English | Telugu
Brahmamudi : బిజినెస్ పనిమీద అమెరికాకి కావ్య, రాజ్.. ఆస్తులన్నీ దోచుకున్నారంటూ రుద్రాణి గొడవ!
Updated : Jan 31, 2025
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -633 లో....కావ్య వేసిన డిజైన్స్ బాగున్నాయని రాజ్ మెచ్చుకుంటాడు. ఇప్పుడు ఈ డిజైన్ ఎలా చేస్తానో చూడమని ఒకతనికి కాల్ చేసి డిజైన్ పంపిస్తాడు. అక్కడ వేళంపాట జరుగుతుంది. ఈ డిజైన్ వాళ్ళకి చూపించి.. ఇది స్వరాజ్ గ్రూప్ ఇండస్ట్రీస్ నుండి వచ్చింది ఒకటే పీస్ అని అక్కడున్నా వాళ్ళకి చెప్తాడు. అందరు పోటీ పడి మరి ఈ డిజైన్ కి వేళం పాడతారు. అదంతా రాజ్ కావ్య ఫోన్ లో వింటూ ఉంటారు. ఆ డిజైన్ కోటిన్నరకి అమ్ముడుపోతుంది. చూసావా దాని కాస్ట్ ఇరవై అయిదు లక్షలు కానీ ఎంతకీ ప్రమోట్ చేసానో చూసావా.. ఇది బిసినెస్ అంటే.. ఇప్పుడు చెప్పు డిజైనర్ గొప్పనా బిజినెస్ మ్యాన్ గొప్పనా అని రాజ్ అనగానే.. మీరే గొప్ప అని ఒప్పుకుంటున్నానని కావ్య అంటుంది.
స్వప్నకి రెంట్ డబ్బులు రెండు లక్షలు వస్తాయి. ఆ విషయం రుద్రాణి, రాహుల్ లకి తెలిసి మాకు డబ్బు కావాలి ఇవ్వమని అడుగుతారు. ఇవ్వనని స్వప్న చెప్పడంతో దీని అకౌంట్ లోని డబ్బు నా అకౌంట్ లోకి ఎలా రప్పించుకోవాలో నాకు తెలుసని రుద్రాణితో రాహుల్ అంటాడు. రాహుల్ తెలివిగా స్వప్న ఫోన్ కి ఒక లింక్ పంపిస్తాడు. అది ఓపెన్ చెయ్యగానే మన అకౌంట్ లోకి డబ్బు వస్తుందని రాహుల్ అంటాడు. అనుకున్నట్లుగానే స్వప్న లింక్ క్లిక్ చెయ్యగానే తన డబ్బు మొత్తం రాహుల్ అకౌంట్ లోకి పడిపోతుంది. అది చూసుకొని అయ్యో డబ్బు ఎలా మా అయిందని స్వప్న కంగారుగా రాహుల్, రుద్రాణి దగ్గరికి వచ్చి నా అకౌంట్ లో డబ్బుపోయింది అంటుంది. అందుకే అన్ని లింక్స్ ఓపెన్ చెయ్యొద్దని రాహుల్ అంటాడు. నేను లింక్ ఓపెన్ చేసినట్లు తనకేల తెలుసు.. రాహుల్ ఈ పని చేసి డబ్బు లేకుండా చేసాడని స్వప్న అనుకుంటుంది. రాజ్ దగ్గరికి తన ఫ్రెండ్ వస్తాడు. మీరు వేసిన డిజైన్స్ వాళ్లకి బాగా నచ్చాయి. అందుకే అమెరికాలో మీటింగ్ ఏర్పాటు చేసాను. నువ్వు కావ్య వెళ్ళాల్సి ఉంటుందని అతను చెప్పగానే అమెరికానా అంటూ కావ్య హ్యాపీగా ఫీల్ అవుతుంది.
తనని మోసం చేసి డబ్బు తీసుకున్నారని స్వప్నకి అర్థమవుతుంది. రాహుల్ మళ్ళీ తన ఫ్రెండ్ దగ్గర డబ్బు అడిగానని రుద్రాణికి చెప్తాడు. రుద్రాణి దగ్గరికి రాహుల్ వచ్చి.. నాకు ఒక యాభై వేలు కావాలని అంటుంది. లేవు ఇందాక మేము అడిగితే ఇచ్చావా అని రుద్రాణి అంటుంది. దాంతో నన్నే మోసం చేస్తారా అంటూ తను కూడా ఒక లింక్ రాహుల్ కి పంపిస్తుంద. అది రాహుల్ క్లిక్ చెయ్యగానే తన డబ్బు మొత్తం స్వప్న అకౌంట్ లోకి వస్తుంది. ఎందుకు అలా చేసావ్ రా దాని డబ్బుతో పాటు మన డబ్బు కూడా పోయిందని రాహుల్ తో రుద్రాణి అంటుంది. స్కామార్స్ ఉంటారు కదా చూసుకోవాలి కదా అంటూ స్వప్న అనగానే.. ఈ పని చేసింది స్వప్ననే అని వాళ్ళకి అర్ధమవుతుంది. తరువాయి భాగంలో రాజ్ వీసా గురించి ఫోన్ లో మాట్లాడడం విన్న రుద్రాణి... అందరి ముందుకి వచ్చి ఆస్తులు తాకట్టు పెట్టి మరి అమెరికాకి వెళ్లి సెటిల్ అవ్వాలనుకుంటున్నారని చెప్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.