English | Telugu

బిగ్‌బాస్‌ సీజన్‌ 9 హోస్ట్‌గా బాలయ్య.. ఇదిగో క్లారిటీ!

నందమూరి బాలకృష్ణ తన సినిమాల్లో ఎంతటి పవర్‌ఫుల్‌ డైలాగ్స్‌ చెబుతారో, ప్రేక్షకుల్ని, అభిమానుల్ని ఎంతగా హుషారెక్కిస్తారో అందరికీ తెలిసిందే. అయితే గత కొన్నాళ్లుగా ఆహా ఓటీటీలో వస్తున్న ‘అన్‌స్టాపబుల్‌’ షో ద్వారా బాలయ్య ప్రేక్షకులకు ఎంత దగ్గరయ్యారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సినిమాల్లో ఫెరోషియస్‌గా కనిపించే బాలయ్య ఈ షోలో ఎంతో సరదాగా గెస్ట్‌లతో మాట్లాడడం, ఆడియన్స్‌ని ఎంటర్‌టైన్‌ చెయ్యడం మనం చూస్తున్నాం. ఇప్పటికే ఈ షోలో టాలీవుడ్‌ ప్రముఖులెంతో మంది పాల్గొన్నారు. ఇక బిగ్‌ బాస్‌ షో గురించి, దానికి ఉన్న క్రేజ్‌ గురించి అందరికీ తెలుసు. ఈ షో జరుగుతున్నన్ని రోజులూ అందరూ దీని గురించే మాట్లాడుకుంటారు, చర్చించుకుంటారు. అంతలా జనంలోకి వెళ్లిపోయిన ఈ షోకి సంబంధించిన సీజన్‌ 9ని నిర్వహించే బాధ్యతను బాలకృష్ణకు అప్పగిస్తున్నారని గత కొన్నిరోజులుగా వార్తలు వస్తున్నాయి. అన్‌స్టాపబుల్‌ను ఎంతో సమర్థవంతంగా హోస్ట్‌ చెయ్యడం వల్ల అతన్నే ఈసారి బిగ్‌బాస్‌ సీజన్‌ 9కి సెలెక్ట్‌ చేశారనే ప్రచారం జరిగింది. కానీ, ఆ వార్తలో నిజం లేదని తెలుస్తోంది. దీనికి సంబంధించి క్లారిటీ కూడా వచ్చేసింది.

బిగ్‌బాస్‌ సీజన్‌ 9 హోస్ట్‌గా బాలయ్య రాబోతున్నాడు అనే వార్తలో ఎలాంటి నిజం లేదని స్పష్టమవుతోంది. ఈ షో మొదటి సీజన్‌కు ఎన్టీఆర్‌ హోస్ట్‌గా వ్యవహరించారు. ఆ తర్వాతి సీజన్‌ను నాని చేశారు. మూడో సీజన్‌కి అక్కినేని నాగార్జునను సెలెక్ట్‌ చేశారు నిర్వాహకులు. ఇక అప్పటి నుంచి 8వ సీజన్‌ వరకు నాగార్జుననే కంటిన్యూ చేశారు. 9వ సీజన్‌కి కూడా ఆయనే ఉంటారని మొదట్లో అనుకున్నారు. అయితే నాగార్జున సినిమాలతో బిజీగా ఉన్నారని, అందుకే నిర్వాహకులు బాలయ్యను అప్రోచ్‌ అయ్యారని ప్రచారం జరిగింది. కానీ, అది వాస్తవం కాదు. సీజన్‌ 9 చేసేందుకు నాగార్జున ఓకే చెప్పారని తాజా సమాచారం. ఈ షో సెప్టెంబర్‌ నుంచి ప్రారంభం కానుంది. ప్రతి సీజన్‌ను కొత్తగా ప్రజెంట్‌ చేస్తుండడంతో బిగ్‌బాస్‌ షోపై ప్రేక్షకులు ఎంతో ఆసక్తి కనబరుస్తున్నారు. రాబోయే 9వ సీజన్‌ మరింత కొత్తగా ఉండబోతోందని తెలుస్తోంది. ఇక ఇప్పటివరకు ఈ సీజన్‌ను బాలయ్య చెయ్యబోతున్నారనే వార్తకు బ్రేక్‌ పడినట్టే.

Illu illalu pillalu : అమూల్యకి పెళ్ళిచూపులు.. కామాక్షి ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -362 లో.. పెళ్లిచూపులకి ఇంకా రావడం లేదని రామరాజు వాళ్ళు ఎదురుచూస్తుంటే వాళ్ళు రారుగా అని శ్రీవల్లి మనసులో అనుకుంటుంది. అప్పుడే అబ్బాయి వాళ్ళు పెళ్లిచూపులకు ఎంట్రీ ఇస్తారు‌. దాంతో శ్రీవల్లి షాక్ అవుతుంది. భాగ్యం, ఆనందరావు కూడా వస్తారు. వాళ్ళు ఏం జరిగిందో శ్రీవల్లికి చెప్తారు. వాళ్ళు చెప్పాల్సింది మొత్తం అబ్బాయి వాళ్ల నాన్నకి చెప్తారు కానీ అతనికి చెవులు వినిపించవు.. వాళ్ల అమ్మ కి చెప్పేలోపు అటువైపు గా ప్రేమ, ధీరజ్ వెళ్లడం చూసి మళ్ళీ చెప్పలేకపోయామని శ్రీవల్లికి భాగ్యం చెప్తుంది.