English | Telugu

దీపని ఎటాక్ చేసింది మేము కాదంటూ డైవర్ట్ చేసిన పారిజాతం!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2 ).ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -228 లో.....దీపపై ఎటాక్ చేయించింది జ్యోత్స్న అని కార్తీక్ కి డౌట్ వచ్చి వెంటనే ఫోన్ చేస్తాడు. పారిజాతం ఫోన్ లిఫ్ట్ చేస్తుంది. నా భార్య పై ఎటాక్ చేయించింది మీరే కదా అని అడుగగా.. పారిజాతం టెన్షన్ పడుతుంది. జ్యోత్స్న ఏదో ఒకటి కవర్ చెయ్యమని చెప్తుంది. మేమ్ ఎందుకు ఎటాక్ చేస్తాం.. మాకేం అవసరం తన మాజీ భర్త అయి ఉండొచ్చు లేక అతని భార్య శోభ అయి ఉండొచ్చని కార్తీక్ మనసుని డైవర్ట్ చేస్తుంది పారిజాతం. ఆ తర్వాత ఫోన్ కట్ చేస్తుంది.

నేనే తప్పుగా అనుకున్నానా అని కార్తీక్ అనుకుంటాడు. మరొకవైపు శౌర్య నాకు కబుర్లు చెప్పమని అంటుంది. నాకు పని ఉందంటూ కార్తీక్, దీపలు వెళ్తుంటే తను అలుగుతుంది. దాంతో ఇద్దరు పనులు మానేసి శౌర్యతో కబుర్లు చెప్తారు. కార్తీక్ కళ్ళు మండుతుంటే దీప చీర కొంగుతో శౌర్య ఆవిరి పడుతుంది. నాకు అమ్మకి నువ్వున్నావ్.. నీకు నేనున్నాను అని శౌర్య అనగానే కార్తీక్ ఎమోషనల్ అవుతాడు.

మరుసటి రోజు ఉదయం జ్యోత్స్న పారిజాతంలు మాట్లాడుకుంటారు. దీపని ఏదో ఒకటి చెయ్యాలని జ్యోత్స్న అనగానే అప్పుడే సుమిత్ర వచ్చి‌.. ఏం చేస్తావ్? దీప జోలికి పోతేనే తను మీ జోలికి వస్తుంది. తన మంచిదని సుమిత్ర అంటుంది. జ్యోత్స్నని మీరే చెడగొడుతున్నారని పారిజాతంపై కోప్పడుతుంది సుమిత్ర. ఎంతైనా సొంత కూతురు దీప కదా ఆ మాత్రం ప్రేమ ఉంటుందని జ్యోత్స్న తన మనసులో అనుకుంటుంది. అప్పుడే శివన్నారాయణ వచ్చి జ్యోత్స్న ఆఫీస్ కి వెళదామని అంటాడు. దాంతో పారిజాతంకి జ్యోత్స్న బై చెప్పి వెళ్తుంది. అక్కడే ఉన్న సుమిత్రకి చెప్పదు. మరొకవైపు కార్తీక్ ఆఫీస్ కి రెడీ అవుతాడు. అప్పుడే దీప ఫైల్ తీసుకొని వస్తుంది. నాకు ఎందుకో ఈ రోజు ఆఫీస్ కి వెళ్లాలని లేదు దీప అని కార్తీక్ అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Brahmamudi: రాహుల్ మనిషిని పట్టుకున్న రాజ్, కావ్య.. ఇక దేత్తడి!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -905 లో....అప్పు పాప కేసు ఫైల్ చూస్తుంటే ఆఫీసర్ వస్తాడు. నీకు ఎన్నిసార్లు చెప్పాను వద్దని అయినా అలాగే చేస్తున్నావని కోప్పడతాడు. లేదు సర్ పాప చనిపోలేదు.. చనిపోయిన పాప వేరు.. ఆ పాప DNA తో మ్యాచ్ అవ్వడం లేదని రిపోర్ట్స్ చూపించగానే అవునా కేసులో ఒక కొత్త మలుపు తీసుకొని వచ్చావ్ గుడ్ కేరియాన్ అని ఆఫీసర్ అంటాడు. కాసేపటికి రేపు పాప వాళ్ళ ఫాదర్ ని స్టేషన్ కి రప్పించండి అని కానిస్టేబుల్ తో అప్పు చెప్తుంది. మరొకవైపు రాహుల్ అవార్డు ఫంక్షన్ కి రాజ్, కావ్య వెళ్తారు. అక్కడ రాహుల్ డిజైన్స్ చూసి రాజ్, కావ్య షాక్ అవుతారు.

Karthika Deepam2: జ్యోత్స్న చేసిన ఫ్రాడ్ చూసి కార్తీక్, శ్రీధర్ షాక్.. ఇంటి వారసురాలు కాదేమో!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -542 లో..... కార్తీక్, శ్రీధర్ జ్యోత్స్న రెస్టారెంట్ ఫుడ్ ట్రక్స్ బాగా పాపులర్ అయ్యాయని హ్యాపీగా ఉంటారు. ఇద్దరు బయట టీ తాగుతూ కబుర్లు చెప్పుకుంటారు. జ్యోత్స్న చాలా తప్పు డు లెక్కలు చూపించిందని శ్రీధర్ అనగానే ఎంత మొన్న కొన్న ల్యాండ్ గురించా అని  కార్తీక్ అడుగుతాడు. లేదు అది జస్ట్ శాంపిల్ మాత్రమే.... ఎంత అంటే అది చెప్తే శివన్నారాయణ గుండె పట్టుకొని పడిపోయేంత డబ్బులు ఫ్రాడ్ చేసిందని శ్రీధర్ అనగానే కార్తీక్ షాక్ అవుతాడు.