English | Telugu

Illu illalu pillalu : శ్రీవల్లి బంఢారం బయటపడుతుందా.. కామాక్షి నిజం చెప్తుందా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -236 లో..... ప్రేమ, నర్మద చేసిన పనికి భాగ్యం ఆనందరావుని భయపెట్టి శ్రీవల్లి చేత బీరువా తాళాలు రామరాజుకి ఇచ్చేలా చేస్తారు. నా కూతురు చిన్నపిల్ల తనకి ఇప్పుడే ఇంటి పెత్తనం ఎందుకని భాగ్యం అంటుంది. అత్తయ్య గారు తాళాలు తీసుకోండి అని శ్రీవల్లి అంటుంది.

ఎందుకు అక్క మీరే ఉంచుకోండి మీరు అయితేనే ఇంటిని సమర్థవంతగా నడిపిస్తారని నర్మద అంటుంది. అదంతా ఏం కాదని తాళాలు రామరాజుకి ఇస్తుంది శ్రీవల్లి. ఆ తర్వాత ఆ తాళాలని వేదవతికి ఇస్తాడు రామరాజు. అందరు హ్యాపీగా ఫీల్ అవుతారు. ఆ తర్వాత శ్రీవల్లి దగ్గరికి చందు వచ్చి.. నాకు డబ్బు కావాలి. మీ వాళ్ళని అడుగమని చందు అంటుంటే.. ఈ రోజు నా పుట్టినరోజు అది పట్టించుకోకుండా బాధపెడుతున్నారని శ్రీవల్లి యాక్టింగ్ చేస్తుంది. మరొకవైపు గోల్డ్ షాప్ కి శ్రీవల్లి ఇచ్చిన గోల్డ్ తీసుకొని వెళ్తుంది కామాక్షి. ఆ గోల్డ్ చూసి షాప్ అతను రోల్డ్ గోల్డ్ అని చెప్తాడు.

ఆ తర్వాత భాగ్యం దగ్గకి శ్రీవల్లి వచ్చి అయన డబ్బు అడుగుతున్నాడు. నాకు టెన్షన్ గా ఉందని చెప్తుంది. అప్పుడే కామాక్షి కోపంగా ఇంట్లోకి వచ్చి శ్రీవల్లిని పిలుస్తుంది. కామాక్షిని శ్రీవల్లి గదిలోకి తీసుకొని వెళ్తుంది. రోల్డ్ గోల్డ్ ఇచ్చి నన్ను మోసం చేస్తావా.. ఇప్పుడే ఈ విషయం నాన్న కి చెప్తానని బయటకు వస్తుంటే భాగ్యం ఆపుతుంది. అదంతా ప్రేమ, నర్మద చూస్తుంటారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Jayam serial : బాక్సింగ్ పోటీలో మిస్సెస్ గంగ రుద్ర ప్రతాప్.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -160 లో..... గంగని ఎలాగైనా అకాడమీ సెలక్షన్ కి వెళ్లకుండా ఆపాలని ఇషిక, వీరు ట్రై చేస్తారు కానీ గంగ, రుద్ర ఇద్దరు కలిసి ఇంట్లో అన్ని పనులు పూర్తి చేసి అకాడమీకి వెళ్తారు. రుద్ర అకాడమీ బయటే ఉంటాడు. నాకు సంబంధించిన కేసు ఇంకా పెండింగ్ లో ఉంది అలా ఉండగా.. నేను లోపలకు రాకూడదని రుద్ర బయటే ఉండి గంగకి అంతా వివరిస్తాడు. నేను నీ పేరు మైక్ లో రావడం వినాలని రుద్ర అంటాడు. గంగ లోపలకు వెళ్తుంది. అక్కడ పారు ఇంకా తన ఫ్రెండ్స్ కలిసి గంగని చులకనగా మాట్లాడుతారు.

Brahmamudi : రుద్రాణిని రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన కనకం!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -922 లో.. ఒకతను వచ్చి రుద్రాణికి మళ్ళీ పసరు మందు ఇస్తాడు. ఆ పసరు మందు పని చేస్తుందా లేదా అని రుద్రాణి అతన్ని అడుగుతుంది. పని చేస్తుందని అతను చెప్తాడు. దాంతో రుద్రాణి పసరు మందు తీసుకొని లోపలికి వెళ్తుంటే అప్పుడే కనకం ఎదురుపడుతుంది. కనకాన్ని చూసి రుద్రాణి టెన్షన్ పడుతుంది. చేతిలో అదేంటీ అని కనకం అనగానే ఇదా.... నాకే పసరు మందు అజీర్తికి వాడమని చెప్పారని చెప్పి రుద్రాణి వెళ్ళిపోతుంది. అలా అయితే ఇంత రాత్రివేళ తీసుకొని వెళ్తుంది ఏంటని కనకంకి డౌట్ వస్తుంది.