English | Telugu

‘నేను కచ్చితంగా వాళ్లకు సారీ చెప్పాలి’.. ఎమోషనల్ అయిన రష్మీ!

'శ్రీదేవి డ్రామా కంపెనీ' ఎప్పటిలానే కొత్త కొత్త కాన్సెప్ట్స్ తో రెడీ అయ్యింది. ఇందులో రష్మీ ఒక కొత్త ఐడియాతో ఎంట్రీ ఇచ్చింది. 'శ్రీదేవి డ్రామా కంపెనీ' స్టేజి మీద ఒక టేబిల్ వేసి దానికి ఒక 8 గాజు గ్లాసులు పెట్టి అందులో ఎల్లో, ఆరెంజ్ జ్యూస్ పోసింది. ఇక ఆ జ్యూస్‌లో లో ఒక సిల్వర్ కాయిన్, గోల్డ్ కాయిన్ వేసింది. ప్రతీ జ్యూస్ గ్లాస్‌లో ఈ కాయిన్స్ వేసింది. ఇక "ఈ జ్యూస్ తాగాక ఫైనల్‌గా సిల్వర్ కాయిన్ వస్తే గనక ఎవరికైనా థాంక్స్ చెప్పాలి అనుకుంటే ఈ స్టేజి ద్వారాఆ పర్సన్‌కి థ్యాంక్స్ చెప్పొచ్చు" అని చెప్పింది.

"అదే జ్యూస్ తాగాక ఫైనల్‌గా గోల్డ్ కాయిన్ వస్తే గనక వాళ్ళు ఎవరికైతే సారీ చెప్పాలి అనుకుంటున్నారో వాళ్లకు ఈ స్టేజి ద్వారా సారీ చెప్పొచ్చు" అని కూడా చెప్పింది రష్మీ. ఈ కాన్సెప్ట్ థీమ్ విన్నాక ఆటో రాంప్రసాద్ "ఫస్ట్ నువ్వే స్టార్ట్ చెయ్యి" అని చెప్పేసరికి, రష్మీ జ్యూస్ తాగింది. కానీ లాస్ట్‌లో గోల్డ్ కాయిన్ వచ్చింది. అంటే సారీ చెప్పాల్సిన టైం వచ్చిందన్నమాట.

గోల్డ్ కాయిన్‌ని చూసిన ఆటో రాంప్రసాద్ "ఎవరికి సారీ చెపుదామనుకుంటున్నావ్?" అని అడిగాడు. "నేను కచ్చితంగా వాళ్లకు సారీ చెప్పక తప్పదు" అని ఎమోషనల్ అయ్యింది. రష్మీ మాటలకు ఇంద్రజ కూడా చాలా బాధ పడింది. ఇంతకు ఎవరెవరు ఈ జ్యూస్ తాగారు, వాళ్లకు ఏ టైప్ ఆఫ్ కాయిన్స్ వచ్చాయి, వాళ్ళు ఎవరెవరికి సారీ, థ్యాంక్స్ చెప్పారో తెలియాలి అంటే సండే వరకు వెయిట్ చేయాల్సిందే.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.