English | Telugu

దేవుడు అమ్మానాన్నను మళ్ళీ పంపిస్తే వాళ్లకు అన్నం కలిపి పెడతా...

సోషల్ మీడియాలో గంగవ్వకి ఒక స్పెషల్ ప్లేస్ ఉంది. ఆమె గురించి తెలియని ఆడియన్స్ రెండు తెలుగు రాష్ట్రాల్లో లేరు. మై విలేజ్ షో ద్వారా గంగవ్వ ఫుల్ ఫేమస్ అయ్యింది. అలాగే ఎన్నో మూవీస్ లో నటించింది. బిగ్ బాస్ హౌస్ కి వెళ్ళింది. అలాంటి గంగవ్వ రీసెంట్ గా ఒక ఒక ఇంటర్వ్యూకి వచ్చింది. అందులో పాపం తన బాధలు చెప్పుకుని కన్నీళ్లు పెట్టుకుంది. ఐతేే ఈ ఇంటర్వ్యూలో హోస్ట్ ఎంతమంది పిల్లలు గంగవ్వా నీకు అని అడిగేసరికి "నాకు ముగ్గురు అమ్మాయిలు ఇద్దరు అబ్బాయిలు. అందులో ఒక అమ్మాయి తొమ్మిదేళ్ల వయసున్నప్పుడే ఫైట్స్ వచ్చి చనిపోయింది. ఒక అబ్బాయి కూడా చనిపోయాడు.

నేను ఈ వయసులో బిగ్ బాస్ కి వెళ్లడం సినిమాలు చేయడం చూస్తున్న నా ఫ్రెండ్స్ కు కడుపు ఉడికిపోతోంది. నాకు చదువన్నదే తెలీదు. ఇక సినిమాలకు వాటికి సంతకం పెట్టాలంటే ఇలా పెడతా. అది వాళ్లకు అర్ధమవుతుంది. మా అమ్మ నాన్న చిన్నప్పుడే చనిపోయారు." అని చెప్పింది. "ఒక వేళా దేవుడు ప్రత్యక్షమై మీ అమ్మను నాన్నను మళ్ళీ కిందకి పంపిస్తానంటే ఎం చేస్తావ్" అని హోస్ట్ గంగవ్వని అడిగింది. "అమ్మ నన్ను వదిలేసి ఎందుకు వెళ్ళిపోయావు అని అడుగుతా. నాకు మా అమ్మకు, నాన్నకు ప్రేమగా అన్నం కలిపి పెట్టాలనిపిస్తోంది. కానీ అలా వస్తారా..రారు కదా" అని చెప్తూ అందరినీ ఏడిపించేసింది. ఇక గంగవ్వ తన సంతకం ఎలా ఉంటుందో చేసి చూపించింది. అందరి సంతకాలు వేరుగా ఉంటాయి తన సంతకం వేరుగా ఉంటది కదా ఎవరైనా గుర్తుపడతారు అని చెప్పింది గంగవ్వ. అలాగే చిన్న గౌన్ వేసుకున్న వర్ష ఫోటో ఛీ యాక్ అనేసింది.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.