English | Telugu

ట్రెండింగ్ లో బిగ్ బాస్ నామినేషన్స్ ప్రోమో.. దామిణి వర్సెస్ యావర్!

బిగ్ బాస్ సీజన్-7 ఇప్పటికే రెండు వారాలు పూర్తి చేసుకుంది. మొదటి వారం కిరణ్ రాథోడ్ ఎలిమినేషన్ అయింది. రెండవ వారం షకీల ఎలిమినేట్ అయింది. ‌కాగా ఇప్పుడు హౌజ్ లో పన్నెండు మంది కంటెస్టెంట్స్ ఉన్నారు. సోమవారం రోజున జరిగే నామినేషన్లకి ఒక క్రేజ్ ఉంటుంది. ఈ ప్రోమో ఇప్పుడు ఫుల్ ట్రెండింగ్ లో ఉంది.

నామినేషన్లు ఒక పొలిటికల్ పార్టీకి మరొక పొలిటికల్ పార్టీకి మధ్య మాటల యుద్ధంలా జరుగుతుంటాయి. కాగా ఈ నామినేషన్లో ప్రియాంక జైన్ కొత్తగా జాయిన్ అయింది. గత రెండు వారాల్లో ఒక్కసారి కూడా నామినేషన్ కానీ శుభశ్రీ రాయగురు, ప్రియాంక జైన్ మూడవ వారం నామినేషన్లో ఉన్నారు‌. ఇక ఆట సందీప్, శివాజీ ఇద్దరు పవరస్త్రని సాధించారు కాబట్టి వారు నామినేషన్లో ఉండరు. మిగిలిన పది మందిలో ఏడుగురు నామినేషన్లో ఉన్నట్లుగా తెలుస్తోంది. యావర్ కి దామిణికి మధ్య మాటల యుద్ధం జరినట్టుగా ఉంది. ఇక శుభశ్రీని అమర్ దీప్ నామినేట్ చేసి.. అసలు ఏనాడైన హౌజ్ లో ఊడ్చావా అంటూ నిలదీశాడు. ఇక అందరు రతికని టార్గెట్ చేసినట్టు తెలుస్తుంది.

ప్రియాంక జైన్, శుభశ్రీ రాయగురు, దామిణి, అమర్ దీప్,‌ ప్రిన్స్ యావర్, టేస్టీ తేజ, గౌతమ్ కృష్ణ, రతిక నామినేషన్లో ఉన్నట్టుగా తాజాగా రిలీజైన ప్రోమోలో తెలుస్తోంది. మరి వీరిలో ఎవరు నామినేట్ అయ్యారు? ఎవరు కాలేదో తెలియాలంటే ఫుల్ ఎపిసోడ్‌ వరకు ఆగాల్సిందే. అయితే ఇప్పటికైతే టేస్టీ తేజ, శోభా శెట్టి, ప్రియాంక జైన్ వీక్ కంటెస్టెంట్ అని తెలుస్తుంది. కాగా ఈ సారి పల్లవి ప్రశాంత్ సేఫ్ లో ఉన్నాడు. అతడిని ఎవరు నామినేట్ చేయలేదని తెలుస్తుంది. అయితే అమర్ దీప్ కి నెగటివ్ కామెంట్స్, ట్రోల్స్ రోజు రోజుకి పెరుగుతున్నాయి. మరి మూడవ వారం బిగ్ బాస్ హౌజ్ లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ కూడా ఉంటుందనే వార్త నెట్టింట చక్కర్లు కొడుతుంది. ఉల్టా పల్టాతో సాగుతున్న ఈ సీజన్ లో మూడవ వారం ఎలా ఉంటుందో చూడాలి మరి!

Jayam serial : బాక్సింగ్ పోటీలో మిస్సెస్ గంగ రుద్ర ప్రతాప్.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -160 లో..... గంగని ఎలాగైనా అకాడమీ సెలక్షన్ కి వెళ్లకుండా ఆపాలని ఇషిక, వీరు ట్రై చేస్తారు కానీ గంగ, రుద్ర ఇద్దరు కలిసి ఇంట్లో అన్ని పనులు పూర్తి చేసి అకాడమీకి వెళ్తారు. రుద్ర అకాడమీ బయటే ఉంటాడు. నాకు సంబంధించిన కేసు ఇంకా పెండింగ్ లో ఉంది అలా ఉండగా.. నేను లోపలకు రాకూడదని రుద్ర బయటే ఉండి గంగకి అంతా వివరిస్తాడు. నేను నీ పేరు మైక్ లో రావడం వినాలని రుద్ర అంటాడు. గంగ లోపలకు వెళ్తుంది. అక్కడ పారు ఇంకా తన ఫ్రెండ్స్ కలిసి గంగని చులకనగా మాట్లాడుతారు.

Brahmamudi : రుద్రాణిని రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన కనకం!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -922 లో.. ఒకతను వచ్చి రుద్రాణికి మళ్ళీ పసరు మందు ఇస్తాడు. ఆ పసరు మందు పని చేస్తుందా లేదా అని రుద్రాణి అతన్ని అడుగుతుంది. పని చేస్తుందని అతను చెప్తాడు. దాంతో రుద్రాణి పసరు మందు తీసుకొని లోపలికి వెళ్తుంటే అప్పుడే కనకం ఎదురుపడుతుంది. కనకాన్ని చూసి రుద్రాణి టెన్షన్ పడుతుంది. చేతిలో అదేంటీ అని కనకం అనగానే ఇదా.... నాకే పసరు మందు అజీర్తికి వాడమని చెప్పారని చెప్పి రుద్రాణి వెళ్ళిపోతుంది. అలా అయితే ఇంత రాత్రివేళ తీసుకొని వెళ్తుంది ఏంటని కనకంకి డౌట్ వస్తుంది.