English | Telugu

మెడలోని తాళి తెగిపోవడంతో కృష్ణ కన్నీటి పర్యంతం.. పరిష్కారమేంటని భవాని ఆందోళన!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -224 లో.. కృష్ణ తలస్నానం చేసి వచ్చి మురారి ముందే తల తూడ్చూకుంటుంటే.. తన వైపు రొమాంటిక్ గా చూస్తాడు మురారి. ఏంటి ఏసీపీ సర్ అని కృష్ణ అడుగుతుంది. వాచ్ కోసం వచ్చానని మురారి చెప్తాడు. కాసేపు ఇద్దరి మధ్య చూపులు రొమాంటిక్ గా సాగుతుంటాయి. అంతలోనే డ్యూటీకి టైమ్ అవుతుందని ఇద్దరు గది బయటకు వచ్చేస్తారు.

మరొక వైపు ఇంట్లో అందరు డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని కృష్ణ, మురారి ల కోసం వెయిట్ చేస్తుంటారు.అప్పుడే వాళ్ళిద్దరు పై నుండి కిందకి వస్తారు. మురారి వాళ్ళతో కలిసి భోజనం చెయ్యడానికి కూర్చొని ఉంటాడు. కొన్ని రోజులు అయితే వీళ్ళకి సేవ చేసే అవకాశం ఉండదని కృష్ణ అనుకొని.. నేను మీకు వడ్డిస్తానని వాళ్ళకి టిఫిన్స్ వడ్డీస్తుంది. అయితే రవ్వ దోస అయిపోయిందన, ఫ్రిడ్జ్ లో పిండి ఉంది తీసుకొని రా అని కృష్ణని రేవతి పంపిస్తుంది. కృష్ణ పిండి తీసుకొని రావడానికి వెళ్తుంది. అయితే ఫ్రిడ్జ్ లో నుండి పిండి గిన్నె తీస్తుండగా.. బాటిల్ కి ,కృష్ణ మెడలోని మంగళసూత్రం చిక్కుకొని తెగిపోతుంది. అలా తెగిపోయిన మంగళసుత్రాన్ని చూసి కృష్ణ ఏడుస్తుంది.

అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు. అందరూ వచ్చి కిందపడిపోయిన పూసలని ఎరుతారు. వీళ్ళబంధం శాశ్వతం కాదు అందుకే ఇలా జరిగిందని ముకుంద తనలో తానే అనుకుంటుంది. కృష్ణ కూడా అలాగే ఆలోచిస్తుంది. నా కొడుకు కోడలి విషయంలో ఎందుకిలా జరుగుతుందని రేవతి బాధపడుతుంది. మీరు ఏం టెన్షన్ పడకండి సిద్ధాంతి గారికి ఫోన్ చేసి రమ్మని చెప్తానని సిద్ధాంతికి ఫోన్ చేసి ఇంటికి రమ్మని చెప్తుంది భవాని. మరొక వైపు అలా జరగడంతో కృష్ణ బాధపడుతు ఉండగా.. కృష్ణ ఏం తినలేదని మురారి జ్యూస్ తీసుకొని వచ్చి తనకి ఇస్తాడు. తను తాగదు, మురారి దగ్గరుండి తాగిస్తాడు.
ఆ తర్వాత కృష్ణని జోక్స్ చేస్తు నవ్విస్తాడు మురారి.

మరొక వైపు అందరూ హాల్లో ఉంటారు. అందరు రెండు, మూడు రోజులు ఎక్కడికి వెళ్ళకండని భవాని చెప్తుంది. సిద్ధాంతి గారు వచ్చాక ఏదైనా పూజకి సంబంధించినవి ఉంటే అన్ని ఏర్పాటు చేయమని రేవతికి భవాని చెప్తుంది. సిద్ధాంతి రాగానే రేవతి తప్ప అందరిని అక్కడ నుండి వెళ్ళిపోమంటుంది భవాని. జరిగిందంతా సిద్దాంతికి భవాని చెప్తుంది. ఈ మధ్య వాళ్ళు సంతోషంగా ఉండడం లేదు, వాళ్ళు సంతోషంగా ఉండటానికి ఏం చేయమని చెప్పినా చేస్తానని భవాని అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.