English | Telugu

కొత్త జంటని ఆశీర్వదించిన శ్రీదేవి డ్రామా కంపెనీ

పల్సర్ బైక్ రమణ అంటే చాలు సోషల్ మీడియాలో ఎన్నో కామన్ మ్యాన్ సాంగ్స్ క్యూ కడతాయి. "నేనట్టాంటి ఇట్టాన్టి ఆడదాన్ని కాను బావయో...పల్సర్ బైక్ మీద రాను బావయో" అనే పాటతో ఫుల్ ఫేమ్ సంపాదించాడు. ఈ సాంగ్ నే రవితేజ హీరోగా నటించిన "ధమాకా" మూవీలో పెట్టారు. ఈ సాంగ్ ఇప్పటికీ ట్రెండింగ్ లో ఉంది. సింగర్ రమణ సింగర్ గా మాత్రమే కాకుండా షార్ట్ ఫిలిమ్స్ లో కూడా నటిస్తూ ఉంటాడు. ఆయనకు రైటర్ గా కూడా ఎంతో మంచి గుర్తింపు ఉంది. ఇండస్ట్రీలో ఇంత పేరు సంపాదించుకున్న రమణ రీసెంట్ గా పెళ్లి చేసుకున్నాడు.

ఇక శ్రీదేవి డ్రామా కంపెనీ నెక్స్ట్ వీక్ ఎపిసోడ్ కి ఈ కొత్త జంటను ఇన్వైట్ చేసి ఈ ఎపిసోడ్ కి "కొత్త జంట" అనే టైటిల్ కూడా పెట్టేసింది. ఆ షో ప్రోమో రీసెంట్ గా రిలీజ్ అయింది. ఇక రమణ వైఫ్ కుందనాశ్రీతో రష్మీ "మీ ప్రేమ చెప్పుకోవాలంటే ఎలా చెప్తావ్" అని అడిగింది. "తానొక ఆర్టిస్ట్ అని మా పెళ్ళికి ఇంట్లో ఒప్పుకోలేదు. మా వాళ్ళు అన్న మాటలకు అతని ప్లేస్ లో ఇంకా ఎవరైనా ఉండి ఉంటే డ్రాప్ ఐపోయేవాళ్లు. మా వాళ్ళు అన్న మాటల్నే కాదు నన్ను కూడా చాలా భరించారు అందుకు థ్యాంక్స్ అండ్ లవ్ యు" అంటూ చెప్పింది. ఇక రమణ వెళ్లి తన వైఫ్ నుదిటి మీద ముద్దు పెట్టుకున్నాడు. ఆ తర్వాత ఇంద్రజ అండ్ శ్రీదేవి డ్రామా కంపెనీ టీం మొత్తం వాళ్ళను స్టేజి మీద కూర్చోబెట్టి చీరా సారె ఇచ్చారు. ఈ వారం కొత్త జంట కాన్సెప్ట్ తో ఎపిసోడ్ ఆడియన్స్ ని అలరించబోతోంది. రెండు షార్ట్ ఫిల్మ్స్ ను కూడా తీసాడు రమణ . "బేబీ" అనే షార్ట్ ఫిల్మ్ ను తన రియల్ స్టోరీ ఆధారంగానే తెరకెక్కించాడు.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.