English | Telugu

Brahamamudi: రుద్రాణి వేసిన ప్లాన్ లో మళ్ళీ బలైన కావ్య!


స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -804 లో..... కావ్యని రాజ్ పక్కకి పిలిచి మాట్లాడతాడు. మీరు అంటే నాకు చాలా ఇష్టమని రాజ్ అనగానే.. మీకు ఎన్ని సార్లు చెప్పాలి.. మీరంటే నాకు ఇష్టం లేదని మళ్ళీ మళ్ళీ ఇబ్బంది పెడుతున్నారు ప్లీజ్ నన్ను ఇలా వదిలెయ్యండి.లేదంటే నేనే ఎక్కడికైనా దూరంగా వెళ్ళపోతానని కావ్య అనగానే.. అయ్యో మీరు ఎందుకు వెళ్లడం నేనే వెళ్ళిపోతానని రాజ్ అక్కడ నుండి వెళ్ళిపోతాడు.

మరొకవైపు అప్పు కళ్ళు తిరిగి పడిపోతుంది. అప్పుడే కావ్య వచ్చి ఏమైందని అడుగుతుంది. వెంటనే డాక్టర్ ని పిలుస్తారు. డాక్టర్ వచ్చి అప్పుని చెక్ చేసి.. ఏం తిన్నావని అడుగుతుంది. ఇడ్లీ తిని ఆ టాబ్లెట్ వేసుకున్నానని చెప్పగానే డాక్టర్ ఆ టాబ్లెట్ చూసి ఎక్స్ పైరి డేట్ అయిపోయిందని డాక్టర్ చెప్తుంది. అదే విషయం డాక్టర్ బయటకు వచ్చి అందరికి చెప్తుంది. ప్రాబ్లమ్ ఏం లేదు అనీ డాక్టర్ చెప్పి వెళ్ళిపోతుంది. ఇలా చేసావేంటి కావ్య అని కావ్యని అంటుంది రుద్రాణి. ఆ ట్యాబ్లెట్ వేసుకుంది అప్పు.. కావ్యని అంటావేంటని రుద్రాణిని అడుగుతుంది ఇందిరాదేవి. అంటే అప్పుకి ఆ ట్యాబ్లెట్ ఇచ్చింది కావ్య అని రుద్రాణి అనగానే నిజమేనా అని కావ్యని ధాన్యలక్ష్మి అడుగుతుంది. అవునని కావ్య అనగానే నీ బుద్ది ఇప్పుడు బయటపడింది.

నువ్వు ప్రెగ్నెంట్ కాలేదని కుళ్ళుగా ఉన్నావ్.. నువు ఒక గొడ్రాలివి అని కావ్యని తిడుతుంది ధాన్యలక్ష్మి. అది భరించలేక కావ్య ఏడుస్తూ అక్కడ నుండి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత ఇంకొకమాట మాట్లాడకు ధాన్యలక్ష్మి.. నీ కోడలు కంటే ముందే కావ్య ప్రెగ్నెంట్ కానీ ఆ విషయం రాజ్ కి ఎలా చెప్పాలని చెప్పలేక అలా మనసులో దాచుకుందని కనకం చెప్పగానే అందరూ షాక్ అవుతారు. కావ్యని ఎన్ని మాటలు అన్నావని ధాన్యలక్ష్మిపై ప్రకాష్ కోప్పడతాడు. అవునండి వెళ్లి సారీ చెప్పాలని ధాన్యలక్ష్మి కావ్య దగ్గరికి వెళ్తుంది.ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Jayam serial : బాక్సింగ్ పోటీలో మిస్సెస్ గంగ రుద్ర ప్రతాప్.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -160 లో..... గంగని ఎలాగైనా అకాడమీ సెలక్షన్ కి వెళ్లకుండా ఆపాలని ఇషిక, వీరు ట్రై చేస్తారు కానీ గంగ, రుద్ర ఇద్దరు కలిసి ఇంట్లో అన్ని పనులు పూర్తి చేసి అకాడమీకి వెళ్తారు. రుద్ర అకాడమీ బయటే ఉంటాడు. నాకు సంబంధించిన కేసు ఇంకా పెండింగ్ లో ఉంది అలా ఉండగా.. నేను లోపలకు రాకూడదని రుద్ర బయటే ఉండి గంగకి అంతా వివరిస్తాడు. నేను నీ పేరు మైక్ లో రావడం వినాలని రుద్ర అంటాడు. గంగ లోపలకు వెళ్తుంది. అక్కడ పారు ఇంకా తన ఫ్రెండ్స్ కలిసి గంగని చులకనగా మాట్లాడుతారు.

Brahmamudi : రుద్రాణిని రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన కనకం!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -922 లో.. ఒకతను వచ్చి రుద్రాణికి మళ్ళీ పసరు మందు ఇస్తాడు. ఆ పసరు మందు పని చేస్తుందా లేదా అని రుద్రాణి అతన్ని అడుగుతుంది. పని చేస్తుందని అతను చెప్తాడు. దాంతో రుద్రాణి పసరు మందు తీసుకొని లోపలికి వెళ్తుంటే అప్పుడే కనకం ఎదురుపడుతుంది. కనకాన్ని చూసి రుద్రాణి టెన్షన్ పడుతుంది. చేతిలో అదేంటీ అని కనకం అనగానే ఇదా.... నాకే పసరు మందు అజీర్తికి వాడమని చెప్పారని చెప్పి రుద్రాణి వెళ్ళిపోతుంది. అలా అయితే ఇంత రాత్రివేళ తీసుకొని వెళ్తుంది ఏంటని కనకంకి డౌట్ వస్తుంది.