English | Telugu
బ్రో సినిమా చూసి లాస్య ఏడ్చేసిందంట!
Updated : Jul 31, 2023
యాంకర్ లాస్య.. అందరికి తెలిసిన సెలబ్రిటీ. ఒకప్పుడు అన్ని చానెళ్ళకి మోస్ట్ ఛాయిస్ లాస్య అని చెప్పొచ్చు. ఇక యాంకర్ రవి, లాస్య కాంబినేషన్ షో అంటే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆ కాంబినేషన్ ఎంత హిట్ అనేది అందరికి తెలుసిందే. సంథింగ్ స్పెషల్ షోకి అప్పట్లో ఎంత క్రేజ్ ఉండేదో అందరికి తెలిసిందే. కొంతకాలం పాటు బుల్లి తెరకు దూరంగా ఉన్న లాస్య మళ్ళీ బిగ్ బాస్ సీజన్ -4 లో ఎంట్రీతో ఫామ్ లోకి వచ్చిందనే చెప్పాలి.
బిగ్ బాస్ హౌస్ లో ఉన్నన్ని రోజులు వంట చేస్తూ అందరి కడుపునింపిన లాస్య.. టైటిల్ గెలవకపోయినా చివరికి వంటలక్కగా బయటకొచ్చింది. లాస్య తను షోస్ చేస్తున్నప్పుడు ఏనుగు, చీమ జోక్ లు చెప్తూ ఫ్యాన్స్ ని సంపాదించుకుంది. అయితే లాస్య, రవి మధ్య ఏదో రిలేషన్ ఉందని అప్పట్లో పుకార్లు రావడంతో తను టీవీ రంగానికి దూరంగా ఉన్నాయనే అనుకున్నారు. కానీ అదేదీ కాదని వాళ్ళిద్దరి మధ్య చిన్న గొడవ జరిగిందని, రవి తన తప్పు తెలుసుకొని సారి కూడా చెప్పాడని లాస్య ఒక ప్రోగ్రామ్ లో చెప్పింది. ఆ తర్వాత మంజునాథ్ ని పెళ్ళిచేసుకొని కొన్ని సంవత్సరాల పాటుగా బుల్లితెరకు దూరమైంది లాస్య.
లాస్య-మంజునాథ్ లకి మొదట అబ్బాయి పుట్టగా తాజాగా మరో అబ్బాయికి జన్మనిచ్చింది లాస్య. అయితే తన ప్రతీ అప్డేట్ ని ఎప్పటికప్పుడు ఇన్ స్టాగ్రామ్ లో, తన యూట్యూబ్ ఛానెల్ లో షేర్ చేస్తుంది లాస్య. తను రీసెంట్ గా రిలీజ్ అయి హిట్ టాక్ ని సొంతం చేసుకున్న సాయి థరమ్ తేజ్, పవన్ కళ్యాణ్ నటించిన 'బ్రో' సినిమాకి వెళ్ళిందంట లాస్య. ఈ సినిమా చూసి చాలా ఎమోషనల్ అయిందని, గుండె బరువెక్కిందని చెప్పింది. " లైఫ్ చాలా పరిమతమైనది. ప్రతీ నిమిషం లైఫ్ ని ఎంజయ్ చేయాలి. ఈ సినిమాకి నేను బాగా కనెక్ట్ అయ్యాను మరి మీరు " అంటూ తన ఫీలింగ్స్ ని షేర్ చేసింది లాస్య.