English | Telugu

కాశీ విశ్వనాథుడి సేవలో తరించిన రష్మీ గౌతమ్

బుల్లితెర మీద గత పదేళ్లుగా జబర్దస్త్ కి యాంకర్ గా చేస్తున్న రష్మీ గౌతమ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. మొదట్లో సుడిగాలి సుధీర్, రష్మీ కలిసి జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ షోస్ ని హోస్ట్ చేసేవాళ్లు. కానీ తర్వాత సుధీర్ మూవీస్ లో ఛాన్సెస్ రావడంతో వెళ్ళిపోయాడు. అలా ఈ రెండు షోస్ ని రష్మీ నిర్వహిస్తూ వస్తోంది. ఇక రీసెంట్ గా రష్మీకి కో-యాంకర్ గా మానస్ జతయ్యాడు. రష్మీ ఎప్పుడూ సోషల్ మీడియాలో చాల యాక్టివ్ గా ఉంటుంది. రీసెంట్ గా ఒక హెల్త్ ఇష్యూని కూడా ఫేస్ చేసింది. ట్రీట్మెంట్ చేయించుకుని వచ్చింది. దాంతో ఆమె కొంచెం తగ్గిపోయింది కూడా. అలాగే ఇప్పుడు కొన్ని పిక్స్ ని పోస్ట్ చేసింది. ఇప్పుడు ఆ పిక్స్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. ఆమె కాశి వెళ్లి అక్కడ దర్శనం చేసుకున్న పిక్స్ ని పోస్ట్ చేసింది. అలాగే "కాశీ మనుషులు నిర్మించిన నగరం కాదు.. ఇది దేవతలు కొలువై ఉండే నగరం, శివుని త్రిశూలం అంతా చూసుకుంటుంది.

కాశీ విశ్వనాథుని ఆధ్యాత్మిక విశ్వాసం " అంటూ హరహర మహాదేవ, హరహర గంగే, కాశీవిశ్వనాథ అంటూ హాష్ ట్యాగ్స్ పెట్టింది. నుదిటి మీద త్రిసూలం బొట్టుతో రష్మీ కొత్తగా అందంగా కనిపించింది ఈ పిక్స్ లో . ఇక నెటిజన్స్ ఐతే హరహరమహదేవా, చాలా బాగున్నారు, ఓం నమఃశివాయ, శివ శంభో, మంచిగా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాం..." అంటూ విష్ చేస్తున్నారు. ఇక జబర్దస్త్ కి మధ్యలో యాంకర్స్ గా సౌమ్య, సిరి హన్మంత్ వచ్చారు కానీ వాళ్ళు ఎక్కువ కాలం నిలబడలేకపోయారు. రష్మీ ఒక్కతే స్టాండర్డ్ గా ఆ షోకి ఫిక్స్ ఐపోయింది. అలాగే కొన్ని మూవీస్ లో కూడా నటించింది.

Brahmamudi: రాహుల్ మనిషిని పట్టుకున్న రాజ్, కావ్య.. ఇక దేత్తడి!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -905 లో....అప్పు పాప కేసు ఫైల్ చూస్తుంటే ఆఫీసర్ వస్తాడు. నీకు ఎన్నిసార్లు చెప్పాను వద్దని అయినా అలాగే చేస్తున్నావని కోప్పడతాడు. లేదు సర్ పాప చనిపోలేదు.. చనిపోయిన పాప వేరు.. ఆ పాప DNA తో మ్యాచ్ అవ్వడం లేదని రిపోర్ట్స్ చూపించగానే అవునా కేసులో ఒక కొత్త మలుపు తీసుకొని వచ్చావ్ గుడ్ కేరియాన్ అని ఆఫీసర్ అంటాడు. కాసేపటికి రేపు పాప వాళ్ళ ఫాదర్ ని స్టేషన్ కి రప్పించండి అని కానిస్టేబుల్ తో అప్పు చెప్తుంది. మరొకవైపు రాహుల్ అవార్డు ఫంక్షన్ కి రాజ్, కావ్య వెళ్తారు. అక్కడ రాహుల్ డిజైన్స్ చూసి రాజ్, కావ్య షాక్ అవుతారు.

Karthika Deepam2: జ్యోత్స్న చేసిన ఫ్రాడ్ చూసి కార్తీక్, శ్రీధర్ షాక్.. ఇంటి వారసురాలు కాదేమో!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -542 లో..... కార్తీక్, శ్రీధర్ జ్యోత్స్న రెస్టారెంట్ ఫుడ్ ట్రక్స్ బాగా పాపులర్ అయ్యాయని హ్యాపీగా ఉంటారు. ఇద్దరు బయట టీ తాగుతూ కబుర్లు చెప్పుకుంటారు. జ్యోత్స్న చాలా తప్పు డు లెక్కలు చూపించిందని శ్రీధర్ అనగానే ఎంత మొన్న కొన్న ల్యాండ్ గురించా అని  కార్తీక్ అడుగుతాడు. లేదు అది జస్ట్ శాంపిల్ మాత్రమే.... ఎంత అంటే అది చెప్తే శివన్నారాయణ గుండె పట్టుకొని పడిపోయేంత డబ్బులు ఫ్రాడ్ చేసిందని శ్రీధర్ అనగానే కార్తీక్ షాక్ అవుతాడు.