English | Telugu

Jayam serial : గంగపై ఎటాక్ ప్లాన్ చేసిన వీరు.. సేవ్ చేసిన రుద్ర! 

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ ఆదివారం నాటి ఎపిసోడ్ -49 లో... వినాయకుడి విగ్రహం నిమజ్జనానికి గంగ అన్ని ఏర్పాట్లు చేస్తుంది. వినాయకుడికి శకుంతల పూజ చేస్తుంది. గంగ వస్తుంటే భాను వచ్చాడనుకొని శకుంతల హ్యాపీగా ఫీల్ అవుతుంది.

ఇక ఇంట్లో అందరు చాలా సంతోషంగా ఉంటారు. అందరు వినాయకుడి ముందు తీన్ మార్ డాన్స్ చేస్తుంటారు. శకుంతల హ్యాపీగా ఉండడం చూసి రుద్ర సంతోషపడతాడు. ఇందుమతి డాన్స్ చేస్తుంది. వీరు ప్లాన్ లో భాగంగా తన మనిషితో రుద్రకి పాపతో రౌడీలున్న వీడియోని పంపిస్తాడు. అది చూసి రుద్ర అక్కడ నుండి బయల్దేరతాడు. రుద్ర వెళ్ళడం చూసి సైదులుకి‌ వీరు ఫోన్ చేసి గంగ దగ్గరికి రమ్మని చెప్తాడు.

ఆ తర్వాత అందరు డ్యాన్స్ చేసి అలసిపోయి పక్కకి వస్తారు. గంగ ఇంకా కొంతమంది డ్యాన్స్ చేస్తారు. అప్పుడే సైదులు కత్తి పట్టుకొని వచ్చి.. గంగ తల దగ్గర పెట్టగా.. వెనకాల నుండి రుద్ర వచ్చి ఆపుతాడు. సైదులు తప్పించుకుంటాడు. ఈ రుద్ర మళ్ళీ ఎందుకు వచ్చాడని వీరు డిజప్పాయింట్ అవుతాడు. గంగ భయపడుతూ శకుంతల దగ్గరికి వెళ్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Jayam serial : బాక్సింగ్ పోటీలో మిస్సెస్ గంగ రుద్ర ప్రతాప్.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -160 లో..... గంగని ఎలాగైనా అకాడమీ సెలక్షన్ కి వెళ్లకుండా ఆపాలని ఇషిక, వీరు ట్రై చేస్తారు కానీ గంగ, రుద్ర ఇద్దరు కలిసి ఇంట్లో అన్ని పనులు పూర్తి చేసి అకాడమీకి వెళ్తారు. రుద్ర అకాడమీ బయటే ఉంటాడు. నాకు సంబంధించిన కేసు ఇంకా పెండింగ్ లో ఉంది అలా ఉండగా.. నేను లోపలకు రాకూడదని రుద్ర బయటే ఉండి గంగకి అంతా వివరిస్తాడు. నేను నీ పేరు మైక్ లో రావడం వినాలని రుద్ర అంటాడు. గంగ లోపలకు వెళ్తుంది. అక్కడ పారు ఇంకా తన ఫ్రెండ్స్ కలిసి గంగని చులకనగా మాట్లాడుతారు.

Brahmamudi : రుద్రాణిని రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన కనకం!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -922 లో.. ఒకతను వచ్చి రుద్రాణికి మళ్ళీ పసరు మందు ఇస్తాడు. ఆ పసరు మందు పని చేస్తుందా లేదా అని రుద్రాణి అతన్ని అడుగుతుంది. పని చేస్తుందని అతను చెప్తాడు. దాంతో రుద్రాణి పసరు మందు తీసుకొని లోపలికి వెళ్తుంటే అప్పుడే కనకం ఎదురుపడుతుంది. కనకాన్ని చూసి రుద్రాణి టెన్షన్ పడుతుంది. చేతిలో అదేంటీ అని కనకం అనగానే ఇదా.... నాకే పసరు మందు అజీర్తికి వాడమని చెప్పారని చెప్పి రుద్రాణి వెళ్ళిపోతుంది. అలా అయితే ఇంత రాత్రివేళ తీసుకొని వెళ్తుంది ఏంటని కనకంకి డౌట్ వస్తుంది.