English | Telugu

ఇండియన్ ఐడల్ సీజన్ 2 కర్టెన్ రైజర్..హోస్ట్ గా హేమచంద్ర, లేడీ జడ్జిగా గీతామాధురి

ఇండియన్ ఐడల్ సీజన్ 1 ఆహా ఓటిటి వేదిక మీద దుమ్మురేపింది. ఇక ఇప్పుడు తెలుగు సంగీత ప్రేక్షకులను అలరించడానికి సీజన్ 2 రాబోతోంది. దీనికి సంబంధించి లేటెస్ట్ గా కర్టెన్ రైజర్ప్రోగ్రాం జరిగింది. ఈ కార్యక్రమానికి సీఈవో అజిత్‌ ఠాకూర్‌ వచ్చారు. ఇక ఈ షో సెట్ కూడా చూపించారు. ఇక అజిత్ ఠాకూర్ మాట్లాడుతూ "రీసెంట్ గానే అన్ స్టాపబుల్ సీజన్ 2 పూర్తయ్యింది. నిజం చెప్పాలంటే ఎక్కడికి వెళ్లినా జై బాలయ్య అనే నినాదాలు వినిపిస్తున్నాయి. బాలకృష్ణ గారు థాంక్యూ సో మచ్.

త్వరలో ఆహా యాప్ ని మలయాళం, కన్నడలో కూడా లాంఛ్ చేయబోతున్నాం." అని చెప్పారు. ఇక సీజన్ 2 హోస్ట్ గా హేమచంద్ర ఎంట్రీ ఇచ్చారు. "తెలుగు ఆడియన్స్ తో అతనికున్న దోస్తీ, పాటలతో అందరిని ఫిదా చేసే స్వరం అతని ఆస్తి" అంటూ ఆహా ఒక కాప్షన్ పెట్టి సోషల్ మీడియాలో రిలీజ్ చేసింది. జడ్జెస్ విషయానికి "ఎవరి పేరు చెప్తే స్పీకర్లు వూఫర్లు గడగడా వణుకుతాయో, ఆయనే మన మొదటి జడ్జ్" అంటూ తమన్ కి వెల్కమ్ చెప్పింది ఆహా. తర్వాత "ఎన్నో పాటలకి ప్రాణం పోసి మన హార్ట్స్ లో ఎప్పటికీ నిలిచిపోయే మెలోడీస్ ని మాస్ నంబర్స్ ని మనకి అందించిన కార్తీక్, మన సెకండ్ జడ్జ్" అని కాప్షన్ పెట్టి అతని ఫోటోని రిలీజ్ చేసింది. వీళ్ళతో పాటు గత సీజన్ లో లేడీ జడ్జిగా నిత్యా మీనన్ కనిపించింది.

ఇప్పుడు ఆమె ప్లేస్ లోకి గీతా మాధురి ఎంట్రీ ఇచ్చింది. "కమర్షియల్ సినిమా అయినా, లవ్ స్టోరీ అయినా, మాస్ బీట్ అయినా మెలోడీ అయినా, తన పాటలకి కనెక్ట్ అవ్వని వారుండరు" అని ఆహా ఆమెకు సంబంధించిన ఒక కాప్షన్ పెట్టి ట్విట్టర్ లో రిలీజ్ చేసింది. ఇక ఈ సీజన్ లో ఇద్దరు చేంజ్ అయ్యారు. ఈ సరికొత్త ప్యానల్ తో సరికొత్త ఫార్మాట్ తో ఆహా తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 2 త్వరలో ఆడియన్స్ ముందుకు రాబోతోంది.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.