English | Telugu
శ్రీశైలం వెళ్ళడానికి దుగ్గిరాల ఫ్యామిలీ రెడీ!
Updated : Jul 2, 2023
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -137 లో... రాజ్ మూలిక కలిపిన పాలు తాగి కావ్య దగ్గరికి వస్తాడు. రాజ్ మత్తులో కావ్య దగ్గరికి వస్తుంటే తనకి భయమేస్తుంది. నన్నేం చేయకండని అరుస్తుంది. అరవకు అంటూ రాజ్ అంటాడు. కాసేపటికి కావ్య ఒళ్ళో రాజ్ పడుకుంటాడు. కావ్య, రాజ్ తో పరిచయం అయినప్పటి నుండి జరిగిన సంఘటనలు గుర్తు చేసుకుంటుంది. మీరు ఇలా మత్తులో కాకుండా ప్రేమతో ఎప్పుడు దగ్గరికి వస్తారో అని ఎదురు చూస్తున్నా అని కావ్య అనుకుంటుంది.
మరొక వైపు కృష్ణమూర్తి పడుకుని ఉండగా కనకం వచ్చి కృష్ణమూర్తి కాళ్ళు పట్టుకుంటుంది. నన్ను క్షమించండి అని కనకం అంటుంది. తప్పుల మీద తప్పులు చేస్తూనే ఉన్నావ్. నిన్ను ఎలా క్షేమించేది. నిలువ నీడ లేకుండా చేసావ్ కదా. చిన్నప్పటి నుండి అప్పు తనకు కావలిసినవి తనే కొనుక్కుంది. ఎలాగూ ఇద్దరు కూతుళ్ల పెళ్లిళ్లు మన చేతులు మీదుగా జరుగలేదు. కనీసం అప్పు పెళ్లి అయిన ఈ ఇల్లు అమ్మి మంచి వాడిని చూసి నా చేతుల మీదుగా చేద్దామని అనుకున్నా.. ఈ ఇల్లు కూడా లేకుండా చేసావ్ కదా అని కృష్ణమూర్తి అంటాడు. నేను చేసింది తప్పే కానీ అప్పుడున్న పరిస్థితిలో అలా చేయవలిసి వచ్చింది. కానీ ఆ సేటు మన ఇల్లు అన్యాయంగా తీసుకుంటాడని ఇలా చేశానని కనకం చెప్తుంది. కనకం, కృష్ణమూర్తి మాట్లాడుకున్న మాటలు అన్నీ అప్పు వింటుంది. ఎలాగైనా నాన్నకి సహాయంగా ఉండాలని అప్పు అనుకుంటుంది.
మరొక వైపు దుగ్గిరాల ఫ్యామిలీ అంతా శ్రీశైలం వెళ్ళాలని అనుకుంటుంది. అందరూ రెడీ అయి హాల్లోకి వస్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి వెళ్లడానికి అన్ని ఏర్పాట్లు చేసినట్టుగా చెప్తాడు. ఆ తర్వాత స్వప్న అందంగా రెడీ అయి రాహుల్ దగ్గరికి వస్తుంది. ఇప్పుడు అందరూ నా గురించి మాట్లాడుకుంటారని రాహుల్ తో అంటుంది. రాహుల్, స్వప్న ఇద్దరు హాల్లో కి వస్తారు. కానీ స్వప్నని ఎవరు పట్టించుకోకుపోవడంతో.. చూసావా కావ్య అందరిని తన వైపు తిప్పుకుంది. ఎవరు నీ గురించి మాట్లాడడం లేదని స్వప్నతో రాహుల్ అంటాడు..
మరొక వైపు కళ్యాణ్ కి అప్పు ఫోన్ చేసి ప్రాక్టీస్ కి రమ్మంటుంది. ఈ రోజు రావట్లేదని కళ్యాణ్ చెప్తాడు. మరొక వైపు రాజ్ నిద్ర లేచేసరికి కావ్య ఒళ్ళో ఉండడం చూసి ఏమైంది అంటూ టెన్షన్ పడుతూ అడుగుతాడు. కావ్య కావాలనే రాజ్ ని ఆటపట్టిస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.