగా కార్ లో ఉంటాడు. అది చూసి అక్కడ ఉన్న జనం కార్ లో నుండి దిగమని చెప్తారు. కావ్య కూడా కోపంతో ఉంటుంది. రాజ్ కిందకి దిగి "మీ లాంటి వాళ్ళు డబ్బుల కోసం ఇవ్వన్నీ చేస్తారు.. మా డబ్బున్న వాళ్లంటే మీకు జలస్... ఇదిగో డబ్బు" అని కావ్యకి ఇస్తాడు రాజ్. "నీ డబ్బులు నాకేం అవసరం లేదు.. ఈ డబ్బుతో నీ డబ్బు జబ్బుని నయం చేసుకో" అంటూ స్ట్రాంగ్ కౌంటర్ వేస్తుంది కావ్య. ఈ అమ్మాయికి ఇంత పొగరేంటి అని అనుకుంటాడు రాజ్. ఇలా రాజ్, కావ్యల పరిచయం మొదలవుతుంది.

మరోవైపు కనకం ఎలాగైనా దుగ్గిరాల ఫ్యామిలీలో జరిగే పూజకి వెళ్ళాలనుకుంటుంది. పాస్ సంపాదించాలని ఆలోచన చేస్తుంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.