English | Telugu

'జబర్దస్త్' భజన.. మామూలుగా లేదుగా!

బుల్లితెరపై 'జబర్దస్త్' షోకి ప్రత్యేకమైన స్థానం ఉంది. తెలుగులో నెంబర్ వన్ కామెడీ షోగా దూసుకుపోతోంది. గత ఎనిమిదేళ్లుగా ప్రసారమవుతోన్న ఈ షోకి ప్రేక్షకాదరణ రోజురోజుకి పెరుగుతోంది. అయితే కొన్నిసార్లు మల్లెమాల, జబర్దస్త్ షోల మీద జనాల్లో వ్యతిరేకత వచ్చింది. ఆర్టిస్ట్ లను అగ్రిమెంట్ పేరుతో బంధిస్తున్నారని.. ముఖ్యంగా అవినాష్ విషయంలో మల్లెమాలపై నెగెటివిటీ క్రియేట్ అయింది. బిగ్ బాస్ షోకి వెళ్లడానికి అవినాష్ ని మల్లెమాల సంస్థ అనుమతించలేదని.. అగ్రిమెంట్ క్యాన్సిల్ చేసుకోవడానికి పది లక్షల రూపాయలు కట్టించుకున్నారని అవినాష్ స్వయంగా బిగ్ బాస్ హౌస్ లో చెప్పాడు.

దీంతో 'జబర్దస్త్' షోపై నెగెటివ్ కామెంట్స్ వినిపించాయి. దీంతో మల్లెమాల సంస్థ 'జబర్దస్త్' ఇమేజ్ ని పెంచే పనిలో పడింది. స్పెషల్ ఈవెంట్స్ లో 'జబర్దస్త్' షో గొప్పదనం గురించి చెబుతున్నారు. నిజానికి ఈ షో చాలా మందికి లైఫ్ ఇచ్చింది. కానీ అందులో నియంతృత్వ పోకడలున్నాయంటూ విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. నాగబాబు సైతం 'జబర్దస్త్' షోని వదిలేస్తూ నెగెటివ్ కామెంట్స్ చేశారు. ఇదిలా ఉండగా.. వచ్చేవారం ప్రసారం కాబోతున్న ఎక్స్ ట్రా జబర్దస్త్ షోలో రాకింగ్ రాకేశ్‌.. బండ్ల గణేష్ అవతారమెత్తి 'జబర్దస్త్' పై తన భక్తిని చాటుకున్నాడు.

ఈ షో ఒక అద్భుతమని.. ఎందరికో జీవితాలను ప్రసాదించిందని తెగ పొగిడేశాడు. అనంతరం జడ్జ్ మనో.. "కొన్ని కోట్ల మంది ఈ షో వలన రిలాక్స్ అవుతున్నారనేది పచ్చి నిజం" అంటూ కామెంట్ చేశాడు. 'జబర్దస్త్ లేకపోతే ఇక్కడ ఎవరం ఉండేవాళ్లం కాదని' హైపర్ ఆది అన్నాడు. "ఈరోజు మాతో పాటు మా కుటుంబాలన్నీ హ్యాపీగా ఉన్నాయంటే కారణం జబర్దస్త్" అని సుధీర్ అన్నారు. ఇలా ఒక్కొక్కరు 'జబర్దస్త్'పై పాజిటివ్ కామెంట్స్ చేస్తుండగా.. 'కేజీఎఫ్' బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ వేసి వారి మాటలను మరింత ఎలివేట్ చేసే ప్రయత్నం చేశారు.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.