English | Telugu

ఢీ గ్రాండ్ ఫినాలేకి అనిల్ రావిపూడి...చిరు సాంగ్ కి ఇరగదీసే డాన్స్

ఇన్నాళ్లు అలరించిన ఢీ షో ఇప్పుడు గ్రాండ్ ఫినాలేకి వచ్చింది. ఆ షో ప్రోమో రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. ఈ షోకి డైరెక్టర్ అనిల్ రావిపూడి వచ్చారు. ఆయన మూవీస్ లో ఎంత ఎంటర్టైన్మెంట్ ఉంటుందో అందరికీ తెలిసిన విషయమే. అనిల్ రావిపూడి కూడా ఏ షోకి వచ్చిన అక్కడ నవ్వులు పూయిస్తారు. ఇక ఈ షోలో ఆది, అనిల్ ఇద్దరి కామెడీ డైలాగ్స్ వేరే లెవెల్ లో ఉన్నాయి. అనిల్ రావిపూడి ఎంట్రీ వెరైటీగా ఉంది. కుర్చీలో కూర్చుని పక్కన రెండు సింహాలను పెట్టుకుని స్టేజి మీదకు వచ్చారు.

ఈ దృశ్యాన్ని చూసిన ఆది కామెంట్ చేసాడు. "ఇంత గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చారు అంతా బాగుంది ఓకే...కానీ రెండు సింహాలతో ఎంట్రీ ఇచ్చారు. ఆ సింహానికి తెలిస్తే" అంటూ బాలయ్య పిక్ వేసేసరికి "చెప్తావా ఏంటి" అంటూ రివర్స్ డైలాగ్ వేసాడు అనిల్. దానికి కౌంటర్ గా "చూడడా ఏంటి" అన్నాడు ఆది. ఆ డైలాగ్ కి అనిల్ రావిపూడి తల వాల్చేసాడు. ఆ సీన్ చూసి శేఖర్ మాష్టర్ కిలకిలా నవ్వాడు. ఇక ఈ ఢీ ఫైనల్స్ కి ఆదర్శ్, వర్షిణి, శ్వేతా నాయుడు వచ్చారు. వీళ్ళ పెర్ఫార్మెన్సెస్ మాములుగా లేవు. ఇంతకు గెలిచింది ఎవరు... టైటిల్ విన్ అయ్యింది ఎవరు అనేది ప్రస్తుతానికి సస్పెన్స్. ఈ షోలో అనిల్ రావిపూడి- శేఖర్ మాష్టర్ ఇద్దరూ కలిసి చిరంజీవి సాంగ్ కి డాన్స్ చేశారు. విన్నర్ ఎవరు అన్న టెన్షన్ లో అందరూ ఉండగా ఆది కామెడీ వేరే రేంజ్ లో ఉంది. " ఇంత టెన్షన్ లో అడగొచ్చో లేదో కానీ మియ్యావ్ మియ్యావ్ పిల్లి ఆ డైలాగ్ చెప్పవా" అనేసరికి "నాకు మైక్ మడత పెట్టు అనాలనుంది" అని రివర్స్ కౌంటర్ వేసాడు అనిల్ రావిపూడి..

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.